
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ప్రేమికుడితో కలిసి వెళ్తున్న యువతిని బెదిరించి హత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ప్రియుడిని చితకబాదారు.
వివరాల్లోకి వెళ్తే జగిత్యాల హుస్నాబాద్కు చెందిన ప్రేమికులు బైక్పై వెల్లడాన్ని అదే గ్రామానికి చెందిన వంశీ, రాజష్లతోపాటు మరో యువకుడు వీడియో తీశారు. తమకు లొంగకపోతే వీడియోని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్దనున్న సెల్ఫోన్, నగదును లాక్కున్నారు.
ఇంటికి చేరుకున్న యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. గ్రామస్తులు, స్థానికులు ముగ్గురిలో ఇద్దరిని పట్టుకొని నడిరోడ్డుపై కట్టేసి చితక బాదారు. మరొకరు పరారీలో ఉన్నారు. యువతి పరువు పోతుందనే కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment