న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్రన్ను ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ) ముందు ప్రవేశ పెట్టింది. ఎన్కౌంటర్కు ముందు ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీరు కమిషన్ కు వివరించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.