నేటి నుంచి టీఎస్‌ క్లాస్‌ ప్రసారాలు | ts classes starts in mana tv from tomarrow | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీఎస్‌ క్లాస్‌ ప్రసారాలు

Published Wed, Nov 16 2016 3:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ts classes starts in mana tv from tomarrow

ప్రారంభించనున్న మంత్రులు కడియం, కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టీఎస్‌–క్లాస్‌’ కార్యక్రమాలు బుధవారం నుంచి మనటీవీలో ప్రసారం కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ ప్రసారాలను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి 12.55 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలు విద్యార్థులకు వరమని మనటీవీ సీఈవో శైలేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 6 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఈ ప్రసార కార్యక్రమాలు అందనున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతతో అందించే విద్యను పటిష్టపర్చాలనే లక్ష్యానికి ఇదో ముందడుగు అని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్‌ విద్య అందనుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement