అహ్మదాబాద్: సూరత్కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ భార్య, కుమార్తెలను పోలీసులు ఆదివారం విచారించారు. ఆశారాం భార్య లక్ష్మి, కుమార్తె భారతిలను ఉగ్రవాద వ్యతిరేక దళం కార్యాలయంలో ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
అహ్మదాబాద్లోని ఆశ్రమంలో ఆశారాం 1997 నుంచి 2006 మధ్య కాలంలో తనపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు సూరత్కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో ఆశారాం భార్య, కుమార్తె ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఆశారాం కుమారుడు నారాయణ్సాయి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి సోదరి కూడా ఫిర్యాదు చేసింది. తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ శాయి 2002-2005 మధ్య కాలంలో తరచూ తనపై అత్యాచారం చేసిట్లు చెల్లెలు ఆరోపించింది.
మరోవైపు ఆశారాం పోలీస్ కస్టడీని ఈనెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ గాంధీనగర్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆశారాం భార్య, కుమార్తెల విచారణ
Published Sun, Oct 20 2013 6:33 PM | Last Updated on Mon, Aug 20 2018 5:41 PM
Advertisement
Advertisement