మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్ | India warns Pakistan not to take its restraint for granted | Sakshi
Sakshi News home page

మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్

Published Tue, Aug 20 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

India warns Pakistan not to take its restraint for granted

పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
 న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో.. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఐదుగురు భారత సైనికులను కాల్చివేసిన ఘటనకు పాకిస్థాన్ బాధ్యత వహించక తప్పదని.. ఆ దేశానికి, వారి సైన్యానికి సంబంధం లేకుండా అదంతా జరగదని వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ కాల్పులకు దిగుతోందని, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆంటోనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ 82 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement