మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి | Should be completed by the end of May Pushkara | Sakshi
Sakshi News home page

మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

Published Sun, Mar 8 2015 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను మే చివరికల్లా పూర్తి చేయాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్‌లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఆలోపే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.  ఇప్పటికే 66 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందని, అదనంగా మరో 16 కొత్త ఘాట్ల కోసం సీఎం నుంచి అనుమతి కోరామన్నారు. పుష్కర ఏర్పాట్లపై ఆయన వివిధ విభాగాలతో శనివారం సమీక్షించారు.

ఉత్సవాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశలోనే చర్యలు తీసుకోవాలన్నారు. స్నాన ఘట్టాలు సులభంగా తెలుసుకునేలా రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రూ.82.33 కోట్లతో 66 పుష్కర, స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement