జమ్ము కశ్మీర్లో మరో విషాదం | 5 Army soldiers killed, who trapped under snow | Sakshi

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

Published Mon, Jan 30 2017 4:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు. సోమవారం మచిల్‌ సెక్టార్లో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సైనికుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు.

ఈ నెల 28న మచిల్‌ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో సైనికులు గల్లంతయ్యారు. వీరి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు మృతదేహాలు లభ్యమయ్యాయి. కశ్మీర్లో ఇటీవల పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement