
బాధ్యతలు స్వీకరించిన స్మిత సబర్వాల్
హైదరాబాద్ : మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అనంతరం ఆమె సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్మిత సబర్వాల్ రెండుసార్లు ఉత్తమ కలెక్టర్గా అవార్డులు అందుకున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయండి.. నానో కారు గెలుచుకోండి అంటూ వినూత్న తరహా ప్రచారం చేపట్టి ఓటు శాతాన్ని పెంచి సంచలనం సష్టించారు. లాటరీలో గెలుపొందిన లచ్చవ్మ అనే మహిళకు నానో కారు బహుకరించారు. కాగా స్మితసబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.