మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు | Eight non-Manipuris killed in bomb blast in labourers' camp | Sakshi
Sakshi News home page

మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు

Published Fri, Sep 13 2013 9:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

మణిపూర్ లో శక్తివంతమైన బాంబు పేలుడు దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.

మణిపూర్ లో శక్తివంతమైన బాంబు పేలుడు దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మణిపూర్ లోని దక్షిణ జిల్లా ఇంఫాల్ లోని నాగంపాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మణిపూరేతరులేనని సమాచారం. మణిపూర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల క్యాంపు వద్ద జరిగిన పేలుడు వెనుక మిలిటెంట్ల హస్తం ఉందని భావిస్తున్నారు. ఓ షాపు లో బాంబు అమర్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారంతా మణిపూర్ కు వలస వచ్చిన వారేనని తెలుస్తోంది. బాంబు పేలుడు తీవ్రత కిలోమీటర్ వరకు వ్యాపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ పేలుడికి ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతను ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యతను స్వీకరించలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement