
ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు.
హైదరాబాద్ సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక దీక్షకు చేస్తున్న అర్చకులను పినపాక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి వారికి మద్ధతు తెలిపారు. అర్చకులు కోరుతున్న కోరికలు చాలా చిన్నవని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.