వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లీష్ నియమితులయ్యారు. ఆ దేశ అధికార నేషనల్ పార్టీ ప్రధాని పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక ఇటలీ ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాలో గెంటిలోనిని నియమించారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా అన్ని పార్టీల నాయకులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ, ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి స్థానాల్లో కొత్త నేతలను ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ స్వచ్ఛందంగా రాజీనామా చేయగా.. ఇటలీ ప్రధాని రెంజీ మాత్రం రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. ఇటలీలో రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం
Published Mon, Dec 12 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
Advertisement
Related news by tags
-
చిరుకు జగ్గారెడ్డి చురకలు
హైదరాబాద్, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని సినిమాలు చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం... ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే చెల్లింది. .. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు... బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విశాఖ, శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణీకులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్పోర్టు సిబ్బంది మాన్యువల్గా బోర్డింగ్ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్నవరంలో ఇదీ పరిస్థితి..మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు. -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్లోని వాతారణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం నేడు, రేపు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రోజు అయిదు జిల్లాలు(కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (భారీ వర్షాలు)జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం(శుక్రవారం)మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అకవాశం ఉందని పేర్కొంది.మరోవైపు వాయుగుండగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కొస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు స్తుండటంతో వేటకు వెళ్ళారాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
గ్రూప్-2 వాయిదా యోచనలో తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తం కావడం తో వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళితో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం గ్రూప్-2 వాయిదాపై ప్రకటన చేసే అవకాశం ఉంది.గ్రూప్-2 పరీక్షను ఆగస్టులో నిర్వహించాల్సి ఉండగా, డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం, పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు మరోసారి విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని విమర్శలు గుప్పించారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ఎందుకీ సంబరాలు జరుపుతోందని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? లేక ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని నిలదీశౠరు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు‘సీఎం రేవంత్ రెడ్డి గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!మభ్యపెట్టే మీ పాలన గురించి..ఒక్క మాటలో చెప్పాలంటే..ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!జై తెలంగాణ’సీఎం గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024
Related News by category
Advertisement