బీఎస్ఎన్ఎల్: మూడు నెలలు ఉచిత కాల్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వం టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.149తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్కాల్స్(లోకల్/ఎస్టీడీ)ను 30రోజుల పాటు పొందవచ్చు. అయితే ఇతర నెట్వర్క్లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్కాల్స్ చేసుకునే వెసులుబాటు లేదు. అంతేకాకుండా రూ.439తో రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్ కాల్స్ను చేసుకోవచ్చు. తాజా పథకం జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.