తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ నెల 18న నిర్వహించిన టీఎస్ఐసెట్– 2017 పరీక్ష ఫలితాలు
ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,172 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఈ నెల 21న ప్రాథమిక కీ విడుదల చేసి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. 60 నుంచి 70 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఓంప్రకాశ్ చెప్పారు. హైదరాబాద్లో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఫలితాలు విడుదల చేస్తారని, అదేరోజు ఫైనల్ కీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.