ఢిల్లీ: నైజీరియా దేశంలో చెరలో ఉన్న తన కొడుకు మనోజ్ కుమార్ ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి దశరథ్ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు విన్నవించాడు. ఈ మేరకు మంగళవారం సుష్మాను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై సుష్మ స్పందిస్తూ.. అక్టోబర్ 12 వ తేదీన నైజీరియి కోర్టు ఉత్తర్వులు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నైజీరియా చెరలో మనోజ్ తో పాటు మరో 11 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సుష్మ తెలిపారు. ఇటీవల నైజీరియా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాడని మనోజ్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.