పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులకు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులకు 1.89శాతం లెస్తో స్యూ(ఎస్ఈడబ్ల్యూ) సంస్థ టెండర్ దక్కించుకుంది. రూ.161కోట్ల విలువైన ఈ పనులకు మూడు సంస్థలు పోటీపడగా, తక్కువ ధరకు కోట్ చేసిన స్యూకు టెండర్ దక్కింది. ప్రస్తుతం స్యూకు గల సాంకేతిక అర్హతలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ఒప్పందాలు జరగనున్నాయి.