నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష పడొచ్చంటూ వ్యాఖ్యానించినందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై డిఫెన్స్ న్యాయవాదులు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసును కోర్టు తిరస్కరించింది. నిందితులు ముఖేష్, పవన్ గుప్తాల తరఫున వాదించిన డిఫెన్స్ న్యాయవాది ఈ మేరకు ఇచ్చిన నోటీసులను సాకేత్ ప్రాంతంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి యోగేశ్ ఖన్నా ఈ నోటీసును తిరస్కరించారు.
నలుగురు నిందితులకు శిక్ష విధించే అంశంపై ఇరుపక్షాల వాదనలను సాకేత్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం వింది. ఈ సందర్భంలోనే ముఖేష్ తరఫు న్యాయవాది వి.కె. ఆనంద్ షిండేపై కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చారు. కానీ అదనపు సెషన్స్ జడ్జి ఖన్నా మాత్రం ఆ పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించడంతో దాన్ని న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
షిండేపై ధిక్కార నోటీసును తిరస్కరించిన కోర్టు
Published Wed, Sep 11 2013 2:46 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Advertisement