గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు..70 మంది మృతి | Israel Strikes Continues In Gaza | Sakshi
Sakshi News home page

గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు..70 మంది మృతి

Published Sun, Jan 5 2025 8:18 AM | Last Updated on Sun, Jan 5 2025 8:18 AM

Israel Strikes Continues In Gaza

గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్‌(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.

‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్‌ మిలిటరీ స్పందించలేదు.

మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు.  అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement