'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'! | Can Speak to Rahul Gandhi for GST, Says Arun Jaitley, Amid 'Intolerance' Row | Sakshi

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

Published Wed, Nov 4 2015 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో రాజీకి సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు

న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో రాజీకి సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయంలో రాహుల్‌తో మాట్లాడేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణ చర్యల్లో అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో పార్లమెంటులో నిలిచిపోయింది. మరోవైపు దేశంలో మత అసహనం పెరిగిపోతున్నదని కేంద్రంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై కాంగ్రెస్‌ నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని జైట్లీ చెప్పారు. 'వారికి (కాంగ్రెస్) సంబంధించిన ఏ నాయకులతోనైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని జైట్లీ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. రాహుల్‌ గాంధీతో కూడా మాట్లాడుతారా? అన్న ప్రశ్నకు తప్పకుండా అని ఆయన బదులిచ్చారు.

వస్తు సేవల పన్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఇది అమలైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న 11 లెవీ పన్నులు రద్దవుతాయి. దేశమంతా ఒకే మార్కెట్‌గా భావించి పన్ను విధించడానికి వీలు పడుతుంది. అయితే కీలకమైన ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందకపోతే గడువులోగా ఇది అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒప్పించే ప్రయత్నంలో కేంద్రం తలమునకలైంది. జీఎస్టీ బిల్లుపై ప్రతిపక్ష నేతలందరినీ సాధ్యమైనంత తొందరలో ఒప్పించే ప్రయత్నం చేస్తామని ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement