పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు | Civilian injured in Pakistan firing in Jammu region | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు

Published Fri, Sep 18 2015 9:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

Civilian injured in Pakistan firing in Jammu region

జమ్మూ : పాకిస్థాన్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం సాధారణ నియంత్రణ రేఖపై పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడు మహమ్మద్ అష్రాఫ్గా గుర్తించినట్లు తెలిపారు.

అతడిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. క్షతగాత్రుడిది పూంచ్ జిల్లాలోని బసోని గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఈ రోజు ఉదయం నుంచే కాల్పులు ప్రారంభించిందని.. వెంటనే అప్రమత్తమైన భారత్ సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగిందన్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement