![కన్న కొడుకుల కర్కశత్వం](/styles/webp/s3/article_images/2017/09/17/61503206285_625x300.jpg.webp?itok=5f2BjciB)
కన్న కొడుకుల కర్కశత్వం
హన్మమ్మ పేరిట తుర్కలమద్దికుంటలో సొంత ఇంటితోపాటు ఆరెకరాల భూమి ఉంది. ఆమె మనవలు రమేశ్, అంకూస్, రంజిత్, సాగర్ కొత్తగా ఇంటిని నిర్మిస్తామంటూ ఉన్నదాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దపల్లిలో ఉండే మనవలు, బంధువుల వద్దకు వచ్చినా.. ఆదరించలేదు. పైగా ఆమెకు వస్తున్న పింఛన్ను మాత్రం నెలనెలా తీసుకునేవారు. కొన్నిరోజులు పట్టణంలోనే యాచిస్తూ పొట్టపోసుకున్న ఈ అవ్వ.. అనారోగ్యంబారిన పడడంతో మనవడు సాగర్ రెండునెలలు పోషించి.. రెండురోజుల క్రితమే హైదరాబాద్లోని కిష్టయ్య ఇంటివద్ద వదిలివచ్చాడు. ఆ మరుసటిరోజు ఉదయమే.. హన్మమ్మను తుర్కలమద్దికుంటలోని పోచమ్మ గుడివద్ద దించి వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు.
ఇదే విషయాన్ని పెద్దపల్లిలో ఉంటున్న మనవలు, బంధువులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. గ్రామ పోలీస్ «అధికారికి చెప్పి ఆశ్రయం కల్పించాలని కోరినా నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చలితో గజగజ వణుకుతున్న అవ్వ.. చేసేదేమీ లేక ఆమెను స్థానికులు శనివారం రాత్రి పెద్దపల్లి బస్టాండ్కు తీసుకొచ్చారు. ‘సాక్షి’కి సమాచారం అందించగా.. స్థానికులతో కలిసి ఓ దుప్పటి అందించి.. ఆమెకు భోజనాన్ని సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నతల్లిని కాదనుకుని.. ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినా.. ఆ కొడుకులపై మాత్రం ఎలాంటి ద్వేషం చూపకుండా ఆ అవ్వ మాట్లాడడం అక్కడున్న వారిని కలచివేసింది.