
మహిళా ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్
రైతులను రెచ్చ గొట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ కు చెందిన మహిళా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుమంది రైతులు చనిపోయారు. అనంతరం ఎమ్మెల్యే శకుంతల పోలీస్స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఠాణాకు నిప్పుపెట్టాలని ఎమ్మెల్యే ఆందోళన కారులను కోరుతున్నట్లు ఉన్న వీడియో పోలీసులకు చిక్కింది. దీంతో న్యాయస్థానం ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఘటన జరిగిన నాటి నుంచి ఎమ్మెల్యే ,ఆమె అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.