
కూలిన హెలికాప్టర్ : 17 మంది మృతి
ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది.
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని కమాండర్ జనరల్ అబ్దుల్ రజాక్ సిర్జాయి కాబూల్లో వెల్లడించారు. మృతుల్లో 12 మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.