AK Antony
-
అనిల్ ఆంటోని గెలుపు సాధ్యమేనా.. బీజేపీ వ్యూహం అదేనా?
తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన 'అనిల్ కె ఆంటోనీ' కూడా ప్రజలవద్దకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని గతంలోనే పేర్కొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా ఉన్న ఎకె ఆంటోనీ వల్ల అనిల్ కే ఆంటోనీ గొప్ప ఇమేజ్ లభించింది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మకం లేదని పలువురు భావిస్తున్నారు. అభివృద్ధి కోసం ఎదురుచూసే యువతను తనవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను ఉపయోగించుకుని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, అనిల్ను తక్కువ అంచనా వేయకూడదని పతనంతిట్టలో కొందరు భావిస్తున్నారు. కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కారణంగా బీజేపీ ఓట్ల శాతం అంతకు ముందుకంటే రెండు రెట్లు పెరిగింది. ఏకే ఆంటోనీ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి అనిల్ మధ్యవర్తి నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్న సమయంలో.. తన తండ్రి లాంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు కాలం చెల్లిపోయి కుక్కల్లా ఉన్నారని అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సంచనలం రేపాయి. పతనంతిట్టలో క్రైస్తవుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో క్రైస్తవులలో గణనీయమైన ప్రభావం ఉన్న జోస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందున సీపీఎం కూడా ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకుల్లోకి రావాలని భావిస్తోంది. -
‘మా అబ్బాయి ఓడిపోవాలి’.. కేంద్ర మాజీ మంత్రి
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడు అనిల్ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా కేరళ సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు. ..కాంగ్రెస్ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇక.. 2023లో అనిల్ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
సాక్షి కార్టూన్ 08-04-2023
సాక్షి కార్టూన్ 08-04-2023 -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్.. అనిల్ ఆంటల్ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ను వీడటం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రియాక్షన్.. మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్బుక్లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. ‘నిన్నటి నుంచి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్లోని నా అన్ని పదవులను వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్కు ధన్యవాదాలు.’ అని తెలిపారు. ఇక ఇప్పటికే మోదీపై ‘ఇండియా ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భారతీయ సంస్థలపై బ్రాడ్కాస్టర్ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW — Anil K Antony (@anilkantony) January 25, 2023 -
BBC Documentary On Modi: కాంగ్రెస్ నాయకుడి కొడుకు ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో మోదీకి ఊహించని వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. అందులో భాగంగా మోదీకి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడుకు నుంచి ఆశ్చర్యపరిచే రీతిలో సపోర్టు లభించింది. ఈ మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మన సంస్థలపై పెత్తనం చెలాయించి, సార్వభౌమాధికారిన్ని అణగదొక్కేలా చేసేందుకు అనుమతించకూడదన్నారు. మన గ్రంథాలు ఉపనిషత్తులు, భగవద్గీత చదివితే గనుక సత్యం ఎప్పటికైనా.. బయటకు వస్తుందన్న విషయం తెలుస్తుందన్నారు. పతిక్రలను అణిచివేసి, సంస్థలు నియంత్రించి, ఆఖరికి ఈడీ, సబీఐలు ఉపయోగించకోవచ్చు, కానీ నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పారు. అది ప్రకాశవంతంగా ఉంటుందని, దానికి బయటకు వచ్చేసే దుష్ట అలవాటు ఉందని అన్నారు. ప్రజలను ఎన్ని అణివేతలకు గురిచేసి భయబ్రాంతులకు గురిచేసినా.. నిజాన్ని బయటకు రాకుండా ఆపలేమని నొక్కి చెప్పారు. ఇటీవల భారత జోడో యాత్రలో రాహుల్ ఆ డాక్యుమెంటరీని నిరోధించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించిన రోజునే అనుహ్యంగా సీనియర్ నాయకుడు కుమారుడు అనిల్ ఆంటోని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి విరుద్ధంగా యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్రం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీ లింక్లకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్లను తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సైతం నిష్పక్షపాతం లేని వలసవాద మససతత్వానికి నిదర్శనం అంటూ బీబీసీని తిట్టిపోసింది. (చదవండి: ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ) -
మోదీని ఓడించాలంటే.. అలా చేయాల్సిందే: ఏకే ఆంటోనీ
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ మనసులోని మాటను బయటపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీని ఓడించాలంటే వ్యూహాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విజయం కోసం మైనారిటీలను మాత్రమే నమ్ముకుంటే కష్టమని కుండబద్దలు కొట్టారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ వారం ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే కాంగ్రెస్ ప్రయత్నం.. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మైనారిటీ, మెజారిటీ రెండు వర్గాల మద్దతు అవసరమని ఆంటోనీ అన్నారు. హిందువులతో పాటు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి విదితమే. రాజకీయ ప్రయోజనాల కోసమే సాఫ్ట్ హిందుత్వ ధోరణిని కాంగ్రెస్ అవలంభిస్తోందని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందుత్వపై బీజేపీకి మాత్రమే సర్వహక్కులు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. భారతీయులుగా చూడడం లేదు: మాలవియా ఆంటోనీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవియా ట్విటర్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘కాంగ్రెస్కు, భారతీయులు భారతీయులుగా కనబడటం లేదు. మెజారిటీ, మైనారిటీ, హిందూ, ముస్లింలుగా దేశ పౌరులు విభజించబడ్డారు. మోదీని ఓడించేందుకు మైనారిటీల మద్దతు సరిపోదు కాబట్టి హిందువులను కలుపుకుపోవాలని యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీ పిలుపునిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు ఆలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంద’ని మాలవియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదివికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ చాలా కష్టాలనే చవిచూస్తోంది. రాజస్తాన్లో ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల తిరుగాబాటుతో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో ఆశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ కష్టకాలం నుంచే గట్టేక్కించమంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏకే ఆంటోనికి ఆదేశాలు జారీ చేశారు. 81 ఏళ్ల ఏకే ఆంటోని మాజీ రక్షణ మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన.. పార్టీ అగ్రనాయకులలో ఒకరు. ఆయనకు రాజకీయంగా మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. అందువల్ల ఇతర పార్టీ నేతలు కూడా ఆయన్ను ఎంతో గౌరవప్రదంగా చూస్తుంటారు. అందువల్ల ఈ కష్టకాలంలో సోనియా గాంధీ చిరకాల ఆప్తమిత్రుడు అయిన ఏకే ఆంటోనిని గుర్తు చేసుకున్నారు. తక్షణమే కలవాల్సిందిగా ఆయనకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏకే ఆంటోని ఈ సాయంత్రానికే కేరళ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రికే సోనియగాంధీతో ఆయన భేటీకానున్నట్ల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రసుతం రాజస్తాన్లో సచిన్ పైలెట్ని ముఖ్యమంత్రి చేస్తే రాజీనామా చేస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్లు రాజస్తాన్లో నెలకొన్న సంక్షోభం గురించి సోనియా గాంధీకి లిఖితపూర్వకంగా నివేదికను సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ ఆశోక్ గెహ్లాట్ మద్దతుదారులపై క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ఇదేం ట్విస్ట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా గెహ్లాట్! కానీ..) -
రాయని డైరీ: ఎ.కె.ఆంటోనీ (కాంగ్రెస్)
డెబ్బై ఏళ్ల వయసు గల నా మిత్రుడు గులామ్ నబీ ఆజాద్ని నా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాకై నేనుగా వెళ్లి పరామర్శించడమా లేక అతడికై అతడే నాకోసం వచ్చే వరకు ఆగడమా అని తర్కించవలసిన అవసరం మా మధ్య లేనప్పటికీ, ఎనభై ఏడేళ్ల మన్మోహన్సింVŠ జీ మనోభావాలనైతే మాత్రం గట్టిగా శిరసావహించాలనే నేను తీర్మానించుకున్నాను. సోనియాజీ సలహా మండలిలో కొత్తగా కీలక సభ్యుడిని అవడం కూడా ఆజాద్తో నేను దూరాన్ని ఏర్పరచుకోవలసిన పరిణామమే. ఆజాద్ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ సోనియాజీ నిర్ణయం తీసుకున్నాక, అతడెంత స్నేహితుడైనా వెళ్లి అతడిని పలకరించడం అంటే పార్టీ నిర్ణయాధికారాన్ని ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఉండరు. పార్టీ మాత్రమే ఉంటుంది. ఆ సంగతిని ఆజాద్కి కాస్త ముందుగా ఎవరైనా వెళ్లి అర్థం చేయించవలసి ఉంటుందని ఈ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది! కాంగ్రెస్కు గట్టి ప్రెసిడెంట్ ఒకరు ఉండాల్సిందేనని ఆజాద్ ఇరవై రెండు మందితో కలిసి లేఖ రాసినప్పుడే నా ప్రియ మిత్రుడికి నూకలు చెల్లాయని నేను అర్థం చేసుకోగలిగాను. భూమి మీద నూకలు చెల్లితే కాలం తీరిపోయినట్లు. కాంగ్రెస్లో నూకలు చెల్లితే లేఖలు రాసి పోయినట్లు. కాంగ్రెస్ ఎంత పెద్ద ఓటమినైనా క్షమిస్తుంది. పార్టీ మీటింగులో మౌనంగా కూర్చొని వెళ్లకపోతే మాత్రం శిక్ష విధించి తీరుతుంది. ఆజాద్ మౌనంగా కూర్చోవాలని అనుకోకపోగా, మౌనంగా కూర్చోకూడదన్న ఆలోచన ఎంత వయసుకీ వచ్చే అవకాశం లేని వాళ్ల చేత కూడా ఆలోచింపజేసి లేఖలో సంతకం పెట్టించి ఉంటాడని సోనియాజీకి, మన్మోహన్జీకి , ఆఖరికి రాహుల్కీ ఒక బలమైన అనుమానం. లేఖ రాసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో స్క్రీన్ మీద ఆజాద్ని మన్మోహన్జీ ఎంత కోపంగా చూస్తూ కూర్చున్నారో నేనసలు చూడనట్లే స్క్రీన్ మీద వేరే మూలకు తలతిప్పి కూర్చున్నాను. ‘‘మీరే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొనసాగాలి సోనియాజీ’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును మేడమ్.. మీరే కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉండాలి. లేదంటే రాహుల్ బాబు ఉండాలి’’ అని నేను అన్నాను. నా మిత్రుడు ఆజాద్ కూడా అటువంటి మనోరంజకమైన మాటే ఒకటి హృదయపూర్వకంగా అంటాడని ఆశగా ఎదురుచూశాను. అనలేదు! అప్పుడే అనిపించింది అతడికి ఊహ తెలియడం మొదలైందని. పార్టీ ఊహలకు అతడొక వాస్తవంలా ఉంటే పోయేది. వాస్తవాలకు విరుద్ధమైన ఒక ఊహగా వికసించాడు. ఆజాద్ ఎంతగా నలిగి ఉంటాడో నేను ఊహించగలను. శిక్ష విధించడంలో కూడా కాంగ్రెస్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇరవై రెండు మంది చేత సంతకాలు పెట్టించి, తనూ ఒక సంతకం చేసినందుకు ఇరవై రెండు మందితో కొత్తగా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయడం చూస్తుంటే మిగిలిన ఆ ఒక్కటీ నీదేనని ఆజాద్కు చెప్పడానికే అన్నట్లు ఉంది. సీడబ్ల్యూసీలో అతడూ ఉంటాడు. ఉంటాడు కానీ.. ఉండటానికి ఉన్నట్లో, ఉన్నా లేనట్లో ఉంటాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా లేకపోయాక కశ్మీర్ను తీసుకొచ్చి బీజేపీ ఇండియాలో ఎంత కలిపితే మాత్రం ఆజాద్ ఇక ఎంతమాత్రం ఈ దేశ పౌరుడు కాదు. అది బాధిస్తుండవచ్చు ఆజాద్ని. పుట్టిన కశ్మీర్ కన్నా కాంగ్రెస్నే అతడు ఎక్కువగా ప్రేమించాడు. కశ్మీరో, ఇండియానో కాదు.. కాంగ్రెస్ పార్టీ అతడి దేశం. ఆజాద్ని కలవాలని మనసు ఆరాపడుతోంది. కాంగ్రెస్కు కొన్ని విలువలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి అతడిని కలవడం అంటే అతడెంతో విలువ, గౌరవం, ప్రాణం ఇచ్చే పార్టీని తక్కువ చేయడమే. - మాధవ్ శింగరాజు -
నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు: సర్వే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే నేడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ను బర్తరఫ్ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు. నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే -
‘రక్షణ ఒప్పందాల్లో వారు జోక్యం చేసుకోరు’
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు రక్షణ ఒప్పందాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. బీజేపీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలపై బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఆంటోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగస్టా కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ ఈడీ విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ పేరును ప్రస్తావించారని వార్తలు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఇక అగస్టాపై యూపీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆంటోనీ గుర్తు చేశారు. బీజేపీ, ప్రభుత్వ సంస్థలు కలిసి కాంగ్రెస్పై ఆరోపణలు చేసేందుకు కట్టుకథలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా అగస్టా వెస్ట్ల్యాండ్ ప్రమోటర్లను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించగా, అగస్టా ఒప్పందంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్ను కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకొస్తోందని బీజేపీ మండిపడింది. అగస్టా కేసుపై విచారణ అంటే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని బీజేపీ ప్రశ్నించింది. -
ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాలన్న డిమాండ్తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిరాహార దీక్షకు దిగారు. షాద్నగర్ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్గౌడ్లు దీక్షలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కోర్ కమిటీ అధిపతిగా ఆంటోనీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. -
రాఫెల్ డీల్లో ఆ క్లాజు లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో ధరల వెల్లడికి సంబంధించి భారత్-ఫ్రాన్స్ మధ్య 2008లో జరిగిన డీల్లో ఎలాంటి క్లాజ్ లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఒప్పందంపై మోదీ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ ఆరోపించారు. ప్రతి విమానం ధరలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని కాగ్, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించే క్రమంలో ప్రభుత్వం రాఫెల్ జెట్ ధరల వివరాల్లో గోప్యత పాటించలేదని స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ధరల వెల్లడిపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశాన్ని తప్పుదారిపట్టించినందుకు వారు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ ధరను వెల్లడించడంపై ఫ్రాన్స్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి పార్లమెంట్ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం సభా హక్కుల ఉల్లంఘనేనని కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. -
'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు. -
‘అగస్టా’లో కీలక మలుపు
మధ్యవర్తి మిచెల్ కారు డ్రైవర్ విచారణలో వివరాల వెల్లడి న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణబహదూర్ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్కు డబ్బులు వచ్చేవని తెలిసింది. లావాదేవీలను విశ్లేషించటం ద్వారా మిచెల్కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్నుంచి మిచెల్ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి. సహకారానికి ప్రతిఫలం ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు(గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు. అయితే.. వాజ్పేయి హయాంలో 2003లోనే అగస్టా ఒప్పందం కుదిరిందని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కేసు విషయాన్ని కేవీ థామస్ నేతృత్వంలోని ప్రజాపద్దుల కమిటీ విచారించనుంది. -
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పరాజయానికి రాహుల్గాంధీ బాధ్యుడు కాదంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బాసటగా నిలిచారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్గాంధీ నేతృత్వంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జెండావందనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమి కారణాల పరిశోధనపై తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను ఆంటోనీ...గురువారం సోనియాకు సమర్పించారు. ఈ కమిటీ రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిందని వచ్చిన వార్తలను ఆంటోనీ ఖండించారు. పార్టీని బలహీనం చేయడానికి ఎవరో దుర్మార్గులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు వేరే ఉన్నాయని చెప్పిన ఆయన.. ఆ కారణాలు ఏంటో బహిర్గత పరచలేదు. అయితే ప్రస్తుత నాయకత్వంలోనే కష్టకాలాన్ని అధిగమించి, పార్టీని పటిష్టపరిచి, పునర్వైభవం అందిపుచ్చుకుంటామని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రధాన పాత్రపై మాట్లాడుతూ, ఆ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పష్టతనిచ్చారని, దానిపై తానింక చెప్పేది ఏమీ లేదన్నారు. పార్టీ సంస్థాగత మార్పులపై తుది నిర్ణయం సోనియాదేనని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కమిటీలో మరో సభ్యుడు ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 500 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో ఏ ఒక్కరు కూడా సోనియా, రాహుల్ నేతృత్వంపై ప్రశ్నలు లేవనెత్తలేదని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని ఆ కమిటీలో ముకుల్ వాస్నిక్, ఆర్సీ కుంతియా, అవినాశ్ పాండే సభ్యులన్న విషయం తెలిసిందే. ఓటమిలో మీడియాకు పాత్ర ఉంది తమ పార్టీ పరాజయంలో మీడియాకు కూడా పాత్ర ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆంటోనీ కమిటీ సమర్పించిన నివేదికలో.. మీడియా బీజేపీకి వత్తాసుపలికి, కాంగ్రెస్కు తక్కువగా కవరేజి ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. మీడియాపై నిందలెలా వేస్తారని ఆజాద్ను ప్రశ్నించగా తమ ఓటమిలో మీడియా కూడా భాగస్వామి అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు గంటసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా చానళ్లు ప్రసారం చేయలేదన్నారు. -
దారుణ పరాజయానికి కారణాలివిగో!
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కారణాలు, విశ్లేషణతో రూపొందించిన నివేదికను పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కమిటీ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఘోర ఓటమి కారణాలను గుర్తించాల్సిందిగా కోరుతూ ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్సీ ఖుంతియా, అవినాశ్ పాండేలతో ఒక కమిటీని సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర్రాలవారీగా విశ్లేషణలతో కూడిన భారీ నివేదికతో పాటు, ప్రముఖ కారణాలను ప్రస్తావిస్తూ ఒక సంక్షిప్త నివేదికను కూడా వారు పార్టీ అధ్యక్షురాలికి అందించారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిటీ, ఆ రాష్ట్రాల్లోని నేతలతో జరిపిన చర్చల వివరాలను కూడా నివేదికలో పొందుపర్చింది. మీడియా కథనాల్లో వచ్చినట్లు.. నివేదికలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓటమికి పార్టీ నాయకత్వాన్ని తప్పుబట్టడం కాకుండా.. బీజేపీ మీడియాను ప్రభావితం చేసిన విషయాన్ని, మీడియా పోషించిన పాత్రను, కాంగ్రెస్ పార్టీ ప్రచార లోపాలను, పార్టీలోని సంస్థాగత బలహీనతలను అందులో పేర్కొన్నారు. నరేంద్రమోడీ స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోవడాన్ని నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించారు. -
ఆంటోనీ...ఆత్మావలోకనం!
మన దేశంలో లౌకికవాదం భావన వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదు. దాని అసలు అర్ధం, అంతరార్ధం ఏమిటో అయోమయపడేంతగా ఇది ముదిరిపోయింది. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని మిగిలినచోట్ల అనుకున్నా... అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం మన దేశంలో స్థిరపడిపోయింది. ఈ గడ్డపై సెక్యులరిజానికి తానే సిసలైన వారసురాలినని కాంగ్రెస్ నమ్ముతుంది. తన తపనంతా దానికోసమేనని అందరినీ నమ్మమంటుంది. మైనారిటీ వర్గాల భద్రతకు భరోసా తమవల్ల మాత్రమే సాధ్యమని ఆ క్రమంలో చెబుతుంది. చివరకు అలాంటి భద్రత కల్పించడమే లౌకికవాదం అనుకునేంతగా దాన్ని ఊదరగొడుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ‘లౌకికవాదాన్ని కాపాడుకుందాం రండ’ని జాతీయస్థాయిలో పిలుపునిచ్చింది. కానీ ఏ పార్టీనుంచీ స్పందన లేదు సరిగదా...ప్రజలు సైతం దాన్ని తోసిపుచ్చారు. బీజేపీవైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ ఆచరిస్తున్న లౌకికవాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ విధానమైనా ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించలేకపోయారని చెప్పారు. మైనారిటీలతో పార్టీకి ఉన్నదనుకుంటున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంటోనీ స్థానం కీలకమైనది. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వెళ్లిపోయాక పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని ముఖ్యమైన అంశాల్లోనూ ఆయన సలహాలు తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి కారణాలేమిటని ఆరా తీసే బాధ్యతను తాజాగా ఆయనకు అప్పగించారు. కనుక ఆంటోనీ వ్యాఖ్యలకు ఎనలేని ప్రాముఖ్యమున్నది. అయితే, ఆంటోనీ వ్యాఖ్యలను కేరళ రాజకీయాల నేపథ్యంలో కూడా అర్ధంచేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో కేరళ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) ముఖ్యమైనవి. కేరళ కాంగ్రెస్కు క్రైస్తవుల మద్దతు ఉంటే ఐయూఎంఎల్ కు ముస్లింలు అండగా ఉంటారు. ఈ రెండు పార్టీలూ తెస్తున్న ఒత్తిళ్ల కారణంగానే యూడీఎఫ్ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతున్నదని, దానివల్ల పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ఆంటోనీ ఆందోళన. అయితే, అలా వ్యాఖ్యానించడంలో ఆంటోనీ ఉద్దేశాలు ఏమైనా మొత్తంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న లౌకికవాద విధానాలు ఆ వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి వచ్చాయి. దేశంలోని మిగిలిన వర్గాల ప్రజలు ఎన్నికలప్పుడు ఎలాంటి వైవిధ్యతతో ఓటేస్తారో, ఏ ఏ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారో, ఏ సమస్యలు ముఖ్యమైనవనుకుంటారో ముస్లింలు కూడా అలాగే అనుకుంటారు. ఆ పద్ధతిలోనే ఓటేస్తారు. అది దాదాపు అన్ని ఎన్నికల్లోనూ రుజువవుతున్న సత్యం. కాంగ్రెస్ అందరి మనసుల్లోనూ నాటిన ‘ముస్లిం ఓటరు’ వేరు. అతడు/ఆమె తమ స్థితిగతుల మెరుగుదలకు...తాము సాధించాల్సిన లక్ష్యాలకూ, తాము కైవసం చేసుకోవాల్సిన అవకాశాలకూ ప్రాధాన్యమివ్వరు. ఎంతసేపూ భద్రత గురించే ఆలోచిస్తారు. ఇలాంటి భావనను కల్పించడంలో కాంగ్రెస్కు ఒక సౌలభ్యం ఉన్నది. వారిని అభద్రతా భావనలో ఉంచుతూ, తమ పార్టీతోనే వారి భద్రత ముడిపడి ఉన్నదన్న అభిప్రాయం కలగజేస్తే చాలు... ఇతరత్రా అంశాలను వారు పట్టించుకోరని ఆ పార్టీ అనుకుంటుంది. ముస్లింల అభ్యున్నతే నిజంగా తన ధ్యేయమైతే వారు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగడానికి ఆసరా కల్పించడంలో తన పాలనా కాలంలో యూపీఏ సర్కారు ఎందుకు విఫలమైంది? 2004లో అధికారంలోకొచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ జీవో జారీచేశారు. ఆ జీవోపై న్యాయస్థానాలు స్టే ఇచ్చినప్పుడు చివరివరకూ పోరాడారు. పర్యవసానంగా కొన్ని మినహాయింపులతో ఆ రిజర్వేషన్లు కొనసాగించవచ్చునని 2010లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమ పార్టీ ముఖ్యమంత్రి ముస్లింల కోసం ఇంతగా తపన పడటాన్ని గమనించినా కాంగ్రెస్ పార్టీ దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ఏనాడూ కృషి చేయలేదు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పరిచినా అది ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ముస్లింలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆ కమిటీ తేల్చిచెప్పింది. వారికి చదువుల్లోనూ, కొలువుల్లోనూ కోటా అమలు చేయాలని సూచించింది. ఆ సిఫార్సులను అమలు చేయడానికైనా యూపీఏకు చేతులు రాలేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చిన తర్వాత మాత్రమే కాస్త కదలిక వచ్చింది. మరోపక్క ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రవంటి చోట్ల ముస్లిం యువకులకు పోలీసుల వేధింపులు, కేసులు తప్పలేదు. సెక్యులరిజం పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న ప్రచారంతో మైనారిటీలకు ఏదో ఉపకారం జరిగిపోతున్నదని, వారు బాగుపడిపోతున్నారని మిగిలిన వర్గాల్లో అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే అది మైనారిటీలకు మేలు చేసే పరిణామం కాదు. తన చేతలు, మాటలు ఆచరణలో ఎలాంటి ఫలితాలనిస్తున్నాయో ఇప్పటికైనా గ్రహించుకుని తాను వల్లెవేస్తున్న లౌకికవాదాన్ని కాంగ్రెస్ పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆంటోనీ చెప్పిన మాటలు కేరళ స్థితిగతుల నేపథ్యంలోనివే కావొచ్చుగానీ... జాతీయస్థాయిలో ఆత్మావలోకనానికి వాటిని అవకాశంగా తీసుకోవాలి. దాని ఆధారంగా సరికొత్త దృక్ఫథాన్ని ఏర్పరుచుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు...మొత్తంగా దేశానికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మైనారిటీలకు! -
ముంబై తీరానికి చేరిన సింధురత్న
ముంబయి : ప్రమాదానికి గురైన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న.. ముంబై తీరానికి చేరుకుంది. ఈ జలాంతర్గామిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించడంతో పాటు ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న నేవీ ఉన్నతాధికారులు జలాంతర్గామిని చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు... గత కొన్ని నెలల్లో నేవీలో జరిగిన ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ప్రమాదాలు, డీకే జోషీ రాజీనామా బాధాకరమైనవని ఆంటోనీ వ్యాఖ్యానించారు. -
యూపీఏకి సైనిక కుట్ర భయం!
డెబ్బయ్ దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ‘భారత సైన్యమంటే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించే బాధ్యతాయుతమైన దళం. ఎట్టి పరిస్థితులలోనూ తిరుగుబాటుకు ప్రయత్నించదు....’ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. రక్షణమంత్రి చేసిన ఈ ప్రకటన హఠాత్పరిణామం మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం, సైనిక దళాల నాటి ప్రధానాధికారి వీకే సింగ్ వాస్తవాలను దాచి పెట్టారంటూ బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలతో ఇది అర్థమవుతుంది. కానీ రెండేళ్ల నాటి ఈ అత్యంత వివాదాస్పద ఘటనను ‘ముగిసిన అధ్యాయంగా’ అభివర్ణించి రక్షణమంత్రి ఇప్పుడు కూడా దేశ ప్రజల దృష్టిని మళ్లించాలని అనుకోవడమే వింత. అప్పుడు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని రక్షణమంత్రి, నాటి సైనిక దళాల ప్రధానాధికారి కూడా తోసిపుచ్చినా, ఇప్పుడు అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయి. దీనితో మొదట వచ్చే ప్రశ్న- పౌర ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్య అపనమ్మకం పెరుగుతున్నదా? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో పౌర ప్రభుత్వం నిలకడగా కొనసాగడం భారతీయ సమాజం పరిణతికి నిదర్శనం. మన ఇరుగు పొరుగు దేశాలు ఇందుకు నోచుకోలేక పోవడం, దానితో ఎదురైన దుష్పరిణామాలు ప్రపంచానికి ఎరుకే. అయినా, మన దేశంలో కొన్నిసార్లు పౌర ప్రభుత్వాధినేతలు సైన్యాన్ని శంకించారని చెప్పడానికి దాఖలాలు లేకపోలేదు. ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలోనూ అలాంటిదేదో జరగబోతున్నదన్న అనుమానాలు కలిగాయి. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్కూ, ఆర్మీ చీఫ్ కేఎస్ తిమ్మయ్యకూ మధ్య విభేదాలు ఇందుకు కారణం. పైగా భారత్లో సైనిక తిరుగుబాటుకు సీఐఏ తన వంతు ప్రయత్నం చేస్తున్నదని 1960 దశకంలో చైనా కూడా అనుమానించింది. తరువాత, 70 దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయని అంతా భావిస్తున్నపుడు, ఇష్టంగానో అనిష్టంగానో ఇలాంటి ప్రత్యామ్నాయం గురించిన దృశ్యాలు సమాజం ముందు కదులుతాయి. 2012 జనవరి మధ్యలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రెండు సైనిక యూనిట్ల కదలికలు యూపీఏ ప్రభుత్వంలో ‘అత్యున్నత’ స్థాయిలోని వారిని కలవరానికి గురి చేశాయి. ఈ కదలికల గురించే ఆ సంవత్సరం ఏప్రిల్లో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించగా రక్షణమంత్రి ఆంటోనీ, ‘ఇది శుద్ధ అబద్ధం’ అని కొట్టిపారేశారు. నాటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఇది అనారోగ్యకర బుర్రల్లో నుంచి వచ్చిన వార్తాకథనమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఏకే చౌధురి ఈ ఫిబ్రవరి 21న చేసిన ప్రకటన అసలు సంగతి బయట పెట్టింది. రెండేళ్లుగా ఆంటోనీ, వీకే సింగ్ అబద్ధం చెబుతున్న సంగతి వెల్లడయింది. చౌధురి చెప్పిన వివరాల ప్రకారం, జనవరి పదహారో తేదీన నాటి రక్షణ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ శర్మ తనను (చౌధురిని) పిలిచి ఆ దళాలను వెంటనే వెనక్కి వెళ్లమని ఆదేశించవలసిందిగా కోరారని ఆయన చెప్పారు. రాత్రి పదకొండుగంటల వేళ ఈ చర్చ జరిగింది. తాను ఇప్పుడే ప్రభుత్వ అత్యున్నత అధికార పీఠంపై ఉన్న వారి దగ్గర నుంచి వచ్చానని, వారు దళాల కదలికతో కలవరపడుతున్నారని శశికాంత్ తనకు చెప్పారని చౌధురి పేర్కొన్నారు. చౌధురి 2012లో సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్గా (డీజీఎంఓ) పనిచేశారు. దళాల కదలిక, తన జనన సంవత్సర సర్టిఫికెట్ గురించి వీకే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకే రోజు జరగడంతో ఈ అనుమానాలు కలిగాయని చౌధురి అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద రక్షణ కార్యదర్శి నివేదిక కోరడం, తాను ఇవ్వడం కూడా జరిగిందని చౌధురి వెల్లడించారు. చౌధురి ప్రకటన చేసిన మరునాడే వైమానిక దళాల రిటైర్డ్ చీఫ్ ఎన్ఏకే బ్రౌనే వెల్లడించిన అంశాలు కూడా 2012 నాటి ఘటన నిజమని స్పష్టం చేస్తున్నాయి. రెండు సైనిక యూనిట్లు కదలిక సమయంలోనే ఆగ్రా నుంచి పారా కమాండోస్ కూడా ఢిల్లీ దిశగా కదలిన సంగతిని బ్రౌనే వెల్లడించారు. నిజానికి పారా కమాండోలు 2012 ఫిబ్రవరిలో ఢిల్లీకి తర్ఫీదు కోసం వెళ్లవలసి ఉంది. ఈ దళం ఏ మిత్రదేశమైనా సంకటంలో పడినపుడు అత్యవసరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. సి-130 విమానాలతో ఈ కమాండోలకు ఇవ్వదలిచిన శిక్షణకు ఇంకా నెల సమయం ఉండగా ముందే ఎందుకు ఢిల్లీ వైపు కదిలాయన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. కాబట్టే, దేశ భద్రత, సాయుధ దళాల విశ్వసనీయత, ప్రభుత్వ మర్యాద వంటి అంశాలు ముడిపడి ఉన్న ఈ వివాదం గురించిన వాస్తవాలను తక్షణం వెల్లడించాలని రాజకీయ పక్షాలు కోరడం సబబే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు: కమల్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ చెప్పారు. శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఇవి జరగనున్నట్టు పేర్కొన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాలపై గురువారం జరిగిన కేబినెట్ కమిటీ భేటీ అనంతరం కమల్నాథ్ పాత్రికేయులతో మాట్లాడారు. అధికార వర్గాల కథనం మేరకు, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టి సాధారణ, రైల్వే బడ్జెట్లను ఆమోదించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్, న్యాయవ్యవస్థ జవాబుదారీ, అవినీతి నిరోధక(సవరణ), పౌర సేవలు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ తదితర బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వీటిలో అవినీతి నిరోధక(సవరణ) బిల్లును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో దీనికి అనుమతి లభించి తీరుతుందనేది విశ్లేషకుల భావన. -
పొత్తులు చూసేది ఆంటోనీ కమిటీనే: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారాన్ని రక్షణ మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ చూసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ స్పష్టం చేశారు. పార్టీలతో పొత్తు వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు. బుధవారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికలకు సహకరిస్తారని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. ‘ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టాం. శాసనసభ్యుల వ్యతిరేకతను పరిశీలిస్తున్నాం’ అని క్లుప్తంగా బదులిచ్చారు. -
‘ముంబై’ దోషులకు శిక్ష పడాల్సిందే
అప్పటిదాకా భారత్ సంతృప్తి చెందదు: ఆంటోనీ 26/11కు ఐదేళ్లు న్యూఢిల్లీ/రాంచీ: ముంబై దాడుల దోషులకు గరిష్ట శిక్ష పడేంత వరకు భారత్ సంతృప్తి చెందదని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ పాకిస్థాన్కు స్పష్టంచేశారు. దాడులకు పాల్పడ్డవారి వివరాలు, ఆ కుట్ర మూలాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్కు గతంలోనే ఇచ్చినట్లు చెప్పారు. ముంబైలో పాక్ ముష్కరుల దాడులకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పొరుగు దేశం నుంచి ఏమి ఆశిస్తున్నారని పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వారికి (పాక్కు) అనేకమార్లు చెప్పాం. దాడికి కారకులైనవారిని తీవ్రంగా శిక్షించనంత వరకు భారత్ సంతృప్తి చెందదు’’ అని చెప్పారు. 2008, నవంబర్ 26న పాక్ నుంచి సముద్రతీరం గుండా వచ్చిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో నరమేధం సృష్టించి 160 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ముందు తీర గస్తీ బలహీనంగా ఉండేదని, కానీ ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆంటోనీ చెప్పారు. దారి తప్పినవారిని క్షమిస్తాం: షిండే దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నవారిని క్షమించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి షిండే అన్నారు. మావోయిస్టులను ఉద్దేశించి ఆయన రాంచీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హింస దేనికీ పరిష్కారం కాదు. మనలో కొందరు యువకులు దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నారు. వారు మనలో ఒకరే. హింసను వీడి జనస్రవంతిలోకి వస్తామంటే వారిని క్షమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. -
బరువైన బహుమానం
పాత పద్ధతిలో ఆలోచించడం మన వ్యవస్థని వ్యసనంలా పట్టుకుందా? ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకాదళంలో భాగం కావడం చరిత్రాత్మకమని రక్షణ మంత్రి ఏకే ఆంటోని పరవశంతో చెప్పారు. అప్పుడే ఒక పాకిస్థానీ పత్రిక తన సంపాదకీయంలో, ‘ఈ నౌకను రక్షణ దళంలో చేర్చుకోవడం చూస్తే పురాతన పద్ధతులలో ఆలోచించడం అక్కడి వ్యవస్థకి వ్యవసనంలా మారిందనిపిస్తోంది’ అని రాసింది. పేదరికంతో మగ్గిపోతున్న భారత్ ఇంత పెద్ద నౌకను తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకో? అంటూ అనవసరమైన విసుర్లు కూడా ఆ పత్రిక వదరింది. ఒకటి నిజం- ఇందులో మొదటి అంశం గురించి ఆ పాక్ పత్రిక బాహాటంగా చెప్పిన అభిప్రాయమే, చాలామంది భారతీయుల మనోగతం అంటే సత్యదూరం కాదు. రక్షణ వ్యవహారాలలో జాగరూకత ఆహ్వానించదగినదే. కానీ అణా కోడిపిల్లకి పావలా ఖరీదైన పందిపిల్లని దిష్టి తీసిన చందంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా స్వీయరక్షణలో పడక తప్పదు. నవంబర్ 16న నౌకాదళంలో భాగమైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య విషయంలో రక్షణ రంగం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నది. ఈ యుద్ధ విమాన వాహక నౌక హిందూ మహాసముద్రంలో బలాబలాల సమతుల్యతలో మార్పులు తెచ్చేదేనని అభిప్రాయపడుతూనే భారత నౌకాదళ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్, ఆ నౌకను సొంతం చేసుకోవడానికి 250 శాతం అదనంగా ఖర్చు చేసిన సంగతిని కూడా ఉదహరించవలసి వచ్చింది. ఇదంతా పదమూడేళ్ల గాథ. ఐఎన్ఎస్ విక్రమాదిత్య సోవి యెట్ రష్యా కాలం నాటిది. అసలు పేరు అడ్మిరల్ గోర్ష్కొవ్ (అంతకుముందు పేరు బకు). యుఎస్ఎస్ఆర్ పత నం తరువాత 2000 సంవత్సరంలో భారత్-రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మనకు ‘బహుమానం’గా ఇచ్చేశారు. భారత నౌకాదళంలో భాగమయ్యే ముందే ఆధునీకరించాలని 2004లో నిర్ణయించారు. యుద్ధ విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేయడం అందులో ఒకటి. 974 మిలి యన్ డాలర్ల ఖర్చుతో ముస్తాబు చేసి రష్యా 2008 సంవత్సరానికి భారత్కు అప్పగించాలి. కానీ రష్యా ‘అనుకోని వ్యయాల’ పేరుతో భారత్కు చాలా చేతి చమురు వదిలిం చిందని ‘కాగ్’ విమర్శ. 250 శాతం ఖర్చు అలా పెరిగిందే. అన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే పశ్చిమ తీరంలోని కార్వార్ (కర్ణాటక) నౌకాశ్రయానికి చేరుతుంది. 44,500 టన్నుల బరువైన ఈ నౌక మీద 88 మిగ్ 29కె యుద్ధ విమానాలు నిలబడవచ్చు. విక్రమాదిత్య రాక చరిత్రాత్మకమని ఆంటోనీ వ్యాఖ్యానించగానే చాలామందికి మన రక్షణ వ్యవహారాల చరిత్ర లో మరో కోణం స్ఫురించింది. ముంబై నౌకా కేంద్రంలో ఉండగా ఐఎన్ఎస్ సింధురక్షక్ అనే జలాంతర్గామిలో జరిగిన పేలుళ్లు గుర్తుకు వచ్చాయి. 113 మిలియన్ డాలర్లు వెచ్చించి డిసెంబర్ 27, 1997లో భారత నౌకాదళంలోకి తీసుకువచ్చిన సింధురక్షక్ ఓ వైఫల్యం. ఇది రష్యా ఇచ్చిన కిలో-క్లాస్ 877 ఇకేఎం జాలాంతర్గామి. 2010లో ప్రమాదానికి గురైతే మళ్లీ రష్యా పంపారు. 80 మిలియన్ల డాలర్ల ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం జూన్ ప్రాంతంలో తిరిగి వచ్చింది. సింధురక్షక్ ప్రమాదం రష్యా ప్రమాణాలనూ, మరమ్మతు సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేసిందని నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ పేర్కొనడం విశేషం. రష్యా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలు సదా ఉత్తమమైనవి కావు, అవి విఫలం కావడానికి అవకాశాలూ ఎక్కువేనని ఆయన అభిప్రాయం. కిలో-క్లాస్ రష్యా అమ్మిన తొమ్మిదో జలాంతర్గామి మరి! రష్యాతో ఉన్న రక్షణ బాంధవ్యాన్ని సమీక్షించుకుంటే భారత్తో ఆ దేశం ఆడిన ప్రమాదకరమైన ఆట బయటపడుతుందని వాదిం చేవారూ ఉన్నారు. రష్యావే, మిగ్-21 యుద్ధ విమానాల వల్ల ఎందరు పైలట్లను కోల్పోయామో చాలా మంది గుర్తు చేస్తున్నారు. 900 మిగ్ -21 విమానాలకుగాను, సగానికిపైగా కూలిపోయాయి. అయితే భారతదేశం ఇంతవరకు తేలికపాటి యుద్ధవిమానాల తయారీ చేపట్టకపోవడంవల్ల మన వైమానిక దళం ఇప్పటికీ ఈ ‘రెక్కల శవపేటిక’లనే ఉపయోగిస్తూండటం మరో విషాదం. కూడంకుళం అణు విద్యుత్కేంద్రం కోసం తీసుకున్న రష్యా సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతకీ విక్రమాదిత్యకు తనని తను రక్షించుకునే వ్యవస్థ ఏర్పడడానికి మరో నాలుగేళ్లు కావాలి. బాయిలర్ వ్యవస్థ పేలడంతో 1994లో ఇదే ఏడాది పాటు మూలప డింది. ఇన్ని లోపాలున్న రక్షణ దిగుమతులు అవసరమా? రష్యాది సాయమా? అక్కడ చెల్లని వాటిని అంటగట్టే తత్వ మా? రష్యాను మెప్పించడమే ప్రధానం అనుకుంటే, రక్షణ సంగతేమిటి? పాక్ పత్రిక వేసిన ప్రశ్న నిజానికి మన నేతలు వేసుకోవలసినది కాదా? కల్హణ -
డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 5 తేది నుంచి 20 వరకు కొనసాగనున్నట్టు లోకసభ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైన అంశాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 20 వరకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని కార్యదర్శి వెల్లడించారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీతో నవంబర్ 11 తేదిన జరిగిన భేటిలో శీతాకాలం సమావేశాలపై నిర్ణయం తీసుకున్నట్టు లోకసభ కార్యదర్శి తెలిపారు. ఈ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం యూపీఏ ప్రభుత్వానికి కీలకంగా మారిన తరుణంలో ఈ శీతాకాలపు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
డిసెంబరు 5 నుంచి పార్లమెంటు!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి 22 వరకూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ మేరకు స్వల్పకాలమే డిసెంబరు మొదటి వారం నుంచి నిర్వహించాలంటూ ప్రతిపాదనలు వచ్చాయి. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్లమెంటు వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సోమవారం నిర్వహించే సమావేశంలో సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా సమావేశానికి హాజరు కానున్నారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమావేశాలను కుదించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు డిసెంబరు 4 నాటికి ముగియనుండగా, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి ఆంటోనీ ఈ నెల చివర్లో త్రివిధ దళాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ కేరన్ సెక్టార్లో ఆర్మీ 15 రోజులపాటు సాగించిన ఆపరేషన్పై ఎన్నో సందేహాలు నెలకొన్నందున ఈ అంశం ప్రధానంగా సమీక్షకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటును తాము భగ్నం చేశామని ఆర్మీ 15 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్లో ఒక్క ఉగ్రవాది కూడా దొరకకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశంలో కేరన్ అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా పాల్గొనవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 నుంచి ఆర్మీ కమాండర్ల నాలుగు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేరన్ ఆపరేషన్కు సంబంధించి ఎన్నో అంశాలు చర్చించి.. అలాంటివి భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు. -
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సైన్యం: ఏకే ఆంటోనీ
న్యూఢిల్లీ: పై-లిన్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం దాటే సమయంలో తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక దళాలను కోరారు. ఐఏఎఫ్కు చెందిన ఐఎల్-76 రెండు విమానాలు ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విపత్తు నివారణ బృందాలను, సహాయక సామాగ్రిని భువనేశ్వర్కు తరలించాయి. రెండు సీ 130జే విమానాలు, 18 హెలికాప్టర్లు, రెండు ఏఎన్-32 ఎయిర్క్రాప్ట్లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచారు. పై-లిన్ తుఫాన్ రేపు తీరందాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళం: 08942 240557, 9652838191 గుంటూరు : 08644 - 223800 తూర్పుగోదావరి: 08856 - 233100 పశ్చిమగోదావరి: 08812 230617 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
ఆంటోనీ సారథ్యంలో ఏడుగురితో తెలంగాణపై మంత్రుల బృందం
తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని కుదించారు. గతంలో పది మంది మంత్రులను ఈ బృందంలో నియమించగా, ఇప్పుడు ఏడుగురితో మాత్రమే ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త బృందానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని చైర్మన్గా ఖరారు చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్, ప్రధాని కార్యాలయ శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి ఈ బృందంలోని ఇతర సభ్యులుగా ఉంటారు. -
ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమె ఈ నెల 2న అమెరికా వెళ్లారు. 2011, ఆగస్టు 5న సోనియాకు అమెరికాలో శస్త్ర చికిత్స జరగడం తెలిసిందే. కాగా గత నెల ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను ఎయిమ్స్కు తరలించారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఏకే ఆంటోనీ నేడు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. కాగా రాష్ట్రవిభజనపై కేబినెట్ నోట్ సిద్దమైందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్న విషయం తెలిసిందే. కేబినేట్ నోట్ తో తాము సిద్ధంగా ఉన్నామని.. సోనియాగాంధీ రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా చికిత్స కోసం అమెరికా వెళ్లిన సోనియాగాంధీకి కొత్త చిక్కులు వచ్చాయి. 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (ఎస్.ఎఫ్.జె.) అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుతో అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. 1984 నవంబర్ నెలలో సిక్కులపై జరిగిన దాడులలో కొందరు పార్టీ నాయకుల హస్తం ఉండగా.. వారికి సోనియా అండదండలు అందిస్తున్నారంటూ వారు తమ పిటిషన్లో ఆరోపించారు. న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. ఎస్.ఎఫ్.జె.తో పాటు ఇతర సిక్కు మానవహక్కుల బృందాలు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశాయి. ఫెడరల్ నిబంధనల ప్రకారం సోనియాగాంధీకి సమన్లు అందజేసేందుకు తమకు 120 రోజుల గడువు ఉంటుందని ఎస్.ఎఫ్.జె. తరఫున వాదించే న్యాయవాది గుర్పత్వంత్ ఎస్. పన్నున్ తెలిపిన విషయం తెలిసిందే. సోనియాకు హాస్పటల్లో సమన్లు అందచేసినట్లు సిఖ్స్ గ్రూప్ వెల్లడించింది. -
రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ
విభజన తప్పనిసరైతే ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరు తూ కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వి.కిశోర్ చంద్ర దే వ్ బుధవారం ఆంటోనీ కమిటీకి లేఖ రాశారు. సీమాంధ్ర అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘హైకోర్టును కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలి. ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్నీ విశాఖకు తరలించాలి. నగరంలో ఐటీ పార్కు, ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఐటీ తదితర ఉన్నతవిద్యాసంస్థలు, గ్రేటర్ సిటీగా చేసి మెట్రో రైలు తదితరాలు తేవాలి’’ అంటూ లేఖలో మంత్రి డిమాండ్ చేశా రు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు, ఎంపీలు కూడా అధిష్టానం విభజన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ ప్రాంత సత్వర, సమగ్రాభివృద్ధికి భారీ ప్యాకేజీని డిమాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. -
రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక అమలు కమిటీ సారథిగా ఆంటోనీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక వాగ్దానాల అమలును పర్యవే క్షించే కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. దీనికి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షునిగా ఉంటారు. దిగ్విజయ్సింగ్, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణసామితో పాటు సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఇందులో సభ్యులుగా నియమితులైనట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
వాయుసేనలోకి భారీ రవాణా విమానం
న్యూఢిల్లీ: వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానికదళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధానిలోని హిండన్ ఎయిర్బేస్లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్లో చేర్చనున్న సీ-17 ఎయిర్క్రాఫ్ట్లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్ను ఇవి మోసుకెళ్లగలవు. రష్యా నుంచి కొనుగోలు చేసిన --76 స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు ఇవే భారీ రవాణా విమానాలు. --76 విమానాలు 40 టన్నుల బరువును మోయగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. -
‘ముందస్తు’కు కాంగ్రెస్ కసరత్తు?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నదా..? ఢిల్లీలో పరిణామాలు, అందుతున్న సంకేతాలు ఈ దిశగానే ఉన్నాయంటూ పీటీఐ వార్తాసంస్థ కథనం తెలియజేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో కోసం 15 రోజుల్లోగా సమాచారం పంపాల్సిందిగా శుక్రవారంనాడు వివిధ రాష్ట్రాల విభాగాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి వర్తమానమందింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు దేశం మొత్తానికి వర్తించే సూచనలు, సలహాలు కూడా పంపించవచ్చని కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నవంబర్ - డిసెంబర్లలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టవచ్చని ఆ వర్గం పేర్కొంటున్నది. అదీగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక మెరుగైన ఫలితాలు సాధించలేకపోతే తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని ఆ వర్గం హెచ్చరిస్తున్నది. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. అయితే మరి కొందరు నాయకులు మాత్రం ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టిపడేస్తున్నారు. చివరిరోజు వరకూ పదవీకాలం పూర్తి చేయడానికే పార్టీ మొగ్గుచూపుతుందంటున్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావడం కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని నియమించింది. పొత్తుల అంశాన్ని పరిశీలించడం కోసం సీనియర్ నాయకుడు, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో ఉప సంఘాన్ని కూడా నియమించారు. అయితే ఆంటోనీ కమిటీ ఇప్పటివరకూ పని ప్రారంభించిన దాఖలాలు లేవు. కమిటీ ఇంతవరకూ ఎన్నిసార్లు సమావేశమైందనే విషయాన్ని కూడా ఆంటోనీ వెల్లడించడం లేదు. మేనిఫెస్టో, ప్రభుత్వ కార్యక్రమాలపై వేసిన ఉపసంఘానికి కూడా ఆంటోనీయే నాయకత్వం వహిస్తున్నారు. కమ్యూనికేషన్, పబ్లిసిటీపై ఉపసంఘానికి దిగ్విజయ్సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. -
మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్
పాకిస్థాన్కు భారత్ హెచ్చరిక న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో.. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఐదుగురు భారత సైనికులను కాల్చివేసిన ఘటనకు పాకిస్థాన్ బాధ్యత వహించక తప్పదని.. ఆ దేశానికి, వారి సైన్యానికి సంబంధం లేకుండా అదంతా జరగదని వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ కాల్పులకు దిగుతోందని, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆంటోనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ 82 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని చెప్పారు. -
యుద్ధసామగ్రి వల్లే పేలుళ్లు: ఆంటోనీ
‘సింధురక్షక్’ ఘటనపై రాజ్యసభకు రక్షణ మంత్రి ఆంటోనీ వెల్లడి న్యూఢిల్లీ/ముంబై: ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి అందులోని యుద్ధసామగ్రి మండటమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభ లో వెల్లడించారు. ముంబై డాక్యార్డ్లో మంగళవారం అర్ధరాత్రి సింధురక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుళ్లు సంభవించడంతో అది మునిగిపోవడం తెలిసిందే. జలాంతర్గామిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురితో సహా 18 మంది నేవీ సిబ్బంది చిక్కుకోవడం కూడా విదితమే. అయితే సింధురక్షక్లో యుద్ధసామగ్రి జ్వలించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. ‘ప్రాథమిక అంచనాల ప్రకారం.. జలాంతర్గామిలో యుద్ధసామగ్రి భద్రపర్చిన ముందు కంపార్ట్మెంట్లో తొలుత అంతర్గత పేలుడు చోటుచేసుకుంది. ఫలితంగా ఇతర కంపార్ట్మెంట్లలోనూ పేలుళ్లు జరిగి జలాంతర్గామి క్షణాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. దీంతో సిబ్బంది బయటికి రాలేకపోయారు’ అని ఆంటోనీ వివరించారు. నౌకలను వెలికితీయడంలో పేరుపొందిన అంతర్జాతీయ కంపెనీలను సంప్రదించామని, వారు జలాంతర్గామిని బయటికి తీసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకుగాను నిపుణులతో ఒక బోర్డును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మృతులకు పార్లమెంటు నివాళి... సింధురక్షక్ ప్రమాదంలో అసువులుబాసిన నేవీ సిబ్బందికి సోమవారం పార్లమెంటు ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ఉభయసభలు వేర్వేరుగా సమావేశమైన అనంతరం సంతాప సందేశాన్ని చదవడంతోపాటు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తంచేశాయి. అమరులైన నేవీ సిబ్బందికి నివాళిగా ఉభయసభలూ కొన్ని నిమిషాలు మౌనం పాటించాయి. ఏడో మృతదేహం లభ్యం సాక్షి, ముంబై: సింధురక్షక్ జలాంతర్గామి నుంచి సోమవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటిదాకా లభించిన మృతదేహాల సంఖ్య ఏడుకు చేరింది. ఇంకా మరో 11 మంది నేవీ సిబ్బంది ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. జలాంతర్గామిలో చమురు కలిసిన నీరు, చీకటి, బురద, లోపలి భాగం ధ్వంసమై చిందరవందర కావడంతో నేవీ గజ ఈతగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే గాలింపు కొనసాగిస్తున్నారు. మృతదేహాలు కాలిపోవడం వల్ల గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మృతులను గుర్తించేందుకు వీలుకానుంది. -
ఆయుధాలను పేల్చడం వల్లే సింధురక్షక్ ప్రమాదం: ఆంటోనీ
ఐఎన్ఎస్ సింధురక్షక్లో ఆయుధ సామగ్రిని పేల్చడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో సోమవారం వెల్లడించారు. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం రాజ్యసభ తిరిగి సమావేశమైంది. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాద అంశం చర్చకు వచ్చినప్పుడు దానిపై ఆంటోనీ మాట్లాడారు. అయితే, పేలుడుకు సంబంధించిన కారణం ఏంటో ఇంతవరకు తెలియరాలేదని, దీనిపై ఫోరెన్సిక్ నిపుణులు దృష్టి పెడుతున్నారని ఆయన చెప్పారు. నీళ్లలో మునిగిపోయిన జలాంతర్గామిని బయటకు తీసి, అందులోని నీరు మొత్తాన్ని తోడిన తర్వాత గానీ వివరాలు తెలియవన్నారు. పేలుడు తీవ్రత, దానివల్ల జలాంతర్గామికి సంభవించిన నష్టాన్ని బట్టి చూస్తే... అందులో ఉన్ 18 మందిలో ఏ ఒక్కరూ బతికుండే అవకాశం కనిపించడంలేదని ఆంటోనీ చెప్పారు. మొత్తం ఎస్ఓపీలకు సంబంధించి ఆడిట్ చేయాలని నౌకాదళం ఆదేశించిందని, ఆయుధాల భద్రతకు సంబంధించిన పరిశీలన మొత్తం జరుగుతోందని, నౌకాదళంలో ఉన్న మొత్తం జలాంతర్గాములన్నింటికి సంబంధించి ఇలాంటి పరీక్షలు చేస్తారని ఆంటోనీ తెలిపారు. -
సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ
దేశమాత సేవలో నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదం గురించిన వివరాలను ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బుధవారం తెలిపారు. సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆంటోనీ ముంబై వెళ్లనున్నారు. కాగా, భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి కూడా ముంబై వెళ్లనున్నారు. ఆయన కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు, వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో తెలుసుకోడానికి నౌకాదళం ఇప్పటికే ఓ దర్యాప్తు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో ముగ్గురు అధికారులతో సహా 18 మంది మరణించినట్లు భావిస్తున్నారు. ముంబైలోని నావల్ డాక్యార్డులో బుధవారం తెల్లవారుజామున పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. -
తెలంగాణలో ఉత్తరాంధ్ర కలపాలి: భట్టి విక్రమార్క
ఆంటోనీ కమిటీకి భట్టి విక్రమార్క కొత్త ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కూడా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి వస్తోంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఈ మేరకు ఒక నివేదిక ఇవ్వాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఆయన ఇప్పటికే రూపొందించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా ఇప్పటికే దీనిపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తెలంగాణతో కలపాలని, తద్వారా కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఉంటుందని డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో సహా తెలంగాణలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ఉత్తరాంధ్ర జిల్లాలను కలపడం వల్ల అనేక సహజ వనరులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు సముద్రంతో సంధానం లేకుండాపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపితే విశాఖ నుంచి సముద్రం, పోర్టులు అందుబాటులో ఉంటాయి. ఇది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది’ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు నేతలతో భట్టి చర్చించారు. వారి నుంచి సానుకూలత వ్యక్తమవడంతో ఈ దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. ఆంటోనీ కమిటీని కలసి తమ ప్రతిపాదన అందించేందుకు భట్టి విక్రమార్క సహా కొందరు నేతలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
చట్టబద్ధత లేని కమిటీకి ఎందుకింత సీన్?
పీసీసీ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: ఎలాంటి చట్టబద్ధత లేకుండా కేవలం పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ వల్ల అనుకున్న రాజకీయ ఫలితాన్ని సాధించలేమన్న ఆందోళన కాంగ్రెస్ సీమాంధ్ర నేతల్లో వ్యక్తమవుతోంది. ఆంటోనీ కమిటీ వేశామని చెప్పుకుని, ఆ కమిటీ ద్వారా తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు. ఆంటోనీ కమిటీ వేసిన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత తగ్గుతుందని భావించామని సీమాంధ్ర నేత ఒకరు చెప్పారు. అయితే ఉద్యమం మరింత తీవ్రతరం కావడంతో పార్టీ నాయకులే కాకుండా బయటివారు కూడా ఆ కమిటీ ముందు తమ అభ్యంతరాలు చెప్పొచ్చని కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి మొదలుపెట్టారు. ఒక మొబైల్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చి ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపించే వారు ఎవరైనా ఉంటే ఆ నంబర్కు ఫోన్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ అంతర్గత కమిటీ మాత్రమే. చట్టబద్ధత లేని కమిటీ ముందు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఎందుకు తమ వాదనలు వినిపిస్తాయి? అయినా ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పుకోవడాని కోసమే ఆ కమిటీ’ అని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. -
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదు: దిగ్విజయ్
-
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదు: దిగ్విజయ్
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సందేహాలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వార్రూమ్లో ఏకే ఆంటోనీతో సమావేశమయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు వస్తుందని తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎవరూ నోరెత్తొద్దు: సోనియాగాంధీ
-
ఒకేరోజు మూడుసార్లు ఉల్లంఘన
జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ బరితెగిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో శ్రుతిమించిపోతోంది. సోమవారం ఒక్కరోజే పాక్ ఆర్మీ జమ్మూకాశ్మీర్లోని పూంచ్, సాంబా జిల్లాల్లో భారత ఆర్మీ ఔట్పోస్టులపై మూడు పర్యాయాలు కాల్పులకు తెగబడింది. మోర్టార్లు, రాకె ట్లను భారీగా ప్రయోగించింది. భారత సైనికులు వీటిని అంతే దీటుగా తిప్పికొట్టారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పాక్ గత మూడు రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఏడోసారి. ఆ దేశ బలగాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య పూంచ్ సరిహద్దు, దిగావర్, మాన్కోటే, దుర్గా బెటాలియన్ ప్రాంతాల్లోని 11 పోస్టులపై భారీ కాల్పులు జరిపాయి. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సాంబాలోని కోతాయ్ ఔట్ పోస్టుపై, రాత్రి 9.20 ప్రాంతంలో పూంచ్లోని మెంధార్ సబ్ సెక్టార్ పోస్టుపై కాల్పులకు పాల్పడ్డాయి. బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సైనికులకు గట్టి సమాధానమిచ్చారు. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరోపక్క.. భారత ఆర్మీ తమ అధీనంలోని కాశ్మీర్(పీఓకే)లో కాల్పులు జరపడంతో ఒక పౌరుడు చనిపోయాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గోపాల్ బాగ్లేను పిలిపించుకుని నిరసన తెలిపింది. -
ఆంటోనీ కమిటీని కలిసే ఆసక్తి ఉందా?
9581141230కు సమాచారమివ్వండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆంటోనీ కమిటీ సభ్యులను కలిసి తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆసక్తి కలిగినవారు ‘‘9581141230’’ మొబైల్ నెంబర్కు సమాచారం పంపాలని కోరారు. సమాచారం అందుకున్న తరువాతే ఆంటోనీ కమిటీని ఎక్కడ, ఎప్పుడు కలవాలనే సమాచార సందేశాన్ని సదరు సంఘాలకు తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్ధి, కార్మిక , ప్రజా సంఘాలతోపాటు కాంగ్రెసేతర పార్టీలు కూడా కమిటీని సంప్రదించవచ్చని సూచించారు. అయితే వ్యక్తులను కాకుండా గ్రూపులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. -
ఎవరూ నోరెత్తొద్దు: సోనియాగాంధీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణపై తాము తీసుకున్న నిర్ణయంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ అధిష్టానానికి గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో ఉధృతంగా సాగుతున్న ఆందోళనతో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తనను కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇటీవల ప్రయత్నించినా అందుకామె ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఏమున్నా పార్టీపరంగా వేసిన ఏకే ఆంటోనీ కమిటీకే చెప్పుకోవాలని కూడా మేడమ్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. విభజన నిర్ణయాన్ని రాష్ట్ర నేతలందరికీ ముందే చెప్పినా, ఇప్పుడు సీమాంధ్ర నేతలు భిన్న వైఖరి తీసుకున్నారంటూ ఆమె ఆగ్రహిస్తున్నారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిని వారికి మరోసారి ‘స్పష్టం’ చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు ఇప్పటికే అధిష్టానం సూచించిందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఎలాంటి స్వరమూ విన్పించడం లేదని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. ‘‘సీమాంధ్ర నేతలంతా విభజన నిర్ణయాన్ని వాయిదా వేయాలంటున్నారే తప్ప వెనక్కు తీసుకోవాలని కోరడం లేదు. బహుశా వారి ప్రాంతంలో ప్రజాగ్రహం కారణంగా, ప్రజల భావోద్వేగాలను తృప్తి పరిచే ఉద్దేశంతో నేతలు ఇలా వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ ఆ క్రమంలో అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టడాన్ని మాత్రం సహించేది లేదు’’ అని అవి స్పష్టం చేశాయి. విభజనపై సీమాంధ్ర నేతలెవరూ బహిరంగ ప్రకటనలు చేయరాదని దిగ్విజయ్సింగ్ సూచించారు. ఎలాంటి అభ్యంతరాలున్నా ఏకే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదే అంతిమ నిర్ణయమని, దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని సోమవారం కొన్ని చానళ్లతో మాట్లాడుతూ ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ‘విభజనపై సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించినందున ఎవరేం మాట్లాడినా అసంబద్ధమే. నేతలంతా సీడబ్ల్యుసీ నిర్ణయానికి కట్టుబడాలి’ అన్నారు. తెలంగాణ ఏర్పాటును కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని, విభజనతో వచ్చే సమస్యలను ఎలా పరిష్కారించాలో మాత్రమే ఆంటోనీ కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. -
‘విక్రాంత్’ తొలి అడుగులు!
కొచ్చి: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ తొలి అడుగు వేసింది! రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ సోమవారం కొచ్చి నౌకాశ్రయంలో దీన్ని ప్రారంభించారు. ‘ఇది జాతి యావత్తూ గర్వించదగిన, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. యుద్ధనౌకల నిర్మాణంలో మన సత్తా చాటాం. ఇలాంటి సామర్థ్యం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు మాత్రమే ఉంది’ అని ఈ సందర్భంగా ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. దేశం కోసం యుద్ధనౌకల నిర్మాణ సుదీర్ఘ ప్రస్థానంలో ఇది కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. తొలిదశ నిర్మాణానికి చిహ్నంగా ఐఎన్ఎస్ విక్రాంత్ను సోమవారం ప్రారంభించారు. తదుపరి దశలో మిగతా నిర్మాణం పూర్తికానుంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కొచ్చిన్ షిప్యార్డ్స్ లిమిటెడ్(సీఎస్ఎల్)కు ఆంటోనీ సూచించారు. సమన్వయం లేక దీని నిర్మాణంలో చాలా ఏళ్ల జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని దీర్ఘకాలం పోరాడేందుకు నౌకాదళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచాలన్నారు. కొచ్చిన్ షిప్యార్డ్కు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1972లో శంకుస్థాపన చేశారని ఆంటోనీ గుర్తు చేసుకున్నారు. పృథ్వీ-2 క్షిపణి, అరిహంత్ అణు జలాంతర్గాములను విజయవంతంగా పరీక్షించటం దేశ రక్షణ రంగ సామర్థ్యానికి రుజువన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంపై ప్రశ్నించగా, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వేచ్ఛ మన బలగాలకు ఉందని ఆంటోనీ చెప్పారు. ‘విక్రాంత్’పై చైనాలో ఆందోళనలు బీజింగ్: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించడంపై చైనాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత నేవీని బలోపేతం చేసి చైనా సొంత ప్రాంతంగా భావించే పసిఫిక్ మహాసముద్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ వినియోగిస్తున్న ఐఎన్ఎస్ విరాట్కు తోడుగా ఈ ఏడాది జనవరిలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య రానుందని, దీంతో ఆ దేశం చైనాపై పైచేయి సాధిస్తుందని చైనా నావల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు జాంగ్ జుషే చెప్పారు. విక్రాంత్ వినియోగంలోకి వస్తే త మ పొరుగు దేశం సుదూర సముద్రాల్లోనూ కాపలా కాయడానికి వీలవుతుందని, దీంతో దక్షిణాసియాలో సైనిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. విక్రమాదిత్య తోడైతే ఆసియాలో రెండు విమానవాహక యుద్ధనౌకలున్న ఒకే ఒక దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. చైనా గత ఏడాది తన తొలి విమానవాహక యుద్ధనౌకను ప్రారంభించింది. -
గురితప్పిన ఎన్నికల ‘ఏకే’!
బైలైన్: కాంగ్రెస్కు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చిత్తశుద్ది ఉండి ఉంటే మూడేళ్ల క్రితమే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఉండేది. ప్రతికూల స్పందనలను గ్రహించి, ప్రత్యేక రాష్ట్రం నిర్ణయం వల్ల ప్రయోజనాలను చూపించి స్పందించడానికి దానికి ఈ మూడేళ్లకాలం ఉపయోగపడేది. తెలంగాణ ప్రకటనకు అది ఎంచుకున్న సమయాన్ని నిర్ణయించింది ప్రజాప్రయోజనం కాదు, పార్టీకి జరిగే మేలే. ప్రజా జీవితంలోని హాస్యం తులాదండపు మొనలాంటిది. అందుకే అది రాజకీయవేత్తకు ఆజన్మ నైతిక శత్రువు. అవినీతి కుంభకోణమంత సమర్థంగా ఒక చతురోక్తి రాజకీయ ప్రతిష్టకు భంగం వాటిల్ల చేయలేకపోవచ్చు. కానీ తగ్గించగలుగుతుం ది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చతురోక్తులను విసరాలన్న ప్రలోభానికి ఎన్నడూ గురికాకుండా వివేకం కనబరచారు. చమత్కారం తన కున్న బలమైన అంశం కాదని ఆయనకు తెలుసు. ఇటీవలి సరిహద్దు కాల్పుల ఘటనలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమస్యతో ఆయన వ్యవహరించిన తీరుపై వెల్లువెత్తిన వ్యంగ్యోక్తుల శతఘ్ని గుళ్ల జడివానకు ఆయన కొంచెం బిత్తరపోయారు. అలాంటి హాస్యం గుర్తుండిపోతుంది. ‘పాకిస్థాన్కు ఏకే-47, ఏకే ఆంటోనీ అనే రెండు ఆయుధాలున్నాయి’ అని ఓటరు గుర్తుంచుకుంటాడు. ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీలపై వెల్లువెత్తే చతురోక్తులు మరింత కరకైనవనే విషయం ఆంటోనీకి ఏమైనా ఊరట కలిగిస్తుందేమో. మరో సార్వత్రిక ఎన్నికల దిశగా మనం వడివడిగా సాగుతుండగా... హేళనకు గురి కావడమే తనకు ఉన్న అతి పెద్ద సమస్య అని కాంగ్రెస్ గుర్తించాల్సిరావొచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదాన్ని ఇప్పుడిక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అతి సుదీర్ఘంగా సాగుతున్న నాటకంలోని చరమాంకంలో ఉన్నాం. ఈ ప్రభుత్వపు జీవితకాలం ముగిసిపోయింది. మరణశయ్యపై ఉండి పునరుత్థానం గురించి కలలు కనడం వ్యర్థం. ఈ ఐదేళ్లలో చాలా భాగం ప్రభుత్వ విధానాలు బురద గుంటలో పడి కనబడకుండా పోయాయి. నినాదాలకు తోడ్పడే విధంగా ఇప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చిత్తశుద్ది ఉండివుంటే మూడేళ్ల క్రితమే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఉండేది. ప్రతికూల స్పందనలను గ్రహించి, ప్రత్యేక రాష్ట్రం నిర్ణయం వల్ల ప్రయోజనాలను చూపించి స్పందించడానికి దానికి ఈ మూడేళ్లకాలం ఉపయోగపడేది. ఇప్పుడు తెలంగాణను ప్రకటించడమంటే ‘కిరాయి’ కోసం చేసిన పనే. ఈ వాతావరణం వల్ల వచ్చిపడే ఓట్లను నొల్లుకోవాలని తీసుకున్న నిర్ణయమే. తెలంగాణ ప్రకటనకు అది ఎంచుకున్న సమయాన్ని నిర్ణయించింది ప్రజా ప్రయోజనం కాదు, పార్టీకి జరిగే మేలే. కానీ రాజకీయాలంటే సందర్శకుల గదిలో ఆడే ఆట కాదు. ఆ గది ఢిల్లీలోని సుందర, సువిశాలమైన బంగ్లాయే అయినాగానీ రాజకీయాలంటే ఆట కాదు. తెలంగాణ నిర్ణయం ఇంతవరకు సాధించినదల్లా కాంగ్రెస్ను రెండు ముక్కలు చేయడమే, ఆంధ్రా వీధుల్లో ఆగ్రహం వెల్లువెత్తేలా చేయడమే, మరిన్ని ప్రత్యేకవాద ఉద్యమాలను ప్రేరేపించడమే. తెలంగాణ వివాదం హైదరాబాద్ వివాదాన్ని సృష్టించింది. హైదరాబాద్ వివాదం కూడా తెలంగాణ వివాదం అంతే దీర్ఘకాలికమైనది. కాంగ్రెస్కు అటూ ఇటూ కూడా గెలుపే అనే పరిస్థితి ఏర్పడటానికి బదులు అటూ ఇటూ కూడా ఓటమే అనే పరిస్థితి ఏర్పడింది. ఆహార భద్రతా చట్టం విషయంలోనూ అదే జరి గింది. దాన్ని అమలు చేస్తే ఆ ప్రాజెక్టులోని లోటుపాట్లు ఎక్కడ భయటపడతాయోనన్న భయం తప్పిస్తే... యూపీఏ తన రెండో దఫా పాలనలోని తొలి ఆరు నెలల్లో ఆ బిల్లును ఆమోదింపజేసుకోకుండా అడ్డగించింది ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రచార మాంత్రికులు మాత్రం అది 1971లో ఇందిరాగాంధీ సృష్టించినలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందని ఇంకా నమ్ముతున్నారు. ‘వాళ్లు (ప్రత్యర్థులు) ఇందిరాగాంధీని తొలగించండి అంటున్నారు. నేను పేదరికాన్ని తొలగించండి (గరీబీ హఠావో) అంటున్నాను’ అనే సరళమైన ప్రతిపాదనతో ఇందిరాగాంధీ ఆ ఏడాది బ్రహ్మండమైన విజయం సాధించారు. ఒక వాగ్దానానికి ఎంత విశ్వసనీయత ఉంటే అది అంతే ప్రభావశీలమైనది అవుతుంది. ఇందిరాగాంధీ కుటుంబ అవినీతిని కూడా పరిగణనలోకి తీసుకున్నా, 1971లో ఆమెను అవినీతి కంపు ఆవరించి లేదు. భారతీయ తరహా సోషలిజంతో ఆమె తమ బాధలను అంతం చేస్తుందని పేదలు విశ్వసించారు. కోరి ముప్పును తెచ్చుకోవాలనుకుంటే తప్ప, ఆనాడు ఎవరూ ఇందిరాగాంధీని చూసిగానీ, కనీసం ఆమె రక్షణ మంత్రిని చూసిగానీ ఎవరూ నవ్వలేదు. 1971 నుంచి కాంగ్రెస్ మూడు దశాబ్దాలపాటూ అధికారం నెరపింది. అది కూడా వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ లేదా ఇందర్ కుమార్ గుజ్రాల్ల లాగా హఠాత్తుగా ఊడిపడ్డట్టుగా గాక, నిలకడగానే అధికారంలో ఉంది. నాటి ఇందిరాగాంధీ వాగ్దానం నేటికీ కలే. ప్రతి ఎన్నిక భవిష్యత్తుకు తెరుచుకునే మరో ద్వారం. గతానికి దొడ్డి తలుపు మాత్రం కాదు. మనకు వారసత్వం గా సంక్రమించిన సమస్యలను మనం పరిష్కరించక తప్ప దు. వాటిలో అతి ముఖ్యమైనది పేదరికమే. ఆ సమస్య పరిష్కారానికి పెద్ద గంతుల ద్వారా సాగే ప్రగతిశీల మార్పునకు దారితీసే ఆర్థిక కార్యక్రమం అవసరం. అంతేగానీ జనాకర్షక పథకాలు పరిష్కారం కాదు. యూపీఏకు మరో ఐదేళ్ల గడువు ఇస్తే అది ఒక నూతన భారతదేశాన్ని సృష్టిస్తుందని 2009లో ఓటర్లు నమ్మారు. కాబట్టే దానికి మంచి గెలుపును కట్టబెట్టారు. ఐదేళ్లు గడిచిపోయాయి. తీరా చూస్తే మనం ఊహించుకున్న నవ భారతం గతం మడతల్లోకి జారిపోగా... అదే పాత భారతదేశం వైపు మనం కళ్లప్పగించి చూస్తున్నాం. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో వెల్లివిరిసిన ఆశావాదానికి బదులుగా నిరాశావాదం అనే రుగ్మతతో మధ్యతరగతి కుంగిపోతోంది. అవినీతి అనే దుష్టశక్తి నేటి రాజకీయ వ్యంగ్యపు చీకటి పార్శ్వం. ఎన్నికల సమస్యగా అవినీతికి ప్రాధాన్యం తగ్గిపోయిందనే సిద్ధాంతాన్ని అధికార వ్యవస్థలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అదో భ్రమ. రాజకీయవేత్తలంతా అవినీతిపరులే కాబట్టి నేటి వారి దొంగతనాన్ని మన్నించేయాలన్న వాదనతో ఓటర్లను వంచించలేరు. న్యాయమూర్తుల బృందం బోనులో ఉన్న ఒక్క వ్యక్తిని మాత్రమే శిక్షించగలుగుతుంది. నేటి ప్రభుత్వం తదుపరి ఎన్నికల న్యాయస్థానంలో విచారణకు నిలుస్తుంది. చతురోక్తులే ఆ న్యాయస్థానంలోని సాక్ష్యాధారాలు, వాదనలు. ఓటరు ఆ న్యాయస్థానంలో న్యాయవాది, న్యాయమూర్తి కూడా. బోనులో ఉన్న వారికి ఓ శుభవార్త కూడా ఉంది. గరిష్ట శిక్ష ఐదేళ్ల రాజకీయ వనవాసం మాత్రమే. వచ్చే ఐదేళ్లు కూడా గత ఐదేళ్లంత త్వరగానే గడిచిపోతాయి. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
ఆంటోనీ కమిటీకి కాలపరిమితి లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్న విభేదాలు, సీమాంధ్ర ప్రాంత నేతల ఆందోళనలను పరిశీలించటానికి.. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నేతృత్వంలో పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం నుంచి పని ప్రారంభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ పేర్కొన్నారు. అయితే.. ఈ కమిటీకి ఎలాంటి కాల పరిమితీ లేదని స్పష్టంచేశారు. దిగ్విజయ్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో తనను కలిసిన కొందరు మీడియా చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక సమస్యలను లేవనెత్తారు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘విభజన అంశంపై సోనియాగాంధీ నియమించిన ఆంటోని కమిటీ వచ్చే సోమవారం నుంచి పని మొదలుపెడుతుంది. సీఎం వ్యక్తంచేసిన సందేహాలను పరిశీలిస్తుంది. ఎవరెవరి వాదనలు తీసుకోవాలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను జాబితా అడిగి తీసుకుంటుంది. అన్ని వర్గాల ప్రజల నుంచి విజ్ఞాపనలను పరిశీలిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యలనూ కమిటీ ముందుగానే పరిశీలిస్తుంది. వాటన్నింటినీ కేంద్రం దృష్టికి తెస్తుంది. సమస్యను పరిష్కరించే దిశగా సూచన చేస్తుంది’’ అని ఆయన బదులిచ్చారు. ‘కమిటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందా లేక ఢిల్లీ నుంచే పనిచేస్తుందా?’ అన్న ప్రశ్నకు.. ‘‘అక్కడికి (హైదరాబాద్కు) వెళ్లవచ్చు.. లేదా ఇక్కడి నుంచే (ఢిల్లీ నుంచే) చేయవచ్చు. నిజానికి ప్రస్తుతం ఆంటోని పార్లమెంట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన వీలునుబట్టి ఎక్కడ వాదనలు వినాలో నిర్ణయిస్తాం’’ అని సమాధానం చెప్పారు. ‘కమిటీకి కాలపరిమితి ఉందా?’ అని అడగ్గా ఎలాంటి కాలపరిమితి లేదని దిగ్విజయ్ స్పష్టంచేశారు. ‘కమిటీకి, తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలపై దృష్టి సారించి.. వాటిని పరిష్కరించటమే కమిటీ లక్ష్యం. అందువల్ల రాష్ట్ర విభజనకు, కమిటీకి సంబంధం ఉంది’’ అని బదులిచ్చారు. -
పాక్ సైన్యం దుశ్చర్యే : ఎ.కె.ఆంటోనీ
భారత జవాన్ల హత్యపై ఆంటోనీ - తొలి ప్రకటనను సవరిస్తూ పార్లమెంటులో ప్రకటన - భారత్-పాక్ సంబంధాలపై ప్రభావముంటుంది - బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే - భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయరాదు - పాక్కు రక్షణ మంత్రి ఆంటోనీ హెచ్చరిక - ఉగ్ర సంస్థలను నిర్మూలించాలని డిమాండ్ - స్వాగతించిన సుష్మ.. పెదవి విరిచిన శివసేన మంగళవారం కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి భారత జవాన్లపై దాడిచేశారు. ... నాకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసు. పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదు. దౌత్యమార్గంలో పాక్కు భారత నిరసన తెలిపాం. - లోక్సభలో రక్షణమంత్రి ఆంటోనీ గురువారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లపై దాడిచేసి హత్యచేసిన ఘటనలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని స్పష్టమైంది. భారత్ సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఐదుగురు భారత జవాన్లను హతమార్చిన దురాగతంలో పాకిస్థాన్ సైన్యం పాత్ర ఉన్నట్టు స్పష్టమైందని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రకటించారు. ఈ ఘటన పర్యవసానంగా నియంత్రణ రేఖపై భారత వైఖరిలో, పాకిస్థాన్తో సంబంధాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. పాకిస్థాన్పై కఠిన స్వరం వినిపిస్తూ.. భారత్ పాటిస్తున్న సంయమనాన్ని అలసత్వంగా పరిగణించరాదని, భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదని హెచ్చరించారు. కాశ్మీర్ సరిహద్దు వద్ద పూంచ్ సెక్టార్లో భారత జవాన్లను హతమార్చింది ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులని మంగళవారం లోక్సభలో ఆంటోనీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి, ప్రత్యేకించి బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తమవడం తెలిసిందే. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇచ్చారని ఆరోపిస్తూ రెండు రోజులుగా పార్లమెంటును అవి స్తంభింపచేశాయి. దాంతో తొలి ప్రకటనను సవరిస్తూ గురువారం పార్లమెంటులో ఆయన తాజాగా ప్రకటన చేశారు. తొలు త చేసిన ప్రకటన అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చేసిందని, అనంతరం సైనికదళాధిపతి ఘటనా ప్రాంతానికెళ్లి వివరాలు సేకరించారన్నారు. ప్రభావముంటుంది... ‘‘నియంత్రణ రేఖకు అవతల పాకిస్థాన్ వైపు నుంచి.. పాక్ సైన్యం మద్దతు, సహాయం, తోడ్పాటు లేకుండా.. అప్పుడప్పుడూ పాక్ సైన్యం నేరుగా పాత్ర పోషించకుండా ఏమీ జరగదని మనకందరకూ తెలుసు’’ అని ఆంటోనీ వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లను హత్యచేసిన దాడిలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని ఇప్పుడు స్పష్టమైంది’’ అని చెప్పారు. ఎలాంటి కవ్వింపూ లేకుండా జవాన్లపై జరిపిన కిరాతక దాడి భారతీయులందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘‘మా సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. ఉగ్రవాద వ్యవస్థలను, సంస్థలను, వాటి సదుపాయాలను నిర్మూలించటంలో పాకిస్థాన్ నిబద్ధదతో కూడిన చర్యలు చూపాలి. 2008 నవంబర్ నాటి ముంబై ఉగ్రవాద దాడికి బాధ్యులైన వారిని సత్వరమే చట్టం ముందు నిలబెట్టటానికి ప్రత్యక్ష చర్యలు చేపట్టాలి’’ అని పాకిస్థాన్ను డిమాండ్ చేశారు. ఆంటోనీ ప్రకటనను లోక్సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ వెంటనే స్వాగతించారు. రక్షణమంత్రి తన పొరపాటును అంగీకరించి, దానిని సరిదిద్దుకున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సుష్మా వ్యాఖ్యలను ఆంటోనీ ముకుళిత హస్తాలతో స్వాగతించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన మాత్రం ఆంటోనీ తాజా ప్రకటనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్తో చర్చలు జరపరాదని ఆ పార్టీ నేత అనంత్ గీతె పేర్కొన్నారు. రాజ్యసభలోనూ ఆంటోనీ ఇదే ప్రకటన చదవబోగా గందరగోళం రేగడంతో సభ వాయిదా పడింది. రక్షణమంత్రి సోమవారం రాజ్యసభలో మళ్లీ ఈ ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్శుక్లా చెప్పారు. భారత జవాన్ల హత్య ఉదంతం పూర్వాపరాలను సైనికాధిపతి జనరల్ బిక్రమ్సింగ్ ఆంటోనీకి వివరించారు. లోక్సభ సోమవారానికి వాయిదా: భారత జవాన్ల హత్య, తెలంగాణ తదితరాలపై తీవ్ర గందరగోళం తలెత్తటంతో లోక్సభను సోమవారం వరకూ వాయి దా వేశారు. ఉదయం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కొందరు ఆంధ్రప్రదేశ్ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీక ర్ మీరాకుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవటంతో ఆమె తొలుత మధ్యాహ్నం వరకూ సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఆంటోనీ ప్రకటన చేశారు. అనంతరం మళ్లీ గందరగోళం తలెత్తటంతో సభను 2 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనా కూడా కొద్దిసేపటికే డిప్యూటీ స్పీకర్ కరియాముండా సభను సోమవారానికి వాయిదా వేశారు. -
వీరుడా.. నీకు వందనం!
సాక్షి, ముంబై: పాకిస్థాన్ సైనికుల తూటాలకు బలైన అమరవీరుడు జవాన్ కుండలిక్ మానే (36)కు గురువారం కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని పింపల్గావ్ బద్రుక్ గ్రామంలో వేలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక, ప్రభుత్వ లాంఛనలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఓవైపు తీరని విషాదం మనసును తొలచి వేస్తున్నా.. మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడయ్యాడన్న అభిమానం అందరి కళ్లలోనూ కనిపించింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పింపల్గావ్ బద్రుక్ గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు, రాజకీయ నాయకులు, ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’, ‘అమర్ రహే.. అమర్ రహే..కుండలిక్ మానే అమర్ రహే’, ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ నినాదాలతో గ్రామ పరిసరాలు మార్మోగాయి. మానే కుటుంబీకులతోపాటు గ్రామప్రజల రోదనలు అక్కడి వారందరినీ కలచివేశాయి. ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మానే మృతికి సంతాప సూచకంగా స్థానిక దుకాణాలన్నీ మూతబడ్డాయి. కేబుల్ ప్రసారాలను కూడా నిలిపి వేసి ఆయనకు నివాళులు అర్పించామని పింపల్గావ్ వాసి ఒకరు తెలిపారు. అంత్యక్రియల ప్రదేశానికి వేలాది మంది రావడంతో పాఠశాల ఆవరణ జనసంద్రంగా మారింది. మానే త్యాగాన్ని వృథాగా పోనివ్వకూడదని, పాకిస్థాన్పై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని పింపల్గావ్ వాసులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‘ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు సహా గ్రామస్తులకు బుధవారం రాత్రి వరకు తెలియనివ్వలేదు. కేవలం గాయపడ్డాడని మాత్రమే చెప్పారు’ అని ఆయన వివరించారు. మానే అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు ఆర్.ఆర్.పాటిల్, హర్షవర్ధన్ పాటిల్, హసన్ ముష్రిఫ్.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గోపీనాథ్ ముండే వంటి ప్రముఖులు హాజరయ్యారు. జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం చేసిన దాడిలో మరాఠా రెజిమెంట్కు చెందిన కుండలిక్ మానేతోపాటు బీహార్కు చెందిన మరో నలుగురు మరణించిన విషయం విదితమే. మరణాంతరం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి పుణేకి బుధవారం రాత్రి ఎయిర్ఫోర్స్ విమానంలో తరలించారు. అనంతరం అక్కడి నుంచి వాహనం ద్వారా గురువారం ఉదయం కొల్హాపూర్, అనంతరం అక్కడి నుంచి పింపల్గావ్కు చేరుకుంది. 50 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మూడు గంటలు... మృతదేహం కొల్హాపూర్కు చేరాక అక్కడే కొంతసేపు ఉంచారు. మానేకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో పింపల్గావ్కు చేరడానికి ఆలస్యమయింది. కొల్హాపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింపల్గావ్ వెళ్లడానికి మూడుగంటలకుపైగా సమయం పట్టింది. రోడ్డుపైనే పలువురు ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో బద్రుక్ గ్రామానికి చేరుకునే సరికి చాలా సమయం పట్టింది. కోరిక తీరకుండానే... పాకిస్థాన్ సైన్యం దాడిలో మరణించిన కుండలిక్ మానే గ్రామంలోని పిల్లల కోసం బస్సును ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకు అవసరమైతే తన రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బును కూడా ఖర్చు చేస్తానని చెప్పేవాడు. బస్సును ప్రారంభించముందే ఆయన శత్రుదేశ తూటాలకు బలయ్యాడు. సుమారు రెండున్నర వేల జనాభ ఉండే పింపల్గావ్ నుంచి పది మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిలో ఒకరైన కుండలిక్ 18వ ఏటనే.. అంటే 1988లో మరాఠా రెజిమెంట్లో చేరాడు. ఆయనకు తల్లిదండ్రులతోపాటు భార్య రాజశ్రీ, పదేళ్ల కుమార్తె ఆర్తి, ఐదేళ్ల కుమారుడు అమోల్ ఉన్నారు. మానే 20 రోజుల క్రితం స్వగ్రామం నుంచి పూంచ్కు వెళ్లారు. గత నెలే పింపల్గావ్కు వచ్చి అందరితో గడిపారు. అదే తన చివరి పర్యటన అని ఆయన గ్రహించి ఉండకపోవచ్చు. -
ఢిల్లీ తరహాలో హైదరాబాద్!
మొయిలీకి ఐదుగురు సీమాంధ్ర మంత్రుల వినతి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటం సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క రాష్ట్రానికో అప్పగించకుండా జాతీయ రాజధాని ఢిల్లీ రాష్ట్రం తరహాలో ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా ప్రకటించాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు.. కొత్తగా ఏర్పడిన ఆంటోనీ కమిటీని కోరినట్లు తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంపై వ్యక్తమౌతున్న అభ్యంతరాలు, సూచనలను పరిశీలించేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సభ్యుడిగా నియమితుడైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐదుగురు కేంద్రమంత్రులు - పల్లంరాజు, జె.డి.శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు గురువారం ఢిల్లీలో కలిసి తమ వాదన వినిపించారు. ఆరు దశాబ్దాలపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో మహా నగరంగా అభివృద్ధి చెందిన రాజధానిపై శాశ్వతంగా హక్కు కోల్పోవటానికి కోస్తా, రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రాదేశిక పాలనా మండలిగా మార్చాలి హైద్రాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినా ఫలితం ఉండదన్న కేంద్రమంత్రులు రాష్ట్రా న్ని సమైక్యంగా కొనసాగించటానికే తాము ప్రాధాన్యతనిస్తామని.. విభజన అనివార్యమైతే హైదరాబాద్ను ఢిల్లీ తరహాలో ప్రత్యేక శాసనసభ, ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం ఉండేలా, శాంతి, భద్రతలు, పోలీసు వ్యవస్థ, పట్టణాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కొనసాగేలా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ వెలుపల కూడా విస్తరించి ఉన్న మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాదేశిక పరిపాలనా మండలిగా మార్చి రెండు రాష్ట్రాలకు రెండు కొత్త రాజధాని నగరాల నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూర్చాలని సీమాంధ్ర మంత్రులు ప్రతిపాదించినట్లు తెలిసింది. మిగతా సభ్యులనూ కలిసే యత్నం... శని,ఆదివారాల్లో ఆంటోనీ కమిటీ మిగతా సభ్యులు అహ్మద్పటేల్, దిగ్విజయ్సింగ్, ఆంటోనీలను కూడా కలిసేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి, జాతీయ రాజధాని ప్రాంతంగా భాసిల్లుతున్న ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్కు కూడా ఒక శాసనసభను ఏర్పాటు చేసి గ్రేటర్ హైద్రాబాద్లో స్థిరపడిన సీమాంధ్రులలో అభద్రతా భావాన్ని తొలగించవచ్చునన్నది వారి వాదనగా చెప్తున్నారు. ఆ తర్వాత దాదాపుగా కేంద్రం అధీనంలోనే ఉండే హైదరాబాద్ నగర రాష్ట్రం నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ పరిపాలనను సాగించే అవకాశం కల్పించవచ్చునని, లేదంటే రెండు రాష్ట్రాలూ కొత్త రాజధానులను నిర్మించుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించవచ్చునని సీమాంధ్ర మంత్రులు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఆపగలిగాం: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై యూపీఏ ముందుకు వెళ్లకుండా ప్రస్తుతానికి ఆపగలిగామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల ఆందోళనల వల్లే గురువారం కేబినెట్ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. అయితే విభజన విషయమై కాంగ్రెస్ పార్టీని ముందుకు వెళ్లకుండా తాము ఆపలేమని స్పష్టం చేశారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు ఢిల్లీలోని విజయ్చౌక్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మెజార్టీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని వెల్లడించడం వల్లే విభజనపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలు వాటి వైఖరిపై పునరాలోచించాలని కోరారు. విభజనతో తలెత్తే సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరిస్తామన్నారు. -
ఆ నలుగురు...!
సంపాదకీయం: దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి పూనుకునే ముందు ఎలా ప్రవర్తించాలో, ఆ పరిష్కార ప్రక్రియలో అందరి భాగస్వామ్యమూ తీసుకోనట్టయితే ఏమవుతుందో తల వాచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చినట్టుంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. కొంపలంటుకున్నాక బావి తవ్వడానికి ప్రయత్నించినట్టున్న ఈ కమిటీ ఏం చేస్తుంది, పరిస్థితిని ఎలా చల్లారుస్తుందన్న సంగతలా ఉంచితే... రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు ‘నలుగురి’ అవసరం పడిందని స్పష్టంగానే తెలుస్తోంది. గత పది రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదంటే కాంగ్రెస్కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాకు సిద్ధపడాల్సివచ్చింది. పార్లమెంటులో గళం ఎత్తాల్సివచ్చింది. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని వాదించేవారు సైతం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుబట్టక తప్పడంలేదు. తీసుకున్న నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనదనుకున్నా, తమ ప్రయోజనాలకు మరెంతగా ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నా... దాన్ని అమలుచేయడానికి పూనుకునేముందు ఒక పద్ధతిని పాటించాలని, ఆ ప్రక్రియలో అందరి సహాయసహకారాలూ తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు అనుకోలేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించగల వర్గాల అభిప్రాయాలేమిటో తెలుసుకోవడానికి లేదా వారి అపార్థాలనూ, అపోహలనూ పోగొట్టడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండుపై తమకు అలవాటైన కుట్రపూరిత మనస్తతత్వంతోనే వారు ఆలోచించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తున్నవారి మనోభావాలతో తమ స్వీయ ప్రయోజనాలను రంగరించి ఎవరూ అడగని ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకురావడం వెనకున్నది ఈ కుట్ర బుద్ధే. తెలంగాణ సమస్యపై భిన్న పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయని, అదేవిధంగా తామూ చెప్పామని అంటున్న కాంగ్రెస్ నేతల వాదన నయవంచన తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఊరుకోలేదు. అధికారంలో ఉన్నది గనుక ఆ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అసలు అధికారికంగా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందే తాము ఏం చేయబోతున్నారో వారు లీకులు ఇచ్చారు. తమ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీలో చర్చించకముందే, యూపీఏలో తమ భాగస్వామ్యపక్షాల వారితో మాట్లాడకముందే ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారని... ఆ రెండు సమావేశాలూ లాంఛనప్రాయమైన ముద్రలు వేయించుకోవడానికేనని పత్రికలు చదువుతున్నవారికి, చానెళ్లు చూస్తున్నవారికి అర్ధమైంది. ఇక్కడి నాయకులకు ఆ మాత్రం విలువైనా ఇవ్వలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకులైతే, అధికారంపై మమకారం లేనివారే అయితే వీరందరూ ఆ క్షణంలోనే పదవులనుంచి వైదొలగేవారు. అలా చేయలేకపోయారు సరిగదా... ఆంటోనీ కమిటీకి అలవిమాలిన ప్రాముఖ్యతనిస్తూ ఇప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయిందట. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకూ తదుపరి చర్యలు ఉండవట. ఆ కమిటీకి ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర పార్టీలవారూ అభిప్రాయాలు చెప్పవచ్చునట. ఇంతవరకూ వచ్చాక కూడా తమ కబుర్లతో ఇంకా జనాన్ని మభ్యపెట్టగలమని వారనుకుంటున్నారు. ఆంటోనీ కమిటీ మౌలికంగా కాంగ్రెస్ కమిటీ. ఆ కమిటీకి ‘హై పవర్’ అని విశేషణం తగిలించినంతమాత్రాన దానికి అధికార ప్రతిపత్తి రాదు. విభజనవల్ల సమస్యలున్నాయనుకునేవారు ప్రభుత్వంతో మాట్లాడాలని చూస్తారు. తమ మనోభావాలను అది పట్టించుకోవాలని ఆశిస్తారు. అది వినడం లేదనుకున్నప్పుడు దాని మెడలు వంచడానికి ప్రయత్నిస్తారు. అంతేతప్ప కాంగ్రెస్కు చెందిన కమిటీని కలవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఏముంటుంది? కలిసి ఏమి మాట్లాడతారు? కొంతవరకూ కాంగ్రెస్ పార్టీకి అది ఉపయోగపడవచ్చు. ఉద్యమాల పర్యవసానంగా పార్టీకి ఉత్పన్నమైన సంకటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దానికి వివరించడానికి ప్రయత్నించవచ్చు. లేదా రాయల తెలంగాణ వంటి తమ రహస్య అజెండాకు దీన్ని వేదికగా చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏర్పాటుచేసుకున్న కమిటీని లోకకల్యాణం కోసం ఆవిర్భవించిన సంస్థగా చిత్రించబోవడం నయవంచన. ఇంతకూ కమిటీలో ఉన్నవారికి విభజనానంతర పరిణామాలపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న భయాలపైగానీ, మొత్తంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైగానీ అవగాహన ఉందనడానికి దాఖలాలు లేవు. అంతటి అవగాహన, శక్తి వీరికుంటే సీడబ్ల్యూసీలోనో, కోర్ కమిటీలోనో విభజన ప్రక్రియకు సంబంధించి మెరుగైన విధానం రూపుదిద్దుకునేది. ముఖ్యంగా గత నాలుగేళ్లలోనూ అన్ని వర్గాల వారితోనూ, అన్ని స్థాయిల్లోనూ చర్చించే ప్రజాస్వామిక ప్రక్రియ అమలయ్యేది. ఇదేమీ లేదు సరిగదా... రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తూ అసలే ఆగ్రహంతో రగులుతున్న రాష్ట్రాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక అస్తిత్వమూ కలిగిన రాయలసీమ ప్రాంత ప్రజలను ఇలాంటి ప్రతిపాదనలతో తాము అపహాస్యం చేస్తున్నామని, వారి మనోభావాలను గాయపరుస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరిచి పోతున్నారు. అడిగింది తెలంగాణ అయితే, పనిలో పనిగా రాయలసీమను విడదీసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందులో భాగంగానే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పోకడలు తెలిసినవారందరూ సరిగానే అంచనా వేస్తున్నారు. ఇలాంటి చేష్టలవల్ల కాంగ్రెస్ మరింత అధోగతిపాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. కనీసం అవసానదశలోనైనా ఈ సంగతిని గ్రహించడం ఆ పార్టీ పెద్దల ఆరోగ్యానికి మంచిది. -
జవాన్లపై దాడి పాక్దే బాధ్యత: ఆంటోనీ
న్యూఢిల్లీ : పాకిస్తాన్ చొరబాటుయత్నంపై రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోనీ గురువారం లోక్సభలో వివరణ ఇచ్చారు. మొన్న పాకిస్తాన్ హస్తం లేదన్న ఆయన.... విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మాట మార్చారు. భారతీయ జవాన్లపై దాడికి పాకిస్తాన్దే పూర్తి బాధ్యత అని ఆంటోని మరో ప్రకటన చేశారు. పాక్ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. జవాన్లపై దాడి ఘటనలో పాక్ బలగాలు పాల్గొన్నాయన్నారు. పూంచ్ సెక్టార్లో ఆర్మీ చీఫ్ పర్యటించారని ఆయన తెలిపారు. మొన్న తనవద్ద ఉన్న సమాచారంతో ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఆర్మీ చీఫ్ బిక్రమ్సింగ్ .... ఆంటోనీతో భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్ల మరణంపై రక్షణ మంత్రి ఆంటోని ప్రకటన చేయాలని విపక్షాలు బుధవారం పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోని పార్లమెంట్లో వివరించారు. దాంతో మంత్రి ప్రకటనతో విపక్షాలు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రక్షణ మంత్రి ఆంటోని పాకిస్థాన్కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆందోళనబాట పట్టాయి. ఆంటోనీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో ఈ ఘటనపై ఆంటోని తాజా ప్రకటన చేశారు. -
పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్సభలో ఆ పార్టీ నేత యశ్వంత్సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు. లోక్సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నారు. పరిహారం వద్దు: జవాను భార్య పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు. -
