Sushma Swaraj
-
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా?
దేశంలో 18వ లోక్సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్పైనే నిలిచింది. 12 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అదే సమయంలో పలు లోక్సభ సీట్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కోవలో న్యూఢిల్లీ సీటుకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి బీజేపీ తరపున ఈ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె 1996లో తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు చూస్తున్నారు.ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారో వెల్లడికానుంది. ఈసారి బీజేపీ ఢిల్లీ నుంచి పోటీకి అవకాశం కల్పించిన కొత్త వారిలో మాజీ విదేశాంగ మంత్రి , బీజేపీ సీనియర్ మహిళా నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఒకరు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానానికి చెందిన ఎమ్మెల్యే. న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్ తన తొలి లోక్సభ ఎన్నికల్లో ఓ లాయర్పై పోటీకి దిగారు. 1996లో దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున పోటీకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికల రంగంలోకి దూకారు. సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా వృత్తి రీత్యా న్యాయవాది. ఆప్ నుంచి ఎన్నికల బరిలో దిగిన న్యాయవాది సోమనాథ్ భారతితో ఆమె పోరుకు సిద్దమయ్యారు. సుష్మా స్వరాజ్ తొలిసారి లోక్సభ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్కు ఎదురుకావడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు నాడు సుష్మాపై కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన కపిల్ సిబల్కు అవే మొదటి ఎన్నికలు. ఇప్పుడు బస్సూరి స్వరాజ్పై ఆప్ తరపున పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి కూడా ఇవే తొలి లోక్సభ ఎన్నికలు కావడం విశేషం. -
బాసురీ స్వరాజ్.. డాటరాఫ్ సుష్మ
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్ సెల్ కన్వినర్గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు... వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో... బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్లోని వారి్వక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరీన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో–కన్వినర్గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హరియాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు... సుష్మా స్వరాజ్ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అది ఊరికే అన్న మాట కాదు.. సుష్మా స్వరాజ్ కూతురి ధీమా!
‘ఈసారి 400కు పైగా సీట్లు’ అనేది ఊరికే అన్న మాట కాదు.. నిజం అయి తీరుతుంది అంటున్నారు బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి "స్వప్రయోజనం"పై ఆధారపడి ఉందని, తమ పార్టీ అవకాశాలపై ఆ కూటమి ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారామె. ఢీల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలనూ మరోసారి బీజేపీ గెలుచుకుంటుందన్నారు. ఢిల్లీలోని అత్యంత పిన్న వయస్కురాలైన బీజేపీ లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అబ్కీ బార్ 400 పార్ (ఈసారి 400కు పైగా సీట్లు)" అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ఒక సంకల్పమని అన్నారు. అంకితభావంతో ఉన్న బీజేపీ కార్యకర్తల సహాయం, ప్రజల మద్దతుతో వాస్తవం అయి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నీ చెప్పినట్లే చేసింది. ఆర్టికల్ 370ని తొలగించడం, రామమందిర నిర్మాణం, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడం వంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బన్సూరి స్వరాజ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఇద్దరు మహిళా అభ్యర్థుల్లో బన్సూరి స్వరాజ్ ఒకరు. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాల్లో వరుసగా మూడోసారి క్లీన్స్వీప్ చేసేందుకు బీజేపీ పోటీపడుతోంది. కాంగ్రెస్తో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్సభ స్థానంలో పోటీ చేస్తోంది. ఆ స్థానం నుంచి సోమనాథ్ భారతిని బరిలోకి దింపింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తనకు ప్రజల నుండి ఎంతో అభిమానం లభిస్తోందని బన్సూరి స్వరాజ్ తెలిపారు. వేదికపై కూర్చొని ప్రసంగాలు చేయడం తనకు ఇష్టం ఉండదని, ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడటమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. -
ఇరకాటంలో సుష్మా స్వరాజ్ కుమార్తె..
న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్ను న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు. అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr — Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024 ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్లో తన సొంత క్యాడర్తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు. -
లోక్సభ బరిలో డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్
బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి జాబితాలో చర్చనీయాంశంగా మారిన ఓ అభ్యర్థి.. బన్సూరి స్వరాజ్(39). ‘తెలంగాణ చిన్నమ్మ’.. కేంద్ర మాజీ మంత్రి .. దివంగత సుష్మా స్వరాజ్ తనయే ఈ బన్సూరి కావడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్సూరి స్వరాజ్కు న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది బీజేపీ. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది. ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్ విభాగంలో ఆమె కో-కన్వీనర్గాసేవలు అందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారి. న్యాయవాద వృత్తిలో మొత్తం ఆమె 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. లండన్లోని బీపీపీ లా స్కూల్లో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వర్విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నుంచి పీజీ చేశారు. ప్రాక్టీస్ చేసే సమయంలోనే ఆమె హర్యానా అదనపు అడ్వొకేట్ జనరల్గానూ నియమితులు కావడం గమనార్హం. आदरणीय #आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। अनकी दीर्घायु व स्वास्थ्य के लिये ईश्वर से प्रार्थना करती हूँ। उनके आवास पर जाकर आशीर्वाद लेने का अवसर मिला। मेरी माँ @SushmaSwaraj द्वारा स्थापित मीठी प्रथा के अनुसार मैं उनका पसंदीदा चॉकलेट केक ले गई थी।#LKAdvaniBirthday pic.twitter.com/h1x7yjbKKO — Bansuri Swaraj (@BansuriSwaraj) November 8, 2021 సుష్మా స్వరాజ్ బతికుండగా తన రాజకీయ గురువైన.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రతీ పుట్టిన రోజుకి స్వయంగా కేక్ తీసుకెళ్లి అందించేవారు. అయితే ఆమె మరణాంతరం కూతురు బన్సూరి ఆ ఆనవాయితీని తప్పకుండా వస్తోంది. న్యూఢిల్లీ లోక్సభ సీటును తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరీ స్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | BJP fields former External Affairs Minister late Sushma Swaraj's daughter, Bansuri Swaraj from New Delhi seat, she says, "I feel grateful. I express gratitude towards PM Modi, HM Amit Shah ji, JP Nadda ji and every BJP worker for giving me this opportunity. With the… pic.twitter.com/szfg055rzf — ANI (@ANI) March 2, 2024 -
సుష్మా స్వరాజ్పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తానెప్పుడూ భారత దేశ రాజకీయాల్లో ప్రముఖమైన నాయుకురాలిగా చూడలేదన్నారు. ఈ మేరకు తాను రాసిన "నెవర్ గివ్ ఏ ఇంచ్ : ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్"లో సుష్మా స్వరాజ్ని కొన్ని అమెరికన్ పదాలతో అవమానకరంగా వర్ణించారు. అంతేగాదు సుష్మా రాజకీయం పరంగా ఆమె కీలకపాత్రధారి కాకపోవడంతోనే మోదీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సన్నిహితంగా పనిచేశానని తన పుస్తకంలో రాశాడు. వాస్తవానికి సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆమెతో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇకపోతే తదుపరి భారత విదేశాంగా మంత్రి.. 2019లో కొత్తగా నియమితులైన జైశంకర్ని తాను స్వాగతించానని, పైగా అతను తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు పాంపియో. అతను మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, అది తనకంటే బాగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఆయనను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. తన పుస్తకంలో జైశంకర్ వచ్చే 20204 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అతను ఒక గొప్ప ప్రోఫెషనల్, హేతుబద్ధమైన వ్యక్తి మాత్రమే గాదని తన దేశానికే గొప్ప రక్షకుడిగా కూడా అభివర్ణించారు. చివరిగా తాను సుష్మాతో పొలిటకల్గా తనతో చాలా ఇబ్బందిపడ్డానని, తనకు ఏవిధంగా సహకరించలేదని చెప్పారు. కానీ జైశంకర్తో చాలా సన్నిహితంగా పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వ్యాఖ్యలకు జైశంకర్ స్పందించి..తాను పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్ని అవమానిస్తూ రాసిన వ్యాఖ్యలను చూశానన్నారు. ఆమెను తానెప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నానని, అలాంటి ఆమె పట్ల ఇలా అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా, సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆమెను అగౌరపరిచేలా చేసిన సంభాషణనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అంతేగాదు పాంపియో తన పుస్తకంలో భారత్ అమెరికాను నిర్లక్ష్యం చేయడం దశాబ్దాల ద్వైపాక్షిక వైఫల్యంగా పేర్కొన్న విషయంపై కూడా శంకర్ ధీటుగా కౌంటరిచ్చారు. ఇదిలా ఉండగా పాంపియో తన పుస్తకంలో... భారత్ అమెరికా, భారత్ సహజ మిత్రులని నొక్కి చెప్పారు. తమ ప్రజలు ప్రజాస్వామ్య చరిత్ర, ఉమ్మడి భాష, సాంకేతికత తదితర వాటిన్నింటిని భారత్తో పంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేగాదు అమెరికా మేధో సంపత్తి ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న మార్కెట్ భారతదేశమేనన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహాత్మకమైన స్థానం చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత్తో దౌత్యాని మూలధారం చేసిందని రాశారు. ఆ పుస్తకంలో తాను ఎంచుకున్న భారతదేశాన్ని అమెరికా తదుపరి గొప్ప మిత్రదేశంగా మార్చడంలో సమయం వెచ్చించండి, కృషి చేయండి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. (చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు) -
ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మా.. నువ్వు లేని లోటు!
ఉక్రెయిన్ సంక్షోభాన్ని అంచనా వేయడంలో భారత ప్రభుత్వం తడబడింది. నెలన్నర కిందట.. కేవలం ఉక్రెయిన్లోని భారతీయుల క్షేమసమాచారాల సేకరణకే పరిమితం అయ్యింది అక్కడి మన ఎంబసీ. మరోవైపు ఆ సంక్షోభంలోనూ తరగతులు నిర్వహించి ఉక్రెయిన్ యూనివర్సిటీలు తప్పు చేస్తే.. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో భయభయంగానే అక్కడే ఉండిపోయారు భారతీయ విద్యార్థులు. అవే ఇప్పుడు ఆపరేషన్ గంగకు అవాంతరాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చిన్నమ్మ ‘సుష్మాస్వరాజ్’ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన సమయంలో.. భారత ప్రభుత్వం స్పందించి ఉక్రెయిన్లోని మన రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లోని ఫామ్లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులకు సూచించింది. అయితే అప్పటికే చాలా దేశాల పౌరులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆపై పరిస్థితి విషమిస్తున్న.. నాలుగైదు రోజుల ముందు కూడా అమెరికా సహా పలు దేశాలు తిరిగి వచ్చేయాలంటూ ఆయా దేశాల పౌరులకు సూచించాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయిందని, ఆ ఆలస్యమే భద్రత భయాందోళనలకు కారణమన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ భారత విద్యార్థులు ఆమె ఉండి ఉంటేనా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు, సీనియర్ దౌత్యవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా.. వేచిచూసే ధోరణికి ఆమె పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా పని చేసిన టైంలో.. దౌత్యపరంగానే కాదు, సహాయచర్యల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శించేవారు. అనుమతుల కోసం ఎదురు చూడకుండా.. ఎంఈఏ ట్విటర్ హ్యాండిల్ ద్వారా స్వయంగా సుష్మాజీనే రంగంలోకి దిగేవారు. పరిస్థితి ఎలాంటిదైనా.. ఎంతటి క్షిష్టమైన సమస్య అయినా సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించేది ఈ చిన్నమ్మ. అందుకే ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. I have got the report. As per medical advice, your brother cannot travel at this stage.Your mother is with him in Georgia. /1 https://t.co/QOwtXsgmz2 — Sushma Swaraj (@SushmaSwaraj) February 1, 2017 సింగిల్ హ్యాండ్ సుష్మా.. యుద్ధం మొదలైన తర్వాతే భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను మొదలుపెట్టింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలు పంపించి.. వాటి సరిహద్దులకు చేరుకున్న భారతీయులను, విద్యార్థులను తరలిస్తోంది. ఆయా దేశాలతో సమన్వయ చర్చలు ప్రారంభించి.. ఇక్కడి నుంచి నలుగురు కేంద్ర మంత్రుల్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని పంపించింది మోదీ ప్రభుత్వం. అయినా తరలింపులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అఫ్కోర్స్.. అక్కడున్న పరిస్థితులే అందుకు కారణం అనుకోండి. అది వేరే విషయం. అయితే.. సుష్మా స్వరాజ్ ఈ పరిస్థితిలో ఉండి ఉంటే పరిస్థితిని ఎలా డీల్ చేసి ఉండేవారో? అనే చర్చను లేవనెత్తారు పలువురు నెటిజన్లు. I have asked for a report from Indian Embassy in Dubai. Indian Walked 1,000 Km To Dubai Court https://t.co/kbvwVV67QP via @ndtv @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) November 30, 2016 వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా సుష్మాజీ జోక్యం చేసుకునే తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర దేశాలతో డిజిటల్ దౌత్యం ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సుష్మాజీ. తెలంగాణ యువత కేటీఆర్ లాంటి ఎంతో మందికి ఒకరకంగా ఇదే స్ఫూర్తి అనే అనుకోవచ్చు. ఆపదలో ఉన్నామని, సాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే చాలు.. ట్విటర్ ఎంఈఏ హ్యాండిల్ ద్వారా నేరుగా రంగంలోకి దిగేవారామె. అలా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులకు సాయం అందించి.. వాళ్ల ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు అందుకున్నారామె. వ్యక్తిగత సాయాలను పక్కనపెడితే.. 2015 ఆపరేషన్ రాహత్ గుర్తించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆపరేషన్ రాహత్ నాటి ఫొటో ఒకవైపు సౌదీ అరేబియా-మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నడుమ ఐదు వేలమంది భారతీయులను, ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత కచ్చితంగా ఆమె టీందే. ముఖ్యంగా బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించిన తీరు.. విరామం తీసుకోకుండా దగ్గరుండి ఆమె పర్యవేక్షించడంపై అప్పట్లో హర్షం వ్యక్తం అయ్యింది. ఇదే కాదు.. 2018 అగ్నిప్రమాదంలో పాస్పోర్టులు తగలబడి పోయి ఇబ్బందులు పడ్డ ఇల్లినాయిస్ యూనివర్సిటీ(అమెరికా) విద్యార్థులను చట్టమైన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్కు రప్పించిన ఘటనా గుర్తు చేస్తున్నారు కొందరు. ఉక్రెయిన్ పరిస్థితులు వేరు కావొచ్చు.. కానీ, ఈ పరిస్థితుల్లో గనుక ఆమె ఉండి ఉంటే మాత్రం పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తం అవుతోంది. వీ మిస్ యూ చిన్నమ్మ. Repatriating our diaspora during difficult times is a competence & commitment of India that most citizens will acknowledge.I respectfully recall Smt Sushma Swaraj who became a powerful symbol of this commitment. 🙏🏽 https://t.co/lmmPQhhOm6 — anand mahindra (@anandmahindra) August 22, 2021 ::: సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
మేం పిలుపు ఇస్తే తట్టుకోలేరు.. బీజేపీపై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపాటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్పై చిల్లరగా మాట్లాడటం సరికాదని, మేం పిలుపు ఇస్తే మీరు తట్టుకోలేరని తెలంగాణ అల్లకల్లోలమవుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పిస్తామని గత ఎన్నికలకు ముందు అప్పటి జాతీయ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పాదయాత్ర లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహబూబ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ను ఏకవచనంతో సంభోదిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన ‘గీత’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు) సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. -
తోషఖానా : సుష్మా స్వరాజ్దే భారీ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానమంత్రి విదేశాంగమంత్రులు, ఇతర అధికార ప్రతినిధులకు అందించే బహుమతులు, గౌరవసూచికగా ఇచ్చే కానుకల రూపంలో కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.7 కోట్ల రూపాయలు ప్రభుత్వనిధి తోషఖానాకు చేరాయి. వీటిలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు లభించిన కోట్ల రూపాయల బంగారు, వజ్రాల ఆభరణాల బహుమతి అతివిలువైనదిగా నిలిచింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో 230మందికి పైగా వ్యక్తులు 2,800 బహుమతులు అందుకోగా, వీటి విలువ సుమారు 17.74 కోట్ల రూపాయలు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఆమెకిచ్చిన 6.7 కోట్ల విలువైన వెండి వజ్రాల పచ్చ ఆభరణాల సెట్ ఈ కాలానికి అత్యంత ఖరీదైన బహుమతిగా నిలిచింది. అలాగే 2015లో ప్రధాని మోదీ అందుకున్న 35 లక్షల విలువైన, హారము, చెవిపోగులు పెట్టె చాలా ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రికి ఖరీదైన బహుమతులు లభిస్తాయి. కానీ 2018-2019 కాలంలో కోట్ల విలువైన వజ్రాల గడియారాలతో చాలామంది అధికారులు టాప్ లో నిలిచారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల తమ తమ విదేశీ పర్యటన సందర్భంగా మెమెంటోలు, సాంస్కృతిక కళాఖండాలు, పెయింటింగ్లు, ఫోటోలు, గాడ్జెట్లు, చీరలు, కుర్తాలతోపాటు మద్యం కూడా బహుమతిగా అందుకున్నారు. ముఖ్యంగా పాలరాయి రాయిపై మోదీ బొమ్మ, హిందీలో పద్యం వంటి వ్యక్తిగతీకరించిన బహుమతి కూడా ఉంది. అంతేకాదు 2014 నుండి తోషాఖానాకు చేరిన వాటిలో రహస్య ఇంటెలిజెన్స్ ఫైల్స్, పశ్చిమ బెంగాల్ నజాఫీ రాజవంశానికి చెందిన 18 వ శతాబ్దపు కత్తి, మహాత్మా గాంధీ డైరీ నుండి ఒక ఫ్రేమ్డ్ పేజీ, గాంధీ చిత్రాలు, అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్,బంతి, ఇత్తడి కంటైనర్లో నింపిన మానస సరోవర్ పవిత్ర జలం, బుల్లెట్ ట్రైన్ నమూనా, వెండి ఎద్దుల బండి ఉండటం విశేషం. సాంప్రదాయం ప్రకారం విదేశీ సందర్శనల సమయంలో దేశానికి చెందిన ముఖ్య ప్రతినిధులు అందుకున్న బహుమతులు నేరుగా ప్రభుత్వనిధి తోషాఖానాకు వెళతాయి. ఖరీదైన ఆభరణాలు, గడియారాల, కళాఖండాలు, గాడ్జెట్లు ఇతర వస్తువులు ఈ కోవలో ఉంటాయి. తోషాఖానా వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 2014 - ఫిబ్రవరి 2020 మధ్య లభించిన బహుమతులలో 61శాతం 5,000 కంటే తక్కువ విలువైనవి కాగా, ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి 4శాతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ 650కి పైగా గిఫ్ట్ లు అందుకోగా, ఆ తరువాత వరుసలో సుష్మ స్వరాజ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలకు సమాచార హక్కు నుంచి మినహాయింపు నివ్వడంతో అందుబాటులో లేవు. -
ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా..
న్యూఢిల్లీ : పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశానికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రథమ స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ‘భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటు కూలంకశంగా చర్చించింది. ఉభయసభల ఆమోదం పొందింది. ఇదంతా భారతదేశ అంతర్గత వ్యవహారం. ఇతర దేశాలు (పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశిస్తూ) మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత.. ‘ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానంటూ’ చివరి ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఉపరాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. భారతదేశ ఆలోచనలు, విదేశాంగ విధానాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, హుందాగా అదే సమయంలో బలంగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సుష్మా స్వరాజ్కు ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆమెను ‘ఆదర్శ భారతీయ మహిళ’గా కీర్తించారు. మాటలు, చేతల్లో స్పష్టత.. ఆలోచన, ఆహార్యం, ప్రసంగాల్లో భారతీయతకు ఆమె ప్రతిరూపమన్నారు. సుష్మా స్వరాజ్కు ఘనంగా నివాళులర్పించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని.. తను పనిచేసిన ప్రతిచోట తనదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆదర్శంతమైన రాజకీయ నాయకురాలి జీవితాన్ని, ఆమె సాధించిన విజయాలను కొత్తతరం రాజకీయ నాయకులు ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. 1996లో పార్లమెంటులో ‘భారతీయత’పై శ్రీమతి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం తనకింకా గుర్తుందన్నారు. ‘ఓ చక్కటి వక్తగా, కార్యశీలిగా, రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా.. మానవతా విలువలున్న వ్యక్తిగా కూడా సుష్మాస్వరాజ్ అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఆమె పేరుముందు స్వర్గీయ అని పెట్టేందుకు కూడా మనసు అంగీకరించడంలేదు. మిత్రులు, మద్దతుదారులు, ప్రజలు ఇలా ఎవరికేం అవసరం వచ్చి ఆమె తలుపు తట్టినా.. నేనున్నానంటూ వచ్చి సాయం చేసే ఓ మంచి సోదరిని ఇంకా మరిచిపోలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నసమయంలోనూ.. సమస్య ఉందని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు వచ్చిన తక్షణమే స్పందించేవారని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలి కాలంలో నేను చూసిన గొప్ప విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్’ అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏడుసార్లు లోక్సభకు, అంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. ప్రజల గుండెల్లో ఆమెకున్న స్థానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘అందరికీ అర్థమయ్యేలా భాషలో స్పష్టత, ఆకట్టుకునే పదాలు వీటికితోడు చక్కటి వక్తృత్వం వెరసి సుష్మాస్వరాజ్ తన ఆలోచనలను చాలా స్పష్టంగా వెల్లడించేవారు. హిందీ, సంస్కృతం, హరియాణ్వీతోపాటుగా కర్ణాటక ఎన్నికల్లో కన్నడ భాషలోనూ స్పష్టంగా మాట్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బహుభాషా కోవిదురాలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘సుష్మాజీ మా కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికొచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నాను. మొన్న రాఖీ పండగ సందర్భంగా సుష్మాజీ గుర్తుకొచ్చి ఉద్వేగానికి గురయ్యాను. ఆమె పేరుకు ముందు స్వర్గీయ అని పిలిచేందుకు ఇంకా మనసు రావడం లేదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. గొప్ప వ్యక్తుల సంస్మరణ సభలు నిర్వహించడం కేవలం వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే కాదని.. వారు చూపిన ఆదర్శాలను అన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్ కుమార్, సుష్మాస్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
-
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి వారి చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్ భరతావని చేత ‘సూపర్ మామ్’ అనిపించుకున్న సుష్మస్వరాజ్ జయంతి సందర్భంగా సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
సుష్మా స్వరాజ్ భర్త భావోద్వేగ ట్వీట్!
ఒక్క ట్వీట్తో ఎంతో మంది సమస్యలను తీర్చి.. భారత ప్రజల చేత ‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ మొదటి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ ట్విటర్ అకౌంట్లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్ షేర్ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని ఙ్ఞప్తికి తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసేందుకు చేతిలో నైఫ్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’ రూపం చూసి.. ‘‘ సూపర్ మామ్.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు. కాగా సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది అన్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడే సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. కాగా ప్రేమికుల దినోత్సం రోజున జన్మించిన సుష్మా స్వరాజ్.. మొదటి జయంతి సందర్భంగా ఆమె భర్త కౌశల్ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇక గతేడాది ఆగస్టు 6న.. భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె.. జమ్మూ కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చివరిసారిగా ట్వీట్ చేశారు. -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
తెలంగాణ చిన్నమ్మ ఉండుంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలి అన్వేషణలో పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన తెలుగు యువకుడు ప్రశాంత్ విషయంలో ఇకపై దౌత్యపరమైన సంప్రదింపులే కీలకం కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే భారత ప్రభుత్వానికి సమాచారం ఉందని ప్రశాంత్ తండ్రి మాటల ద్వారా తెలిసింది. దీంతో ప్రశాంత్ను విడుదల చేసేందుకు విదేశాంగశాఖ పాత్ర కీలకం అవుతుందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ అమాయకుడని, అతని మానసిక పరిస్థితిపై పాకిస్తాన్ ముందే అభిప్రాయానికి వచ్చింది కాబట్టే.. అతని ఇంటికి వీడియో సందేశం పంపారని పలువురు భావిస్తున్నారు. కాబట్టి దౌత్య సంప్రదింపులతో ప్రశాంత్ ఇండియాకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ట్వీట్ చేస్తే చాలు.. 2014 నుంచి 2019 వరకు విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించిన సుష్మా స్వరాజ్ భారతీయులను, ముఖ్యంగా విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ముందుండేవారు. చిన్న ట్వీట్ చేస్తే గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేవారు. ‘భారతీయులు అంగారక గ్రహం మీద ఉన్నా సరే.. వారిని క్షేమంగా తీసుకువస్తాం’అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ భారతీయుల సంక్షేమంపై ఆమెకు ఉన్న సంకల్పాన్ని చాటిచెప్పింది. పాకిస్తానీయులకు సైతం అత్యవసర వైద్యం కోసం అభ్యర్థించగానే వెంటనే వీసాలు మంజూరు అయ్యేలా చొరవచూపిన అమ్మ మనసు ఆమెది. గతంలో దారితప్పి పాకిస్తాన్లో ప్రవేశించిన బధిర బాలిక గీత విషయంలో సుష్మా స్వరాజ్ చూపిన చొరవను మాటల్లో అభివర్ణించలేం. తాజాగా ప్రశాంత్ విషయంలో నెటిజన్లు సుష్మా స్వరాజ్ను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఉండి ఉంటే భరోసా ఇచ్చేవారని అంటున్నారు. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తుపెట్టుకోవాలన్న సుష్మా స్వరాజ్ను మిస్సవుతున్నామంటూ పలువురు పోస్టింగులు పెడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రశాంత్ తండ్రి బాబూరావు కేపీహెచ్బీ కాలనీ: ప్రశాంత్ను క్షేమంగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరేందుకు ప్రశాంత్ తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రశాంత్ను క్షేమంగా మన దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని భారత దౌత్య కార్యాలయ అధికారులను కోరనున్నారు. అయితే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడంతో బుధవారం దౌత్య కార్యాలయ అధికారులను బాబూరావు కలవలేకపోయినట్లు తెలిసింది. -
‘చిన్నమ్మ’ చివరి కోరిక తీర్చిన కుమార్తె
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్భూషణ్ జాదవ్ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ) -
జైపాల్రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్
మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సుష్మాస్వరాజ్, అద్వానీని ఒప్పించి రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జైపాల్రెడ్డి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. జైపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో జైపాల్రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. చట్టసభల్లో ఆయన నిజాయితీగా, హుందాగా వ్యవహరించి ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారని కొనియాడారు. ఈ సభకు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!
సాక్షి, వెబ్డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1 హయాంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ దాదాపు 20 రోజుల వ్యవధిలో మరణించడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఎన్నికల హామీలో భాగంగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ సర్కారు రద్దు చేసిన మరుసటి రోజే చిన్నమ్మ కన్నుమూయగా... జైట్లీ ఈరోజు మధ్యాహ్నం(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిగా సుష్మ జాతికి చేసిన సేవలను, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ దేశ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులకు సాక్షిగా ఉన్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నాయకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. వీరిద్దరి అస్తమయం పార్టీ పరంగానే గాకుండా వ్యక్తిగతంగా కూడా తమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ అనారోగ్య కారణాల రీత్యా ఆరు పదుల వయస్సులోనే కన్నుమూయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది. ‘అమ్మ’గా అభిమానం చూరగొన్నారు.. గత ఐదేళ్లలో భారతదేశ దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో విదేశాంగ మంత్రిగా సుష్మ ప్రముఖ పాత్ర పోషించారు. 2014లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ దాదాపు 90 దేశాల్లో పర్యటించారు. వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొనడంలో ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే ఇవన్నీ సజావుగా సాగడానికి సుష్మ చతురత, దౌత్యనీతి ముఖ్య కారణాలు అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సి వచ్చినపుడు ఆశువుగా ఉపన్యాసం ఇస్తానని మోదీ ప్రకటించగా.. కాగితం మీద రాసుకుని చదివితేనే చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుందని చిన్నమ్మ చెప్పడంతో మోదీ ఆమె సలహాను పాటించారు. సుష్మ మాట అంటే ఆయనకు అంత నమ్మకం. ఇక విదేశాంగ మంత్రిగా సమస్యల్లో ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులకు సుష్మ అండగా నిలిచారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేగాకుండా ఎన్నికలకు ముందు పుల్వామా ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేగిన సమయంలోనూ సుష్మ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడంలో ఆమె సఫలీకృతులయ్యారు. రష్యాతో పాటు పాక్ మిత్రదేశం అయిన చైనాతో కూడా చర్చలు జరిపి పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్కు మద్దతు కూడగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇక విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ కేవలం తన శాఖకే పరిమితమైపోకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నారై బాధిత భార్యల కోసం చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భార్యలు చేసే ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తలను పట్టుకోవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఈ లక్షణాలన్నీ వెరసి దేశ ప్రజలకు ఆమెను ప్రియమైన మంత్రిగా చేయడంతో పాటు ఆపదలో ఆదుకునే సూపర్ మామ్గా కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేగాక ప్రఖ్యాత ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. ఇవన్నీ సుష్మ వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు పొందడమేగాక నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనేలా చేశాయి. ఆయన హయాంలోనే కీలక సంస్కరణలు వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ మోదీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం చేపట్టింది. అదే విధంగా అరుణ్ జైట్లీ హయాంలోనే సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు కూడా. కేవలం విత్త మంత్రిగానే గాకుండా ప్రముఖ న్యాయవాదిగా కూడా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో మోదీ సర్కారుకు న్యాయ సలహాలు ఇచ్చారు. బీజేపీ ట్రబుల్షూటర్గా గుర్తింపు పొందిన ఆయన... ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో దిట్టగా ప్రసిద్ధికెక్కారు. రఫేల్ ఒప్పందంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారును విమర్శించిన సమయంలోనూ జైట్లీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టారు. మోదీకి నమ్మిన బంటుగా ప్రాచుర్యం పొందిన జైట్లీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైన చిక్కుప్రశ్నలను సులువుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించారు. ఇక కార్పోరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచర్ తీరుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాకుండా మోదీకి అనుకూలంగా సమర్థవంతంగా తన వాదనలు వినిపించేవారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ట్విటర్ ద్వారా తన సందేశాలను పోస్ట్ చేస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేవారు. ఈ క్రమంలో ఆయన మరణం మోదీకి తీరని లోటు అని బీజేపీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. -
75 రోజుల పాలనపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలను అమలు చేసిందని, స్పష్టమైన విధానం, సరైన దిశ ఉండటం వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి 75 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఐఏఎన్ఎస్తో మాట్లాడారు. ‘బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలను వేగవంతంగా అమలు చేసింది. ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విధానం, సరైన ఉద్దేశం వల్లే ఇది సాధ్యపడింది. ఈ 75 రోజుల్లో చాలా మార్పులు సంభవించాయి. చిన్నారులకు భద్రత నుంచి చంద్రయాన్–2 వరకు, అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళకు రక్షగా ఉండే ట్రిపుల్ తలాక్ చట్టం వరకు, కశ్మీర్ నుంచి రైతు సంక్షేమం వరకు ఇలా.. ప్రజల తరఫున పనిచేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఏం చేయగలదో అంతకంటే ఎక్కువే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. ‘ప్రజల జీవితావసరం నీరు. అందుకే దేశంలో నీటి సరఫరా, నీటి సంరక్షణ విధానాలను పటిష్టం చేసి, అమలు చేసేందుకు ప్రత్యేకంగా జల్శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. 1952 తర్వాత 17వ లోక్సభ సమావేశాలు అత్యంత ఫలవంతంగా సాగి చరిత్ర సృష్టించాయి. ఈ సమావేశాల్లోనే వ్యాపారులు, రైతులకు పింఛన్లు అందించే బిల్లు, వైద్య రంగం సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు, దివాలా కోడ్, కార్మిక చట్టాల సంస్కరణల బిల్లుతోపాటు ఎంతో కీలకమైన కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులు సభ ఆమోదం పొందాయి. అదే సమయంలో అనేక వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వం అన్నిటినీ పరిష్కరించింది’ అని ప్రధాని మోదీ తెలిపారు. విదేశాంగ శాఖను మార్చేశారు ! విదేశాంగ శాఖ రూపురేఖలను సుష్మా స్వరాజ్ మార్చేశారని మోదీ కొనియాడారు. నిబంధనలు ఉన్న ప్రొటోకాల్ స్థాయి నుంచి ప్రజల పిలుపునకు స్పందించే కార్యాలయంలా ఆ శాఖను మార్చారన్నారు. పార్టీ నేతలతో కలసి మంగళవారం ఆయన సుష్మాకు నివాళులర్పించారు. 2014లో ఐక్యరాజ్యసమితి సభలో ప్రసంగించాల్సిన ముందు రోజు ఆమెతో మాట్లాడానని, రేపటి ప్రసంగం ఎక్కడ అని అమె అడిగారని తెలిపారు. తను ప్రసంగాలు రాసుకోననగా, అందుకు సుష్మా ‘అది కుదరదు, భారత్ గురించి మీరు చెప్పాల్సిందే. మీకు నచ్చినట్లు మాట్లాడటానికి లేదు’ అన్నారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఎంత గొప్ప వక్తలైనా కొన్ని చోట్ల చూసి చదవాల్సిందేనని ఆమె తెలిపారన్నారు. -
ప్రవాసీల ఆత్మబంధువు
గల్ఫ్ డెస్క్: పొట్ట చేత పట్టుకుని పొరుగుదేశాలకు వలస వెళ్లిన ప్రవాసులకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ సుష్మాస్వరాజ్ అండగా నిలిచారు. విదేశాంగ మంత్రిగా సేవలందించిన సుష్మాస్వరాజ్ ఎన్నారైల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రవాసీల సమస్యలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుని అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా ప్రవాసీల సంక్షేమం కోసం ఆమె ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయని గల్ఫ్లోని భారతీయులు అంటున్నారు. లైసెన్సింగ్ విధానంలో మార్పులు.. మన దేశం నుంచి కార్మికులను, ఉద్యోగులను విదేశాలకు ఉపాధికి పంపించేం దుకు గాను రిక్రూటింగ్ లైసెన్సింగ్ విధానంలో సుష్మాస్వరాజ్ పలు మార్పులు తీసుకువచ్చారు. గతంలో లైసెన్సింగ్ ఏజెన్సీ బ్యాంకు గ్యారంటీగా రూ.20 లక్షలు పెట్టాల్సి ఉండగా, దానిని రూ.50 లక్షలకు పెంచారు. అయితే, చిన్న ఏజెంట్లకు ఇబ్బందులు తలెత్తడంతో వంద మంది లోపు పంపడానికి రూ.8 లక్షల డిపాజిట్ విధానాన్ని అమలు చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు ‘మదద్’.. విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న భారతీయులు తమ సమస్యలను విదేశాంగ శాఖ అధికారులకు తెలుపుకునేందుకు గాను ఆన్లైన్లో అవకాశం కల్పించారు. మదద్ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం –భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ) ద్వారా ఎక్కడ ఎవరు ఏ సమస్య ఉన్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే విదేశాంగ శాఖ స్పందిస్తుంది. ఈ వ్యవస్థకు హిందీలో ‘మదద్’ అని పేరు పెట్టారు. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమస్యలు చెప్పుకోవడం, వాటికి రిప్లై రాయడం నెలల తరబడిగా కొనసాగేది. ఆన్లైన్ ఫిర్యాదులతో సమస్యను క్షణాల్లో చెప్పుకునే అవకాశం ఏర్పడింది. ఇలా సుష్మాస్వరాజ్ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు. ట్విట్టర్ ద్వారా స్పందన విదేశాల్లో ఉన్న ప్రవాసీలు ఎవరైనా ఇబ్బం దులు ఎదుర్కొన్నట్లయితే వారు నేరుగా తమ సమస్యను అప్పట్లో నేరుగా మంత్రి సుష్మాస్వరాజ్కు చెప్పుకునేందుకు ట్విట్టర్ అకౌంట్ను అందుబాటులో ఉంచారు. తమ సమస్యను ట్విట్టర్ ద్వారా చెప్పుకుంటే చాలు.. వెంటనే సమస్య పరిష్కారానికి విదేశాంగ శాఖ రంగంలోకి దిగేది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా ట్విట్టర్లో వచ్చే వినతులను ఆమె పరిశీలించేవారు. గల్ఫ్ కార్మికులకు అండగా... 2014 నుంచి 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సుష్మాస్వరాజ్ గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు సహా యం అందించారు. కేంద్ర మంత్రి హోదా లో గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సందర్భాల్లో ఆమె వలస కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు. 2016లో సౌదీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి పలు కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో సుష్మ వెంటనే స్పందించి విదేశాంగ శాఖ అధికారులను రంగంలోకి దింపి మన కార్మికులను ఒక చోటకు చేర్చి వారికి భోజన సదుపాయాలను సమకూర్చడంతో పాటు కార్మికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయించారు. కువైట్, బహ్రెయిన్, యూఏఈ తదితర దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలోనూ కార్మికులకు సహాయమందించారు. ప్రభావితం చేసిన విధాన నిర్ణయాలు సుష్మాస్వరాజ్ హయాంలో ‘కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన’ విధానంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్)ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్)లో విలీనం చేయడం పై మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. 2003 నుంచి ప్రతిఏటా జనవరి 9న నిర్వహిస్తున్న ‘ప్రవాసీ భారతీయ దివస్’ను రెండేళ్లకోసారి నిర్వహించడం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ విదేశాల్లోని అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ఈ పండుగను నిర్వహించడం పట్ల ప్రశంసలు అందుకున్నారు. ఇ–మైగ్రేట్ ద్వారా ఆన్లైన్ రిక్రూట్మెంట్.. భారత కార్మికులను విదేశీ ఉద్యో గాల్లో భర్తీచేయడానికి ఇ–మైగ్రేట్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు, ఉద్యోగులు, రెండు దేశాల ప్రభుత్వాలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఒకే వేదికపైకి వస్తాయి. దీని ద్వారా వేతన ఒప్పందాల రికార్డుల నిర్వహణ, కార్మికుల సంక్షేమం, భద్రత సులువు అవుతుంది. వేగంగా స్పందించేవారు వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఏ చిన్న సమస్య ఎదురైనా సుష్మాస్వరాజ్ వేగంగా స్పందించేవారు. విదేశాల్లో ఆస్పత్రిపాలైన మన కార్మికులను ఎందరినో స్వదేశానికి చేర్చారు. ప్రవాసుల సంరక్షణలో కొత్త శకానికి నాంది పలికారు. 2015లో ఒమాన్లో పర్యటించి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. – రాధ బచ్చు, ఒమాన్ (సికింద్రాబాద్) బహ్రెయిన్ను మూడుసార్లుసందర్శించారు సుష్మాస్వరాజ్ బహ్రెయిన్ను 2014, 2016, 2018 సంవత్సరాల్లో సందర్శించా రు. ఇరుదేశాల మధ్య ఖైదీల బదిలీ, హెల్త్ కేర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండియన్ ఎంబసీ నూతన భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ చిన్నమ్మకు మా నివాళి. – పడాల రాజేశ్వర్గౌడ్, బహ్రెయిన్ (ముచుకూర్, నిజామాబాద్) సౌదీ ‘జనాద్రియా’ పండుగలో పాల్గొన్నారు సౌదీ అరేబియాలోని రియా ద్లో 2018లో జరిగిన సౌదీ జాతీయ వారసత్వ పండుగ ‘జనాద్రియా’లో సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయులను ఆత్మీయంగా పలకరించారు, ప్రవాసుల సమస్యలను ఆలకించారు. – అబ్దుల్ సాజిద్, సౌదీ (జగిత్యాల) -
సుష్మా స్వరాజ్కు గల్ఫ్ ఎజెంట్ల నివాళి
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గల్ఫ్లో ఉన్న భారతీయులు గురువారం సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలిసి గల్ఫ్లోని రిక్రూటింగ్ ఎజెంట్లు సుష్మా స్వరాజ్కు నివాళులర్పించి, ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిక్రూటింగ్ ఎజెంట్ అధ్యక్షుడు డీఎస్ రెడ్డి, రైసుద్దీన్, ప్రశాంత్, ఖలీల్ పాషా తదితరులు పాల్లొన్నారు. -
ఉద్వేగానికి లోనైన బన్సూరి స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ గురువారం యూపీలోని హపూర్ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్ కౌశల్ వెంట రాగా బన్సూరి స్వరాజ్ ఈ క్రతువును నిర్వహించారు. 67 సంవత్సరాల సుష్మా స్వరాజ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అధికార లాంఛనాల నడుమ బుధవారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
నల్లగొండతో సుష్మాస్వరాజ్కు అనుబంధం
సాక్షి, నల్లగొండ: గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందిన కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ రాయకురాలు సుష్మాస్వరాజ్కు నల్లడొండతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నవంబర్ 5న బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ పోరుసభ బహిరంగసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అప్పట్లో ఆమె లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో నల్లగొండకు తొలిసారి వచ్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సుష్మాస్వరాజ్ జాతీయ నాయకురాలు కావడడంతో ఆమెను కలుసుకోవడానికి జిల్లాకు చెందిన అనేకమంది ప్రముఖులు, మేధావులు, యవత పోటీ పడ్డారు. ఆ సమయంలో నల్లగొండలో బీజేపీ కార్యాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడికి వచ్చిన ఆమె నేరుగా స్థానిక బీజేపీ నేత బండారు ప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యారు. అంధవిద్యార్థులతో ఆప్యాయంగా.. సుష్మాస్వరాజ్కు జ్ఞాపికను అందిస్తున్న డ్వాబ్ కార్యదర్శి చొక్కారావు (ఫైల్) అనంతరం సుష్మాస్వరాజ్.. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుతో కలిసి నల్లగొండ పట్టణంలోని డ్వాబ్చే నిర్వహించబడుతున్న అంధుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చడించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆమెను డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, పాఠశాల సిబ్బందితో కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుష్మాస్వరాజ్ మృతి దేశానికి తీరనిలోటు నల్లగొండ: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోన ?బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే హరియాణలో శాసనసభకు ఎన్నికై 25వ ఏటనే రాష్ట్రమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికై దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో అనుకూలంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్లో చిన్నమ్మగా అందరికి గుర్తుండి పోయారని తెలిపారు. సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు శ్రీరామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, నూకల వెంకట్నారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, నిమ్మల రాజశేఖర్రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, భూపతిరాజు, యాదగిరాచారిచ దర్శనం వేణు, గుండగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు -
సుష్మకు కన్నీటి వీడ్కోలు
-
ఎంపీ సుమలత ట్వీట్పై నెటిజన్ల ఫైర్
బెంగళూరు : బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా, సినీ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చేసిన ట్వీట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో కర్నాటక భవన్లో సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో పాల్గొన్న ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్లోడ్ చేశారు. దీనిపై పలువురు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్లు చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన సుష్మా స్వరాజ్ మృతి చెందితే ఆమెను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఈ ట్వీట్ చేయడం అంత అవసరమా మేడం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. దీంతో బుధవారం ఉదయం సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు అని సుమలత ట్వీట్ చేశారు. ಮಾಜಿ ವಿದೇಶಾಂಗ ಸಚಿವೆ ಶ್ರೀಮತಿ ಸುಷ್ಮಾ ಸ್ವರಾಜ್ ಜಿ ಅವರ ಸಾವಿನ ಸುದ್ದಿ ತುಂಬಾ ದುಃಖಕರವಾಗಿದೆ. ಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಪ್ರೀತಿಪಾತ್ರರಿಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ಸಂತಾಪ.ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ದೇವರು ಚಿರಶಾಂತಿಯನ್ನು ನೀಡಲಿ ಎಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. 🙏🙏🙏 pic.twitter.com/l2ccKtPONp — Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) August 7, 2019 At dinner meeting of Hon'ble CM in Karnataka Bhavan , Delhi @CMofKarnataka @BSYBJP @DVSadanandGowda @SureshAngadi_ #PrahladJoshi Discussed issues & problems faced in various districts pic.twitter.com/6fThr3Wu0V — Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) August 6, 2019 -
బళ్లారి ముద్దుబిడ్డ
బళ్లారి ముద్దుబిడ్డగా కీర్తిగాంచిన బీజేపీ అగ్ర నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మృతి జిల్లవాసులతో పాటు యావత్ కర్ణాటకలో అశేష అభిమానులకు తీవ్ర శోకాన్నిమిగిల్చింది. రాష్ట్రం నుంచి ఎంతో మంది బీజేపీ నాయకులు, అభిమానులు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు.కన్నడనాటతో బలమైన అనుబంధం ఉన్న ఆమె అస్తమయం బళ్లారి ప్రాంతానికి తీరనిలోటుగా అభిమానులు ఆవేదనచెందుతున్నారు. సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో, ముఖ్యంగా బళ్లారిలో బీజేపీకి, నాయకులకు సుష్మాస్వరాజ్ వెన్నుదన్నుగా ఉండేవారు. 1999 లోక్సభ ఎన్నికల్లో అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో ఆమెపై పోటీకి సుష్మాస్వరాజ్ సై అన్నారు. దీంతో బళ్లారిలో ఒక్కసారిగా బీజేపీకి గట్టి పునాది ఏర్పడింది. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, హరపనహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకరరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిలు ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ వెంట నడిచి ఆమె గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయడంతో పాటు సోనియాగాంధీ గెలుపొందడంతో సుష్మాస్వరాజ్ ఓటమి చెందారు. ఆమె ఓటమి పాలైనా నిరుత్సాహ పడక బళ్లారిపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. పేదల పెళ్లిళ్లకు పెద్ద అతిథి ఈక్రమంలో గాలి సోదరులు, శ్రీరాములుకు సుష్మాస్వరాజ్ అండ లభించింది. సుష్మస్వరాజ్ను గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తల్లిగా భావిస్తూ ఆమెకు అమితమైన గౌరవం ఇవ్వడంతో పాటు ఆమె ఆధ్వర్యంలో బళ్లారిలో ఏటా వరమహాలక్ష్మీ పూజను చేయడం ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి బళ్లారిలో వరమహాలక్ష్మీ వ్రతం రోజున గాలి కుటుంబం జరిపించే ఉచిత సామూహిక వివాహాల్లో సుష్మాస్వరాజ్ పాల్గొంటూ వేలాది పేద జంటలకు ఆశీస్సులు అందించారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారు. సుష్మాస్వరాజ్ ఇక లేరన్న వార్త బళ్లారిలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. -
సుష్మా స్వరాజ్ రోజుకో రంగు చీర
2009–14 మధ్య (15వ లోక్సభ) కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్, లోక్సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఉన్న సమయంలో వారిరువురి మధ్య పలు కవితా యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో 15వ లోక్సభ సమావేశాల్లో అనేకసార్లు అసహ్యకర పరిస్థితులు తలెత్తాయి. అయితే కొన్నిసార్లు మన్మోహన్, సుష్మలు.. ఒకరిపై ఒకరు కవితాత్మకంగా చేసుకున్న విమర్శలు సభ్యులను ఉల్లాసపరిచాయి. వారిద్దరి హాస్య చతురత అందరికీ గుర్తుండేలా చేశాయి. ఓ సారి మన్మోహన్ మాట్లాడుతూ, మీర్జా ఘాలిబ్ రాసిన ప్రఖ్యాత కవితను చదివారు. ‘హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్, జో నహీన్ జాన్తే వఫా క్యా హై’ (విశ్వాసం అనే పదానికి అర్థం కూడా తెలియని మనుషుల దగ్గరి నుంచి మేం విశ్వాసాన్ని ఆశిస్తున్నాం) అని మన్మోహన్ అనగా, సుష్మ దీనికి స్పందిస్తూ, బషీర్ బద్ర్ కవితతో సమాధానం ఇచ్చారు. ‘కుచ్ తో మజ్బూరియా రహీ హోంగీ, యూం హీ కోయీ బేవఫా నహీ హోతా’ (కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉండుండాలి. ఏ కారణమూ లేకుండా ఊరికే ఎవ్వరూ నమ్మిన వారిని మోసం చేయరు) అని సుష్మ బదులిచ్చారు. ఆ వెంటనే మన్మోహన్ను ఉద్దేశించి సుష్మ మరో కవిత చదువుతూ ‘తుమ్హే వఫా యాద్ నహీ, హమే జఫా యాద్ నహీ; జిందగీ ఔర్ మౌత్ కే తో దో హీ తరణే హై, ఏక్ తుమ్హే యాద్ నహీ, ఏక్ హమే యాద్ నహీ’ (నా విశ్వాసాన్ని మీరు గుర్తుంచుకోరు. మీకు విశ్వాసం లేకపోవడాన్ని నేను గుర్తుంచుకోను. జీవితంలో రెండే పాటలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోరు. ఇంకోటి నాకు గుర్తుండదు) అని చెప్పడంతో సభ్యులంతా ప్రశంసించారు. ఇలాంటి సందర్భాలు 15వ లోక్సభలో ఎన్నో ఉన్నాయి. వచ్చి మీ రూపాయి తీసుకోండి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తనకు చేసిన ఫోన్ కాల్ను, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని సాల్వే కంట తడి పెట్టారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేకపోయారని అన్నారు. గుండెపోటుకు అరగంట ముందు, మంగళవారం రాత్రి 8:50 గంటల ప్రాంతం లో సుష్మా హరీష్కి కాల్ చేసి మాట్లాడారు. . ‘మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉద్వేగపూరితమైనది. ఒక్క రూపాయి నేను నీకు ఇవ్వాల్సి ఉంది. వెంటనే వచ్చి తీసుకోండి’ అని ఆమె చెప్పారని ఆయన అన్నారు. ‘‘నిజంగానే ఆ రూపాయి ఎంతో విలువైనది. ఎందుకంటే అది ఒక లాయర్గా నాకు ఆమె చెల్లించే ఫీజు. అందుకే తప్పకుండా వచ్చి తీసుకుంటా’ అని నేను చెప్పాను. ‘ సరే బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ రూపాయి తీసుకోండి’ అని ఆమె చెప్పారు. ‘నేను సరే’ అనడంతో ఆమె ఫోన్ పెట్టేశారు. సుష్మాతో అవే చివరి మాటలవుతాయని ఊహించలేకపోయానని సాల్వే గద్గద స్వరంతో చెప్పారు. ఆ రూపాయి కథేంటంటే.. పాక్ జైల్లో ఉన్న కుల్భూషణ్ జాధవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సాల్వే వాదించారు. అందుకు ఆయన భారత ప్రభుత్వం దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఈ కేసులో ఆయన గెలవడంతో జాదవ్ ఉరి ఆగింది. భారత్ తరఫున సాల్వేను నియమించినప్పుడు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఉన్నారు. రోజుకో రంగు చీర సుష్మా స్వరాజ్కు ఓ వైవిధ్యమైన అలవాటు ఉంది. వారంలో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలనే దానిపై ఆమె కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. ప్రతి సోమవారం ముత్యపు తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ చీరలు, మంగళవారాల్లో ఎరుపు, కాషాయం లేదా దొండపండు రంగు చీరలు, బుధవారాల్లో ఆకుపచ్చ రంగు, గురువారాల్లో పసుపుపుచ్చ రంగు, శుక్రవారాల్లో బూడిద లేదా వంగపూత రంగు, శనివారాల్లో నీలం లేదా నలుపు రంగు చీరలను ఆమె ధరించేవారు. ఆదివారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలనేదానిపై ప్రత్యేకమైన నిబంధనలేమీ ఉండేవి కావు. దాదాపు గత రెండు దశాబ్దాలపాటు ఆమె ఈ అలవాటును పాటించారు. ఇలా రోజుకో రంగు చీర ధరించేందుకు జ్యోతిష్యం లేదా మూఢనమ్మకాలు కారణం కాదనీ, కేవలం అది తన అలవాటని సుష్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాకు కూడా ఇలాంటి అలవాటే ఉంది. సిక్కు అయిన ఆయన, రోజుకో రంగు తలపాగాను ధరిస్తారు. -
హైదరాబాద్లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!
సాక్షి, హైదరాబాద్: తాను హైదరాబాద్లో లేకున్నా.. చేనేత దుస్తులను మర్చిపోనని అమెరికన్ మాజీ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రస్తుతం కాన్సులేట్లో లేనప్పటికీ ఈరోజు చేనేత దుస్తులనే ధరించానని బుధవారం ట్వీట్ చేసి కొన్ని ఫొటోలను జతచేశారు. ఆమె కాన్సుల్ జనరల్గా ఉన్న సమయంలో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో సిబ్బంది మొత్తం చేనేత దుస్తుల్లో విధులకు హాజరవడం గమనార్హం. సుష్మ మృతిపై యూఎస్ కాన్సులేట్ దిగ్భ్రాంతి.. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపై యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్తో కలసి సుష్మ సమావేశమైన ఫొటోను పోస్టు చేసింది. -
వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ
భారతీయత నిండుదనానికి ఆమె చిరునామా. భారతీయుల స్వప్నానికి ప్రతిబింబం. సాటి లేని వాగ్ధాటి ఆమె సొంతం. ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ... చెప్పాలనుకున్న విష యాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో అందివేసిన చేయి. ఏపనైనా అలవోకగా చేసే ధైర్యం, తెగువ ఆమె సొంతం. రాజకీయంగా... అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించారు. ఒక స్త్రీగా, ఇల్లాలిగా, రాజకీయనాయకురాలిగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సంపూర్ణ మహిళగా ఖ్యాతి పొందారు. ఆమె మరెవరో కాదు భారత వీరనారి, ద గ్రేట్ లెజెండ్ సుష్మ స్వరాజ్. పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనైనా... దక్షిణాదిలో కూడా ఆమె సుపరిచితురాలే. పార్టీ అధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆమె పాపులర్ అయ్యారు. పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా తన మార్క్ ఉండాల్సిందే. హర్యానాలో విద్యా భ్యాసం చేసిన సుష్మ 20 ఏళ్లకే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత బీజేపీలో చేరి అంచ లంచెలుగా ఎదిగారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ జాతీయ నాయకురాలి స్థాయికి చేరుకున్నారు. 25 ఏళ్లకే అంబాలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది 27 ఏళ్లకే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికై ఔరా అన్పించుకున్నారు. నాలుగుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నిక య్యారు. 1999లో బళ్లారి నుంచి లోక్ సభకు పోటీ చేసి సోనియాకు సవాల్ విసిరి.. దేశమంతా తనవైపు చూసేలా ప్రచారం సాగించారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. వాజ్పేయి హయాంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సమాచార శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి అప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. 1996లో వాజ్పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉంటూ లోక్సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సుష్మ కీలక బాధ్యత నిర్వర్తించారు. 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు పొందారు. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కేబి నెట్లో కీలక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మ ఆ శాఖకు ముందెన్నడూ లేని గుర్తింపు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా దేశానికి తరలించడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైంది. కల్లోల దేశాల్లో ప్రజల్ని రక్షించేందుకు తాను నేరుగా ఆయా దేశాల రాయ బార కార్యాలయాలతో చర్చలు జరిపేవారు. పార్లమెంట్ లో సుష్మ చేసే ప్రసంగాలకు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరూ జేజేలు పలికేవారు. భాషపై పట్టు, వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆమె ఇట్టే కట్టిపడేసేవారు. విదేశాంగ మంత్రిగా ఉంటున్న సమయంలో వచ్చిన ఆనారోగ్యం సుష్మను ఊపిరి సలుపుకోనివ్వలేదు. అందువల్లే గత ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తన జీవిత కాలంలోనే చూడాల్సిన ఘట్టంగా, చనిపోయే ముందు చేసిన ట్వీట్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించింది. సుష్మ చనిపోయారన్న నిజాన్ని భారతీయులెవరూ జీర్ణించుకోలేకోపోయారు. సంతాప సందేశాల్లో ప్రపంచదేశాధినేతలు కన్నీటి పర్యంతమయ్యారంటే విదేశాంగ విధానంపై సుష్మ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విదేశాంగ విధానానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ సుష్మ స్వరాజ్ ముందు, సుష్మ స్వరాజ్ తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి నేత మరొకరు ఉండరు. ఉండబోరు. ఆ ఘనత ఒక్క సుష్మకు మాత్రమే దక్కుతుంది. పురిఘళ్ల రఘురామ్: బీజేపీ సమన్వయకర్త, ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
సుష్మకు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ : సహచరులు, మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) అంత్యక్రియలు బుధవారం ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. లోధి రోడ్డులోని శ్మశానంలో ఉన్న విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. త్రివర్ణ పతాకంతో చుట్టిన ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్న బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశానానికి తరలించారు. గుండెపోటు కారణంగా సుష్మ మంగళ వారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అడ్వాణీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర ప్రము ఖ రాజకీయ నాయకులు, సుష్మ కుటుంబసభ్యు లు, స్నేహితులు, ప్రజలు సహా వేలాది మంది సుష్మ అంత్యక్రియలకు హాజరై, విషణ్ణ వదనాలతో తుది వీడ్కోలు చెప్పారు. సుష్మ ఇంటి వద్ద ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పిస్తూ మోదీ కంటతడి పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు జంతర్ మంతర్ లోని సుష్మ ఇంటి వద్ద, 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బీజేపీ కార్యాలయంలోనూ సుష్మ భౌతిక కాయాన్ని ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిం చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ, అమిత్ షా, అడ్వాణీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తదితర అనేక మంది నేతలు సుష్మ ఇంటికి వెళ్లి, భౌతిక కాయానికి నివాళులర్పించారు. నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యారి్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్ నేతలు రాహు ల్ గాం«దీ, గులాం నబీ ఆజాద్, సీపీఎం నాయకు రాలు బృందా కారత్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ నాయకురాలు హేమ మాలిని తదితరులు సుష్మ ఇంటికి వెళ్లి నివాళి అరి్పంచారు. కన్నీరు పెట్టుకున్న అడ్వాణీ సుష్మకు గురువుగా పేరుగాంచిన ఎల్కే అడ్వాణీ, సుష్మ భౌతిక కాయం వద్దకు రాగానే కంటతడి పెట్టారు. ఆమె గురించి అడ్వాణీ గుర్తు చేసుకుం టూ, ‘నా ప్రతీ పుట్టిన రోజున నాకు ఎంతో ఇష్టమైన చాకొలేట్ కేక్ను సుష్మ తీసుకొచ్చేది. నేను నా బృందంలోకి చేర్చుకున్న నిబద్ధత కలిగిన యువ కార్యకర్త ఆమె. కాలక్రమంలో ఆమె మా పార్టీలో గొప్ప పేరున్న, ప్రఖ్యాత నాయకురాలిగా ఎదిగింది. పారీ్టలోని, బయటి మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలు. ఏవైనా సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆమెకున్న జ్ఞాపక శక్తిని చూసి నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను’అని చెప్పారు. కాగా, సుష్మ మరణంతో ఏర్పడిన లోటును పూడ్చటం చాలా కష్టమని అమిత్ షా అన్నారు. ‘ఆమెను ప్రేమించే కోట్లాది మంది ప్రజలకు ఇది దుర్దినం. మోదీ నాయకత్వంలో ఆమె ఐదేళ్ల కాలం పనిచేసి, భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చారు’అని ఆయన పేర్కొన్నారు. రాఖీ కట్టడానికి నా చెల్లెలు లేదు: వెంకయ్య దయ, ధైర్యం, ప్రేమ, మంచితనాలకు సుష్మా మారుపేరు అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆమె అకాల మరణం విచారకరమనీ, దేశం ఓ గొప్ప పాలనాదక్షురాలిని, సమర్థవంతమైన పార్లమెంటేరియన్ని, ప్రజల గొంతుకగా నిలిచిన నాయకురాలిని కోల్పోయిందన్నారు. సుష్మకు రాజ్యసభ బుధవారం ఘన నివాళి అరి్పంచింది. ప్రధాని మోదీ కూడా ఆ సమయం లో సభలో ఉన్నారు. సభ సమావేశమైన వెంటనే సుష్మ మరణం గురించి ఓ నోట్ను వెంకయ్య చదివి సభ్యులకు తెలియజెప్పారు. దేశం అత్యున్నతంగా ఉండాలని ఆమె ఎప్పుడూ కోరుకునేదని అన్నారు. సుష్మ మరణం తనకు వ్యక్తిగతంగా లోటు అని వెంకయ్య చెబుతూ, ఆ గొప్ప నాయకురాలు చెప్పిన మాటలు, చేసిన పనులు ప్రజా జీవితంలో ఉన్న వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ‘ఆమె నన్ను ఎప్పుడూ అన్నా అని పిలిచేది. మా ఇంట్లో జరిగే కుటుంబ, సంప్రదాయ వేడుకలకు అన్నింటికీ హాజరయ్యేది. ప్రతి రాఖీ పండుగకూ నా చేతికి రాఖీ కట్టేది. ఈ సారి నాకు ఆ గౌరవం దక్కదు. ఆమె మరణంతో నా జీవితంలో ఎంతో విలువైన చెల్లెల్ని నేను కోల్పోయాను’అని వెంకయ్య ఉద్వేగంతో చెప్పారు. సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి: చైనా సుష్మా మృతికి చైనా బుధవారం సంతాపం తెలిపింది. ఇండియా–చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రిగా ఆమె పాత్రను చైనా గుర్తుచేసుకుంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఓ ప్రకట న విడుదల చేస్తూ, ‘మేడం సుష్మా స్వరాజ్ ఇండియాలో సీనియర్ రాజకీయ నాయకురాలు. ఆమె మరణం పట్ల మేం సంతాపం తెలుపుతున్నాం. సుష్మ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. సుష్మ విదేశాంగ మంత్రిగా ఉండగా అనేకసార్లు ఆమె చైనాలో పర్యటించారు. చైనా–ఇండియా సంబంధాలను మరింత ముందకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు’అని తెలిపారు. సుష్మా స్వరాజ్ చివరిసారిగా చైనాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెళ్లి, ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొని వచ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన కూతురు సుష్మా స్వరాజ్ అంత్యక్రియలను ఆమె కూతురు బాసురీ నిర్వహించారు. స్వరాజ్ భౌతిక కాయాన్ని విద్యుత్ దహనవాటికలోని ప్లాట్ఫాంపై ఉంచిన అనంతరం, ఆ ప్లాట్ఫాం చుట్టూ బాసురీ నీటి కుండతో మూడుసార్లు తిరిగారు. అనంతరం కుండను జారవిడిచి పగులగొట్టారు. ప్లాట్ఫాం చుట్టూ బాసురీ తిరుగుతున్నప్పుడు ఆమె తండ్రి కూడా తోడుగా ఉన్నారు. వారిద్దరినీ మోదీ ఓదారుస్తూ కనిపించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన బాసురీ, తన తండ్రితోపాటు సుప్రీం కోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. పాలు ఒలికిపోయినా ఏమీ అనేవారు కాదు.. సుష్మా స్వరాజ్ హరియాణాలోని అంబా లా కంటోన్మెంట్లో పెరిగారు. రాష్ట్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. చిన్నతనంలో ఆమెతో అనుబంధం ఉన్న పలువురు.. సుష్మ మరణం నేపథ్యంలో నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. కంటోన్మెంట్లోని బీసీ బజార్ ప్రాం తంలో ఆమె ఇల్లు ఉండేది. ఇప్పటికీ అదే ఇంట్లోనే సుష్మ సోదరుడు గుల్షన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. చర్చల్లో పాల్గొనడ మంటే చిన్నప్పటి నుంచి సుష్మకు బాగా ఇష్ట మనీ, బడిలో అనేక పోట్లీలో ఆమె పాల్గొందని చెబుతున్నారు. ‘ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే సుష్మ రాజకీయాలపై ఆసక్తి చూపేది. ఆ దిశలోనే వెళ్లి ఉన్నత శిఖరాలకు చేరింది’అని శ్యామ్ బిహారీ అనే వృద్ధుడు చెప్పారు. ఆమె అందరితోనూ ఆప్యాయంగా ఉండేదనీ, ప్రత్యర్థి పార్టీ వాళ్లకు కూడా సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేదని శ్యామ్ గుర్తుచేసుకున్నారు. 60వ పడిలో ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ చిన్నప్పుడు తాము క్రికెట్ ఆడుతుంటే, ఆ దారిలోనే సుష్మ పాల కోసం వెళ్లేదని చెప్పారు. ఎప్పుడైనా క్రికెట్ బంతి తగిలి పాలు ఒలికినా ఏమీ అనేది కాదనీ, మీరు బాగా ఆడండి అని చెప్పి వెళ్లిపోయేదని తెలిపారు. సుష్మ సోదరుడి ఇంట్లోని పనిమనిషి సుష్మ మరణ వార్త విని తీవ్రంగా విలపించారు. ‘ఆమె కొన్ని నెలల క్రితం ఇక్కడకు వచ్చారు. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసుకుని, వారిద్దరికీ బాగా చదువు చెప్పించాలనీ, వారి కోసం ఏదైనా అవసరం అయితే అడగమని చెప్పారు’ అని ఆమె తెలిపారు. -
గుర్తుండిపోయే నేత!
కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్లాల్ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్ పరివార్ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్ నాయకుడు ఎల్కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్ కౌశల్ను పెళ్లాడాక ఆమె జనసంఘ్కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు. ఆ క్రమంలో ఆమె లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి. బెంగళూరులోని పబ్పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్ పరివార్ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు. విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది. ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. -
సెల్యూట్తో కడసారి వీడ్కోలు పలికారు!!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్కు యావత్ దేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. తీవ్ర గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిండైన భారతీయ రూపంతో, తన వాక్పటిమతో ప్రజలను ప్రేమగా హత్తుకొనే నాయకత్వ శైలితో ప్రజలకు ఎంతో చేరువన ఈ చిన్నమ్మకు కన్నీటి నివాళులర్పించేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆమె నివాసంలో, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు.. ఆమె తనయురాలు బాన్సూరి స్వరాజ్, భర్త స్వరాజ్ కౌశల్ తుదిసారి సెల్యూట్ చెప్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థివ దేహానికి వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కుమార్తె బాన్సూరీ స్వరాజ్ చేతుల మీదుగా ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది
బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై హరియాణా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ వాసి అయిన సుష్మా స్వరాజ్ బాల్యపు రోజులను, ప్రజలతో ప్రేమగా, ఆప్యాయంగా వ్యవహరించే ఆమెతో తమ అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. సుష్మా స్వరాజ్ హరియాణా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చౌదరీ దేవీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1977-82, 1987-90 మధ్యకాలంలో అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనుకోకుండా కలిసివచ్చిన అదృష్టంతోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఎంతో కటోరశ్రమతో ఉన్నతమైన నాయకురాలిగా ఎదిగారని ప్రస్తుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ గుర్తుచేసుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనే సుష్మా ఎమ్మెల్యేగా గెలుపొందారని, అనంతరం హరియాణ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన తెలిపారు. ‘1977లో అంబాలా కంటోన్మెంట్ టికెట్ను సోమ్ ప్రకాశ్ చోప్రాకు జనతా పార్టీ ఇచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లి వచ్చిన ఆయన కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేదు. దీంతో ఆ టికెట్ అనూహ్యంగా సుష్మాజీకి దక్కింది. ఆమె గెలుపొందారు. జనతా పార్టీ హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది’ అని అనిల్ విజ్ తెలిపారు. 1990లో సుష్మా రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అప్పటినుంచి అనిల్ విజ్గా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సుష్మా స్వరాజ్ చిన్నవయస్సులోనే తల్లి చనిపోయారని, అప్పటినుంచి అంబాలా కంటోన్మెంట్లోని బీసీ బజార్లో ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ఆమె.. స్కూలు రోజుల నుంచే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనేవారని అనిల్ విజ్ తెలిపారు. అంబాలా కంటోన్మెంట్లోని ఎస్డీ కాలేజీలో చదివిన సుష్మా అనంతరం చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. ఆమె సోదరుడు ప్రస్తుతం అంబాలా కంటోన్మెంట్లోని తన పూర్వీకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. -
‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’
తిరువనంతపురం: చెరగని చిరునవ్వుకు, నిండైన భారతీయతకు నిలువెత్తు నిదర్శనం సుష్మా స్వరాజ్. దేశ ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించగలిగిని అతి కొద్ది మందిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు ఎవరూ సాయం కోరినా తక్షణమే స్పందించేవారు సుష్మా స్వరాజ్. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం చిన్నమ్మ జ్ఞాపకాల్లో తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుష్మకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా హెచ్ఐవీ రోగులంటే చిన్న చూపు ఇంకా పోలేదు. నేటికి ఆ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు. 2020లోనే ఇలా ఉంటే.. 2003 కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకుని.. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించదని సమాజానికి ఓ సందేశం ఇచ్చారు సుష్మా స్వరాజ్. ట్విటర్ యూజర్ పియు నాయర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘తల్లిదండ్రుల కారణంగా ఈ చిన్నారులకు ఎయిడ్స్ వ్యాధి సోకింది. దాంతో వీరు చదువుతున్న పాఠశాల యాజమాన్యం.. ఈ చిన్నారులను స్కూల్ నుంచి తొలగించింది. ఇతర ఏ స్కూల్లో కూడా వీరిని చేర్చుకో లేదు. దాంతో చిన్నారుల తాత ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలాం వారు చదువుకోవడానికి మార్గం చూపడమే కాక ఈ పిల్లల కోసం ఓ ప్రత్యేక ట్యూటర్ని కూడా ఏర్పాటు చేశారు. వీరి గురించి తెలిసిన సుష్మా స్వరాజ్ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా చిన్నారులను కలుసుకుని ప్రేమగా దగ్గరకు తీకున్నారు. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందదని తెలిపారు’ అంటూ నాయర్ ఈ ఫోటోని ట్వీట్ చేశాడు. నేడు సుష్మా స్వరాజ్ చనిపోయారనే వార్త తెలిసి ఈ పిల్లల తాత తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ రోజు సుష్మాజీ నా మనవల పట్ల చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ పిల్లల చదువకు అవసరమైన సాయం అందేలా సుష్మాజీ ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన మేలును జీవితాంతం మరవలేం’ అన్నారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు 2010లో మృతి చెందగా.. మరొకరికిప్పుడు 23 ఏళ్లు. -
‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్ తెచ్చేవారు’
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్ మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీ. బుధవారం ఉదయం ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తూ.. అద్వాణీ కన్నీరు పెట్టుకున్నారు. ‘సుష్మ చాలా చిన్న వయసులోనే పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ... శక్తివంతమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. నేటి తరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలిచారు. సుష్మ గొప్ప వక్త. ఆమె జ్ఞాపకశక్తిని చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయేవాడిని. సుష్మ ప్రతిసంవత్సరం నా పుట్టిన రోజు నాడు నాకిష్టమైన చాకొలెట్ కేక్ తీసుకొచ్చేవారు. ఒక్క సారి కూడా కేక్ తేవడం మర్చిపోలేదు’ అంటూ సుష్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అద్వాణీ. అంతేకాక సుష్మ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆమె తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె మరణం బీజేపీకి తీరని లోటు అంటూ అద్వాణీ కన్నీటి పర్యంతమయ్యారు. -
మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!
‘బన్సూరీ(సుష్మా స్వరాజ్ కుమార్తె)ని నన్ను సెలబ్రిటీ లంచ్ కోసం రెస్టారెంటుకు తీసుకువెళ్తా అని చెప్పారు. కానీ మా ఇద్దరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయారు దీదీ’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఉద్వేగానికి లోనయ్యారు. ‘సుష్మాజీ ఆకస్మిక మరణం వేలాది మంది కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పార్టీ కార్యకర్తగా మహిళా సాధికారతకై మన జీవితాన్ని అంకితం చేసినట్లయితే...అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి’ అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి స్మృతి మరో ట్వీట్ చేశారు. కాగా విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన సుష్మా స్వరాజ్.. అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యర్థి పార్టీలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడుతూనే... తనదైన శైలిలో ప్రసంగాలు చేసి వారిని సైతం ఆకట్టుకునేవారు. కేవలం రాజకీయ నాయకురాలిగానే గాకుండా... మంచి మనసున్న ‘అమ్మ’గా ప్రజలకు దగ్గరయ్యారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. असंख्य महिला कार्यकर्ताओं की प्रेरणा दीदी का आकस्मिक निधन हम सबको स्तब्ध कर गया । आज उनके शोकाकुल परिवार के प्रति सहानुभूति व्यक्त करती हूँ ।एक कार्यकर्ता के नाते महिला उत्थान के प्रति अगर हम अपना जीवन समर्पित करे तो वो दीदी के प्रति सच्ची श्रधांजलि होगी । pic.twitter.com/J7aJTCQtpm — Smriti Z Irani (@smritiirani) August 7, 2019 -
సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులనే తేడా లేకుండా రాజకీయాల్లో ఆమె శాస్వత ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆమె తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేవారు. అయితే ఆమె ఏకంగా ఆరు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, ఆయా రాష్ట్ర ప్రజల్లో గుర్తింపును పొందారు. 1970లలో హర్యానా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం.. అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. హర్యానా: సుష్మా స్వరాజ్ తొలిసారిగా 1977 ఎన్నికల్లో పోటీ చేశారు. హర్యానాలోని అంబాలా నుంచి విజయం సాధించారు. తన 25 ఏళ్ల వయసులోనే సుష్మా హర్యానాలోని దేవీలాల్ సర్కారులో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే హర్యానా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. ఢిల్లీ: 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సుష్మ దక్షిణ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తరువాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి ఆమె కేంద్రమంత్రిగా సేవలు అందించారు. అయితే ఆ తరువాత ఆమె తన పదవికి రాజీనామా చేసి, ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్: సుష్మా స్వరాజ్ 2000లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయాక కూడా అక్కడి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సుష్మ కీలకపాత్ర పోషించారు. 2009, 2014 ఎన్నికల్లో విదిశ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. కర్ణాటక: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై 1999 లోక్సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. బళ్లారి లోక్సభ స్థానంలో సోనియాతో తలపడ్డారు. ఆమె ఓటమి చెందినప్పటికీ అక్కడి ప్రజలతో అప్పుడప్పుడు మమేకమవుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజలతోనూ సుష్మా స్వరాజ్కు మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. బిల్లు ఆమోదం సందర్భంగా ‘తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకొండి’ అంటూ సుష్మా చేసిన ప్రసంగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాదు కేంద్ర విదేశాంగ మంత్రిగా వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు -
‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’
న్యూఢిల్లీ: చిన్నమ్మగా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ మరిక లేరు. గుండెపోటు రూపంలో మృత్యువు ఆమెను దేశ ప్రజలకు దూరం చేసింది. చెరగని చిరునవ్వుతో భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సుష్మా స్వరాజ్. 25 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు సుష్మా స్వరాజ్. అయితే తన ఎదుగుదలలో భర్త స్వరాజ్ కౌశల్ తోడ్పాటు మరువలేనిది అంటారు సుష్మా స్వరాజ్. ఆయన ప్రోత్సాహంతోనే తాను ఇంత ఎదిగానని చెప్తారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను దాటుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడు సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. వీరికొక కుమార్తె. ఆమె కూడా లాయరే. ఈ ఏడాది సుష్మా స్వరాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సుష్మా స్వరాజ్ భర్త మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో పాల్గొనని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మిల్కా సింగ్ కూడా ఓ ఏదో రోజు పరుగు ఆపాల్సిందే. 25 ఏళ్ల వయసులో.. 1977లో మీ పరుగు ప్రారంభమయ్యింది. 41 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మీతో పాటు నేను కూడా పరిగెడుతున్నాను. నేనేం 19 ఏళ్ల యువకుడిని కాదు. ఇక నాకు పరిగెత్తే ఓపిక లేదు. మీరు మీ పరుగును ఆపుతూ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను’ అంటూ స్వరాజ్ కౌశల్ చమత్కరించారు. సుష్మా స్వరాజ్ కుటుంబ జీవితానికి, వృత్తి బాధ్యతలకు సమాన ప్రధాన్యం ఇచ్చారు. ఈ విషయం గురించి స్వరాజ్ కౌశల్ గతంలో ఓ సారి మాట్లాడుతూ.. ‘మా అమ్మ గారు 1993లో క్యాన్సర్తో మరణించారు. ఆ సమయంలో సుష్మ ఎంపీగా ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నా తల్లికి సేవ చేయడానికి సహయకురాలిని నియమించుకోమని సుష్మకు చాలా మంది సలహ ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఏడాది పాటు నా తల్లికి అన్ని సేవలు చేసింది. కుటుంబం పట్ల ఆమె ప్రేమ అలాంటిది. నా తండ్రికి నాకన్నా, సుష్మ అంటేనే అభిమానం. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయనకు సుష్మనే తలకొరివి పెట్టింద’ని తెలిపారు స్వరాజ్ కౌశల్. -
సుష్మా స్వరాజ్కు ప్రముఖుల నివాళి
-
‘నన్ను అన్నా అని పిలిచేవారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ దివంగత సీనియర్ నేత సుష్మా స్వరాజ్కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సుష్మ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ...ప్రజల గొంతుక వినిపించే శక్తివంతమైన పార్లమెంటేరియన్ సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. ఆమె అకాల మరణం జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘ ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు. రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టేవారు. అందుకోసం నేనే స్వయంగా వారింటికి వెళ్లేవాడిని. అయితే ఇకపై రాఖీ పండుగ నాడు తానే మా ఇంటికి వస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. కాబట్టి నేనే వచ్చి రాఖీ కడతాను నాతో అన్నారు’ అంటూ సుష్మా స్వరాజ్తో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులతో పంచుకున్నారు. కాగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. -
తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గొంతుక వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ఢిల్లీలో సుష్మాస్వరాజ్కు ఆయన నివాళర్పించారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం ఆమెనని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా "తెలంగాణ చిన్నమ్మ"గా నిలిచిపోతారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ యువకులు బలిదానం కావొద్దు..తెలంగాణ చూడాలని భరోసా నింపిన గొప్ప నాయకురాలని చెప్పారు. గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు విదేశాంగ శాఖ మంత్రిగా సాయం చేశారన్నారు. ప్రవాసి భారతీయలకు అండగా నిలవడం కోసం ‘మదద్’ వెబ్ సైట్ పెట్టి వారికి అండగా నిలిచారన్నారు. సుష్మా స్వరాజ్ మృతి దేశానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలిపారు. -
‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మృతిపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడానికి గంట ముందే ఆమె తనతో మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ జాదవ్ తరపున ప్రభావవంతంగా వాదించి భారత్కు విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కులభూషన్ జాదవ్ కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు ఇంటికి రావాల్సిందిగా సుష్మా తనను ఆహ్వానించారని, ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ సుష్మా స్వరాజ్తో నేను నిన్న రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి వచ్చి కలవండి’ అని అన్నారు. దానికి నేను, ‘అవును మేడమ్ ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు’’ అని సుష్మాతో సాగిన సంభాషణను హరీష్ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాధవ్(49)కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్ వాదనలే కీలకం. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. కానీ ఈ కేసు వాదించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. పాక్ తరఫున బ్రిటన్కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్కు దక్కిన విజయంగా అభివర్ణించారు. దీనిపై హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు. (చదవండి : ఉరి.. సరి కాదు) -
ముగిసిన అంత్యక్రియలు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మా స్వరాజ్ మృతి చెందారు. ముగిసిన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. భద్రతా దళాల గౌరవ వందనం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ పార్థివ దేహం వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కడసారి నివాళులర్పించిన ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎల్కే అద్వాణీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా పలువురు బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్ భౌతిక కాయానికి కడసారి నివాళులర్పించారు. కుమార్తె చేతలు మీదుగా అంతిమ సంస్కారాలు సుష్మాస్వరాజ్ అంతిమయాత్ర లోధి రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకుంది. కాసేపట్లో ఆమె అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సుష్మాకు కడసారి వీడ్కోలు పలికేందుకు శ్మశాన వాటిక వద్దకు భారీగా ప్రముఖులు, అభిమానులు చేరుకున్నారు. సుష్మా స్వరాజ్కు అంతిమ సంస్కారాలు కుమార్తె బన్సూరీ నిర్వహించనున్నారు. శ్మశాన వాటకకు చేరుకున్న ప్రధాని సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, గులా నబీ ఆజాద్ లోధీ రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకున్నారు. Delhi: PM Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and former Bhutan PM Tshering Tobgay at Lodhi crematorium. #SushmaSwaraj pic.twitter.com/YfIX6o51sp — ANI (@ANI) August 7, 2019 దలైలామా సంతాపం సుష్మా స్వరాజ్ మృతికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజల పట్ల సుష్మాస్వరాజ్ ఎంతో దయ, స్నేహభావంతో మెలిగేవారని ప్రశంసించారు. కడసారి వీడ్కోలు పలికిన మంత్రులు బీజేపీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితరులు సుష్మా అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. #WATCH Rajnath Singh, JP Nadda, Ravi Shankar Prasad, Piyush Goyal & other BJP leaders give shoulder to mortal remains of #SushmaSwaraj as they are being taken from BJP headquarters to Lodhi crematorium in Delhi. pic.twitter.com/H72kZ3lpQw — ANI (@ANI) August 7, 2019 ప్రారంభమైన అంతిమయాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి సుష్మా స్వరాజ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. కార్యాలయం వద్ద సుష్మా పార్థివదేహానికి ఆమె భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సూరీ శాల్యూట్ చేశారు. ఆ సమయంలో వారు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టిన ప్రధాని మోదీ కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. అలానే మరో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సుష్మా స్వరాజ్ను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరి కొద్ది సేపట్లో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున బీజేపీ కార్యాలయం వద్దకు తరలి వచ్చారు. జనసంద్రాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు లోధీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్నాథ్ సింగ్తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మహిళా సాధికారతకు నిదర్శనం: సచిన్ సుష్మా స్వరాజ్ మృతి పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ‘సుష్మా స్వరాజ్ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయుల క్షేమం గురించి ఆమె ఆరాట పడేవారు. ఆమె మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాను’ అన్నారు సచిన్. బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి హోంమంత్రి అమిత్షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు నివాళులర్పించారు. అమిత్ షా కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను సుష్మ మృతదేహం మీద కప్పారు. ఏపీ గవర్నర్ సంతాపం మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు మరువలేమన్నారు. సుష్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు గవర్నర్. బీజేపీ ప్రధాన కార్యాలయానికి సుష్మ మృతదేహం పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తమ అభిమాన నాయకురాలిని కడసారి చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. Delhi: Mortal remains of former External Affairs Minister #SushmaSwaraj being taken to BJP headquarters pic.twitter.com/Uv4VE33jIT — ANI (@ANI) August 7, 2019 సుష్మా స్వరాజ్ మృతికి చైనా సంతాపం తెలిపింది. చైనా-భారత్ సంబంధాలు బలపడటంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని చైనా రాయబారి సన్ విడాంగ్ తెలిపారు. దీదీ.. ఆ ప్రామిస్ నెరవేర్చలేదు సుష్మాస్వరాజ్ మృతి పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మా స్వరాజ్ కుమార్తె)ని, నన్ను మంచి రెస్టరెంట్కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్ను నెరవేర్చకుండానే వెళ్లిపోయావు’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. I have an axe to grind with you Didi . You made Bansuri pick a restaurant to take me for a celebratory lunch. You left without fulfilling your promise to the two of us. — Smriti Z Irani (@smritiirani) August 6, 2019 కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సోనియా గాంధీ, ఒడిశా సీఎం సుష్మా స్వరాజ్ ఇంటికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. మాకు మంచి స్నేహితురాలు: ఇజ్రాయెల్ అంబాసిడర్ ‘సుష్మా స్వరాజ్ మా దేశానికి మంచి స్నేహితురాలు. నా దేశం, నా దేశ ప్రజల తరఫున సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఇజ్రాయెల్-ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటంలో సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది’ అంటూ భారత్ ఇజ్రాయెల్ రాజబారి రాన్ మల్కా ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. సాయానికి చిరునామ: శత్రుఘ్న సిన్హా ‘నా ప్రియ స్నేహితురాలి మృతి నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆమె ఇక లేరనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సాయం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె. ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు సాయం చేయడానికి ఆమె ఎల్లప్పుడు ముందుండేది. వారి బాగోగుల కోసం నిరంతరం కృషి చేసింది. సాయం చేయడంలో ఎన్నడు వెనకంజ వేయలేదు. ఆమె చాలా మందికి హీరో. తప్పును.. తప్పుగా వేలెత్తి చూపే ధైర్యం ఆమె సొంత. ఆమె మృతి కుటాంబానికే కాక దేశానికి కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అంటూ శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. Rudely shocked & deeply saddened by the sudden demise of #SushmaSwaraj, Former External Affairs Minister, a very dear personal friend, an inspirational leader, a brilliant parliamentarian, a most respected, great administrator and a woman par excellence who dedicated her life to — Shatrughan Sinha (@ShatruganSinha) August 7, 2019 సుష్మా స్వరాజ్ నాకు అత్యంత ఆప్తులు సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వాణీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు గల అనుబంధాన్ని అద్వాణీ గుర్తు చేసుకున్నారు. 1980 కాలంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. సుష్మా స్వరాజ్ అప్పటికి చాలా చిన్నది. అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది.. చూస్తుండగానే దేశంలోనే చాలా శక్తివంతమైన రాజకీయనాయకురాలిగా ఎదిగారు. మహిళా నాయకులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె అకాల మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది’ అన్నారు అద్వాణీ సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గౌతమ్ గంభీర్ సుష్మా స్వరాజ్ నివాసం వద్దకు చేరుకుని ఆమె మృత దేహానికి నివాళులర్పించారు. కర్ణాటకలో బీజేపీ శ్రేణుల సంతాప సభ కర్ణాటక సీఎం యడియూరప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం సుష్మా స్వరాజ్ మృతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అలాగే సుష్మ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం అంత్యక్రియలు.. సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె మరణం తీరని లోటని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం, పార్టీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ప్రముఖుల సంతాపం.. సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జేపీ నడ్డా, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నాయకురాలు హేమా మాలిని, యోగా గురువు బాబా రాందేవ్ తదితర ప్రముఖులు సుష్మా స్వరాజ్ నివాసం వద్దకు చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. -
ఆ ప్రసంగం ఓ చరిత్ర: కవిత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో గొప్ప నేతను కొల్పోయామని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమె ప్రసంగాల ద్వారా తాను ఎంతో స్ఫూర్తిని పొందానని కవిత గుర్తుచేశారు. ఈమేరకు 1996లో లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగ వీడియోని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. చరిత్రలో ఇదొక గొప్ప ప్రసంగమంటూ ఆమె పోస్ట్ చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగంపై ప్రసంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. కవిత షేర్ చేసిన వీడియోలో బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని కూడా వాజ్పేయీ ఉన్నారు. It’s hard to believe that @SushmaSwaraj Ji is no more. My heartfelt condolences to her family & huge fan base. I have always admired her for her extraordinary oratory skills.This is one of my fav speeches of hers. https://t.co/qR3zWj54kx #RIPSushmaJi — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 7, 2019 -
ట్విటర్ ఫైటర్ను కోల్పోయా : పాక్ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా హఠాన్మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ‘ ట్విటర్లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయాను. హక్కుల కోసం పోరాటే గొప్ప దిగ్గజం ఆమె. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను’ అని ఫవాద్ చౌద్రీ ట్వీట్ చేశారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కాగా పాకిస్తాన్లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్లో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్లోని ఇండియన్ కమిషనర్ను సుష్మా ఆదేశించారు. దీనిపై ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. సుష్మాస్వరాజ్ ట్విటర్ను వేదిగా చేసుకుని పలు సమస్యలకు పరిష్కారం చూపారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. సుష్మా స్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్రవేశారు. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చి పలువురి అభినందనలు అందుకున్నారు. సుష్మా ఎటువంటి తారతమ్యాలు లేని రీతిలో సేవలు అందించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. Condolences to the family of Smt Sushma Swaraj, ll miss twitter melee with her, she was a giant in her own right, RIP https://t.co/MEVgLAK5jM — Ch Fawad Hussain (@fawadchaudhry) August 6, 2019 -
నేల మీదే పడుకుంటా; సుష్మ భీష్మ ప్రతిఙ్ఞ!
సాక్షి, న్యూఢిల్లీ : నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి అక్కడి ప్రజల చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్ భరతావని చేత ‘సూపర్ మామ్’ అనిపించుకున్న ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు. సుష్మ హఠాన్మరణంతో దేశమంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. తన జీవితకాలంలో (67)... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆమె ప్రజా జీవితంలోనే గడిపిన సుష్మా స్వరాజ్.. చివరి శ్వాస వరకు ప్రజలతో మమేకమయ్యే ఉన్నారు. ‘ఈరోజు నా కోసం జీవితమంతా ఎదురు చూశా’ అంటూ కశ్మీర్ పరిణామాలపై మంగళవారం చివరిసారిగా సుష్మ ట్వీట్ చేశారు. అదే విధంగా తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించారంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు సుష్మ అభినందనలు తెలిపారు. భీష్మ ప్రతిఙ్ఞ! ‘సుష్మా చాలా ఎమోషనల్ లీడర్. అందరికీ అతివేగంగా కనెక్ట్ అయిపోతారు’’ ఈ మాటలు సుష్మా స్వరాజ్ సన్నిహితులకే కాదు ఆమె జీవితం గురించి తెలిసిన, ట్విటర్లో ఆమెను ఫాలో అయ్యే యువతరానికి కూడా బాగా తెలుసు. మంచైనా, చెడు అయినా సరే మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు గొట్టినట్లు చెప్పడం సుష్మకు అలవాటు. అలాగే భావోద్వేగాలను దాచుకోకుండా మాటల తూటాలు వదలడంలోనూ ఆమె ముందుంటారు. మాతృభూమి పట్ల తనకున్న భక్తిని చాటుకోవడంలోనూ ఏమాత్రం సందేహించరు. ప్రతీ విషయాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకుంటారామె. ఉదాహరణకు... 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్న సమయంలో సుష్మ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘ తమ ప్రాణాలను త్యాగం చేసి బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన తర్వాత కూడా దేశాన్ని పాలించడానికి భారతీయులెవరూ దొరకలేదా? పరాయి పాలన అంతమైన తర్వాత కూడా ఓ విదేశీయురాలు పాలకురాలిగా ఎంపిక కాబడితే నిజంగా నా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఒకవేళ అదే గనుక జరిగితే నేను శిరోముండనం చేసుకుంటాను. రోజూ నేలమీదే పడుకుంటాను. పల్లీలు మాత్రమే తింటాను. తెల్లచీరే ధరిస్తాను అంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని కానున్నాన్నరన్న వార్తలపై సుష్మ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆమె వెనక్కితగ్గలేదు. క్షమాపణ చెప్పేది లేదని.. సోనియా గాంధీ ఎప్పుడు ప్రధాని అయినా తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. ఇక 1996 లోక్సభ ఎన్నికల్లోనూ బళ్లారి(కర్ణాటక) నియోజకవర్గంలో సోనియా చేతిలో ఓటమి పాలైనపుడు కూడా సుష్మ ఈవిధంగానే స్పందించారు. తాను ఎన్నికల బరిలో ఓడిపోయానే తప్ప యుద్ధంలో కాదని ఓటమిని హుందాగా స్వీకరించిన చిన్నమ్మ.. చివరిదాకా బళ్లారి ప్రజలు, నేతలతో తరచుగా సమావేశమయ్యేవారు. ఇలా ప్రతీ విషయంలోనూ నిక్కచ్చిగా, ఒకింత ఉద్వేగంగా స్పందించే సుష్మ అకాల మరణం పట్ల ఆమె అభిమానులే కాకుండా యావత్ దేశమంతా ‘అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ అంతే భావోద్వేగంగా నివాళులు అర్పిస్తున్నారు. -
ప్రముఖులతో సుష్మాస్వరాజ్
-
చిన్నమ్మ మరిలేరు : చిన్నబోయిన బాలీవుడ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంపై బాలీవుడ్ దిగ్ర్భాంతి చెందింది. సుష్మా హఠాన్మరణంపై బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యావత్జాతిని ఆందోళనకు గురిచేసిన సుష్మా మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఓ గొప్ప రాజనీతికలిగిన నేత, దిగ్గజ నాయకురాలు మనల్ని విడిచివెళ్లారన్న విషాద సమాచారం తమను బాధించిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్ సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ అద్భుత పార్లమెంటేరియన్, మంత్రి అంటూ కొనియాడిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అత్యున్నత సేవలు అందించిన ఆమెను మిస్ అవుతున్నామని అన్నారు. సుష్మా స్వరాజ్జీ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అనుష్క శర్మ ట్వీట్ చేశారు. సుష్మాజీ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె తమకు ఎప్పటి నుంచో అత్యంత సన్నిహితురాలిగా మెలిగేవారని, తమ పట్ల ఆప్యాయత కనబరిచేవారని సంజయ్ దత్ గుర్తుచేసుకున్నారు. దిగ్గజ నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఢిల్లీ సుల్తానుల కోటను బద్దలు కొట్టిన సుష్మా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంతో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేరుకున్నారు. దేశ రాజధానికి ఢిల్లీకి స్వాతంత్ర్య భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. 1998 అక్టోబర్ 13న ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. దీంతో 800 ఏళ్ల నాటి ఢిల్లీ సుల్తానుల రికార్డును ఆమె శాస్వతంగా తుడిచేశారు. ఢిల్లీ సుల్తానుల పాలకురాలు రజియా సుల్తానా 1236 అక్టోబర్ 14 నుంచి 1240 వరకు హస్తినను పాలించారు. ఆమె తరువాత ఢిల్లీని పాలించిన మహిళగా సుష్మా చరిత్రలో నిలిచిపోయారు. 1998 ఎన్నికల్లో ఆమె ఓటమి చెందినప్పటికీ మరో మహిళా సీఎంగా షీలా దీక్షిత్ ఆ పదవిని అధిష్టించారు. కాగా ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి మహిళా ముఖ్యమంత్రులుగా సేవలందించింది వీరిద్దరు మాత్రమే. ఇదిలావుండగా షీలా, సుష్మా ఇద్దరూ 15 రోజుల వ్యవధిలోనే మృతిచెంది భారతావనిని శోకసంద్రంలో ముంచారు. 1970లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుష్మా ఇప్పటి వరకు అనేక అత్యున్నత పదవుల బాధ్యతలను స్వీకరించి వాటిని వన్నెతెచ్చారు. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆమె.. ఇటివల ముగిసిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. -
ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంలు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం దిగ్ర్భాంతికి లోనయింది. తీవ్ర గుండెపోటుతో ఎయిమ్స్లో మంగళవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. తన రాజకీయ జీవితంలో కీలక పదవులు చేపట్టి వాటికి వన్నెతెచ్చిన సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మదన్లాల్ ఖురానా, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్లు మరణించడం గమనార్హం. ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ నేత మదన్లాల్ ఖురానా 2018, అక్టోబర్ 27న సుదీర్ఘ అనారోగ్యంతో 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1993-96 మధ్య ఖురానా ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ దిగ్గజ నేత షీలా దీక్షిత్ (81) ఈ ఏడాది జులై 20న ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అత్యధిక కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ 2004లో కేరళ గవర్నర్గానూ సేవలు అందించారు. జీవితాంతం కాంగ్రెస్ నేతగానే కొనసాగిన షీలా 1984లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. యూపీలోని కన్నౌజ్ ఎంపీగానూ పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించారు. మరో ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ (67) ఆకస్మిక మరణం అటు దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను విషాదంలో ముంచెత్తింది. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సుష్మా స్వరాజ్ 1998లో ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. -
ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను అర్థం చేసుకున్నాం. తల్లికి పురుడు పోసి తెలంగాణ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ నుంచి గల్లీ వేదికల వరకు పదే పదే చెబుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి అండదండగా ఉంటూ వచ్చిన మహిళా నేత సుష్మస్వరాజ్. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతి ఆందోళనకు హాజరై రాష్ట్ర ఏర్పాటుకు తొలి నుంచి ఆమె అండగా నిలబడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే సందర్భంలో కొందరు బీజేపీ అగ్రనేతలే తెలంగాణలో, పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను తప్పుబట్టినా.. ఇది యూపీఏ ప్రభుత్వం తేల్చాల్సిన అంశమంటూ తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసినా.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనని పట్టుబట్టి మద్దతుగా నిలిచిన సుష్మాస్వరాజ్.. మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అగ్రనేతలు ఎల్.కే.అద్వానీ, రాజ్నాథ్సింగ్, నితిన్గడ్కరీ, అరుణ్జైట్లీను తెలంగాణకు అనుకూలంగా వారిని ఒప్పించడంలో సుష్మ పోషించిన పాత్ర చాలా కీలకం. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుష్మస్వరాజ్ మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో నిలిచిపోతాయి. ‘‘ప్రసవ వేదనను తీర్చే సమయం ఆసన్నమైంది. ఎన్నో త్యాగాల మీద, విద్యార్థుల బలిదానాల మధ్య అనేక మంది ప్రజా పోరాటాలతో పండంటి తెలంగాణ బిడ్డ జన్మించబోతుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. ముందు ముందు తెలంగాణబిడ్డ ఎదిగేందుకు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి’’అంటూ ఆమె చేసిన ప్రసంగం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చదవండి: సుష్మా హఠాన్మరణం -
మాటలన్నీ తూటాలే!
సుష్మా స్వరాజ్ నిలుచుంటే నిండా ఐదగుడుల ఎత్తు కూడా ఉండరు. ఒక అంగుళం తక్కువే ఉంటారు. కానీ రాజకీయాల్లో, వ్యక్తిత్వంలో ఆమె శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 67 ఏళ్ల వయసులో... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ప్రజా జీవితంలోనే!!. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఆమెను విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. సుష్మా రాజకీయ మూలాలు కుటుంబం నుంచే మొదలయ్యాయని చెప్పాలి. తల్లిదండ్రులు వాస్తవంగా పాకిస్థాన్లోని లాహోర్ ప్రాంతంలో పుట్టినా... దేశ విభజన సమయంలో హరియాణాకు వచ్చేశారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆరెస్సెస్ కార్యకర్త. సుష్మ కూడా చదువుకునేటప్పుడే అఖిలభారత విద్యార్థి పరిషత్లో చేరారు. ఎమర్జెన్సీ తరవాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో ఆమె తొలిసారి ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. సినిమాలకు ఊపిరి... 1999లో వాజ్పేయి కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా ఉన్నపుడు సుష్మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి పరిశ్రమ స్థాయి కల్పించారు. దీంతో సినిమాలకు బ్యాంకు రుణాలు తీసుకోవటం సులభమయింది. అప్పటిదాకా ఫైనాన్స్ కోసం అండర్వరల్డ్పై భారీగా ఆధారపడిన సినిమా రంగం... ఈ నిర్ణయంతో కొత్త టర్న్ తీసుకుంది. ఫైనాన్షియల్ కంపెనీలు ఈ రంగంలోకి రావటానికి మార్గం సుగమమయింది. ‘డిజిటల్ డిప్లొమసీ’.... 2014 నుంచీ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఆమె సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ప్రతి అంశాన్నీ ట్వీట్ చేయటంతో ఆమెకు ట్విటర్లో ఏకంగా 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్ ద్వారా వెంటనే స్పందించేవారు. ఏ సమయంలోనైనా ట్విటర్లో అందుబాటులో ఉండే నేతగా సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పేరుంది. అందుకే వాషింగ్టన్ పోస్ట్ ఈమెకు ‘సూపర్ మామ్’ ట్యాగ్ కూడా తగిలించింది. ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952 తల్లిదండ్రులు: హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ చదువు: బీఏ – సనాతన్ ధర్మ కాలేజి, అంబాలా ఎల్ఎల్బీ – పంజాబ్ యూనివర్సిటీ భర్త: స్వరాజ్ కౌశల్ (1975లో వివాహం) సంతానం: ఒక కుమార్తె వృత్తి: సుప్రీంకోర్టు లాయర్ రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్సభ) - భర్త స్వరాజ్ కౌశల్ పిన్న వయస్సులోనే గవర్నర్గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, హరియాణా కేబినెట్లో (1977– 82, 1987–90) అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ దంపతులు విశిష్ట జంటగా లిమ్కాబుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. - ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 13, 1998 నుంచి డిసెంబర్ 3, 1998 వరకు పనిచేశారు. - 1998లో కేంద్ర సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. - 2000– 20003 సంవత్సరాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా - 2003–2004 కాలంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. - 2009లో లోక్సభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. - 2014– 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. - పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎస్సీసీ ఉత్తమ కేడెట్గా, ఉత్తమ విద్యార్థినిగా మూడేళ్లపాటు ఎంపికయి గోల్డ్ మెడల్ సాధించారు. వివిధ స్థాయీసంఘాలు, పార్లమెంట్ కమిటీల్లో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు. హరియాణా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు. -
సుష్మా చివరి ట్వీట్ ఇదే..
బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. సుష్మా అకాల మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాధరణ కలిగిన సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సుష్మా.. చివరి శ్వాస వరకు దేశ అభివృద్ది కోసం పాటు పడ్డారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లు పాస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రం ఆమె చివరి ట్వీట్ చేశారు. ఇందు కోసమే తాను చాలు రోజులుగా వేచి చూస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్ షా హుందాగా ప్రవర్తించారని మరొక ట్వీట్లో ప్రశంసించారు. (చదవండి: సుష్మాస్వరాజ్ హఠాన్మరణం) प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime. — Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019 गृह मंत्री श्री अमित शाह जी को उत्कृष्ट भाषण के लिए बहुत बहुत बधाई. I congratulate the Home Minister Shri @AmitShah ji for his outstanding performance in Rajya Sabha. — Sushma Swaraj (@SushmaSwaraj) August 5, 2019 -
సుష్మాస్వరాజ్: ఏబీవీపీ నుంచి కేంద్ర మంత్రిగా..
బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇక లేరు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుష్మా మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీ ఎయిమ్స్కు చేరుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె.. అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సుష్మా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా...మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోదీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్ ఏబీవీపీ నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. 2004 ఏప్రిల్లో సుష్మా స్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు అదనంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి అంతర్జాతీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. -
సుష్మా హఠాన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లోని ఎమెర్జెన్సీ వార్డ్కు తీసుకువచ్చారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రమే ఆమె ట్వీట్ చేశారు. ‘నరేంద్ర మోదీజీ.. చాలా చాలా కృతజ్ఞతలు ప్రధాని గారు. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను’ అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే హుటాహుటిన కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ఎయిమ్స్కు చేరుకున్నారు. సుష్మాస్వరాజ్ మృతికి రాష్ట్రపతి కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. ‘సుష్మాజీ మృతి వార్త నన్నెంతో షాక్కు గురిచేసింది. ప్రజాజీవితంలో గొప్ప దార్శనికతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నేతను దేశం కోల్పోయింది’ అని కోవింద్ ట్వీట్ చేశారు. ఎన్డీయే 1 ప్రభుత్వంలో తన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (చదవండి: సుష్మా చివరి ట్వీట్ ఇదే..) ‘భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు’ అని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రయోజనాల విషయంలో ఆమె ఎల్లప్పుడూ రాజీలేని పోరాటమే చేశారని మోదీ గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన అన్ని శాఖల్లోనూ అద్భుత పనితీరును కనపర్చారని, విదేశాంగ మంత్రిగా పలు దేశాలతో భారత్ సంబంధాలను మరో ఎత్తుకు తీసుకువెళ్లారని వరుస ట్వీట్లలో కొనియాడారు. విదేశాల్లో ఆపదల్లో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ఎప్పుడూ ముందుండేవారని, ప్రజా సేవలో ఆమె సేవలు మరవలేనియని ప్రధాని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతికి షాక్కు గురి చేసిందని కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ మృతి తమనెంతో బాధకు గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. గొప్ప నేత, అద్భుత వక్త, అన్ని పార్టీల్లో ఆప్తులున్న సుష్మాజీ మరణం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’ అని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రేపు బీజేపీ హెడ్ క్వార్టర్ట్స్లో.. సుష్మాస్వరాజ్ మృతదేహాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆ తరువాత లోధీ రోడ్డులో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు లాయర్గా 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధాని మోదీ గత మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మోదీజీ! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కోసం నా జీవితమంతా ఎదురుచూశా. – ‘370’ రద్దుపై సుష్మా చివరి ట్వీట్.. సుష్మా స్వరాజ్ మరణించారని తెలిసి తీవ్రంగా షాక్కు గురయ్యాను. ప్రజలు అమితంగా ప్రేమించే ఓ మంచి నాయకురాలిని దేశం కోల్పోయింది. ప్రజా జీవితంలో గౌరవం, ధైర్యం, సత్ప్రవర్తనకు ఆమె మారుపేరులా ఉండేవారు. ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలని తపించేవారు. ఈ దేశానికి ఆమె అందించిన సేవల వల్ల ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతుంది. – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు. – ప్రధాని నరేంద్ర మోదీ ఏడుసార్లు లోక్సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. లోక్సభలో విపక్ష నేత పాత్రలో బీజేపీ వాణిని గట్టిగా వినిపించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ కార్యకర్తలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. – అమిత్ షా, హోం మంత్రి నా సహాధ్యాయిల్లో అత్యంత విలువైన వ్యక్తి సుష్మా స్వరాజ్ మరణ వార్త విని నేను తీవ్రంగా కలత చెందాను. పార్టీలకతీతంగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె మరణం మనకు భారీ లోటు. కింది స్థాయి నుంచి సుష్మ అనేక బాధ్యతలు నిర్వర్తించి విదేశాంగ శాఖ మంత్రి వరకు ఎదిగారు. ఆమె హయాంలో విదేశాంగ శాఖ పనితీరును పూర్తిగా మార్చేశారు. ప్రజల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో శ్రద్ధ, జ్ఞానంతో సుష్మ ఈ దేశానికి సేవ చేశారు. ఆమె సేవలను దేశం, పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనూహ్యంగా మరణించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఆమె నాకు 1990ల నుంచి తెలుసు. మా భావజాలాలు వేరైనప్పటికీ, పార్లమెంటులో ఎన్నోసార్లు మేం ఇద్దరం ఎంతో స్నేహపూర్వకంగా నడచుకున్నాం. ఎంతో గొప్ప రాజకీయ నాయకురాలు, మంచి మనిషి సుష్మ. ఆమెను మనం కోల్పోయాం. సుష్మ కుటుంబ సభ్యులకు నా సానుభూతి. – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం సుష్మా స్వరాజ్ మరణించారని తెలియడంతో నేను షాక్కు గురయ్యాను. ఆమె ఓ అసాధారణ రాజకీయ నాయకురాలు. వాక్పటిమను బహుమతిగా పొందిన వక్త. పార్టీలకు అతీతంగా ఆమెకు మిత్రులున్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. సుష్మా స్వరాజ్ మరణ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది. ఆమె నన్ను ఎప్పుడూ శరద్ భాయ్ అని పిలిచేది. మనం ఓ గొప్ప రాజనీతిజ్ఞురాలిని, గొప్ప వక్తను, సమర్థవంతమైన పరిపాలకురాలిని.. వీటన్నింటికీ మించి ఓ దయా హృదయురాలిని మనం ఈనాడు కోల్పోయాం. – శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు సుష్మా స్వరాజ్ మరణ వార్త వినాల్సి రావడం బాధాకరం. ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. – సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది సుష్మ అక్క. మనం సంబరాలు చేసుకోవడం కోసం ఓ రెస్టారంట్ను ఎంపిక చేయమని బన్సూరీ(సుష్మ కూతురు)కి మీరే చెప్పారు. కానీ మా ఇద్దరికి ఇచ్చిన ఆ మాటను నెరవేర్చకుండానే మీరు ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయారు. – స్మృతీ ఇరానీ, జౌళి శాఖ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నేత ఆమె అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మన్ననలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
‘ఆజం ఖాన్ మానసిక వికలాంగుడు’
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్ చేశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్పై చర్యలు తీసుకునేలా స్పీకర్కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. -
‘షీలా దీక్షిత్లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’
న్యూఢిల్లీ: ట్విటర్లో యాక్టీవ్గా ఉండే ప్రముఖుల్లో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో ఉంటారు. ఆపదలో ఉండి సాయం కోరే వారి విషయంలో తక్షణమే స్పందించే సుష్మా స్వరాజ్.. కామెంట్ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ట్విటర్ వేదికగా చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగే రామ్ మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇర్ఫాన్ ఖాన్ అనే ఓ ప్రబుద్ధుడు సుష్మా ట్వీట్పై స్పందిస్తూ.. ‘షీలా దీక్షిత్ లానే మిమ్మల్ని కూడా ఏదో రోజు దేశమంతా తల్చుకుంటుంది అమ్మా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ నెల 20న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. చనిపోయాక సుష్మాజీని కూడా అలానే తల్చుకుంటారని చెప్తూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘నా గురించి ఇంత అత్యున్నతమైన ఆలోచన చేసినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. సుష్మా సమాధానం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడమే కాక ఇర్ఫాన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Is bhawana ke liye apko mera agrim dhanyawad. I thank you in anticipation for this kind thought. https://t.co/pbuW6R6gcE — Sushma Swaraj (@SushmaSwaraj) July 21, 2019 -
అధికారిక నివాసం ఖాళీ చేసిన సుష్మాస్వరాజ్
-
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన సుష్మ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ప్రభుత్వ అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేసిన ఆమెకు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ లేన్లోని రెసిడెన్సీ-8ను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను ఆ బంగ్లాలో ఉండటం లేదని, అంతకు ముందు ఫోన్ నెంబర్లలో గాని, నివాసంలోగానీ అందుబాటులో ఉండనంటూ సుష్మా స్వరాజ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు సుష్మకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. I have moved out of my official residence 8, Safdarjung Lane, New Delhi. Please note that I am not contactable on the earlier address and phone numbers. — Sushma Swaraj (@SushmaSwaraj) 29 June 2019 -
ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి
అల్గునూర్ (మానకొండూర్): ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ అయిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాధితుడు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ‘సాక్షి’లో ‘ఎడారిలో బందీ’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడారు. వీరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సౌదీ అరేబియాలోని విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు వీరయ్య ఉన్న ప్రదేశానికి చేరుకుని అతడిని వెంటనే భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అక్కడి నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం స్థానికంగా నివాసముండే తెలుగువారికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ప్రత్యేక వీసా వీరయ్య వీసా ముగియడంతో అతడిని స్వదేశానికి పంపించేందుకు అధికారులు ప్రత్యేక వీసా తయారు చేయించారు. ఈనెల 25న విమానం టికెట్ బుక్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముంబై వరకు టికెట్ బుక్ చేయడంతో వీరయ్య ఈ నెల 26న వేకువ జామున సౌదీ అరేబియా నుంచి బయల్దేరాడు. 27వ తేదీన ముంబై చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బస్సులో జగిత్యాలకు వచ్చి శుక్రవారం కరీంనగర్ చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల ఉద్వేగం క్షేమంగా ఇంటికి వచ్చిన వీరయ్యను చూసి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని చూసిన ఆనందంలో వీరయ్య కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తాను మళ్లీ ఇంటికి చేరుతానని అనుకోలేదని ఈ సందర్భంగా వీరయ్య తెలిపాడు. తాను ఇంటికి రావడానికి సహకరించిన కేటీఆర్, సుష్మాస్వరాజ్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై సౌదీ వెళ్లిన తాను అక్కడ నరకం అనుభవించానని, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అన్ని సక్రమంగా ఉంటేనే వెళ్లాలని పేర్కొన్నాడు. తమకు స్థానికంగా ఉపాధి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
ఆ ఇద్దరూ రాజకీయాలకు గుడ్బై చెప్పినట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్లు ఇక రాజకీయాలకు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది. తమకు పార్లమెంట్ మాజీ సభ్యులు గల గుర్తింపు కార్డులను మంజూరు చేయాలంటూ. ఈ ఇద్దరు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తొలి సమావేశాలు నిర్వహించేందుకు భేటీ అయిన పార్లమెంట్కు వారు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన 17 లోక్సభ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మా ప్రకటించగా.. వయో భారంతో మహాజన్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంట్లు.. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులకు సుమిత్ర మహాజన్ విందును కూడా ఏర్పటుచేసినట్లు సమాచారం. తనకు పార్లమెంట్ సభ్యురాలిగా, లోక్సభ స్పీకర్గా అవకాశం కల్పించిందుకు బీజేపీ పెద్దలకు ప్రత్యేక ధన్యావాదాలంటూ ఇటీవల ఆమె ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమె ధరఖాస్తును పరిశీలించిన కేంద్రం త్వరలోనే గుర్తింపు కార్డును జారీచేస్తామని చెప్పినట్లు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పంకజ్ కృష్ణసాగర్ తెలిపారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ మధ్యప్రదేశ్ నుంచే లోక్సభ ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ కేంద్ర విదేశాంగ బాధ్యతలు నిర్వహించిన సుష్మా స్వరాజ్ విధిశ నుంచి, మహాజన్ ఇండోర్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో సుష్మా ఢిల్లీకి సీఎంగా గతంలో పనిచేశారు. కాగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు సుష్మాపేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
గవర్నర్ పదవిపై స్పందించిన సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ నియమితులయ్యారంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏపీ గవర్నర్గా బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సుష్మా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే గవర్నర్గా నియమితులైనట్లు వదంతులు వచ్చాయి. ఇదిలావుండగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి కేంద్రమంత్రి హర్షవర్థన్ కూడా సుష్మాకు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా సుష్మాను అభినందిస్తూ.. పోస్టులు చేయడంతో ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అనంతరం కేంద్రమంత్రి తన ట్వీట్ను డిలీట్ చేశారు. The news about my appointment as Governor of Andhra Pradesh is not true. — Sushma Swaraj (@SushmaSwaraj) 10 June 2019 -
రాజ్యసభకు సుష్మా, అద్వానీ..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలపై ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బిహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నిక అనివార్యం కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా గుజరాత్లోని గాంధీ నగర్ నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోటీకి ముందే ఇదే విషయంపై అద్వానీతో షా, మోదీ చర్చించినట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్లోని విదిశ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వన్లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. -
మంత్రివర్గంలో ఆమె లేకుంటే ఎలా?
మోదీ కొత్త కేబినెట్లో 10 శాతానికి పైగా మహిళా మంత్రులు ఉన్నప్పటికీ... అదా విషయం! ఆరుని మూడుకు తగ్గించడం గురించి కదా.. మరో సుష్మను కేబినెట్ హోదాలోకి తీసుకోకపోవటం గురించి కదా.. ఇప్పుడు మాట్లాడుకోవలసింది! మాధవ్ శింగరాజు రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మహిళల్లో సుష్మా స్వరాజ్ లేరు! మంత్రివర్గంలో ఆమె లేకపోవడం ఏంటని కాదు ఆశ్చర్యం. ఆమె లేకుండా ఎలా అని! ‘మిస్ యూ సుష్మాజీ’ అని పార్టీలతో నిమిత్తం లేకుండా దేశ నాయకులు, దేశ ప్రజలు ఆమెకు ఇప్పటికీ ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే సుష్మను క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసినప్పటికీ అది ఏమాత్రం సంభవించవలసిన పరిణామం కాదనే భావన ఈ దేశ ప్రజలు, పూర్వపు మంత్రి వర్గ సహచరులలోనూ ఉంది.మోదీ కొత్త ప్రభుత్వంలో శుక్రవారం నాడు విదేశాంగ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘‘సుష్మాజీ అడుగుజాడల్లో నడవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మంత్రిగా ఆయన పెట్టిన తొలి ట్వీట్ అది. ప్రస్తుత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్ కూడా ఉండి ఉంటే మోదీ రెండో ఆలోచన లేకుండా ఆమెకు విదేశాంగ శాఖనే ఇచ్చి ఉండేవారు. గత ఐదేళ్లలో విదేశాంగ మంత్రిగా సుష్మ భారతదేశ దౌత్య సంబంధాలను చక్కబరచడం ఒక్కటే అందుకు కారణం కాదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలతో కలిసి ఎన్నారై బాధిత భార్యల కోసం ఆమె చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ ఉన్న భార్యలు చేసిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తల్ని పట్టి తేవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ‘దేశ ప్రజల ప్రియతమ మంత్రి’ అనే గుర్తింపునిచ్చా యి. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసులో 2016 నవంబరులో మధుమేహం తీవ్రం కావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రిలో సుష్మ అడ్మిట్ అయ్యారు. ఆ వివరాలను ట్వీట్ చేస్తూ.. కిడ్నీ ఫెయిల్ అవడంతో తనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని ఆమె వెల్లడించినప్పుడు అనేక మంది తమ కిడ్నీ ఇస్తామని ముందుకు వచ్చారు! ‘మేడమ్.. మీకు సమ్మతమైతే నా కిడ్నీని డొనేట్ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశానికి మీ సేవలు అత్యవసరం’ ఒక యువకుడు ట్వీట్ చేశాడు. జమ్మూలో ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల ఖేమ్రాజ్ శర్మ అయితే తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ‘‘విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది భారతీయులను ఆమె కాపాడారు. ఆదివారాలు కూడా ఆమె మంత్రిత్వ శాఖ కార్యాలయం తెరిచే ఉండేది. సుష్మ చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా నేను నా కిడ్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాను’’ అని శర్మ బీబీసీ ప్రతినిధితో అన్నారు. వాటన్నిటికీ ఒకే సమాధానంగా.. ‘‘ఫ్రెండ్స్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మాటలు రావడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు’’ అని సుష్మ ట్వీట్ చేశారు. ఆ ఏడాది డిసెంబరులో సుష్మకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగింది. మరింత ఆరోగ్యకరమైన పరిసరాల పరిశుభ్రత అనివార్యం కావడంతో తనిక పోటీ చేయబోవడం లేదని ఎన్నికలకు కొన్ని నెలల ముందే సుష్మ ప్రకటించారు. సర్జరీ తర్వాత కూడా రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన సుష్మ.. విదేశాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, సహాయం కోసం చేతులు చాచిన ఎందరినో ఒక తల్లిలా జన్మభూమి ఒడిలోకి తీసుకున్నారు. సుష్మ ఇంతగా తన ప్రభావాన్ని చూపించబట్టే కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మహిళలకు దక్కని సముచిత స్థానం గురించి కాకుండా, మంత్రివర్గంలో సుష్మ లేకపోవడం అనే విషయమే ప్రాముఖ్యాంశం అయింది. 78 మంది మహిళా ఎంపీలు ఉన్న ప్రస్తుత లోక్సభలో మహిళలకు మోదీ ఇచ్చిన కేబినెట్ హోదాలు మూడంటే మూడు మాత్రమే! స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్సిమ్రత్కౌర్ బాదల్. ఈ ముగ్గురూ గత లోక్సభలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నవారే. అప్పట్లో వీరితో పాటు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమాభారతి.. మొత్తం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ఉండేవారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, అనుప్రియా పటేల్ సహాయ మంత్రులుగా ఉండేవారు. మొత్తం ఎనిమిది మంది. ఆరు కేబినెట్ హోదాలు. రెండు సహాయ పదవులు. అదిప్పుడు మూడు కేబినెట్ హోదాలు, మూడు సహాయ పదవులుగా కుదించుకుపోయింది. 64 మంది మహిళా ఎంపీలు ఉన్న గత లోక్సభతో పోలిస్తే అంతకంటే పద్నాలుగు మంది మహిళా ఎంపీలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత లోక్సభలో ఉండాల్సిన మహిళా మంత్రుల సంఖ్య మరీ ఆరైతే కాదు. గత లోక్సభలో సుష్మతో సమానంగా మహిళా సంక్షేమం కోసం పని చేసిన మేనకా గాంధీని ప్రస్తుతానికి మోదీ పక్కన ఉంచారు. గంగాజల ప్రక్షాళన సేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న ఉమాభారతి తనంతట తనే తప్పుకున్నారు. సహాయమంత్రి అనుప్రియా పటేల్ మళ్లీ అదే హోదాలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. సహాయ హోదాలోకి మునుపు అదే హోదాలో ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొత్తగా రేణుకా సింగ్ సరితను, దేవశ్రీ చౌదరిని తీసుకున్నారు. పాత లోక్సభలో 6+2 గా ఉన్న మహిళా మంత్రులు కొత్త లోక్సభలో 3+3 అయ్యారు. జాతీయవాద మోదీ ప్రభుత్వానికి ‘మానవీయ’ ఇమేజ్ని తెచ్చిపెట్టిన సుష్మాస్వరాజ్ ఇప్పుడు మంత్రివర్గంలో లేని కారణంగా ఆమెపై పడుతున్న ఫోకస్.. మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య సగానికి సగం తగ్గడం అనే అంశాన్ని అవుట్ ఫోకస్ చేస్తోందని చెప్పడం కాదిది. కొత్తగా ఎన్నికైన లోక్ సభ మహిళా ఎంపీలలో సుష్మాస్వరాజ్లు లేకుండా పోరు. లేకున్నా, బాధ్యతలు అప్పగిస్తే తయారవుతారు. 1977లో దేవీలాల్ సుష్మపై నమ్మకం ఉంచి పాతికేళ్ల వయసులో ఆ కొత్తమ్మాయికి కేబినెట్ బాధ్యతలు అప్పగించినట్లే మోదీ కూడా కొత్త మహిళా ఎంపీలలో కనీసం మరో ముగ్గురికైనా కేబినెట్ హోదాను ఇస్తే దేశ ప్రయోజనాలకు అవసరమైన శక్తి సామర్థ్యాలు నిరూపితం కావా! 543 మంది సభ్యులున్న లోక్సభలో 80 వరకు మంత్రుల్ని తీసుకోవచ్చు. కేబినెట్లో ఇప్పుడు 58 మంది ఉన్నారు. ఫస్ట్ టైమ్ మహిళా ఎంపీలలో సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రేణుకా సింగ్, దేవశ్రీ చౌదరి, కాకుండా బీజేపీలో ఫస్ట్ టైమ్లు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్లు కాకున్నా సీనియర్లు ఉన్నారు. వాళ్లలోంచి తీసుకోవచ్చు. తీసుకుం టారా?! ∙ -
24 గంటలూ మీ సేవలోనే.. కేంద్రమంత్రి ఫస్ట్ ట్వీట్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అడుగుజాడల్లో ముందుకుసాగడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ బృందం 24 గంటలూ దేశ ప్రజల సేవలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్చేశారు. ‘ఇది నా మొదటి ట్వీట్. శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తుండటం గర్వకారణంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మాజీ విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ శుక్రవారం చరిత్ర సృష్టించారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆయన 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత్-చైనా మధ్య తలెత్తిన 73 రోజుల డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్ కీలక పాత్ర పోషించారు. -
సంప్రదాయంలో ‘స్వయంప్రకాశం’
దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరెస్సెస్ మూలాలు మరవని సుష్మా స్వరాజ్ 11 సార్లు రాష్ట్రాల, పార్లమెంటు ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులతో తలపడి నిలిచి గెలిచారు. 2009లో అడ్వాణీ స్థానంలో నరేంద్రమోదీకి బదులుగా ఆయనకంటే చిన్న వయస్కురాలైన సుష్మా స్వరాజ్ను బీజేపీ అధినేతగా ఆరెస్సెస్ నిర్ణయించి ఉంటే ఆ పార్టీ చరిత్ర మరొక మలుపు తిరిగి ఉండేదనటం నిర్వివాదాంశం. కానీ క్రికెట్లో లాగే అందరు స్టార్లూ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్లు కాలేరనీ రాహుల్ ద్రావిడ్లు కూడా ఉంటారన్నది రాజకీయాల్లోనూ సత్యమే. వారసత్వ రాజకీయాలకు దూరంగా బీజేపీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజయాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ వెలుగొందారు. ఆమె నిష్క్రమణ ఆమె సొంత నిర్ణయమే. జాతిహితం భారతీయ జనతాపార్టీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజ యాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్. ఆమె నిష్రమణతో అనేక అంశాల్లో ముందువరుసలో నిలిచి చరిత్రకెక్కిన గొప్ప భారతీయ మహిళా రాజకీయవేత్తను బీజేపీ కోల్పోనుంది. రాష్ట్రపతి భవన్లో నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వారు కూర్చున్న స్థానాలను దాటి అత్యంత విశిష్ట సందర్శకులు కూర్చున్న చోటికి సుష్మా స్వరాజ్ నడిచి వెళుతున్న దృశ్యం సంచలనం కలిగిం చింది. అక్కడ కూర్చుని ఉన్న సందర్శకుల్లో చాలామందికి ఆమె నూతన మంత్రివర్గంలో చేరవచ్చనే ఆశ అప్పటికీ చావలేదు. తన తొలి మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకుండా నరేంద్రమోదీ తన రెండో దఫా పాలన సాగించడం బహుశా కష్టమే కావచ్చు. సుష్మాకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు రహస్యం కాదు. తాను కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నానని ట్విట్టర్లో స్వయంగా ప్రకటించడం ద్వారా సుష్మా భారత రాజకీయ నాయకులు ప్రజా జీవితంపై కొనసాగుతున్న ముసుగును బద్దలు చేసిపడేశారు. తర్వాత ఆమె వేగంగా కోలుకున్నారనుకోండి. తన శరీరంలో కొత్తగా ఏర్పర్చుకున్న కిడ్నీతో ఆమె రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ వచ్చింది. దాని బలంతోనే ఆమె ఐక్యరాజ్యసమితిలో తన పాకిస్తానీ ప్రత్యర్థులతో తలపడ్డారు, ప్రపంచవ్యాప్తంగా తోటి విదేశీ కార్యాలయాలతో సమావేశాలు ఏర్పరుస్తూ వచ్చారు. అసాధారణమైన గౌరవాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆమె పెదాలనుంచి ఒక్కటంటే ఒక్క తేలికపాటి పదం కానీ వ్యక్తీకరణ కానీ ఎవరూ చూడలేకపోయారు. అలాగే ఆమె ఆగ్రహాన్ని కూడా ఎవరూ చూడలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ శాఖ మంత్రులను కలవడంలో వ్యవహారాలు నడపడంలో సుష్మా పూర్తిగా భిన్నమైన ఒక వినూత్న దౌత్య ప్రక్రియను పాటించారు. నరేంద్రమోదీ విదేశీవిధానాన్ని పూర్తిగా తానే నడుపుతూ వచ్చారని సుష్మా పాత్ర ఏమీ లేదని విమర్శకులు దాడి చేశారు. పాస్పోర్ట్, వీసా వలస సమస్యలను ట్విట్టర్లో పరిష్కరించడం తప్ప ఆమె చేసేందుకు ఏమీ లేదని కూడా విమర్శలు వచ్చాయి. కానీ తనపై వస్తున్న ఇలాంటి ఆరోపణలన్నింటినీ ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. మోదీ మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా నిజానికి పెద్దగా పొడిచిందంటూ ఏమీ లేదు. సుష్మా బాధ్యత చాలా కష్టభూయిష్టమైంది. ఒకవైపు తన ప్రధాని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుండగా ఆమె ఏమాత్రం లోటుగా భావించకుండా ఆయనకు దారి కల్పించారు. మీడియాలో ప్రచారం కోసం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు. వెనుక గదిలో తన పాత్ర పోషించడానికి ఆమె సిద్ధపడ్డారు. మోదీని ప్రశంసించడం తప్ప ఆయన గురించి ఒక్క పదం కూడా చెడుగా మాట్లాడలేదు. అతి చిన్నపట్టణమైన చండీఘర్లో మేమిరువురం 1977లో ఏకకాలంలో మా వృత్తి జీవితాలను ప్రారంభించాం. దేవీలాల్ నేతృత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వంలో పాతికేళ్ల ప్రాయంలో సుష్మా నవ, యువ కేంద్రమంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నేను ఆ సమయంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో సిటీ రిపోర్టరుగా పనిచేసేవాడిని. ఆ కాలంలో చాలా మంది రాజకీయ నేతల కంటే ఆమె ఎక్కువ ఆత్మగౌరవంతో మెలిగేవారు. అలాంటిది.. తన పార్టీ ఇప్పుడు రెండో దఫా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక సందర్శకురాలిగా ఉంటూ అక్కడ ఉన్న వారి అభినందనలు అందుకున్న సందర్భంలో 42 ఏళ్ల పాటు సాగిన ఆమె రాజకీయ జీవితం ఇక ముందు ఎలా సాగనుంది అనే విషయంలో నాకు ఇప్పటికీ అంత స్పష్టత కలగడం లేదు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుష్మా ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు పనిచేసిన ఎస్ జయశంకర్ ఇప్పుడామె స్థానంలో విదేశీవ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన అసాధారణమైన అంతర్గత శక్తి సహా యంతో ఆమె తన రాజకీయ నిష్క్రమణను తాత్వికంగా స్వీకరించవచ్చు. ఆమె ప్రజాజీవితంలో జరిగిన ఈ మలుపు కేవలం మలుపు కాదు.. ఆమె విశిష్టమైన రాజకీయ ప్రయాణంలో ఇది బహుశా ముగింపు లాంటి మలుపు కావచ్చు. 1970ల నాటి భారత రాజకీయాల్లో స్వయంప్రకటిత మహిళా నేతగా ఎదిగిన సుష్మా 27 ఏళ్ల వయసులో ఆమె హర్యానా జనతాపార్టీ అధ్యక్షురాలయ్యారు. అయితే 1979లో జనతాపార్టీ విచ్చిన్నమయ్యాక ఆమె జనసంఘ్ గ్రూప్ వైపు అడుగులేశారు. అప్పటినుంచి ఆమె వంశ పారంపర్యతకు దూరంగా స్వయం సిద్ధ రాజకీయనేతగా ఎదుగుతూ వచ్చారు. జాతీయ క్యాలెండర్లలోంచి నాట్యం చేస్తున్న అజంతా అప్సర చిత్రాలను తొలగించాలని, అశ్లీలతతో కనిపిస్తున్న కండోమ్ ప్రకటనలను నిషేధించాలని, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని సెక్సీ రాధా పాటను తొలగించాలని, దీపా మెహతా సినిమా ఫైర్లో షబానా ఆజ్మీ, నందితాదాస్ మధ్య లెస్బియన్ ప్రేమ దృశ్యాలను ప్రదర్శించకూడదని, అత్యాచార బాధితురాలిని సజీవ శవంగా భావించాలని తన జీవితం పొడవునా ప్రకటిస్తూ వచ్చిన సుష్మా బీజేపీ సాంప్రదాయతత్వానికి తాను తలొగ్గినట్లు మనతో నచ్చబలికేవారు. అంతమాత్రాన ఆమెను ఒక మామూలు బీజేపీ సాంప్రదాయిక భావాలు మాత్రమే కలిగిన నేతగా భావించరాదు. ఆమె ఒక విభిన్నమైన మహిళ అని చెప్పడానికి ఆమె జీవితం నుంచి డజన్ ఉదాహరణలను ఎత్తి చూపవచ్చు. ఆమె ఫక్తు మధ్యతరగతి జీవితాన్ని ప్రధానస్రవంతి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈ మూలాలే ఆమె వ్యక్తిగత ఎంపికలను నిర్ణయిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్కి చెందిన పితృస్వామిక వారసత్వాన్ని దూరం పెడుతూ వచ్చారు కూడా. ఈ క్రమంలోనే ఆమె మంగళూరులో కొంతమంది యువతులను అనైతిక కార్యకలాపాలకు దిగుతున్నారని ఆరోపిస్తూ బార్ల నుండి హిందూ ఛాందసవాద శక్తులు బయటకు లాగి అవమానించినప్పుడు ఆ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సుష్మా ఏమాత్రం భయపడలేదు. ఒక ఆధునిక, స్వతంత్ర మహిళగా, ఒక యువతికి తల్లిగా ఆమె ఎంతో స్వతంత్రంగా వ్యవహరించేవారు. మాట్లాడేవారు. దీంతో ఆమె సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తానొక విభిన్నమైన మహిళ అని గుర్తించినందుకే ఆమె అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాజకీయ జీవితం నుంచి తాను నిష్క్రమించబోతున్నానని, ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీపడటం లేదని ఆమె సరైన సమయంలో ప్రకటించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 11 సార్లు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన సుష్మా బలమైన పోటీని, ప్రత్యర్థులతో తలపడటాన్ని ఆమె ఎన్నడూ తప్పించుకోలేదు. కానీ ఇప్పుడామెకు 66 ఏళ్లు. పైగా ఆరోగ్యం ఇప్పుడామె ప్రధాన సమస్యగా మారింది. మధుమేహం తొలి దశ ప్రభావ ఫలితమిది. అయితే చివరవరకు వేచి ఉండకుండా కొత్త మంత్రివర్గంలో తాను చేరబోవడం లేదనే విషయాన్ని ఇంకాస్త ముందుగా ఆమె ప్రకటించి ఉండాల్సిందని నా సూచన. ఏది ఏమైనా ఆమె తన కెరీర్ను ఒక విజేతగానే, పార్టీకి అత్యంత విశ్వసనీయురాలిగానే ముగించారని ఆమె ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఆమె తొలినుంచి అడ్వాణీ ఆరాధకురాలు. కానీ 2009లో కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి అడ్వాణీ తిరస్కరించినప్పుడు సుష్మా ఏమాత్రం తొట్రుపాటు చెందకుండా పార్టీకి చెందిన సద్బుద్ధి కలిగిన ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్‘ (వెంకయ్యనాయుడు, అనంతకుమార్, అరుణ్ జైట్లీ )తో చేతులు కలపడమే కాదు పార్టీకి యువ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ను కోరారు కూడా. దాంతో నితిన్ గడ్కరీ వెలుగులోకి వచ్చారు.గత అయిదేళ్లకాలంలో ప్రధాని కార్యాలయం ఆమెను పక్కనబెట్టి ఉండవచ్చు, కొన్ని అంశాల్లో ఆమె ప్రాధాన్యం తగ్గించి ఉండవచ్చు. కానీ జైట్లీతో భేదాభిప్రాయాలు ఏర్పడిన సమయంలో మోదీ సుష్మాను తన వైపు ఉండాలని ఎంచుకున్నారు. ఆ సమయంలో రాజ్నాథ్ సింగ్ చైనాలో ఉండటంతో ఆమెను ఢిల్లీలోనే ఉండాలని మోదీ కోరారు. అప్పటికే ఆమె దుబాయ్కు వెళ్లవలిసి ఉంది. సుష్మా విశ్వాసాన్ని, పరిణతిని మోదీ గుర్తించారనడానికి ఇది చక్కటి తార్కాణం. పైగా అది ఆమె రాజకీయ కెరీర్లో కీలకమైన దశ. అద్వాణీకి బదులుగా యువనేతగా సుష్మానే ఎంచుకోవాలని బీజేపీ/ఆరెస్సెస్ నాయకత్వం నిర్ణయించుకుని ఉంటే ఏం జరిగేదన్నది చర్చనీయాంశం. ఆమె నరేంద్రమోదీ కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు. అదే జరిగి ఉంటే ఆమె నాయకత్వంలో ఎలాంటి బీజేపీ అవతరించి ఉండేదన్నది కూడా చర్చనీయాంశం.మోదీకి బదులుగా సుష్మా బీజేపీ నాయకత్వంలోకి వచ్చి ఉంటే అనేది మంచి చర్చకు తావిచ్చి ఉండేది. క్రికెట్లాగే రాజకీయాల్లోనూ ప్రతి స్టార్ కూడా ఒక కపిల్ దేవ్లా, సచిన్ టెండూల్కర్లా కాలేరు. వదలడానికి వీలులేని వ్యక్తి అయినప్పటికీ కీర్తి, అధికారానికి చేరువ కాలేకపోయిన రాహుల్ ద్రావిడ్ వంటి పాత్రను కూడా కొంతమంది పోషిం చాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నేతగా సుష్మాస్వరాజ్కి కూడా ఈ వర్ణనే సరిగ్గా సరిపోతుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekarGupta -
సుష్మాకు నో ప్లేస్ : గుండె పగిలిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నసుష్మా స్వరాజ్ (66)కు మోదీ 2.oలో చోటు దక్కలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు రెండోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సుష్మాకు అవకాశం దక్కలేదు. అయితే మాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తరహాలోనే సుష్మా కూడా కేంద్రమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా తానే స్వయంగా తప్పుకున్నట్టు సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ముందుగానే సుష్మా స్వరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్కు చోటు దక్కకపోవడంపై ట్విటర్ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వియ్ మిస్ యూ మేమ్ అంటూ విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే మేడం తిరిగి కావాలి..ఈ విషయాన్ని రీట్వీట్ చేయండి.. ట్రెండింగ్ చేయండి..తద్వారా ఆమెను కేంద్రమంత్రిగా వెనక్కి తెచ్చుకుందామటూ ట్వీట్ చేస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు తీరని లోటని మరొక యూజర్ ట్వీట్ చేశారు. కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్కు మూత్రపిండ మార్పిడి చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చదవండి : నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్ #sushmaswaraj we want you back mem plzz guys do retweet and make it trending so that mem will return — saksham gupta (@Guptasaksham07G) May 29, 2019 @SushmaSwaraj ji #sushmaswaraj 😢😭😢😭😢😭😢😭 ?????? — Nilesh U.R Dhanure (@DhanureNilesh) May 30, 2019 #SushmaSwaraj will not be part of Modi Cabinet. My heart breaks to hear this.#ModiSwearingIn #ModiSarkar2 — Nidhi Taneja (@nidhitaneja0795) May 30, 2019 Sushma Swaraj is not joining Modi's Cabinet. Huge loss for NRIs and Twitter.#ModiSwearingIn — Jet Lee(Vasooli Bhai) (@Vishj05) May 30, 2019 -
ఆ నలుగుర్ని రక్షించాలంటూ విజయసాయిరెడ్డి లేఖ
హైదరాబాద్: మలేసియాలో చిక్కుకున్న నలుగురు తెలుగు యువకులను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్కు లేఖ రాశారు. బాధితులు విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాంకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి నిమిత్తం వారు మలేసియాకు వెళ్లినట్లు తెలిసిందని, మలేసియాకు వెళ్లిన వెంటనే వారి పాస్పోర్టులు లాక్కుని ఏజెంట్ చించేశాడని ఆ తర్వాత గదిలో బంధించాడని తెలిపారు. మలేసియాలో చిక్కుకున్న యువకుల్ని సహృదయంతో కాపాలడాలని సుష్మను కోరారు. -
సుష్మా స్వరాజ్కు విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు. మలేషియాలో ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నవిశాఖకు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్ అనే ఏజెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్పార్ట్లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ను కోరారు. -
త్వరలో ఇండియాకు.. ‘ఎడారిలో బందీ’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశం కాని దేశంలో ఒంటెల యజమాని వద్ద బందీగా దుర్భర జీవితం గడుపుతున్న కరీంనగర్ జిల్లా వాసి పాలేటి వీరయ్య స్వదేశం రావడానికి మార్గం సుగమమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామం నుంచి వీరయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. రియాద్లోని ఎడారిలో ఒంటెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటెల యజమాని పెట్టే బాధలను తాళలేక పోయాడు. ఎలాగోలా తాను పడుతున్న బాధలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు. ఈ మేరకు గురువారం ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఎడారిలో బందీ’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. వీరయ్య పడుతున్న బాధలను తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తక్షణం స్పందించారు. వీరయ్య సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సుష్మాస్వరాజ్ సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్య ఆచూకీ తెలుసుకొని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రియాద్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం వేగంగా స్పందించింది. వీరయ్య ఎక్కడ ఉన్నాడో గంటల్లోనే పూర్తి సమాచారాన్ని సేకరించింది. రియాద్ ఎంబసీ కార్యాలయంలో హైదరాబాద్ వాసి ఉండటంతో వీరయ్య ఆచూకీ తెలుసుకోవడం సులభమైంది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా కేటీఆర్, ప్రశాంత్ పటేల్, దేశ్రాజ్కుమార్ తదితర 9 మందికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసింది. వీరయ్య ఇండియా వెళ్లడానికి ఎగ్జిట్ వీసా కూడా సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. వీరయ్య రాకపై కేటీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలో కష్టాలు పడుతున్న వీరయ్య సొంత ఇంటికి చేరుతుండటంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరయ్య భారత్కు వచ్చేందుకు సహకరించిన రియాద్లోని భారత రాయబారి, నగరానికి చెందిన ఆసఫ్ సయీద్తోపాటు ఎంబసీ అధికారులకు ట్విట్టర్లో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీరయ్య కోసం ఆయన కుటుంబసభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరి తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృం దంలో ఒకరిగా తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న భారతరత్న అబ్దుల్ కలాం స్మారకాన్ని సందర్శించినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
‘త్వరలోనే మోదీ గట్టి చెంప దెబ్బ తింటారు’
కోల్కతా : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన ప్రభుతాన్ని డబ్బు దండుకొనే సిండికేట్లు నడుపుతున్నాయంటూ విమర్శించిన మోదీపై.. దీదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రధాని మోదీని అసత్యాలు పలికే వ్యక్తిగా దీదీ వర్ణించారు. అంతేకాక తాను హిందువుల పండగలు, ఉత్సవాలను అడ్డుకొంటున్నానంటూ బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై కూడా మమతా స్పందించారు. జై శ్రీరాం అంటే.. దీదీ జైలులో పెడుతుందని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా.. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనని.. జై శ్రీరాం బదులు జై హింద్ అని నినదిస్తానని వెల్లడించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభించిన బీజేపీ గత ఐదేళ్లలో ఒక్క చిన్న రామ మందిరాన్ని కూడా నిర్మించలేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుత ఎన్నికల్లో మోదీకి ప్రజాస్వామ్య చెంపదెబ్బ గట్టిగా తగులుతుందని, ఓటమి తప్పదని దీదీ పేర్కొన్నారు. దీదీ హద్దు మీరారు : సుష్మా స్వరాజ్ మమతా బెనర్జీ మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై.. బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో దీదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ममता जी - आज आपने सारी हदें पार कर दीं. आप प्रदेश की मुख्यमंत्री हैं और मोदी जी देश के प्रधान मंत्री हैं. कल आपको उन्हीं से बात करनी है. इसलिए बशीर बद्र का एक शेर याद दिला रही हूँ : दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे, जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों. — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019 -
మాటకు మాట
-
ఆ యువకుడిని భారత్కు రప్పించండి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: జర్మనీలోని ఒట్టో–వాన్–జ్యూరిక్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లి తీవ్ర మానసిక సమస్య తో బాధపడుతూ గల్లంతైన హైదరాబాద్కు చెందిన సాయి రాహుల్ అనే యువకుడిని భారత్ రప్పించేలా చొరవ చూపాలని కోరుతూ మాజీ ఎంపీ దత్తాత్రేయ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు. సాయి సోదరి హిమబిందు మంగళవారం దత్తాత్రేయను కలిసి సోదరుడి పరిస్థితి వివరించి కన్నీ టి పర్యంతమయ్యారు. దీంతో ఆ యువకుడి జాడ కనిపెట్టి హైదరాబాద్కు రప్పించేలా చొరవ చూపాల్సిందిగా దత్తాత్రేయ లేఖలో కోరారు. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
‘ఆత్మహత్యే దిక్కు.. వద్దు నేనున్నాను’
న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేక విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇదే మాట చెబుతుంటారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయులైన సరే తన సమస్య గురించి ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే రెస్పాన్స్ అవుతారు చిన్నమ్మ. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటు చేసుకుంది. అలీ అనే వ్యక్తి సౌదీ వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలు కావోస్తుంది. ఇండియా తిరిగి రావాలని అనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర విక్మా(ఉద్యోగ వీసా) తప్ప పాస్పోర్ట్, వీసాలాంటి ఇతర ఐడీలు ఏం లేవు. ఈ క్రమంలో తనకు సాయం చేయమని ఇండియన్ ఎంబసీని కోరాడు. తాను ఇక్కడకు వచ్చి దాదాపు 21 నెలలు కావోస్తుందని.. ఇంతవరకూ సెలవు తీసుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో సమస్యలున్నాయి.. అందుకే ఇండియా వెళ్లాలి అనుకుంటున్నాను అన్నాడు. కానీ వర్క్ వీసా తప్ప మరే ఐడీ తన దగ్గర లేదని సాయం చేయమని కోరాడు. ఇలా ఏడాది నుంచి అభ్యర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆఖరి ప్రయత్నంగా మరోసారి ‘నన్ను ఇండియా పంపించి పుణ్యం కట్టుకొండి. నాకు ఇంటి దగ్గర నలుగురు పిల్లలున్నారు. సంవత్సరం నుంచి సాయం కోరుతున్నాను. కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం నాకు సాయం చేస్తారో లేదో చెప్పండి. మీరు సాయం చేయకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం’ అని ట్వీట్ చేశాడు. అలీ అభ్యర్థన కాస్తా సుష్మా స్వరాజ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ‘వద్దు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయకండి. మేం మీకు సాయం చేస్తాం’ అని తెలపడమే కాక ఈ కంప్లైంట్కు సంబంధించిన పూర్తి వివరాలు తనకు పంపించాల్సిందిగా రియాద్లో ఉన్న ఇండియన్ ఎంబసీని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. దాంతో మరో సారి నెటిజనుల సుష్మా స్వరాజ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. (చదవండి : అంతా మేడమ్ దయ వల్లే..!)