ceasefire
-
హమాస్పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది.పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
టెల్అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి. -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
Sakshi Cartoon: ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ
ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ -
అమల్లోకి కాల్పుల విరమణ
జెరూసలేం: అనూహ్యంగా కుదిరిన ఇజ్రాయె ల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ 60 రోజులపాటు అమల్లో ఉంటుంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యం ఈ కాలంలో అక్కడి నుంచి వెనక్కి మళ్లుతుంది. ఆయా ప్రాంతాలను లెబనాన్ సైతం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఒప్పందం ప్రకారం.. ఆక్ర మణకాలంలో ఆయా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన హెజ్బొల్లా స్థావరా లను తిరిగి నిర్మించకూడదు. 14 నెలలకాలంగా సరిహద్దు వెంట యుద్ధం కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల స్థానికులు మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చి ధ్వంసమైన తమ ఇళ్లు, దుకాణాలను నిర్మించుకోవచ్చు. ‘‘ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీలతో మాట్లాడా. తా త్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండిపోవాలని ఆశిస్తున్నా’’ అని శ్వేతసౌధం నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యా నించారు. గాజా స్ట్రిప్లోని హమాస్కు హెజ్ బొల్లా నుంచి లభిస్తున్న ఆయుధ, నైతిక మద్ద తును అడ్డుకునేందుకే ఇజ్రాయెల్ ఈ కా ల్పుల విరమణకు అంగీకారం తెలిపిందని అంతర్జాతీయ మీడియా లో వార్తలొచ్చాయి. అయితే హెజ్బొల్లాతో పోరులో నిండుకున్న ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకునేందుకు ఈ కాల్పుల విరమణ కాలాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటోందని తెలుస్తోంది. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్ను బహిష్కరించాలని ఖతార్ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
‘విరమణకు నస్రల్లా అంగీకారం’
బీరూట్: బీరూట్పై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు ముందు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ అన్నారు. హత్యకు ముందే ఇజ్రాయెల్తో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం గురించి నస్రల్లా అమెరికా, ఫ్రెంచ్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ బీరూట్పై వైమానిక దాడుల చేసినట్లు సమయంలో నస్రల్లా దక్షిణ శివారు ప్రాంతం దహియేలోని ఒక బంకర్లో ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు లెబనాన్ నుంచి పారిపోవాలని నస్రల్లాను హెచ్చరించినట్లు బుధవారం రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ వార్నింగ్ వేళ.. ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్ -
నెతన్యాహు తగినంత కృషి చేయటం లేదు: బైడెన్
న్యూయార్క్: ఆరుగరు బంధీలను మిలిటెంట్ సంస్థ హమాస్ హత్య చేయటంపై ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం నెతన్యాహు వ్యవహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.చదవండి: గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
Israel Hamas War: కాల్పుల విరమణపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూపు చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్, ఈజిప్టులకు చెందిన దూతలు ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్ గ్రూపు ప్రతినిధులతో జరుపుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాల్పుల విరమణ డీల్లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు గాజాకు మానవతాసాయాన్ని భారీగా పెంచేందుకు అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ కల్పించడం అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పి తమ వద్ద ఉన్న బంధీలను విడుదల చేయాలంటే హమాస్ భారీ డిమాండ్లు ముందు పెడుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు పూర్తిగా ఆపాలి, ఇజ్రాయెల్ సేనలు గాజా నుంచి వెళ్లిపోవాలి, ఇళ్లు వదిలి పోయిన గాజా వాసులు తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితులు కల్పించాలి లాంటి డిమాండ్లు పరిష్కరించి యుద్ధానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని హమాస్ కోరుతోంది. అయితే వీటన్నింటికి ముందు కాల్పుల విరమణ అనేది తప్పనిసరని పేర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ స్పందిస్తూ తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ పాటించి గాజా వాసులకు మరింత మానవతాసాయం అందించేందుకు మాత్రమే ఒప్పుకుంటామని, హమాస్ అంతమయ్యేదాకా యుద్ధం ఆపేది లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్, హమాస్లు తక్షణం కాల్పుల విరమించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం. ఇదీ చదవండి.. అమెరికా అధ్యక్ష పోరులో మళ్లీ ఆ ఇద్దరే..! -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్కాట్ చేయటం గమనార్హం. -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
గాజాపై మళ్లీ విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
టెల్ అవీవ్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. తాత్కాలిక కాల్పుల విరమణ శుక్రవారం ఉదయం ముగియడంతో గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని పునప్రారంభించింది. కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందాన్ని ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హమాస్ వర్గం ప్రకటించలేదు. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందే గాజా నుంచి ప్రయోగించిన రాకెట్ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. అటు.. హమాస్ అనుబంధ మీడియా కూడా గాజా ఉత్తర ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు వస్తున్నట్లు నివేదించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు మొదట దాడి చేశారు. ఆ తర్వాత ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో గాజాపై విరుచుకుపడింది. ఉత్తర గాజాను ఖాలీ చేయించింది. హమాస్ అంతమే ధ్యేయంగా కాల్పులు జరిపింది. అయితే.. అమెరికా సహా ప్రపంచ దేశాల విన్నపం మేరకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇజ్రాయెల్, హమాస్ ఇరుపక్షాలు బందీలను వదిలిపెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ గురువారం ఉదయం నాటికే నాలుగు రోజుల కాల్పుల విరమణ పూర్తైంది. బందీలంతా విడుదల కాకపోవడంతో కాల్పుల విరమణను మరొక్క రోజు పొడిగించారు. శుక్రవారం ఉదయానికి ఆ గడువు కూడా పూర్తవడంతో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోని రామ్గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
టీజర్పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్కు అర్థం తెలుసా?
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిని 'సలార్' టీజర్ విడుదలైన సమయం నుంచి యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. 'సింహం, చిరుత, పులి, ఏనుగు, చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో... అంటూ టీనూ ఆనంద్ డైలాగ్తో టీజర్ పీక్స్కు చేరుకుంటుంది. దీంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. (ఇదీ చదవండి:సలార్ టీజర్తో తేలిపోయింది.. ఇది నిజమేనని) టీజర్లో ప్రభాస్ కటౌట్ క్లియర్గా చూపించకపోవడంతో పాటు డార్లింగ్కు ఎలాంటి డైలాగ్స్ లేకపోవడంతో కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇది టీజర్నా లేదా గ్లింప్స్ నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసినా ప్రభాస్ ఫేస్ చూపించకపోవడంతో వారు కొంత వరకు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: NKR21:కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ!) కేజీఎఫ్ చాప్టర్-1&2 అని ప్రశాంత్ రెండు భాగాలుగా తీసి విజయవంతమయ్యాడు. ఇప్పడు ప్రభాస్తో 'సలార్ పార్ట్-1: సీజ్ఫైర్తో ట్యాగ్ లైన్ ఇచ్చాడు. అంటే పార్ట్-2 ఉంటుందని ఫైనల్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ 'సీజ్ ఫైర్' అంటే ఏమిటని వెతుకుతున్నారు. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్రమైన కాల్పులు జరిగినప్పుడు కానీ అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో కానీ శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకునేందుకు ఉపయోగించే పేరే సీజ్ ఫైర్. మరి సినిమాలో ప్రభాస్ వేట ఎంత వైల్డ్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. -
యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్
సూడాన్లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది. -
మాట తప్పిన రష్యా.. ప్రకటన చేసిన గంటల్లోనే ఉక్రెయిన్పై దాడి
ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా బాంబుల మోత మోగించింది. తూర్పు ఉక్రెయిన్లోని క్రామాటోర్క్స్ నగరంపై రష్యా వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ సమయం 36 గంటల పాటు కొనసాగనుండగా.. నిబంధనలు ఉల్లంఘించిన రష్యా దళాలు క్రామాటోర్క్స్ నగరాన్ని రెండుస్లార్లు మిస్సైల్స్తో విరుచుపడినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో వైమానిక సైరన్లు వినపడినట్లు తెలిపారు. ఈ దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిందని అయితే అందులో ప్రజలు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా రష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతోసహా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
Ukraine Russia War: రష్యా కాల్పుల విరమణ
కీవ్: ఉక్రెయిన్లో ఈ వారాంతంలో 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. కాగా, ఉక్రెయిన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. కానీ, చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెన్స్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్లోని పలు కీలక ప్రాంతాలను రష్యా బలప్రయోగంతో ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. డొనెట్స్క్, లుహాన్స్క్, జపొరిఝాజియా, ఖేర్చన్లలో రష్యా సైన్యం పాగా వేసింది. -
Russia-Ukraine War: కీవ్ పరిసరాల్లో భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు. నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా వెనక్కు తగ్గలేదు ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వ్యూహాత్మక తప్పిదం ఉక్రెయిన్పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్హౌస్ ప్రతినిధి కేట్బీడింగ్ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు. రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్వేర్ను సకాలంలో అందించాలని లావ్రోవ్ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది. -
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్ఈ)లతో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ వీడి భారత్కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన) -
కాల్పుల విరమణ.. మా బలహీనత కాదు: పాక్
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 25న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరి బలంగా, మరొకరి బలహీనతగా చూడరాదని పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. నరవణే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ 2021 ఫిబ్రవరి 25న నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట కాల్పుల విరమణను పాటించేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే గురువారం ఢిల్లీలో ఓ సెమినార్లో మాట్లాడుతూ.. తాము(భారత సైన్యం) బలమైన స్థానంలో ఉండి చర్చలు జరపడం వల్లే పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. చదవండి: ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు -
Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి. శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
ప్రియాంక గాంధీ అరెస్ట్!
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్(యూపీ)లోని సోన్భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం ఘోరావల్ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె రోడ్డుపైనే కూర్చోవడంతో పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక తొలుత వారణాసిలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆమె ఘోరావల్కు వెళ్తుండగా, వారణాసి–మీర్జాపూర్ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై కూర్చుని నిరసన తెలపడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. శుక్రవారం సాయంత్రానికి ఆమె ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. బాధితులను కలవకుండా వెనక్కు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్న ప్రియాంక, అతిథి గృహం నుంచి తాను తిరిగి వెళ్లేందుకు సమర్పించాల్సిన వ్యక్తిగత బాండును ఇచ్చేందుకు నిరాకరించారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాకా ఆమె అక్కడే ఉన్నారు. ప్రియాంక వద్దే ఉన్న యూపీ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అజయ్ మాట్లాడుతూ ఘోరావల్కు వెళ్లేందుకే ప్రియాంక నిశ్చయించుకున్నారనీ, అలా కుదరని పక్షంలో జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఉభా గ్రామంలో గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న 36 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోడానికి ఆ గ్రామ పెద్ద యజ్ఞాదత్ బుధవారం ప్రయత్నించగా, గిరిజనులకు, యజ్ఞాదత్ మనుషులకు మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. ఈ ఘర్షణలో యజ్ఞా దత్ మనుషులు కాల్పులు జరపగా 10 మంది గిరిజనులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, నలుగురు పోలీసు సిబ్బంది సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామనీ, ప్రధాన నిందితుడు యజ్ఞా దత్సహా 29 మందిని అరెస్టు చేశామని సీఎం చెప్పారు. అరెస్ట్ అక్రమం: రాహుల్ రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘ఉత్తరప్రదేశ్లో ప్రియాంకను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారాన్ని బీజేపీ నిరంకుశ ధోరణిలో ఉపయోగిస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న అభద్రతా భావానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై స్పదిస్తూ, ప్రజాస్వామ్యాన్ని యూపీ ప్రభుత్వం నియంతృత్వంగా మార్చకూడదనీ, ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
భారత్, పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దుల్లో ఎప్పుడూ భీకర వాతావరణమే దర్శనమిస్తుంది. గతంలో పలుమార్లు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని మంగళవారం ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్ ద్వారా జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరుదేశాల అధికారులు కలసి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్ష నిర్వహించినట్టు భారత ఆర్మీ పేర్కొంది. సరిహద్దుల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హాట్లైన్ ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పాక్ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. -
కాల్పుల విరమణ కలిసొచ్చేనా..?
సాక్షి, శ్రీనగర్ : పవిత్ర రంజాన్ మాసంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేసిన భద్రతా దళాలు కేంద్రం సూచనతో రంజాన్ అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తాయని భావిస్తున్నారు. రంజాన్ మాసంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టవద్దని మే 16న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలను కోరిన విషయం తెలిసిందే. శాంతిని కాంక్షించే ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదినం జరుపుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే తమపై దాడులు జరిగినా..అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సందర్భంలో భద్రతా దళాలు దీటుగా స్పందిస్తాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.కాల్పుల విరమణ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు పెరిగాయని అయితే భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని సమాచారం. గత తొమ్మిదిరోజులుగా వరుసగా జరుగుతున్న కాల్పుల హోరు ఇటీవల గణనీయంగా తగ్గినట్టు భద్రతా దళాలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నాయి. కేంద్రం చేపట్టిన చర్యలకు జమ్మూ కశ్మీర్లో సానుకూల స్పందన వస్తోందని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. మరోవైపు కేంద్ర నిర్ణయంతో జమ్ము కశ్మీర్లో ప్రతిఒక్కరిపై సానుకూల ప్రభావం ఉంటుందని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అలజడులు ఆగుతాయ్..
సాక్షి, శ్రీనగర్ : రంజాన్ సందర్భంగా జమ్ము కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సానుకూల ఫలితాలు ఇస్తుందని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ నిర్ణయం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న శక్తులు సహా అన్ని వర్గాలపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాది జూన్లో ప్రారంభంకానున్న అమర్నాథ్ యాత్ర శాంతియుతంగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు నెలలపాటు సాగే అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. యాత్ర ఆసాంతం సజావుగా సాగుతుందని భావిస్తున్నామన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా కేంద్రం తీసుకున్న చొరవతో అమర్నాథ్ యాత్ర సైతం ప్రశాంతంగా ముగుస్తుందని అన్నారు. రంజాన్ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా హింసను విడనాడి కాల్పుల విరమణను పాటించాలని కోరారు. కాల్పుల విరమణను లష్కరే తోయిబా తోసిపుచ్చడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ లష్కరే నిర్ణయం ఎలాగున్నా తాము సరైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రంజాన్ నెలలో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్లో ఎలాంటి ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవని మే 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్పై రాజ్కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్కుమార్ను బయటకు తీసుకెళ్లారు. -
పాక్ సైన్యం పైశాచికం.. చంపాక ముక్కలుగా నరికారు!
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో నలుగురు భారత సైన్య సిబ్బందిని పాక్ సైన్యం బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని చంపాక చేసిన పైశాచిక చేష్టల గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బయటపడ్డ మరో జవాన్ అందించిన వివరాల ప్రకారం వర్ణించలేని రీతిలో వారిని పాక్ ఆర్మీ హింసించిందంట. నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టరు వద్ద నలుగురు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతలో ఊహించని రీతిలో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) వారివైపు దూసుకొచ్చింది. వారి వెంట కొందరు ఉగ్రవాదులు కూడా ఉన్నారంట. సుమారు 400 మీటర్ల సరిహద్దు దాటేసిన పాక్ సైన్యం వారిని బంధీలుగా చేసుకుంది. ఆపై చిత్ర హింసలకు గురి చేసి హతమార్చింది. ఇక వారిని చంపాక దాష్టీకానికి పాల్పడింది. వారి మృతదేహాలను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా వీరు వచ్చారని భారత సైన్యం ప్రకటించింది. మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్ (32), లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్ (34), లాన్స్ నాయక్ కులదీప్ సింగ్ (30), సిపాయి పర్ గత్ సింగ్ (30)లు పాక్ టీమ్ దుర్మార్గానికి బలయ్యారు. మరో జవాను తీవ్ర గాయాలతో తప్పించుకోగా, అతనికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన తరువాత పాక్ సైనిక పోస్టులపై భారత్ భారీ ఎత్తున ప్రతిదాడులకు దిగింది. అంబదాస్ మహారాష్ట్రలోని భందారాకు చెందినవారు కాగా.. గుర్మైల్ కుటుంబం పంజాబ్లోని అమృత్సర్లో, పర్గత్ కుటుంబం హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఉంటోంది. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం మెహబూబా ముఫ్తీ రాజౌరీ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాక్ కాల్పులు జరపడం గమనార్హం. నా వార్త నిజం కాదు.. ఆర్మీ ప్రకటన... ‘మేజర్ అంబదాస్, లాన్స్నాయక్ గుర్మైల్, సిపాయ్ పర్గత్లు అసమాన ధైర్యం, నిజాయితీలున్న సైనికులు. విధి నిర్వహణలో వారి అంకితభావానికి, ప్రాణత్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వారిని ముక్కలుగా నరికారన్న జవాన్ ప్రకటనను ఆర్మీ ఖండించింది. శరీరంపై బుల్లెట్ల గాయాలు మాత్రమే ఉన్నాయని.. నరికారన్న వార్తలో వాస్తవం లేదని అధికారులు చెబుతుండటం విశేషం. -
సరిహద్దుల్లో పాక్ దాష్టీకం!
విచక్షణారహితంగా కాల్పులు.. ఒక మహిళ మృతి పూంచ్: జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ దాష్టీకం పెరిగిపోతోంది. పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖకు సమీపంలో పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందారు. మృతురాలిని రుఖియా బీగా గుర్తించారు. పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో ఉదయం 5 గంటల సమయంలో భారీ ఎత్తున కాల్పులకు తెగబడిందని, దీంతో భారత బలగాలు దీటు బదులిచ్చాయని, కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు కుప్వారా జిల్లాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. దీంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టాయి. -
ప్రతీకార కాల్పులు మా హక్కు
పాక్కు స్పష్టం చేసిన భారత డీజీఎంవో న్యూఢిల్లీ/శ్రీనగర్: పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అందుకు ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని భారత్ పాక్కు గట్టి హెచ్చరికలు పంపింది. అదే సమయంలో నియంత్రణ రేఖ వద్ద శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందంది. సోమవారం సరిహద్దులో కాల్పులు జరిగిన అనంతరం పాకిస్తాన్ మిలిటరీ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) మేజర్ సాహిర్ షంషద్ మీర్జా భారత డీజీఎంవో ఏకే భట్కు ఫోన్ చేశారు. భారత దళాలు పాక్ సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నాయని మీర్జా అనడంతో అన్ని సందర్భాల్లోనూ పాక్ సైనికులే కాల్పులతో రెచ్చగొట్టారని భట్ చెప్పారు. పాక్ కాల్పుల్లో జవాన్, బాలిక మృతి జమ్మూ కశ్మీర్లోని పూంచ్, రాజౌరీ, బారా ముల్లా జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఓ భారత జవాన్, తొమ్మిదేళ్ల బాలిక మరణించారు. భారత దళాలూ పాక్కు దీటుగా బదులిచ్చాయి. పాక్ సైనికులు వేసిన మోర్టార్ బాంబులు నాయక్ అహ్మద్ అనే సైనికుడి బంకర్పై పడటంతో ఆయన మరణించారు. -
ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల వ్యవహారం భారత్-పాకిస్తాన్ల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎల్వోసీని ఆనుకుని ఉన్న గ్రామాలపై భారత బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హైకమిషనర్కు పాక్ విదేశాంగ శాఖ సోమవారం సమన్లు జారీచేసింది. తక్షణమే కాల్పులు ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ‘జూన్ 10, 12 తేదీల్లో ఎల్వోసీలోని సచిరికోట్, హాట్స్పైరింగ్ సెక్టార్లపైకి భారత బలగాలు జరిపిన కాల్పులు ముగ్గురు పౌరులు చనిపోయారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పదేపదే ఉల్లంఘిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండియన్ డిప్యూటీ కమిషనర్ జేపీ సింగ్కు సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్ సమన్లు జారీచేశారు’ అని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైన్యం కూడా పౌరులు చనిపోయిన విషయాన్ని నిర్ధారించిందని, భారత్ చర్యను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!
-
పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్వోసీ మీదుగా ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. కృష్ణగాటి సెక్టార్లో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. పాక్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు, ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారని సైనిక వర్గాలు తెలిపాయి. ఒక జవానుకు గాయాలయ్యాయి. వెంటనే ఈ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చిందని, కానీ, పాక్ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్ కమాండ్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. కశ్మీర్లో అలజడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. -
మరో జవాను అమరుడయ్యారు
శ్రీనగర్: సరిహద్దులో తరచూ నియంత్రణ రేఖా(ఎల్వోసీ) ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరపుతున్న పాక్ రేంజర్ల దాడుల్లో శనివారం మరో బీఎస్ఎఫ్ జవాను నితిన్ సుభాష్(28) అమరుడయ్యారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన నితిన్ సుభాష్ 2008లో బీఎస్ఎఫ్ లో చేరారు. సుభాష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, శుక్రవారం రాత్రి నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన మిలిటెంట్లు ఓ బీఎస్ఎఫ్ జవాను చంపి శరీరాన్ని ముక్కముక్కలుగా నరికిన విషయం తెలిసిందే. -
పాక్ మళ్లీ కాల్పులు
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట జరిపిన కాల్పుల్లో యూపీకి చెందిన జవాను సుధీశ్ కుమార్(24) ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లాలోని తార్కుండీ సరిహద్దు ప్రాం తంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని సీనియర్ సైన్యాధికారి వెల్లడిం చారు. ఆదివారం ఉదయం కూడా నౌశెరా సెక్టార్ వెంట భారత పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణ శాఖ అధికారి తెలిపారు. ఈ దాడులను భారత దళాలు తిప్పికొట్టాయని.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడుల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట పాక్ 25 సార్లకు పైగా కవ్వింపు చర్యలకు పాల్పడిందని సీనియర్ ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూంచ్ జిల్లాలో పాక్ జరిపిన దాడుల్లో ఐదుగురు పౌరులు, నలుగురు జవా న్లు గాయపడ్డారు. అయితే భారత భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది పాక్ జవాన్లు గాయపడినట్లు ఆయన తెలిపారు. గత నెలరోజుల వ్యవధిలో పాక్ పలుమార్లు కాల్పుల మోత మోగించింది. అక్టోబర్ 8న పూంచ్ జిల్లాలోనే మెంథార్ కృష్ణగాటీ సెక్టార్ గుండా ఉన్న భారత ఆర్మీ చెక్పోస్టుపై పాక్ జరిపిన కాల్పుల్లో భారత జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబరు 5న రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఎల్వోసీ వద్ద భారత చెక్పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో మూడుసార్లు దాడి చేశాయి. అక్టోబరు 4న రాజౌరీ జిల్లాలోని నౌశెరా సెక్టార్లోని మక్రి, కల్షియన్, జాన్గర్, జమ్మూలోని పల్లన్వాలా సెక్టార్లోని పలన్వాలా, చన్నీ, దమను, ప్లాటన్, గిగ్రియాల్, పూంచ్లోని కృష్ణగాటీ, బాల్నోయిలో పాక్ దళాలు మోర్టార్ బాంబులతో దాడి చేశాయి. అక్టోబరు 3న పూంచ్లోని కేజీ సెక్టార్లోని మండీ, షాపూర్కె ర్నీ, సౌజియన్లలో పాక్ కాల్పులు జరిపింది. అక్టోబరు 2న జమ్మూలోని పల్లన్వాలా ప్రాంతాల్లో పలుమార్లు పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అక్టోబరు 1న జమ్మూలోని పల్లన్వాలా సెక్టార్లోనూ పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.సెప్టెంబరు 30న పాక్ దళాలు అఖ్నూర్ సెక్టార్లోని చప్రియాల్లో పాక్ కాల్పులకు తెగబడింది. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూకశ్మీర్: పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రమూక స్థావరాలపై భారత్ దళాలు దాడి చేసి 72 గంటలు అయిందో లేదో... పాక్ మళ్లీ తన తెంపరితనాన్ని చాటుకుంది. శనివారం మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ సెక్టార్పైకి ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం: కశ్మీర్లో కలకలం
-
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం: కశ్మీర్లో కలకలం
జమ్ము: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కశ్మీర్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. పూంఛ్ జిల్లాలో పాక్ బలగాల కాల్పులు, బుద్ధ అమర్ నాథ్ యాత్రికులపై గ్రెనేడ్ దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. ఢిల్లీలోని జరిగిన స్వాతంత్ర్యవేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూంఛ్ జిల్లా సరిహద్దులో ఆదివారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత జవాన్లే లక్ష్యంగా మిషిన్ గన్స్, మోర్టార్ రాకెట్లతో దాడి చేసిందింది. దీనిని తిప్పి కొట్టే క్రమంలో భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు కొనసాగుతున్నయని, ఎవరైనా గాయపడిందీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని భద్రతాబలగాల ప్రతినిధులు పేర్కొన్నారు. నాలుగు నెలల తర్వాత ఇరుదేశాల జవాన్ల మధ్య కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. పూంఛ్ జిల్లాలోనే ప్రఖ్యాత బుద్ధ అమర్ నాథ్ దేవాలయానికి వెళుతోన్న యాత్రికులపై ముగ్గురు ముష్కరులు గ్రేనేడ్లు విసిరారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో 11 మంది యాత్రికులు గాయపడ్డారు. వారందరినీ జమ్ములోని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాంబులు వరిసిన ముగ్గురు యువకుల్లో ఇద్దరిని జనం పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మరొకడు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. ఇటు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో కమిషనర్ అబ్దుల్ బాసిత్ పాక్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ కీ ఆజాదీ (కశ్మీర్ స్వాతంత్ర్యం) నేపథ్యంలో ఈ ఏటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే ఆయన కశ్మీర్ స్వాతంత్ర్యంపై మాట్లాడటం గమనార్హం. ఇదిలాఉంటే ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని సరిహద్దుల్లోని కీలక చెక్ పోస్టుల వద్ద పాక్ బలగాలు.. భారత బగాలకు మిఠాయిలు పంచిపెట్టాయి. -
పాక్ కాల్పులు: భారత జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని గురెజ్ సెక్టార్లో భారత జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారని రక్షణశాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. భారత జవాన్లు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగారని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటలకు ఈ కాల్పులు కొనసాగాయని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. ఇటీవల కాలంలో భారత సరిహద్దుల్లోని భారత జవాన్ల శిబిరాలే లక్ష్యంగా పాక్ సైన్యం తరచుగా కాల్పులు దిగింది. ఈ కాల్పుల్లో పలువురు భారతీయ జవాన్లతోపాటు పౌరులు మరణించారు. అలాగే పశువు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. -
చర్చలైనా తీరు మారలే.. మళ్లీ బుల్లెట్ జారిన పాక్
జమ్మూ: పాకిస్థాన్ తీరు మారలేదు. అంతర్జాతీయ సరిహద్దు విభాగ రక్షణ దళానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజులపాటు ఓ చోట కూర్చుని చర్చించినా ఫలితం రాలేదు. బుధవారం మరోసారి ఆ దేశం సైనికులు హద్దు మీరారు. గంటల వ్యవధిలోనే పూంచ్ సెక్టార్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఆటోమేటిక్ ఆయుధాలతో, మోర్టార్ షెల్స్తో కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొని దాడులను తిప్పికొట్టింది. పూంచ్ సెక్టార్ తోపాటు కృష్ణఘాట్ సెక్టార్లో పాక్ సైన్యం దుశ్చర్యలకు దిగింది. ఈ నెలలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడటం 17వ సారి. -
తీరు మారని పాక్.. మళ్లీ కాల్పులు
జమ్మూకాశ్మీర్: పాకిస్ధాన్ తీరు ఏమాత్రం మారడం లేదు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని భారత్ పాక్ సరిహద్దు వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. స్వల్ప తీవ్రత గల మోర్టార్ షెల్లింగ్స్ వేశారు. దీంతో అక్కడే ఉన్న భారత సైన్యం వారికి గట్టిగా బదులిచ్చింది. ఇరు వర్గాల మధ్య కొన్నిగంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభమైన నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడటం ఇది నాలుగోసారి. -
కాల్పులు.. సూక్తులు..!
భారత్పై పాక్ తీరు ఇస్లామాబాద్/శ్రీనగర్: ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్.. మరోవైపు తమ దేశంపై నిందలు మోపే అలవాటును మానేయాలంటూ భారత్కు నీతులు చెప్తోంది. గత వారం రోజులుగా స్వల్ప విరామాలతో నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సరిహద్దు దళాలపై పాక్ ఆర్మీ వరుస కాల్పులకు తెగబడుతోంది. తాజాగా, జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఉన్న హమీర్పూర్ సెక్టార్లోని భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ పోస్టులపై ఆదివారం రాత్రంతా పాక్ సైన్యం ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్స్, 120 ఎంఎం మోర్టార్లతో దాడులు చేసింది. దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. గత 9 రోజుల్లో 17 సార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాగా, ఇరు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో.. పాక్పై నిందలు మోపడం భారత్ ఆపేసి, సానుకూల దృక్పథంతో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు రావాలని పాక్ మంత్రి ఆసిఫ్ సూచించారు. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారు జమ్మూకశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చిందని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ మండిపడ్డారు. శ్రీనగర్లో సోమవారం ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్లో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ యూనియన్ సదస్సులో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్కు పాక్ ఎందుకు ఆహ్వానం నిరాకరించిందో సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ‘కశ్మీర్ అంశంపై అసెంబ్లీలో చర్చించనంతవరకు ఒక్క పాకిస్తానే కాదు.. ఎవరూ కూడా ఈ అసెంబ్లీని సీరియస్గా తీసుకోరు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలూ అసెంబ్లీ పరువును దిగజార్చాయన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని, అఫ్జల్గురు ఉరిపై తీర్మానాన్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. -
మళ్లీ భారత్ సరిహద్దుపైకి పాక్ కాల్పులు
జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని సౌజైన్ సెక్టర్లోకి శుక్రవారం తెల్లవారుజామున పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగాయి. వరుసగా మూడో రోజు శుక్రవారం భారత సరిహద్దు బలగాలపై పాక్ కాల్పులు జరుపుతు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. -
సరిహద్దు వెంబడి భీకర కాల్పులు
జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి బీఎస్ఎఫ్కు చెందిన 12 ఔట్ పోస్ట్లే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని పోలీసులు వెల్లడించారు. వెంటనే భారత బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగాయని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరి కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రోజు ఉదయం 6.05 గంటలకు పాక్ బలగాలు బీఎస్ఎప్ పోస్ట్లపై కాల్పులకు తెగబడ్డాయని వివరించారు. అలాగే సోమవారం సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గల నాలుగు ప్రాంతాలలో పాక్ ఆర్మీతో పాటు రేంజర్స్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ తెంపరితనాన్ని చాటుకున్నాయని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఆర్ ఎస్ పురా సెక్టర్ ప్రాంతంలో కాట్రంకా సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు. పాక్ కాల్పులపై వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. శనివారం అర్థరాత్రి 1.00 గం.కు మొదలైన ఈ కాల్పులు 2.30 గం.ల వరకు జరుగుతునే ఉన్నాయని తెలిపారు. అయితే భారత్ వైపున ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. -
'ఇండియానే ఉల్లంఘించింది'
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత దేశమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితికి పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. భారత్ కాల్పులపై దర్యాప్తు జరిపించాలని పాక్ ఆర్మీ కోరుతూ ఐక్యరాజ్యసమితికి చెందిన భారత్, పాకిస్తాన్లలోని సైనిక పరిశీలకుల బృందానికి (యూఎన్ఎంజీఐపీ)కి శుక్రవారం ఫిర్యాదు చేసింది. ‘కాల్పుల్లో మా దేశస్థులు నలుగురు చనిపోయారు. జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దులోని ప్రజలపై భారత సైన్యం భారీ మోర్టార్లు, మెషిన్ గన్లు ప్రయోగించింది' అని పేర్కొంది. తమ సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపిందని భారత్ చెప్పిన నేపథ్యంలో పాక్ ఈ ఫిర్యాదు చేసింది. 1949 నుంచి భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ అంశాన్ని యూఎన్ఎంజీఐపీ పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. -
పాక్ కాల్పులపై భారత్ ఉన్నతస్ధాయి సమీక్ష
ఢిల్లీ: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ దుందుడుకు చర్యలపై గురువారం భారత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లు పాల్గొన్నారు. ఇప్పటికే భారత సరిహద్దు పరిస్థితులను బీఎస్ఎఫ్ డీజీ పాఠక్ కేంద్రానికి వివరించారు. భారత సరిహద్దుల్లోని అకునూర్ ప్రాంతంపై బుధవారం పాక్ సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
పాక్కు బుద్ధి చెప్పాలంటే కాల్పులకు దిగాల్సిందే..
ముంబై: పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పాలంటే భారత్ కూడా కాల్పులతో రంగంలోకి దిగాలని శివసేన తెగేసి చెపుతోంది. తాజాగా పాకిస్థాన్ కాల్పులపై మండిపడిన శివసేన... తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తప్పేమీ లేదనీ పేర్కొంది. పాకిస్థాన్ 2013లో 347, 2014 లో 562 సార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ లెక్కలు చెప్పుకొచ్చింది. పొరుగుదేశం చేస్తున్న ఈ దుశ్చర్యల మూలంగా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 3 2,000 ప్రజలు తమ నివాసాలను వీడి పోవాల్సి వస్తోందని మండిపడింది. పాక్ కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు కాల్పుల విరమణ నిబంధనలను పక్కన పెట్టయినా సరే తగిన బుద్ధి చెప్పాలని తన సంపాదకీయంలో పేర్కొంది. పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్న దశలో ఉందని అయితే కేవలం అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే మనగలుగుతోందని పేర్కొంది. కాగా జమ్ము కశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో ఎల్వోసీలో సోమవారం పాక్ దళాలు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. -
మరోసారి తెగబడిన పాక్, తిప్పికొట్టిన జవాన్లు
జమ్మూ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబ సెక్టార్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. అంతకు ముందు కతువా, రాంఘర్, హిరనగర్, సాంబ సెక్టార్లలో పాక్, భారత్ సైన్యాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పాక్ సైన్యం కాల్పులను జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన కాల్పులు...శనివారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. కాల్పుల ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారి మాట్లాడుతూ పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. అయితే భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు. -
కవ్వింపులకు దిగిన పాకిస్థాన్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వద్ద కవ్వింపులకు దిగింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాల్లో భారత్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది. ఎల్ ఓసీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలకోట్ సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు కవ్వింపు కాల్పులకు దిగాయని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పులకు భారత సైనికులు దీటుగా స్పందించారని వెల్లడించారు. 8.10 గంటలకు వరకు కాల్పులు కొనసాగాయి. ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. -
భారత్పై మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ కాశ్మీర్: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా, జమ్మూ జిల్లాలోని రామ్గర్, అర్నియా సెక్టార్లలో సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం వెంటనే అప్రమత్తమైంది. భారత్ సైన్యం ఎదురు కాల్పులు జరిపి... పాక్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని సైనిక అధికారులు వెల్లడించారు. గత అర్థరాత్రి ఒంటి గంటకు ఓ సారి.... గురువారం తెల్లవారుజామున 4.00 గంటలకు మరోసారి కాల్పులు జరిగాయిని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండగను జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన సియాచిన్ వెళ్లారు. -
పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ శుక్రవారం కాల్పులు జరిపింది. అయితే పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాగా పాక్ సైన్యం కాల్పుల్లో అనంతపురం జిల్లాకు చెందిన ఓ జవాను మృతి చెందాడు. జవాను అనీల్ కుమార్ స్వస్థలం అనంతపురం జిల్లా తలుపుల మండలం తూపల్లి గ్రామం. గతరాత్రి అనీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సరిహద్దులో ఆగిన పాక్ దూకుడు
జమ్మూ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది. జమ్మూ, సాంబ జిల్లాల పరిధిలోని సరిహద్దులో ఈ నెల 8-9తేదీల మధ్యరాత్రంతా కాల్పులు జరగనేలేదని, భారతసైన్యం ప్రతిఘటనతో పాక్ కాల్పుల జోరుకు కళ్లెం పడిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి శుక్రవారం చెప్పారు. గురువారం రాత్రి కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో 4 బీఎస్ఎఫ్ స్థావరాలు లక్ష్యంగా కేవలం 20నిమిషాలసేపు పాక్ కాల్పులను మినహాయిస్తే, గత రెండురోజులుగా కాల్పులు ఆగిపోయాయన్నారు. ఉద్రిక్తత సడలించాలి: పాక్ ఉభయదేశాల మధ్య అధీనరేఖవద్ద ఉద్రిక్తతల సడలింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్ను కోరింది. తమతమ సామార్థ్యాలేమిటో ఉభయపక్షాలకు అవగాహన ఉందని, యుుద్ధం సరైన ప్రత్యామ్నాయం కాబోదని అందువల్ల ఉద్రిక్తతలను సడలించాలని పరోక్షంగా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ పాక్ వ్యాఖ్యానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. భారత్తో సాధారణ సంబంధాలు ఉండాలన్నదే తమ కోరిక అని పాక్ తన ప్రకటనలో తెలిపింది. -
జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయి
రాహురి/బారామతి(మహారాష్ట్ర)/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాల కవ్వింపు చర్యలపై తాను మాట్లాడాల్సిన పని లేదని, ట్రిగ్గర్లపై ఉన్న భారత జవాన్ల చూపుడువేళ్లే దీనిపై మాట్లాడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాక్ దుశ్చర్యలకు భారత బలగాలు తిరుగులేని సమాధానం ఇస్తున్నాయని మోదీ భారత సైనిక దళాలను ప్రశంసించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పాక్ దళాల కాల్పులపై తాను స్పందించడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నా ఆలోచనలేంటో ప్రజలకు తెలుసు. వాటిని విశదీకరించాల్సిన అవసరం లేదు. మన జవాన్లు మాట్లాడాల్సి వస్తే.. ట్రిగ్గర్పై ఉన్న వారి చూపుడువేళ్లే మాట్లాడతాయి. ఇకముందు కూడా వారు అలాగే మాట్లాడతారు’ అని మోదీ అన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం బహిరంగంగా చర్చకు పెట్టడం సబబుకాదని సూచించారు. దేశ భక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనీ హితవు పలికారు. గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగిస్తూ.. ‘సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ శత్రువు భయాందోళనలు సృష్టిస్తోంది. భారత్లో పరిస్థితులు మారాయని, మునపటిలా వ్యవహరిస్తే సహించబోమని మన శత్రువులకు ఇప్పటికే అర్థమైంది’ అని భారతదేశ వైఖరిని మోదీ స్పష్టం చేశారు. ఏనాడైనా బోర్డర్కు వెళ్లావా?: ఎన్సీపీ కొంచుకోట అయిన బారామతిలో ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఆయన అల్లుడు అజిత్ పవార్పై మోదీ విరుచుకుపడ్డారు. ‘రక్షణమంత్రిగా ఉండగా.. పాక్, చైనాలతో సరిహద్దు సమస్యలు తలెత్తినప్పుడు ఏ నాడైనా సరిహద్దు వద్దకు వెళ్లావా? నీ హయాంలో ముంబై, మాలేగావ్, పుణెల్లో పేలుళ్లు జరిగితే.. కనీసం ఆ ఉగ్రవాదుల ఆనవాళ్లైనా గుర్తించారా?’ అని శరద్పవార్ను మోదీ ప్రశ్నించారు. దేశభక్తితో ఈ అంశాలను తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని చెప్పారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, సరిహద్దుల్లో పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చర్చకు పెట్టి జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని మోదీ సూచించారు. నీటి కోసం ఓ రైతు 55 రోజులు దీక్ష చేస్తే..దీనిని పట్టించుకోని అజిత్ పవార్ డ్యామ్లో నీరు లేకుంటే ఎలా ఇస్తాం.. మూత్రంతో డ్యామ్ను నింపుతామా అని ప్రశ్నించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్-ఎన్సీపీ తెగదెంపులు ఓ నాటకం మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ విడిపోవడం ఒక నాటకమని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల దృష్టిని మరల్చేందుకు వారు వేర్వేరుగా పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్, ఎన్సీపీ తెగదెంపులు చేసుకున్నాయని, కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాని రాజధాని ఢిల్లీలో ఉండకుండా.. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. -
కోలుకోలేని దెబ్బతీస్తాం..!
కవ్వింపు చర్యలపై పాక్కు భారత్ తీవ్ర హెచ్చరిక సరిహద్దులో కొనసాగుతున్న కాల్పులు ముగ్గురు జవాన్లు సహా 12 మంది గాయాలు భయంతో సొంతూళ్లను వదులుతున్న ప్రజలు జమ్మూ/న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. సరిహద్దు వెంట విచక్షణారహిత కాల్పులను కొనసాగిస్తున్న పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఇదే దుస్సాహసాన్ని కొనసాగిస్తే.. కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘ఇదే దుందుడుకుతనాన్ని కొనసాగిస్తే.. దానికి మీరు మూల్యం చెల్లించుకోలేని స్థాయిలో మా దళాల ప్రతిస్పందన ఉంటుంది’ అని భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. భారత దళాల ప్రతిస్పందనను ఉద్దేశిస్తూ.. భారత్ సందేశం పాక్కు చేరిందని న్యూఢిల్లీలో జైట్లీ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతి కోరుకుంటే తక్షణమే కాల్పులను ఆపేయాలని పాక్కు స్పష్టం చేశారు. ఒకవైపు కాల్పులు కొనసాగుతుండగా.. ఆ దేశ నేతలతో చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. భారత్ దురాక్రమణదారు కాదని, తన భూభాగాన్ని, తన ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత భారత్పై ఉందని అన్నారు. పాక్ దుశ్చర్యల వెనక కారణమేమై ఉండొచ్చన్న విలేకరుల ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ.. కాల్పుల ముసుగులో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తుండొచ్చన్నారు. భారత్కు ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని హోమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్షిస్తున్నారని, దీనిపై ప్రధానే మాట్లాడాల్సిన అవసరం లేదని.. బీఎస్ఎఫ్, ఆర్మీ దీటుగా స్పందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరువైపులా హోరాహోరీ.. పాక్ దాడులు, భారత్ ఎదురుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ, సాంబ, కతువ జిల్లాల్లోని సరిహద్దుకు దగ్గరలో ఉన్న 130 గ్రామాలు, 60 సరిహద్దు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు బుధవారం రాత్రంతా జరిపిన దాడుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప విరామాలతో పర్గ్వాల్, కనచక్, ఆర్నియా, రామ్గఢ్ సబ్ సెక్టార్లలో గురువారం రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందం తరువాత ఆ ఒప్పంద ఉల్లంఘన ఈ స్థాయిలో జరగడం ఇదే ప్రథమమని భావిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీనుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా పాక్ ప్రారంభించిన దాడుల్లో 8 మంది చనిపోగా, 9 మంది సైనిక సిబ్బంది సహా 80 మంది గాయాలపాలయ్యారు. 60 బీఎస్ఎఫ్ సరిహద్దు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. 113 సరిహద్దు గ్రామాల్లోని 30 వేల మందికి పైగా ప్రజలు సొంతూళ్లను వదిలి రక్షణ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మాకూ ఆ సామర్ధ్యం ఉంది: పాక్ ఇస్లామాబాద్: భారత్వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ ఉద్రిక్తతలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణకు దారితీయకూడదని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ‘భారత్ జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అన్నారు. భారత రక్షణమంత్రి జైట్లీ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో అయన పైవిధంగా వ్యాఖ్యానించారు. -
భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్
ఇస్లామాబాద్: భారత్వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణకు దారితీయకూడదని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఖ్వాజా సూచించారు. ‘ఇలాగే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే.. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంద’న్న భారత రక్షణమంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యల అనంతరం ఖ్వాజా పై విధంగా స్పందించారు. -
పాక్ కాల్పుల్లో 20మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. గాయపడినవారిలో బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు 15మంది సామాన్య పౌరులు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కొన్నిచోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. కాగా 20 గ్రామాల్లోని సుమారు 20వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.మరోవైపు ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక అధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. -
మళ్లీ అదే దుశ్చర్య
సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు 12 మందికి గాయాలు రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ జమ్మూ/న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ బలగాల ఆగడాలు మితిమీరాయి. సోమవారం అర్నియా పట్టణంలో ఐదుగురు భార త పౌరులను బలిగొన్న పాక్ దళాలు మంగళవారం కూడా పలుసార్లు భారీస్థాయిలో కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూ, పూంచ్, రాజౌరీ, కతువా జిల్లాల్లో వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 40 భారత సరిహద్దు సైనిక శిబిరాలు, 25 గ్రామాలపై భారీ కాల్పులు, మోర్టారు బాంబు దాడులకు తెగబడ్డాయి. ఒక భారత జూనియర్ ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు సహా 12 మంది గాయపడ్డారు. అర్నియా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం రాత్రి దాటాక కూడా ఇరు పక్షాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ చర్యతో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డెరైక్టరేట్ జనరల్ అధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. కాల్పులు విరమణను మీరే ఉల్లంఘించారంటూ పరస్పరం ఆరోపించుకున్నారు. మరోపక్క.. భారత త్రివిధ దళాల అధిపతులు మంగళవారం ఢిల్లీలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై సరిహద్దు పరిస్థితిపై చర్చించారు. పాక్ కాల్పుల నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరపాలన్న ప్రతిపాదనను భారత్ చివరి నిమిషంలో పక్కన పెట్టింది. సోమవారం నాటి పాక్ కాల్పుల్లో గాయపడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్కు గురైనట్లు తెలుస్తోంది. కాల్పుల భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్
జమ్మూ:పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. నిన్న అర్నియా పట్టణంలో ఐదుగురు భారత పౌరులను బలిగొన్న పాక్ దళాలు మంగళవారం కూడా జమ్మూ సెక్టార్, పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సరిహద్ద సైనిక శిబిరాలపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. అర్నియా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డెరైక్టరేట్ జనరల్ అధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని మళ్లీ ఉల్లంఘిస్తూ జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)వెంబటి ఉన్న 10 సరిహద్దు కేంద్రాలు, జనావాసాలపై పాకిస్తాన్ దళాలు భారీస్థాయిలో మోర్టార్ దాడులు, కాల్పులకు దిగాయి. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా పాక్ దళాలు జరిపిన ఈ కాల్పు ల్లో ఆర్నియా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక సహా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోగా 34 మంది గాయాల పాలయ్యారు. ఐబీకి 4 కిమీల దూరంలోని ఆర్నియా బస్టాండ్లోనూ మోర్టార్ షెల్స్ కనిపించాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయని సరిహద్దు రక్షణ దళం అధికార ప్రతినిధి వెల్లడించారు. పాక్ కాల్పులకు భారత సైన్యం కూడా దీటుగా స్పందిస్తోందన్నారు. పాక్ దుశ్చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు సమాధానమిచ్చేందుకు భారతదళాలు సంసిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. భారత్లో పరిస్థితులు మారాయన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకుని.. ఈ దుశ్చర్యలను ఆపేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నించి భంగపడిన ప్రతీసారి నిస్పృహకు లోనై పాక్ కాల్పులకు దిగుతోందం టూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. శ్రీనగర్లో ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఒమర్ అబ్దుల్లా జమ్మూ చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల అంత్యక్రియలకు హాజరయ్యారు. జనావాసాలపై పాక్ కాల్పులను ఒమర్ తీవ్రంగా ఖండించారు. బాధిత ప్రాంతాలు కొన్నిటిని సందర్శించిన పీటీఐ ప్రతినిధికి రక్తం మరకలతో కూడిన మంచాలు, చిల్లులు పడిన ఇళ్ల పైకప్పులు, బుల్లెట్లతో రంధ్రాలు పడిన కిటికీలు కన్పించారుు. మోర్టార్ బాంబుల ముక్కలు కూడా చెల్లాచెదురుగా పడి కన్పించారుు. పాక్ మళ్లీ దాడులకు తెగబడవచ్చుననే భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలావుండగా పూంచ్ జిల్లా భింబేర్ గాలి ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి స్థావరాలపై కూడా పాక్ సైన్యం సోమవారం ఉదయం 8.30 ప్రాంతంలో మోర్టార్ దాడులకు, కాల్పులకు పాల్పడినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. పాక్ ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా కాంగ్రెస్, బీజేపీలు పేర్కొన్నారుు. పాక్ ఈ విధమైన ఉల్లంఘనలకు పాల్పడటం గత నాలుగు రోజుల్లోనే ఇది పదకొండోసారి. కాగా, భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేసింది. -
భయం.. భయం..!
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ సేనలు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ పది సార్లు పాక్ బలగాలు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆదివారం సైతం పూంచ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు భారీగా కాల్పులకు తెగబడ్డారు. వీటిని భారత సేనలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే నివాస ప్రాంతాలపై సైతం పాక్ జవాన్లు దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. పాక్ బలగాల వరుస దాడుల నేపథ్యంలో జమ్మూ సెక్టార్లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా ప్రాంతాల్లో 200 మందిని పోలీసులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు జమ్మూ జిల్లా కలెక్టర్ అజీత్ కుమార్ సాహూ నిర్థారించారు. సరిహద్దుల వద్ద పరిస్థితులు ఊహించని రీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శనివారం కూడా పాక్ బలగాలు ఆర్ఎస్ పురా సెక్టార్లో మోర్టార్ షెల్స్తో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం పాక్ సైనికుల కాల్పుల్లో ఓ బాలిక మృతి చెందగా.. ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. గత కొద్ది నెలల్లో పాక్ బలగాలు వంద సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత ప్రభుత్వం మండిపడింది. పాక్ బలగాల కవ్వింపు చర్యలను ఖండిస్తున్నామని, పాక్ సేనలకు దీటుగా సమాధానం చెప్పాలని రక్షణ శాఖ వర్గాలను ఆదేశించామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
పాక్ కాల్పులు, 17 ఏళ్ల యువతి మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఫూంచ్ సెక్టార్ సౌజెయిన్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల యువతి జహీరా అక్తర్తో పాటు మరో నలుగురు గాయడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో పాక్ సైన్యం ఇలా కాల్పులు జరపడం ఇది మూడోసారి. పాక్ సైనికులు గురువారం జరిపిన కాల్పుల్లో కూడా ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. -
'కయ్యానికి కాలు దువ్వితే..చూస్తూ ఊరుకోం'
చంఢీఘడ్: భారత దేశ సహనాన్ని, ఓపికను బలహీనతగా చూడవద్దని పాకిస్థాన్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నింటితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలని భారత్ కోరుకుంటోందని ఆయన అన్నారు. నియంత్రణారేఖ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘటనకు పాల్పడుతున్న అంశాన్ని ఉద్దేశించి రాజ్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే..తాము తెల్ల జెండాను చూపబోమని ఆయన తెలిపారు. కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ తో శాంతి చర్చలు జరపమని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. కయ్యానికి కాలుదువ్వితే చూస్తూ ఊరుకోబోమని రాజనాథ్ తెలిపారు. -
మరోసారి కాల్పులకు పాల్పడ్డ పాకిస్తాన్
జమ్ము : పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్నితుంగలోకి తొక్కి కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్లో రెండు బీఎస్ఎఫ్ కేంద్రాలు లక్ష్యంగా.... పాక్ రేంజర్స్ శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు దాడిని తిప్పికొట్టాయి. ఊహించని దాడితో సరిహద్దు గ్రామ ప్రజలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని బంకర్లలోకి పరుగులు తీశారు. భయంతో తెల్లారే వరకు అక్కడే ఉండిపోయారు. 12 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ దాదాపు 20 సార్లుకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. కాగా మేఘాలయాలో భారత సైన్యం, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. వారి స్థావరం నుంచి భారీగా మందు గుండు సామగ్రీని స్వాధీనం చేసుకున్నారు. -
భారత స్థావరాలపై పాక్ కాల్పులు
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని సరిహద్దు వద్ద పాక్ సైనికులు భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. 'మంగళవారం అర్ధ రాత్రి 12 నుంచి 1 గంటలకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మళ్లీ కాల్పులకు దిగారు. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి' అని పోలీస్ అధికారి చెప్పారు. -
రెండుసార్లు కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్లోని నాలుగు బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ బలగాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయి. పాక్ బలగాల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే రెండుసార్లు కాల్పుల విరమణ ఒడంబడికను పాకిస్థాన్ అతిక్రమించింది. పూంచ్ జిల్లాలోని మంధర్ ప్రాంతంలో ఉదయం 11.30లో ఒకసారి, సాయంత్రం 4.05 గంటల ప్రాంతంలో మరోసారి కాల్పులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ కవ్వింపు కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయని పేర్కొన్నారు. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బింబర్ గాలి సబ్ - సెక్టార్పైకి పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. దాంతో భారత్ జవాన్లు అప్రమత్తమైయ్యారు. పాక్ సైన్యం కాల్పులను భారత్ జవాన్లు తిప్పికోట్టారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుందని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని చెప్పారు. పాక్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్ను భారత్కు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్సులు చోటు చేసుకున్నాయని మెహతా వెల్లడించారు. ఇటీవల బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న నావ చీనబ్ నదిలో తిరగబడింది. ఆ ఘటనలో సత్యశీల్ అనే జవాన్ ఆ నదిలో కొట్టుకుని పోయాడు. ఆ క్రమంలో సియాల్ కోట్ వద్ద అతడ్ని పాక్ బలగాలు పట్టుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సత్యశీల్ను భారత్ అప్పగించాలని పాక్కు కోరింది. దాంతో సత్యశీల్ను శుక్రవారం భారత్కు అప్పగించారు. సత్యశీల్ను భారత్కు అప్పగించి కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం. -
హమ్మయ్య! ఎంత ప్రశాంతత!
గాజా/జెరూసలేం: తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న గాజా ప్రాంతంలో సోమవారం ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. ఇరవై రోజులపాటు తుపాకులు, రాకెట్ దాడులతో దద్దరిల్లిన ప్రాంతంలో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు తగ్గడం, హమాస్ రాకెట్ దాడులు గణనీయంగా తగ్గడంతో గత 20 రోజులతో పోల్చితే గాజా ప్రశాంతంగా కనిపించింది. మరో వైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు అంతం పలుకుతూ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చాయి. మానవతా దక్పథంతో కూడిన బేషరతు కాల్పుల విరమణ ఒప్పందం ఉభయపక్షాల మధ్య తక్షణం కుదరాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం రాత్రి పిలుపునిచ్చింది. రంజూన్(ఈద్) పర్వదినం తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగించాలని, ఘర్షణలో దెబ్బతిన్న గాజా ప్రాంత బాధితులకు అత్యవసర సహాయం అందేలా సహకరించాలని కోరింది. శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 20 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. -
పాక్ ఉల్లంఘనలు ఆగాలి: జైట్లీ
శ్రీనగర్: కాల్పుల విరమణ ఉల్లంఘనలు, చొరబాట్లు కొనసాగినట్లైతే పాకిస్థాన్తో చర్చల్లో పురోగతి సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద దురాగతాలకు అడ్డుకట్ట వేయూలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నొక్కిచెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న జైట్లీ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సాధారణ పరిస్థితులు నెలకొనని పక్షంలో పాక్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కాశ్మీరీ పండిట్లు వెనక్కి వచ్చేలా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం విధాన పరమైన చర్యలు ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో భద్రత పరమైన పరిస్థితిపై గవర్నర్ ఎన్.ఎన్.వోరా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైనికాధికారులతో చర్చించానన్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా హాజీ పిర్ పాస్కు సమీపంలోని సైనిక స్థావరాలను ఆయన సందర్శించారు. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
ఇటీవల భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ప్రధానిల మధ్య జరిగిన చర్చలతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని ఇరుదేశాల దేశాలు భావించాయి. అలాంటి తరుణంలో పాకిస్థాన్ సైనికులు మరోసారి తమ తెంపరితనాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఇరుదేశాల సరిహద్దుల్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఎల్ఓసీ వెంబడి ఉన్న రాజోరి, పూంచ్ జిల్లాలపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో ఉన్న భారత భద్రత దళాలు వెంటనే అప్రమత్తమైయ్యాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. పాక్ సైనికులు కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. అయితే పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఓ భారత్ జవాన్ మృతి చెందగా, మరో ముగ్గురు సైనికులు మరణించినట్లు సమాచారం. శుక్రవారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో రాజోరి, పూంచ్ జిల్లాలోని జనావాసాలపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఆ బుల్లెట్లకు పెంపుడు జంతువులు బలైయ్యాయని శుక్రవారం ఒమర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
మళ్లీ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ బలగాలు మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఎల్వోసీ వెంబడి భీంబర్ గాలీ వద్ద ఉన్న భారత ఔట్పోస్టులపై పాకిస్థాన్ బలగాలు సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిపాయని, వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ కాల్పుల్లో భారత సైనికులు ఎవరూ గాయపడలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తె లిపారు. పాక్ బలగాలు చిన్న తుపాకులతోపాటు ఆటోమేటిక్ తుపాకులతోనూ భారత పోస్టులపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం చేసేందుకే పాక్ బలగాలు కాల్పులకు దిగాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి. -
మరో సారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘనకు మరోసారి పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని సాంబ జిల్లాలోని బీఎస్ఎఫ్ దళాలకు చెందిన మంగు చాక్, కాద్వా చెక్ పోస్ట్లపై ఈ రోజు ఉదయం నుంచి కాల్పులకు తెగబడిందని సీనియర్ పోలీసు ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. అయితే భారత్ సైన్యం వెంటనే స్పందించిందన్నారు. కాగా ఇరువైపులా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. పాక్ సైన్యం నిన్న ఒక్క రోజే హమీర్పూర్ ప్రాంతంలో మూడు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన సంగతిని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం హైదరాబాద్కు చెందిన లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మరణించిన సంగతి విదితమే. గత వారం రోజుల కాలవ్యవధిలో పాక్ సైన్యం తొమ్మిది సార్లు భారత్ సరిహద్దు పై కాల్పులకు తెగబడిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
గుజరాత్ తీరంలో పాక్ ఘాతుకం
అహ్మదాబాద్: గుజరాత్లోని జకావ్ తీరం సమీపంలో పాకిస్థాన్కు చెందిన సముద్ర గస్తీ సిబ్బంది దుశ్చర్యకు పాల్పడ్డారు. చేపల వేటకు వెళ్లిన ఓ బోటు సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి, ఒకరిని చంపేశారు. మరో 30 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోర్బందర్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మనీష్ లోధారి తెలిపారు. పాక్ సిబ్బంది కాల్పుల్లో నరన్ సోస అనే జాలరి మరణించినట్లు ఆయన వివరించారు. ఇతర బోట్ల నుంచి 30 మందిని అపహరించుకుపోయారని, దీనిపై స్థానిక పోలీసు, కోస్ట్గార్డ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘‘అంతర్జాతీయ జలాల్లో మేం వేటకు వెళ్లాం. కాసేపటికి పాకిస్థాన్ బోట్లు మమ్మల్ని చుట్టుముట్టాయి. విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో మాతో వచ్చిన ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. బోటులో ఉన్న మిగతా ఐదుగురం ప్రాణాలు కాపాడుకొని తీరానికి చేరుకున్నాం’’ అని మంగన్ సోసొ అనే జాలరి చెప్పారు. ఈ ఘటనపై రక్షణమంత్రి ఏకే ఆంటోనీతో మాట్లాడానని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. పాక్ చర్యను సీరియస్గా తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నియంత్రణ రేఖ వద్ద పాక్ దళాల కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్కు అలవాటుగా మారిపోయింది. శనివారం పూంఛ్, రాజౌరి జిల్లాల్లో మూడుసార్లు కాల్పులకు తెగబడింది. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్ వద్ద భారతీయ సైనిక శిబిరాలపై ఎలాంటి కవ్వింపు లేకుండానే పాక్ దళాలు కాల్పులు జరిపాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి కర్నల్ ఆర్కే పాల్టా తెలిపారు. అలాగే, రాజౌరి జిల్లాలోని బాలాకోట్ ప్రాంతంలో రాత్రి 10.30 గంటల వరకు కాల్పులు కొనసాగాయని చెప్పారు. త్రికుండి గలి, బాలాకోట్ ప్రాంతాల్లో శనివారం నాడు పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి కాల్పులు ఉండకూడదంటూ 2003 నవంబర్ నెలలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. కానీ, దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే పాక్ దళాలు పదే పదే కాల్పులకు పాల్పడుతూ ఉన్నాయి. నియంత్రణ రేఖ వద్ద, జమ్ము కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నట్లు భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. -
మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్
పాకిస్థాన్కు భారత్ హెచ్చరిక న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో.. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఐదుగురు భారత సైనికులను కాల్చివేసిన ఘటనకు పాకిస్థాన్ బాధ్యత వహించక తప్పదని.. ఆ దేశానికి, వారి సైన్యానికి సంబంధం లేకుండా అదంతా జరగదని వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ కాల్పులకు దిగుతోందని, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆంటోనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ 82 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని చెప్పారు.