సైనికుల కాల్చివేతపై ప్రకటనను సమర్థించుకున్న ఆంటోనీ
ఐదుగురు భారత సైనికులను పాకిస్థాన్ మూకలు కాల్చి చంపిన సంఘటనపై పార్లమెంటులో తాను చేసిన ప్రకటనను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమర్థించుకున్నారు. తనకు మరిన్ని వివరాలు అందిన వెంటనే వాటిని పార్లమెంటుకు సమర్పిస్తానన్నారు. ఈ సంఘటనపై ఆంటోనీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్థానీ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారనడం వాళ్లు తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లేనని తీవ్రంగా విమర్శించాయి. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. అయితే, 'రక్షణ మంత్రిగా ఏవైనా ప్రకటనలు చేసేటప్పుడు నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను నిన్న ఓ ప్రకటన చేశాను. ఈరోజు ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. నాకు మరిన్ని వివరాలు తెలియగానే వాటిని మీ ముందుంచుతాను' అని ఆయన రాజ్యసభలో బుధవారం తెలిపారు. పార్లమెంటుతో పాటు భారతదేశం మొత్తం జాతి భద్రత, సమగ్రత విషయంలో ఒక్కటిగానే ఉన్నట్లు ఆంటోనీ చెప్పారు. అయితే, ఆంటోనీ ఇచ్చిన సమాధానం బుధవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. -
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. తొలి రెండు రోజులు సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు సభను హోరెత్తించి వాయిదా వేయిస్తే మూడోరోజు బుదవారం నాడు పాకిస్థాన్ సైనికులు జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లోకి చొచ్చుకొచ్చి మరీ భారత సైనికులను హతమార్చిన వైనంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఉభయ సభలను అట్టుడికించింది. దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే పాకిస్థాన్ చెలరేగిపోతోందని, పదే పదే మన దేశం మీద దాడులకు పాల్పడుతూ జవాన్ల విలువైన ప్రాణాలను హరిస్తోందని బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజీనామా చేసి తీరాల్సిందేనని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోనీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. విపక్షాల గలభాతో లోక్సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. -
పాక్కు బుద్ధి చెప్పండి: ఆంటోనీ
విపక్షాల డిమాండ్.. ఉభయ సభలను కుదిపేసిన పాక్ దుశ్చర్య సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారని రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన మండిపడిన ప్రతిపక్షాలు.. పాక్కు తప్పించుకునే మార్గం చూపుతున్నారని ధ్వజం పాక్ కాలుదువ్వుతున్నా ప్రభుత్వం స్పందించదేమని నిలదీత సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన సోనియా గాంధీ న్యూఢిల్లీ: భారత సైనికులను పాక్ దళాలు కాల్చి చంపిన ఘటన మంగళవారం పార్లమెంటులోని ఉభయసభలను కుదిపేసింది. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ‘‘పాకిస్థాన్ పదే పదే కాలు దువ్వుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’’ అని బీజేపీ, లెఫ్ట్, ఎస్పీ, జేడీయూ, శివసేన, బీఎస్పీ ఉభయసభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారు: ఆంటోనీ లోక్సభ, రాజ్యసభల్లో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తూ.. పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి ఈ దాడి చేశారని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు పార్టీలకతీతంగా మండిపడ్డాయి. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్ నేతృత్వంలోనే దాడి జరిగిందని స్వయంగా రక్షణ శాఖ ప్రతినిధి ఆచార్య ప్రకటిస్తే.. పాకిస్థాన్ సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులే దాడి చేశారని చెప్పడమేంటంటూ నిలదీశాయి. పాకిస్థాన్ తప్పించుకోవడానికి ఆంటోనీ మార్గం చూపుతున్నారని విమర్శించాయి. బీజేపీ నాయకులు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. పాకిస్థాన్ విషయంలో అసలు కఠినంగా వ్యవహరించే ఉద్దేశం కాంగ్రెస్కు ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు అరుణ్జైట్లీ మాట్లాడుతూ.. దాడి చేసేసి, అది ప్రభుత్వేతర శక్తుల కుట్రేనని తప్పించుకుంటున్న పాకిస్థాన్కు ఆంటోనీ వ్యాఖ్యలు మద్దతిస్తున్నట్లుందని విమర్శించారు. వామపక్షాలు, అన్నా డీఎంకే, బీఎస్పీ సహా పలువురు నేతలు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘నియంత్రణ రేఖ వెంబడి భారత ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకునేందుకు మన సైన్యం పూర్తిస్థాయిలో సమాయత్తమై ఉంది’’ అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయితే తనకు అందిన సమాచారం వరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసని, పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదని పేర్కొన్నారు. పాక్ చర్యలను బట్టే భారత స్పందన ఆధారపడి ఉంటుందన్నారు. దౌత్య మార్గంలో పాక్కు భారత నిరసన తెలిపామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనలు రెట్టింపయ్యాయని చెప్పారు. గతేడాది జనవరి-ఆగస్టు మధ్య 57 ఉల్లంఘనలు ఉంటే.. ఈ ఏడాది అవి 80 శాతం పెరిగాయన్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ మాట్లాడుతూ.. పాక్, చైనా చొరబాట్లను అరికట్టే విషయంలో భారత వైఖరిపై అనుమానం వ్యక్తంచేశారు. పాక్నుగాని, చైనానుగాని ఎట్టిపరిస్థితుల్లో నమ్మరాదన్నారు. సోనియా విచారం.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి మోసకారి దాడులకు భారత్ తలవంచరాదని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీతోపాటు యావత్ దేశమంతా తోడుగా ఉంటుందని అన్నారు. పాక్ విషయంలో ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరినట్లు పార్టీ ప్రతినిధి భక్త చరణ్ దాస్ తెలిపారు. మరోవైపు ‘‘సైనికులపై దాడి జరిగిన విషయం ఉదయాన్నే తెలిసిం ది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇలాంటి సంఘటనలు రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు పునరావృతం కావడానికి దోహదం చేయవు’’ అని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పాక్ చర్యలను బట్టే భారత్ స్పందన: ఏకే ఆంటోనీ
కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేతపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్ చర్యలను బట్టే భారతదేశం స్పందన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పాకిస్థానీ సైన్యం యూనిఫాం ధరించిన వ్యక్తులతో కలిసి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. లోక్సభ సమావేశం కాగానే సమాజ్వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
నిర్ణయం మారదు! ఊపందుకున్నవిభజన!
సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో మార్పు చేసే అవకాశమే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. విభజనతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని.. ఇందుకు పార్టీ అధిష్టానానికి సహకరించాలని తనను కలిసిన ఆ ప్రాంతాల కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు సమాచారం. విభజన నిర్ణయంపై సీమాంధ్రలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపధ్యంలో దిగ్విజయ్ను కలిసిన సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు.. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరినపుడు ఆయన పై విధంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి కీలకమైన, విధానపరమైన అంశాలను పరిశీలించేందుకు ‘కేబినెట్ నోట్’ను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రకటించింది. ఈ నోట్ను కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంటులో చర్చకు అవకాశం ఉంటుందని పేర్కొంది. మరోవైపు.. విభజనపై సీమాంధ్రలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ ప్రాంత నేతలతో చర్చలు జరిపేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆంటోనీ ఇప్పటికే నాయకులతో చర్చలు ప్రారంభించారని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మారే అవకాశం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులకు తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, అభ్యర్థనలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ.. వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని ఆయన మీడియాతో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను అనుసరిస్తామని.. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయానికి ఇరు ప్రాంతాల నేతల మధ్య రాజీ కుదురుస్తామని చెప్పారు. ‘టి-నోట్’ సిద్ధమవుతోంది... పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సోమవారం నాడు ఉభయసభల్లోనూ తెలంగాణ అంశంపై తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు సభా కార్యక్రమాలను స్తంభింపచేశారు. తెలంగాణ అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని, దీనిపై చర్చ చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి చిదంబరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన అంశంలో.. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం భారత రాజ్యాంగం ఒక ప్రక్రియను నిర్దేశిస్తోంది. దానితోపాటు కొత్త రాష్ట్రం ఏర్పాటుతో అనేక కీలక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని పేర్కొన్నారు. తెలంగాణపై కేబినెట్ నిర్ణయం కోసం కీలకమైన, విధానపరమైన అంశాలతో కేంద్ర హోంశాఖ సమగ్రమైన నోట్ (నివేదిక)ను రూపొందిస్తుందని చిదంబరం చెప్పారు. ఇందులో నదీ జలాల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాల్లో నివసించే వారందరికీ భద్రత, రక్షణ, పౌరులందరికీ ప్రాధమిక హక్కుల హామీ తదితర అంశాలు ఉంటాయన్నారు. అయితే.. చర్చ తర్వాత ఇందులో చేర్చే, లేదా చేర్చే అవకాశం గల అంశాలేమిటో ఆయన చెప్పలేదు. ఈ అంశాలపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. దీనిపై సభలో నిర్మాణాత్మక చర్చ జరిపే అవకాశం ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన సమయంలో ఇలాంటి చర్చను ఆహ్వానిస్తుందన్న చిదంబరం.. ఆ తగిన సమయం ఎప్పుడు అనేది కూడా చెప్పలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత నేతలతో చర్చలు జరిపేందుకు.. వారి అభిప్రాయాలను, ఆందోళలను తెలుసుకునేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీమాంధ్ర సభ్యులను శాంతపరచే బాధ్యతను ఆంటోనికి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్కు అధిష్టానం అప్పగించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ సోమవారం మీడియాకు తెలిపారు. తెలంగాణ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఎంపీలందరితోనూ ఆంటోని మాట్లాడారని.. వారిని శాంతపరచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందరి అభిప్రాయాలనూ కేంద్రానికి నివేదిస్తాం... ఆంటోని నేతృత్వంలోని కమిటీ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను వింటుందని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని దిగ్విజయ్సంగ్ చెప్పారు. సోమవారం రాత్రి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు దిగ్విజయ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంత నేతలు సంయమనం పాటించాలని.. అన్ని ప్రాంతాల వారితో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెసుకునేందుకు ఇప్పటికే పార్టీ అంతర్గంతంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ‘‘కమిటీ ఇరు ప్రాంతాల అభ్యంతరాలను వింటుంది. ఎవరి అభిప్రాయాలనైనా కమిటీ ముందు చెప్పుకోవచ్చు. అందరి వాదనలు వింటాం. ఇక్కడ వ్యక్తమైన అభిప్రాయలన్నింటీకీ కేంద్రానికి నివేదిస్తాం’’ అని వివరించారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలపై మాట్లాడుతూ.. ‘‘ఏపీఎన్జీఓల ఎలాంటి వివక్ష ఉండదు. విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్లో సెటిలైన వారికి సమాన అవకాశం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో ఆందోళనకు దిగటం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. బిల్లు సమయానికి రాజీ కుదుర్చుతాం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగ పరంగా అన్ని విధివిధానాలను అనుసరిస్తాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మొదట కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. రాష్ట్ర విభజనపై తీర్మానం చేయాలని రాష్ట్ర అసెంబ్లీకి సూచిస్తుంది. అసెంబ్లీ తీర్మానం అందాక కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ బృందం అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఓ వైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా కొనసాగుతూనే మరో పక్క సమాంతరంగా అందరి అభిప్రాయాలను సేకరిస్తుంది. బిల్లు తయారీ సమయానికి అన్ని ప్రాంతాల వారిని ఒప్పించి రాజీ కుదుర్చుతాం’’ అని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల్లో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి సూచించానని.. విగ్రహాల కూల్చివేతకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యహరించాలని కోరానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిదంబరం ప్రకటన పూర్తిపాఠమిదీ... ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినంతవరకూ.. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రక్రియ ఉంది. దానితో పాటు, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో అనేక కీలకాంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మంత్రివర్గ నిర్ణయం కోసం కేంద్ర హోంశాఖ ఈ కీలకాంశాలు, రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించిన అంశాలతో ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. ఇందులో నదీజలాల పంపిణీ, విద్యుదుత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాల ప్రజల భద్రత, ప్రజలందరి ప్రాధమిక హక్కులపై హామీ వంటి వాటితో పాటు ఇతర అంశాలు ఉంటాయి. వీటిపై కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై సమగ్ర చర్చ జరిపేందుకు ఈ సభకు అవకాశం లభిస్తుంది. తగిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్చను ఆహ్వానిస్తుంది’’. -
అభ్యంతరాలు తెలుసుకోనున్న హైలెవల్ కమిటీ
ఢిల్లీ: కాంగ్రెస్ హైలెవల్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రులు సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. బంద్లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టటం - దిష్టి బొమ్మల దగ్ధం - జవర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం ........ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయని వారిని ప్రజలు నిలదీస్తున్నారు. వారి ఇళ్లపై దాడులు కూడా చేస్తున్నారు. రాజీనామాలు చేయని వారు తమతమ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితి కేంద్రం దృష్టికి వెళ్లింది. దానికి తోడు ఈరోజు పార్లమెంటులో సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేశారు. దాంతో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రుల బృందం సీమాంధ్ర ప్రాంత నేతల భయాలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఇదిలా ఉండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని రాజ్యసభలో ఈరోజు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.