కరుణ్‌ నాయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా? | do you know about Karun Nair | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Published Mon, Dec 19 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

కరుణ్‌ నాయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

కరుణ్‌ నాయర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కరుణ్‌ నాయర్‌ రికార్డు సృష్టించాడు. అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి..

  • రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్‌ 6, 1991న కరుణ్‌ నాయర్‌ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్‌-15 క్రికెట్‌ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్‌ 19 జట్టులో చోటు సాధించాడు.
     
  • ఈ రైట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ 2012లో విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా సీనియర్‌ దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు.
     
  • 2014-15 రంజీ ట్రోపీ సీజన్‌లో నాయర్‌ 47.26 సగటుతో 700 పరుగులు చేసి.. కర్ణాటక మరోసారి రంజీ ట్రోపీ నిలబెట్టుకోవడంలో తోడ్పడ్డాడు. ఈ టోర్నీలో రాబిన్‌ ఉతప్ప, కేఎల్‌ రాహుల్‌ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసింది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
     
  • 2016లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ తరఫున ఆడిన కరుణ్‌ నాయర్‌ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
     
  • 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కరుణ్‌ అడుగుపెట్టాడు.
     
  • ప్రస్తుతం జరుగుతున్న  ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
     
  • టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్‌ నాయర్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్‌ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement