strikes
-
Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు
కాబూల్: మయన్మార్లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో స్వల్ప వ్యవధిలో రెండుమార్లు భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. EQ of M: 4.7, On: 29/03/2025 05:16:00 IST, Lat: 36.50 N, Long: 71.12 E, Depth: 180 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/F4P212Y0hC— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025ఆఫ్ఘనిస్థాన్లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూప్రకంననలు(Earthquakes) ప్రజలను వణికింపజేశాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51.. 5:16 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా జనం తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయిలాండ్లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూకంపం సంభవించింది.EQ of M: 4.3, On: 29/03/2025 04:51:37 IST, Lat: 36.59 N, Long: 71.12 E, Depth: 221 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/gPUcvvaCpb— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.ఇది కూడా చదవండి: Earthquake: మయన్మార్లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు -
ఇజ్రాయెల్ దాడికి మరోమారు గాజా విలవిల
దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.⭕️A key Hamas terrorist who was operating from within the Nasser Hospital compound in Gaza was precisely struck.The strike was conducted following an extensive intelligence-gathering process and with precise munitions in order to mitigate harm to the surrounding environment as… pic.twitter.com/C3pZqlC6NO— Israel Defense Forces (@IDF) March 23, 2025అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్ 7న ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్ దాడులు..26 మంది మృతి
గాజా:ఇజ్రాయెల్- హమాస్ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. -
ఇరాన్పై దాడులు.. నెతన్యాహు సంచలన ప్రకటన
టెల్అవీవ్:ఇరాన్ మీద ఇటీవల జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.ఇరాన్ అణు స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేసినట్లు నెతన్యాహు తాజాగా అంగీకరించారు.ఈవిషయాన్ని ఆయన దేశ పార్లమెంట్లో వెల్లడించారు.తాము వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం మాత్రం ఆగలేదని ఆయన పేర్కొన్నారు.ఇక ఇదే ఏడాది ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద ఉండగా అక్టోబర్లో చేసిన దాడిలో అవి కూడా ధ్వంసం అయ్యాయన్నారు. అదే సమయంలో ఇరాన్ తన క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామని వెల్లడించారు.ఒకవేళ వీటికి ఇరాన్ ప్రతి దాడులు చేస్తే వాటికి కూడా ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహూ తెలపడం గమనార్హం.కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.అయితే దాడుల సమయంలో అణుస్థావరాల విషయం ప్రస్తావనకు రాలేదు. -
హెజ్బొల్లాకు మళ్లీ ఎదురుదెబ్బ.. మరో కీలక నేత హతం
బీరుట్:మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ ఆదివారం(నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించింది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. -
‘ఇరాన్లో అడ్డగోలుగా అణుస్థావరాలు.. దాడులు చేయాల్సిందే!’
ఇరాన్లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024 ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
బీరుట్:లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది.బీరుట్పైనే కాకుండా తీర నగరం టైర్పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన శనివారం జరిపిన దాడుల గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లో మొత్తం 3136 మంది మరణించారని, 13వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. కాగా, పాలస్తీనాలోని హమాస్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హెజ్బొల్లా ఇరాన్కు మద్దతుగా పనిచేస్తోందన్న కారణంగా ఇటీవల ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్పై విరుచుకుపడుతోంది.ఇదీ చదవండి: డీఏపీకి ‘గాజా’ దెబ్బ -
ఇజ్రాయెల్కు పవర్ చూపించాలి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ పవర్ను ఇజ్రాయెల్కు చూపించాలన్నారు. దీని కోసం ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులను మరీ తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని ఖమేనీ చెప్పినట్లు తెలిపింది. కాగా,శనివారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా 100 యుద్ధ విమానాలు,డ్రోన్లతో అక్కడి క్షిపణి,డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇదీ చదవండి: ఇరాన్పై నిప్పుల వర్షం -
హెజ్బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్లోని బీరుట్లో హెజ్బొల్లా గ్రూప్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్లకు ఇజ్రయెల్ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులు చేస్తోంది.Israel has launched targeted airstrikes on branches of the Hezbollah-linked Al-Qard Al-Hassan financial association in Beirut and the Beqaa Valley. These strikes, some near Beirut's airport, follow warnings from the IDF accusing the quasi-bank of financing Hezbollah's operations. pic.twitter.com/wi9sjbUYhF— TBN Israel (@TbnIsrael) October 21, 2024 బీరుట్లోని ఆ ప్రాంతాల్లో లెబనాన్ పౌరులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. దిక్కు తోచక బీరుట్ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లితున్నారు.హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు చోట్ల పేలుళ్లు జరిపింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.⚡️This moment, #Israel airstrikes targeted multiple areas in the suburbs of #Beirut, Lebanon. The Israel has announced plans to target businesses it claims are connected to #Hezbollah, singling out the Al Qard Al Hassan Institution.Al Qard Al Hassan operates throughout Lebanon,… pic.twitter.com/VTmnyXK2eF— Shah Faisal AfRidi (@Sfaisalafridi) October 20, 2024 అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 73 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైనిక ముట్టడి కారణంగా ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారింది. గాజా స్ట్రిప్కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం వంటి అవసరమైన సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్బొల్లా డ్రోన్ ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది.చదవండి: మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే -
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు..మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి -
సిరియాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
డమాస్కస్:సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా 11 మంది దాకా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పిల్లలు,మహిళలు ఉన్నట్లు సిరియా మీడియా వెల్లడించింది. దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది.ఇజ్రాయెల్లోని గోలాన్ హైట్స్ నుంచి మూడు మిసైల్స్ అపార్ట్మెంట్పైకి దూసుకువచ్చి ఈ దాడులు జరిపాయి. ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అక్టోబర్7 హమాస్ తమపై జరిపిన మెరుపు దాడుల తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా చితికిపోయింది: అమెరికా -
గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది మృతి
గాజా:ఓ పక్క లెబనాన్లో హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు మరోపక్క పాలస్తీనాలోని గాజాలోనూ దాడులు కొనసాగిస్తున్నాయి.ఆదివారం(అక్టోబర్6)సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24మంది మరణించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు.డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదులో నిరాశ్రయులైన ప్రజలుంటున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 24మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో దాదాపు 42వేల మంది మరణించారు.ఇదీ చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
హెజ్బొల్లాకు రెస్ట్ తీసుకునే సమయం కూడా ఇవ్వం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ వరుస వైమానిక,భూతల దాడులతో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే లెబనాన్ దేశ రాజధాని బీరూట్ చిగురుటాకులా వణికిపోతుంది.తాజాగా ఇజ్రాయెల్ శనివారం సాయంత్రం నుంచి బీరూట్లోని హెబ్బొల్లా కమాండ్ సెంటర్లు, అణ్వాయుదాలు నిల్వ ఉంచే స్థావరాలు, టెన్నెల్స్,మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పేలుళ్ల దాటికి దక్షిణ బీరుట్, దాని పరిసర ప్రాంతాలు రెండుగంటలకు పైగా బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. దీంతో బీరూట్లో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి ఒకటిగా నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. మేము హెజ్బొల్లాపై మరింత ఒత్తిడి తేవాలి. ఉపశమనం లేకుండా హెజ్బొల్లాకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి. విశ్రాంతి ఇవ్వకుండా శాస్వత నష్టం కలిగించేలా చేయాలని అన్నారు. -
లెబనాన్పై దాడులు ఆపాలి: రష్యా
మాస్కో: లెబనాన్లో ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ త్వరలో పర్యటిస్తారని తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడితో మిఖాయిల్ సమావేశం కానున్నారని వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని కోరింది. ఇదీ చదవండి: లెబనాన్లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
లెబనాన్లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్:లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సోమవారం(సెప్టెంబర్30) తెల్లవారుజామున బీరుట్ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.బీరుట్లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్ను ఇజ్రాయెల్ ఐరన్డోమ్ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: లెబనాన్ నిరాశ్రయులు..10 లక్షలు -
గాజా: స్కూల్పై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడంలేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ స్కూల్లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగా అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. -
టెల్అవీవ్లో కత్తిపోట్లు.. ఇద్దరి మృతి
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్ కేంద్రంగా ఇరాన్ మద్దతుతో పనిచేసే హిబ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్పై మరోసారి బాంబుల వర్షం కురిపించింది.ఆదివారం(ఆగస్టు4) తెల్లవారుజామున ఉత్తరగాజాలోని టెంట్ క్యాంప్పై జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ శివార్లలో పాలస్తీనా మిలిటెంట్ ఒకరు జరిపిన కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్లోని జనావాసాలపై హిజ్బుల్లా ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని సమాచారం. -
ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడులు: ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలున్నాయని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్లోని సామాన్య సైనిక స్థావరాలతో పాటు సామాన్య పౌరులు కూడా లక్ష్యంగా దాడులు చేసే అవకాశాలున్నాయి. తమ సీనియర్ కమాండ్ర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందడంతో హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు ఇరాన్ పరోక్ష మద్దతుందన్న ప్రచారం ఉంది. ఒక పక్క హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య, మరోపక్క హెజ్బొల్లా సీనియర్ కమాండర్ మృతితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజజ్రాయెల్పై ఎలాంటి దాడులు జరిగినా మద్దతిచ్చేందుకు అమెరికా ఇప్పటికే ఫైటర్జెట్లను పశ్చిమాసియాకు పంపుతుండటం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. -
ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
గాజాలో స్కూల్పై ఇజ్రాయెల్ దాడి.. 31 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే స్కూల్లోని ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిసింది. ఇది కాక మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాడుల ప్రభావంతో ఖాన్ యూనిస్ నగరం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా అప్పటి నుంచి హమాస్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్లో జరుగుతున్న జీ7 మీటింగ్లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్లో మానవ బాంబు కలకలం -
ఇరాన్ దాడులు: నష్టంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్13) అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకు వచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తర్వాత కూడా బాలిక పరిస్థితి కుదటపడలేదు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా -
ఇరాన్తో ఉద్రిక్తతల వేళ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే..!
కీవ్: ఉక్రెయిన్పై ఆదివారం(మార్చ్ 24)రష్యా తాజాగా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్తో పాటు పశ్చిమ ఉక్రెయిన్లోని ఎల్వివ్పై రష్యా దాడులు చేసింది. కీవ్లో రష్యా దాడుల కారణంగా పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్ చీఫ్ మిలిటరీ ఆఫీసర్ చెప్పారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. రష్యా తాజా దాడులతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ అలర్ట్ అయింది. తమ ఆకాశంలోకి ఇతర దేశాల యుద్ధ విమానాలు ప్రవేశించకుండా నిఘా పెట్టింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు -
హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్లో వీగిన అమెరికా తీర్మానం -
లెబనాన్: ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి మృతి
జెరూసలెం: దక్షిణ లెబనాన్లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అయిదుగురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో తల్లిదండ్రులు సహా ఇద్దరు పిల్లలున్నారు. మరణించిన వారిలో మహిళ ప్రస్తుతం గర్భవతి. ఇజ్రాయెల్ దాడిలో ఇళ్లంతా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివసించేవారు తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. గత వారంలోనూ దక్షిణ లెబనాన్లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఓ జంటతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అటు గాజాలో హమాస్ ఇటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 30,960 మంది మరణించగా లెబనాన్లో 312 మంది హెజ్బొల్లా ఫైటర్లు, 56 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. వీలు దొరికినపుడల్లా హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇజజ్రాయెల్ సైనికులు సహా సాధారణ పౌరులు మృతి చెందారు. ఇదీ చదవండి.. పాక్ అధ్యకక్షుడిగా జర్దారీ -
America Britain Strikes : హౌతీల కీలక వ్యాఖ్యలు
సనా: యెమెన్ రాజధాని సనాలోని తమ స్థావరాలపై అమెరికా,బ్రిటన్లు సంయుక్తంగా చేస్తున్న దాడులను హౌతీ మిలిటెంట్లు తేలిగ్గా కొట్టి పారేశారు. దాడుల ప్రభావం తమపై పెద్దగా లేదని, దాడుల్లో ఎవరూ గాయపడలేదని హౌతీ గ్రూపు సీనియర్ కమాండర్ మహ్మద్ అబ్దుల్ సలాం చెప్పాడు. అయితే దాడులకు మాత్రం తాము గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో నుంచి వెళ్లే ఇజ్రాయెల్తో సంబంధాలున్న అన్ని వాణిజ్య నౌకలపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు. బ్రిటన్తో కలిసి హౌతీలపై చేస్తున్న వైమానిక దాడులపై అమెరికా వివరాలు వెల్లడించింది. తాము ఇప్పటివరకు జరిపిన దాడుల కారణంగా హౌతీలు మళ్లీ డ్రోన్లు, మిసైళ్లతో ఇప్పట్లో నౌకలపై దాడి చేయకపోచ్చని తెలిపింది. యెమెన్లో హౌతీలు డ్రోన్లు, మిసైళ్లు నిల్వ ఉంచిన స్థావరం తమ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా వెల్లడించింది. కాగా, హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ అలీ అల్ హౌతీ మాట్లాడుతూ యెమెన్పై అమెరికా దాడులను ఉగ్రవాదంతో పోల్చాడు. అమెరికా ఒక పెద్ద దయ్యమని మండిపడ్డాడు. యెమెన్లోని హౌతీ స్థావరాలపై శుక్రవారం ప్రారంభమైన అమెరికా, బ్రిటన్ల వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్, అమెరికా దాడులు -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి
లెబనాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్కు బీరూట్ కేంద్రంగా మారింది. బీరూట్ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా పేర్కొంది. లెబనీస్లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది మరణించారు. ఇదీ చదవండి: ఆఫ్గానిస్థాన్లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు -
Iraq: హెజ్బొల్లా స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాక్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ఉత్తర ఇరాక్లో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడడంతో అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు హెజ్బొల్లాపై దాడులకు దిగినట్లు దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ‘ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపునకు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్లోని మా బలగాలు దాడులు జరిపాయి. ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని వరుస దాడులు జరిపాం. ఇరాక్, సిరియాల్లో మా బలగాలపై ఇటీవల మిలిటెంట్లు తరచుగా దాడులు జరుపతున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశాం’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్న హమాస్తో పాటు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీ మిలిటెంట్లు, ఇరాక్లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్ల వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపిస్తుండటం గమనార్హం. ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్లో ఆమె కీ రోల్ ! -
సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి
వాషింగ్టన్: సిరియాలో ఇరాన్ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. ఇరాన్ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు. ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది -
పేరుకే హాలీవుడ్! వేలాదిగా ఉపాధి కోతలు.. అలమటిస్తున్న కార్మికులు
ప్రపంచ సినీ పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు హాలీవుడ్ (Hollywood) గురించే గొప్పగా చెప్పుకొంటాం. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు, షోలు అక్కడి నుంచే వస్తాయి. సాంకేతిక విలువల్లో ఏ మాత్రం రాజీ పడకుండా చిత్రాలు నిర్మిస్తుంటారు అక్కడి దర్శక నిర్మాతలు. అయితే అంతటి ప్రాముఖ్యత ఉన్న హాలీవుడ్లో ఓ వైపు స్ట్రైక్లు కొనసాగుతుండగా మరోవైపు వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. గత సెప్టెంబరులో అమెరికాలో 3,36,000 ఉద్యోగాలు పెరిగాయి. బ్లూమ్బెర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు ఊహించిన దాని కంటే ఇది దాదాపు రెండింతలు. అయితే ఇందుకు భిన్నంగా హాలీవుడ్లో ఉపాధి కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం , చలనచిత్రం, సౌండ్ రికార్డింగ్ పరిశ్రమలలో ఆగస్ట్లో 17,000 మంది ఉపాధి కోల్పోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో మరో 7,000 మంది ఉపాధి కోల్పోయారు. హాలీవుడ్లో మే నెలలో సమ్మెలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 45,000 మంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,60,000 మంది నటీ నటులు, అనౌన్సర్లు, రికార్డింగ్ కళాకారులు, ఇతర మీడియా నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ SAG-AFTRA అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP)తో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన తర్వాత జూలై 14న సమ్మె ప్రారంభించింది. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్, ఎన్బీసీ యూనివర్సల్, పారామౌంట్, సోనీతో సహా ప్రధాన స్టూడియోల తరపున AMPTP సంప్రదింపులు చేస్తుంది. -
హాలీవుడ్లో సమ్మె సైరన్.. 60 ఏళ్ల తర్వాత ఇలా..
ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్కి పేరు. భారీ బడ్జెట్ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్. ఇప్పుడు ఆ హాలీవుడ్ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్ తప్ప యాక్షన్.. సౌండ్లాంటి షూటింగ్ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్లో వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని డబుల్ స్ట్రయిక్ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్స్ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్లు ఆగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్ యాక్టర్స్తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’, ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి నిష్క్రమణ... క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఓపెన్ హైమర్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్లో గురువారం ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి యాక్టర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్ (సమ్మె)ప్రారంభించారని టాక్. ఎమ్మీ, ఆస్కార్ అవార్డ్ వాయిదా? హాలీవుడ్లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలోవార్తలొస్తున్నాయి. ∙ సమ్మె బాధాకరం ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది. -
యూకేలో పాస్పోర్ట్ సిబ్బంది సమ్మె
లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాస్పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాస్పోర్ట్లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు. మళ్లీ టీచర్ల సమ్మెబాట యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది. -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
Russia-Ukraine War: చర్చలకు చరమగీతం
వాషింగ్టన్: మారియుపోల్లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే మారియుపోల్లో రష్యా విధ్వంసం దరిమిలా ఇకపై ఆ నగరం గతంలోలాగా ఉండకపోవచ్చని వాపోయారు. ఇటీవల కాలంలో రష్యాతో శాంతి కోసం చర్చలు జరిపామని, కానీ తాజా ఘటనలు చర్చలకు చరమగీతం పాడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ అజోవస్టాల్ స్టీల్ మిల్ ప్రాంతంలో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు ప్రతిఘటన కొనసాగిస్తున్నారు. వీరంతా ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా సైన్యం ప్రకటించింది. మారియుపోల్లో ఉన్నవారి రక్షణ గురించి బ్రిటన్, స్వీడన్ నేతలతో మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ వ్లాదిమిర్ ఫ్రోలోవ్ మరణించారు. మారియుపోల్లో తుదిదాకా పోరాడతామని ఉక్రెయిన్ ప్రధాని షైమ్హల్ ప్రకటించారు. బాంబింగ్ ఉధృతి పెరిగింది మాస్క్వా మునక తర్వాత రష్యా తన మిసైల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. ఖార్కివ్ నగరంపై దాడుల్లో ఐదుగురు మరణించారు. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. తమకు మరిన్ని ఆయుధాలందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్వివ్ నగరంపై రష్యా జరిపిన మిసైల్ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు ఈ నగరంతో సహా దేశ పశ్చిమభాగంపై రష్యా దాడులు పెద్దగా జరపలేదు. దీంతో చాలామంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు. కానీ తాజాగా ఈ నగరంపై కూడా రష్యా దాడుల ఉధృతి పెరిగింది. నగరంలోని మిలటరీ స్థావరాలు, ఆటోమెకానిక్ షాపుపై రష్యా దాడులు జరిపినట్లు నగర మేయర్ ఆండ్రీ చెప్పారు. దాడుల్లో ఒక హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కీవ్కు దక్షిణాన ఉన్న వాసైల్కివ్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నగరంలో ఒక మిలటరీ బేస్ ఉంది. ఉక్రెయిన్లోని ఆయుధ స్థావరాలను, రైల్వే తదితర మౌలికసదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు డోన్బాస్లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదన్నది రష్యా ఆలోచనగా చెబుతున్నారు. రష్యా సైతం తాము పలు మిలటరీ టార్గెట్లపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. మానవీయ కారిడార్లపై రష్యా దాడి చేస్తున్నందున పౌరుల తరలింపును నిలిపివేశామని ఉక్రెయిన్ పేర్కొంది. డోన్బాస్ నుంచి పారిపోతున్న నలుగురు పౌరులను రష్యా సేనలు కాల్చిచంపాయని ఆరోపించింది. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపునకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ ముట్టడి విఫలమైన దరిమిలా డోన్బాస్పై పట్టుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. మారియుపోల్ ఆక్రమణ ఈ దిశగా కీలక ముందడుగని నిపుణులు పేర్కొన్నారు. నగరంపై దాడిలో దాదాపు 21వేల మంది చనిపోయిఉంటారని ఉక్రెయిన్ తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు ఉన్నట్లు అంచనా. సిద్ధమవుతున్న సిరియా ఫైటర్లు ఉక్రెయిన్లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందంటున్నారు. జనరల్ అలెగ్జాండర్ను ఉక్రెయిన్పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే! గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
పేదల స్థలాలను అడ్డుకుంటే పుట్టగతులుండవు
తాడికొండ: పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపును అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షాలకు పుట్టగతులు ఉండవని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా నరసింహులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీక్షలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు రాష్ట్ర సమానాభివృద్ధి, వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించాల్సింది పోయి అభాండాలు వేసి అభాసుపాలు చేసేందుకు కోర్టులను ఆశ్రయిస్తూ చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారన్నారు. అవరోధాలతో అభివృద్ధిని ఆపలేరని, ప్రతి మనిషికీ కావలసిన కనీస సౌకర్యమైన సొంత స్థలం, ఇంటి నిర్మాణం కోసం రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తుంటే చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వికలాంగుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కిరణ్రాజ్ మాట్లాడుతూ నిరుపేదలు, దివ్యాంగులను నిరాశ్రయులను చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్న బాబుకు తమ ఉసురు కచి్చతంగా తగులుతుందన్నారు. -
మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో కొనసాగుతున్న రిలే దీక్షలు
తాడికొండ: పరిపాలన వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కేవలం తమ వర్గం వారి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆయన ఏనాడూ న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకుంటున్న ఆయనకు పేదలపై ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్షాల నాయకులు పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అమరావతి రాజధాని కన్వీనర్ మల్లవరపు నాగయ్యమాదిగ, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పిడతల అభిషేక్, ఎంఏసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాంబయ్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొదమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రోజుకు మత్స్యకారుల దీక్షలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలంటూ దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మత్స్యకార యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసినట్లయితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని దీక్షాలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. మత్స్యకార నాయకుడు జానకిరామ్ చేపట్టిన ఈ దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ కే. రాజు మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని కే. రాజు ధీమా వ్యక్తం చేశారు. -
మార్పు మంచికే..!
సాక్షి, హైదరాబాద్: ఓ 25 రోజుల క్రితం.. అసలు ఆర్టీసీ మనుగడ ఏంటన్న పరిస్థితి. సంస్థ ఉంటుం దా లేదా అన్న అనుమానం. మోయలేని నష్టాలు, భరించలేని అప్పులు.. ఆర్టీసీని దెబ్బతీశాయి. అలాంటి ఆర్థిక సంక్షోభంతోనే రికార్డుస్థాయి సమ్మె జరిగేలా చేసింది. కానీ... సమ్మెకు పూర్వం ఆర్టీసీలో పరిస్థితి, ప్రస్తుత స్థితిలో ఎంతో తేడా. పని ప్రారంభించిన ఈ 25 రోజుల్లో ప్రత్యక్షమైన వాతావరణానికి గత స్థితికి పొంతనే లేదు. ఇటు కార్మికుల్లో, అటు అధికారుల ప్రవర్తనలో కొట్టొచ్చే తేడా.. వెరసి ఆర్టీసీ స్వరూపాన్నే మార్చే సంకేతాలిస్తున్నాయి. ఆర్టీసీ ఉండదేమో అనుకున్న స్థితిలో ఆందోళనకు గురైన సిబ్బంది, అధికారులు... సంస్థ కొనసాగటంతో ఊరట చెంది కొత్త ఉత్సాహంతో సవాల్గా స్వీకరించి పని ప్రారంభించమే దీనికి కారణం. సమ్మె ముగిసిన వారంలోపే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు డిపోకు ఐదుగురు చొప్పున సిబ్బందితో ప్రగతిభవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఆ జోష్ను మరింత పెంచింది. వారి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు వరాల జల్లు కురిపించటమే కాకుండా, అధికారులు–కార్మికులు అన్న తేడా లేకుండా అంతా కలిసి సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలంటూ చేసిన సూచనలు మంచి మార్పును తెచ్చాయి. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరిగిన చార్జీలు తెచ్చే అదనపు ఆదాయం కంటే.... ఇరుపక్షాల్లో వచ్చిన మార్పు వల్ల మనస్ఫూర్తిగా పనిచేసే తత్వం పెరిగి సంస్థ పురోగతిలో కనిపిస్తున్న బూస్టప్ పెద్దది. ఈ 25 రోజుల్లో మారిన పరిస్థితిపై అధికారులు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇలా... గైర్హాజరీ అప్పుడు ఇప్పుడు 10 % 03% సమ్మెకు పూర్వం చాలా డిపోల్లో చెప్పా పెట్టకుండా సిబ్బంది గైర్హాజరవటం ఉం డేది. డ్యూటీ బుక్కైన తర్వాత కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నఫళంగా విధులకు గైర్హాజరయ్యేవారు. వేరే సిబ్బందిని కేటాయించే వీలు లేక కొన్ని సర్వీసులు డిపోలకే పరిమతమయ్యేవి. సగటున పది శాతం మంది సిబ్బంది ఈ జాబితాలో ఉండేవారు. ఫలితంగా ప్రయాణికులకు, ఆదాయం పరంగా ఆర్టీసీకి ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు తీరు మారింది. ఆరోగ్య సమస్యలతో మినహా ఈ తరహా గైర్హాజరీ 3 శాతానికి తగ్గిపోయింది. పంక్చువాలిటీ: అప్పుడు ఇప్పుడు 88% 95% ప్రతి బస్సుకు సమయం ఉంటుంది. దాని ఆధారంగా సిబ్బంది డ్యూటీ సమయాలు షెడ్యూల్ అవుతాయి. కానీ మొత్తం సిబ్బందిలో సగటున 12 శాతం మంది దీన్ని పాటించేవారు కాదు. సరిగ్గా బస్సు బయలుదేరేవేళకు వచ్చేవారు. బస్సు సిద్ధం చేసుకుని భద్రత పరమైన వ్యవహారాలు చూసుకుని బస్సు హ్యాండ్ ఓవర్ చేసుకునే డ్యూటీ టేకింగ్ ఓవర్కు 20 నిమిషాల సమయం అవసరం. దీంతో బస్సు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చేది. దీనివల్ల అన్ని పాయింట్లకు బస్సు ఆలస్యంగా వెళేంది. ఇప్పుడు సగటున 5 శాతం మంది తప్ప మిగతావారంతా రావాల్సిన సమయానికి కనీసం ఐదు నిమిషాలు ముందే ఉంటున్నారు. పద్ధతిగా బస్సు అప్పుడు ఇప్పుడు 60% 95% బస్సు ఏ ప్రాంతానికి వెళ్తుందో తెలియాలంటే ముందు, వెనక బోర్డు ఉండాలి. తర్వాత సీట్లు, ఫ్లోర్ చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండాలి. ఇదంతా డ్రైవర్, కండక్టర్లపై ఆధారపడి ఉంటుంది. గతంలో దాదాపు 40 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. అందుకే చాలా బస్సులు దుమ్ముకొట్టుకుపోయి ఉండటం, బస్సుల్లో ఊరిపేరుతో ఉండే బోర్డుల మార్పు పంక్చువల్గా లేకపోవటం, వెనకవైపు బోర్డులు ఏర్పాటు చేయకపోవటంలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వందలో ఐదు తప్ప అన్నీ పద్ధతిగా తిరుగుతున్నాయి. స్వచ్ఛంద ట్రిప్పుల రద్దు అప్పుడు ఇప్పుడు 8% 0.2% 8 గంటల డ్యూటీ విషయంలో సిబ్బంది పట్టింపుగా ఉంటారు. రకరకాల కారణాలతో చివరి ట్రిప్పు ఆలస్యంగా మారినప్పుడు కొందరు మధ్యలోనే దాన్ని మళ్లించి డిపోకు వచ్చేవారు. ఇలా బస్సులు తిరగాల్సిన మొత్తం కిలోమీటర్లలో నిత్యం సగటున 8 శాతం కోతపడేది. ఇప్పుడు అది కేవలం 2 శాతంగా ఉంటోంది. సిబ్బంది– అధికారుల మధ్య సత్సంబంధాలు అప్పుడు ఇప్పుడు 80% 90% కార్మిక సంఘాల ఎన్నికలు విషయంలో తప్ప కొత్త సమస్యలు పెద్ద గా లేవు. దీంతో గతంతో పోలిస్తే సంబంధాలు మెరుగుపడ్డాయి. తొలి పక్షం రోజులు మరింత మెరుగ్గా ఉంది. గత వారం రోజులుగా కొన్ని డిపోల్లో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అప్పుడు ఇప్పుడు 20% 5% ప్రయాణికులున్నా బస్సు ఆపకపోవటం, టికెట్ల జారీ, చిల్లర ఇచ్చే విషయం, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించటం... గతంలో ప్రతి డిపోలో సగటున నిత్యం మూడు నుంచి నాలుగు ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి అందేవి. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఉన్నతాధికారులకూ ఫిర్యాదులు వచ్చేవి. 20 శాతం మందిపై ఈ తరహా ఫిర్యాదులుండేవి. ఇప్పుడవి 5 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు చెయ్యెత్తినా బస్సు ఆపుతున్నారు. -
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి. -
‘ఎన్నికల్లో అక్రమాల’ కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: ఎన్నికల అక్రమాలను తక్షణ అరెస్టుకు వీలైన నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘వాదనలు విన్నాం. ఈ పిటిషన్ను కొట్టేస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల అక్రమాలుగా పరిగణించే డబ్బులు పంచడం, తప్పుడు ప్రకటనలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ద్వారా జరిగే పలురకాల దుర్వినియోగం తదితర అక్రమాలను తక్షణం అరెస్టుకు వీలుకల్పించే నేరాలుగా పరిగణించాలని, కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్లో పేర్కొన్నారు. 2000 తర్వాత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన తెలిపారు. -
వారి డిమాండ్లు తీర్చరా?
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్రావు గారికి, విద్యుత్ కాంట్రాక్టు (ఆర్టిజాన్) కార్మికుల సమ్మె గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురు కుగా పాల్గొన్న ప్రక్రియ కూడా మీకు తెలుసు. ఈ కార్మికులనుద్దేశించి మింట్ కాంపౌండ్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డుతూనే వాళ్లందరి సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్న సభలో నేను కూడా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడి నాలు గేళ్లైంది. ఇక ఎన్నికలకు పది నెలలు మాత్రమే మిగి లాయి. గతంలో వీళ్లు చేసిన రెండు సమ్మెల ఫలి తంగా వీళ్లని ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్టు ఉద్యమంగా మారుస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా హర్షించాం. అదే క్రమంలో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వం సాధించగలిగింది. ఈ సాధనలో 23వేల మంది కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఏమిటో మీకు తెలుసు. అది గుర్తించే వీళ్లందరినీ పర్మ నెంట్ చేయాలనే ఒక నిర్ణయం మీరు తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒక కీలకమైన నిర్ణయం. విద్యుత్ బోర్డుకు సారథ్యం వహిస్తున్న ప్రభాకర్ రావు నేతృత్వంలో, సాధక బాధకాలను, చట్టపర అడ్డంకులను పరిశీలించాకే ఈ 23 వేల మందిని నాలుగు కేటగిరీల కింద విభజించి చాలా శాస్త్రీయం గానే వీళ్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీఓను విడు దల చేసింది. దీనిని సవాలు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో ఎవరో ఒక అనామకుడు కోర్టులో ప్రజా వ్యాజ్యం కింద కేసు వేశాడు. కోర్టు దీనిమీద స్టే ఇచ్చిన విషయం మీకు తెలుసు. అప్పట్లో కోర్టు డైరెక్టు పేమెంటును సమర్థించింది. అంటే కాంట్రా క్టర్ల వ్యవస్థను తిరస్కరించింది. మీరు ఇంత ప్రతి ష్టగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కౌంటర్ వేసి అప్పటి అడ్వొకేట్ జనరల్ ద్వారా వాదనలు విని పించి స్టేను ఎత్తివేసే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది. ఇదంత కష్టమైన పనేం కాదు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 30 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సర్వీసులని క్రమబద్ధీకరించారు. కోర్టు స్టే తర్వాత కౌంటర్ వేయడంలో కాని ఈ ఉద్యోగుల క్షేమ సమాచారాలను కాని ప్రభుత్వం పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదని మేం భావిస్తున్నాం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సంద ర్భంలో మీరు ఒక ఇంక్రిమెంట్ ప్రకటించినప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఈ 23 వేల మందికి ఇవ్వలేదు. ఈ 23 వేల మంది పాత్ర లేకుండానే 24 గంటల విద్యుత్ సాధ్యమయ్యిందా? పర్మినెంట్ చేయాలని నిర్ణయిం చినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎందుకు అంత వెనుకంజో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇంక్రి మెంట్ కానీ లేదా వాళ్లకు అంగీకరించిన టైం స్కేళ్లు ఇవ్వడానికి కోర్టుకు ఏం అభ్యంతరం ఉంటుంది? అభ్యంతరమల్లా క్రమబద్ధీకరణ మీదే. విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీసు దాదాపు 40 రోజుల కిందే ఇచ్చారు. ప్రభుత్వం ఏదో సహాయం చేద్దామంటే సమ్మెకు నోటీస్ ఇవ్వడమేంటి అని ప్రభు త్వం భావించి ఉండవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను కోర్టులో సకాలంలో సమర్థించు కోలేకపోతే, ఆ దిశలో ఏం చర్యలు తీసుకోకపోతే కార్మికులు ఏం చేయాలి? తెలంగాణ ప్రకటించి జాప్యం చేస్తే మనం ఉద్యమాలు చేయలేదా? ఉద్య మాలు చట్టబద్ధం కాదు, సమ్మెచేస్తే చర్యలు తీసు కుంటాం అని అంటే, వేరే మార్గాలేమిటో ప్రభుత్వం సూచించాలి. సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టు కున్నారు. ఒకటీ రెండు సందర్భాలలో ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారిని కార్మికులు కలిసినప్పుడు నేను కూడా వెళ్లాను. ఇవ్వన్నీ పాత డిమాండ్సే కదా అన్ని పరిశీలనలో ఉన్నాయని మాత్రం సమాధానం చెప్పారు. రెండు, మూడు రోజుల క్రితం లేబర్ కమి షనర్ చర్చలకు పిలిచి ప్రతి డిమాండ్కు యాంత్రి కంగా స్పందించారే తప్ప, పరిష్కారాలను సూచించ లేదు. సమ్మె హక్కు రాజ్యాంగంలోనే ఉంది. బ్రిట న్లో సమ్మె హక్కు లేదు. కానీ సంప్రదింపుల యంత్రాంగం చాలా పటి ష్టంగా ఉంది. ఈ సమ్మెను మీరు సరిౖయెన స్ఫూర్తితో అవ గాహన చేసుకొని సంప్రదింపులు జరిపి తగు నిర్ణ యాలు తీసుకోండి. వారి డిమాండ్లలో క్రమబద్ధీ కరణ అంశం కోర్టు ముందు ఉంది కాబట్టి దాని విష యంలో తక్షణమే కౌంటర్ వేసి అవసరమైతే సుప్రీం కోర్టు లాయరుకు అప్ప జెప్పండి. మీరే అంగీకరించి జీవో ఇచ్చిన జీతభత్యాలను, అంటే నాలుగు స్కేళ్లను అమలు చేయండి. కోర్టు అభ్యంతరం చెబితే ప్రభుత్వ దృక్పథాన్ని, వాదనని కోర్టుకు చెప్పి ఒప్పిం చేలా ప్రయత్నం చేయండి. రాజకీయాలంటేనే సమస్యలను పరిష్కరించడం. సమ్మెను శాంతి భద్ర తల సమస్యల్లా చూడకండి. తక్షణమే స్పందించి, మీరు తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయండి అంటున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేసే డిమాం డ్లను సుముఖంగా పరిష్కరించండి. గౌరవ అభినందనలతో... ప్రొ జి. హరగోపాల్ వ్యాసకర్త విద్యుత్ కార్మికుల సలహాదారు -
ఏకాభిప్రాయం కుదిరేనా?
వేతనాల పెంపు, హాఫ్ కాల్షీట్ రద్దు వంటి తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లైట్స్మన్ స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్తో లైట్స్మన్ యూనియన్ చర్చలు జరిపింది. కానీ, చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధర్నా చేసేందుకు గురువారం ఫిల్మ్ చాంబర్కు వెళ్లింది లైట్స్మన్ యూనియన్. గురువారం సాయంత్రం యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ– ‘‘24 యూనియన్స్లో 23 యూనియన్స్కు అగ్రిమెంట్స్ అయ్యాయని తెలిసింది. మాకు అగ్రిమెంట్ పేపర్స్ వచ్చాయని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ధర్నాను నిలిపివేశాం. మరోసారి చర్చలు జరపనున్నాం. ఈ సమావేశంలోని నిర్ణయాలు మాకు సానుకూలంగా రాకపోతే బంద్ను కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. పూర్తి వివరాలు అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత తెలియజేస్తాం’’ అన్నారు. -
కాంగ్రెస్లో అలజడి
అధికార కాంగ్రెస్ భగ్గుమంది. టికెట్లు దక్కకపోవడంతో ఎక్కడికక్కడ అసంతృప్తులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేయడంతో అలజడి రేగింది. కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేవరకూ వెళ్లింది. బెంగళూరులో కేపీసీసీ కార్యాలయం కూడా నిరసనలతో హోరెత్తింది. అసంతృప్తులు సహజమేనని సీఎం సిద్ధరామయ్య అన్నారు. సాక్షి, బెంగళూరు:ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎంతో కసరత్తు చేసి ఆదివారం రాత్రి విడుదల చేసిన 218 మంది అభ్యర్థుల జాబితా అగ్గి రాజేసింది. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అగ్రహోదగ్రులైన నాయకులు ఆందోళనలకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలు, నిరసనలతో పాటు పార్టీ కార్యాలయాల్లో విధ్వంసానికీ వెనుకాడలేదు. హైకమాండ్ నుంచి టికెట్ రాకపోతే రెబల్స్గా బరిలో దిగుతామంటూ హెచ్చరించారు. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. దీంతో వారితో పాటు ఇతర ఔత్సాహికులు ఆందోళనకు దిగారు. భగ్గుమన్న ఆగ్రహం ♦ బ్యాడిగె ఎమ్మెల్యే బసవరాజు నీలన్నకు టికెట్ రాకపోవడంపై ఆయన మద్దతుదారులు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ♦ తిపటూరు ఎమ్మెల్యే షడక్షరీ అనుచరుడు ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ♦ నెలమంగళ మాజీ ఎమ్మెల్యే అంజనమూర్తి మద్దతుదారులతోకలిసి నీలంబగల్ జాతీయ రహదారిపై కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ♦ బాగల్కోటలో ఆర్బీ తిమ్మాపుర అనుచరులు టైర్లను కాల్చి నిరసన తెలిపారు. ♦ హానగల్ ఎమ్మెలే మనోహర్ తహసీల్దార్ కూడా ఆందోళనకు దిగారు. ♦ చిక్కమగళూరు టికెట్ ఆశించిన గాయత్రి శాంతిగౌడ అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ♦ జగళూరు టికెట్ ఆశించి భంగపడ్డ హెచ్బీ రాజేష్ కాంగ్రెస్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దావణగెరెలోని మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ♦ బాగేపల్లి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎం.మెహతాకు కూడా మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. ♦ బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట రాజాజీనగర, మహాలక్ష్మి లేఅవుట్ నియోజకవర్గాలకు చెందిన గిరీష్, మంజులానాయుడు ఆందోళనకు దిగారు. అదేవిధంగా దావణగెరె, బాగల్కోట ప్రాంతాల్లో కూడా అక్కడి కాంగ్రెస్ నాయకులు టికెట్ రాలేదని నిరసన తెలిపారు. టికెట్లు రాని11 మంది సిట్టింగ్లు వీరే బాదామి – చిమ్మనకట్టె; తిపటూరు – షడక్షరీ; కరికెరె – హెచ్జీ శ్రీనివాస్; మాయకొండ – శ్రీనివాసమూర్తి నాయక్; బ్యాడిగె – బసవరాజు నీలన్న శివన్నవర్; హానగల్ – మనోహర్ తహసీల్దార్; విజయపుర – ముకుల్ భగవంత్; జగలూరు – రాజేష్; సిరిగుప్ప – బీఎం నాగరాజు; కొల్లెగళ – జయన్న; కల్బుర్గి గ్రామీణ – బి.రామకృష్ణ రెబల్గా పోటీ చేస్తాం సీఎం సిద్ధరామయ్యతో కలిసి చర్చించాం. టికెట్ ఇస్తారనే ఆశ ఉంది. నియోజకవర్గం నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ టికెట్ రాకపోతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతానని శిరిగుప్ప ఎమ్మెల్యే నాగరాజు, బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టె తెలిపారు. ఎమ్మెల్యేలు బసవరాజు నీలన్న, శివన్నవర్, షడక్షరీ, శివమూర్తి తదితరులు కూడా తిరుగుబాటలో ఉన్నారు. -
రేపటి నుంచి ఓలా, ఉబర్.. బంద్!
సాక్షి, హైదరాబాద్ : యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 19న దేశవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేయనున్నారు. ఈ సమ్మె ముఖ్యంగా ముంబాయి, బెంగుళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, పుణే లాంటి ముఖ్య నగరాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు ఈ పోరాటానికి సిద్ధమవుతున్నారు. గతంలో అనేకసార్లు నిరసనలు, సమ్మెలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో మరోసారి సమ్మెబాట పడుతున్నారు. రేటిటినుంచి సమ్మె ప్రారంభం కానుందని ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ప్రతినిధి సంజయ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయని చెప్పారు. ఎన్నో ఆశలతో ఏడు లక్షల వరకు ఖర్చు చేసి క్యాబ్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఓలా, ఉబెర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని నాయక్ తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
పోరాటమే జీవితం
సాక్షి, కామారెడ్డి: బీడీలు చుట్టిన చేతులు పిడికిలి బిగించాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై పోరాటమే ఆమె జీవితంలో భాగమైంది. పోలీసు కేసులు, అరెస్టులకు వెరవకుండా తన జీవితాన్ని మహిళా, కార్మిక పోరాటాలకే అంకితం చేసింది. పాతికేళ్లుగా ఆమె కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన అనసూయ 1991లో శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్లో చేరింది. అప్పటి నుంచి నేటిదాకా ఉద్యమాలకే అంకితమైంది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఆమె ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించింది. చింతకుంటలో మహిళలపై అత్యాచారం, శివాయిపల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం తదితర సంఘటనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అనసూయ చురుకుగా పాల్గొంది. అంతేగాక బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తూ వస్తోంది. కార్మిక, మహిళా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయ జనశక్తి నక్సల్ నేత లక్ష్మీరాజం ఉరఫ్ గొడ్డలి రామన్నను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కూతురు వెన్నెల. అనసూయ భర్త రామన్న 2000 సంవత్సరంలో మర్రిపల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు. భర్త మరణంతో తోడును కోల్పోయిన అనసూయ కూతురి బాధ్యతను మోస్తూనే తాను ఎంచుకున్న మహిళా, బీడీ కార్మిక ఉద్యమాలను వదిలిపెట్టకుండా ఉద్యమాలకు అంకితమైంది. ప్రస్తుతం అనసూయ కూతురు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతోంది. కాగా మహిళా, కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయపై అప్పట్లో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఓ సారి వరంగల్ జైలులో పది రోజులు, నిజామాబాద్ జైల్లో పన్నెండు రోజులు ఉండాల్సి వచ్చింది.\ అలుపెరుగని పోరు.. మహిళలు, బీడీ కార్మికుల సమస్యలపై అనసూయ అలుపెరుగని పోరాటం చేస్తోంది. పాట, మాటతో మహిళల్ని చైతన్యం చేస్తున్న అనసూయ అలుపెరుగకుండా ఉద్యమాల్లో పాల్గొంటోంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళల్ని పోగుచేసి ఉద్యమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ఐక్యవేదిక ద్వారా రాష్ట్ర సాధనోద్యమంలోనూ అనసూయ చురుకుగా పాల్గొంది. అలాగే గోదావరి జలాల సాధన కోసం జరిగిన పాదయాత్రలు, ఆందోళన కార్యకమ్రాల్లో ఆమె పాల్గొన్నారు. అరుణోదయ విమలక్కతో కలిసి బహుజన బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొని తన వాణిని వినిపించేది. కాగా మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై జరిగిన పోరాటాల ఫలితంగా అరెస్టులు, శిక్షలు పడ్డాయి. బతికున్నన్ని రోజులూ ప్రజలతోనే.. బతికున్నన్ని రోజులు మహిళలు, కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తా. ప్రజలతోనే నా జీవితం కొనసాగుతోంది. మహిళలపై ఇప్పటికీ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించేందుకు మహిళల్ని చైతన్యం చేస్తూనే ఉంటా. పోరాడితే పోయేదేమి లేదు. సమస్య ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మహిళలకు ఇంటా, బయట అనేకరకాలుగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు సంఘటితం కావాలి. –అనసూయ, మహిళా నాయకురాలు కామారెడ్డిలో బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న అనసూయ(ఫైల్) -
ఫలించిన ఎమ్మెలే విశ్వ పోరాటం
ఉరవకొండ: పట్టణంలోని అర్హులైన పేదలకు జానెడు జాగా ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్ దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. 2008లో మహనేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయంలో ఉరవకొండ పట్టణంలోని నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 88 ఎకరాల స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత పేదలకు పట్టాలు పంచి పెట్టడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అటు ప్రభుత్వంపై ఇటు ఉన్నతాధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇంటిపట్టాల పంపిణీ ప్రక్రియకు ఇప్పటికి మోక్షం కల్గింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు క్షేమం పట్టని ప్రభుత్వం
- ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో అన్యాయం - పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం - ఉరవకొండ ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం ఉరవకొండ : జిల్లా రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, రుణమాఫీ కాక అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నా వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఏ కోశానా లేదన్నారు. రైతాంగ సమస్యలతో పాటు చేనేత, ఉరవకొండ పట్టణ సమస్యలపై బుధవారం స్థానిక కవితా హోటల్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తీవ్ర కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా సర్కారు చోద్యం చూస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రూ.1,030 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.500 కోట్లు విడుదల చేసినా, రాష్ట్రవాటా రూ.500 కోట్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుండటంతో కూలీలు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజల మట్టం పడిపోయిందని, 75వేల బోర్లు ఎండిపోయాయని వివరించారు. పశువులకు మేత, నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇంకుడు గుంతల్లో దోపిడీ జిల్లాలోని టీడీపీ నేతలకు ఇంకుడు గుంతల తవ్వకం పనులు కాసులు కురిపిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం పది లక్షల ఇంకుడు గుంతలు తవ్వాల్సి ఉండగా..ఇందులో 3.50 లక్షలు పూర్తి చేశారన్నారు. ఇంకా 7.50 లక్షలు తవ్వాల్సి ఉందని, వీటిలోనూ నిధులు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రూ.1200 కోట్లతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారని, ఇందులో సగానికి పైగా నిధులు స్వాహా చేశారని అన్నారు. మొక్కల పెంపకంలోనూ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ కిసాన్సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఉపసర్పంచ్ జిలకరమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేయండి
అనంతపురం న్యూసిటీ : టీడీపీ ప్రభుత్వ అనైతిక చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అనంతపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన వారిని చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకోవడం ఆయన దిగుజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగ విలువలను కాలరాశారన్నారు. సీఎం తీరుపై వారి సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయన్నారు. నీతి, నిజాయితీ, నిప్పు అని చెప్పే చంద్రబాబు ఇంతటి నీచానికి దిగజారడం దారుణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అది తప్పని చెప్పిన సీఎం, ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల్లో టీడీపీపై పూర్తిస్థాయిలో వ్యతిరేక వచ్చిందన్నారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గురునాథ్రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ నీచ వైఖరిని ఎండగట్టేందుకు చేపట్టిన ధర్నాకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాలవారు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికుల ధర్నా
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 220 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం ఆందోళనకు చేపట్టారు. తమకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణం ముందుకు ధర్నాకు దిగారు. ఔ వేతనాలు చెల్లించి తమను క్రమబద్ధీకరించేంత వరకు విధులకు హాజరు కాబోమంటూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల ఆందోళన కారణంగా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వచ్చి రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. -
రేపు సీపీఐ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ యార్డుల ఎదుట ధర్నాలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి మొద లైన నేపథ్యంలో ఉపాధి కూలీలకు ప్రభు త్వం తాగునీరు సరఫరా చేయాలని, పని కల్పించాలని, ఎండలు ముదిరిన పుడు ఉచితంగా బియ్యం, పప్పులు అం దించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇబ్బందు ల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలబడేలా ఈ నిరసనలు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. నిధుల కొరత తో మిర్చి, కందుల కొనుగోలు చేయలేక పోతున్నామని, సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుందన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్
అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్రను వ్యతిరేకిస్తూ యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. దాదాపు మూడు వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సాయినగర్లోని ఎస్బీఐ వద్ద మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్యాంకు ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు రుషేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, బ్యాంకు ఉద్యోగుల వ్యతిరేకమైన సంస్కరణలు చేపడుతోందని ఆరోపించారు. రూ.90 లక్షల కోట్లు ప్రజాధనం స్వదేశీ, విదేశీ కంపెనీల పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బ్యాకింగ్ రంగం ప్రైవేటు దిశగా సాగుతోందని, పారిశ్రామిక తమకు అనుకూలంగా సవరించుకుంటోందని హెచ్చరించారు. కోట్లాది మంది బ్యాంకు ఉద్యోగులు, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు ఐక్యమత్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దనోట్ల రద్దు ద్వారా బ్యాంకులకు ఏర్పడిన లోటును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, బ్యాంకుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు మున్వర్బాషా, ఖాధర్బాషా, వీరభద్రారెడ్డి, శివకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
అనంతపురం అర్బన్ : తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షని బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు జె.నాగరాజనాయక్, హెచ్.నరసింహప్ప, జి.గోవిందు, కె.వెంకటేశ్వరరాజులు నిరాహార దీక్షని ఈ నెల 27న చేపట్టారు. రెండవ రోజైన బుధవారం దీక్ష కొనసాగించారు. రాత్రి 8.30 గంటల సమయంలో వన్ టౌన్ సీఐ రాఘవన్ నేతృత్వంలో ఎస్ఐ రంగడు, తన సిబ్బందితో అక్కడి చే రుకుని దీక్ష చేస్తున్నవారికి వైద్యుల చేత ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు, మిగతా ముగ్గురూ అస్వస్థతకు గురవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో నలుగురి దీక్షని పోలీసులు భగ్నం చేసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల రిలేదీక్ష
రామాయంపేట: రెవెన్యూ డివిజన్కోసం రామాయంపేటలో దీక్షలు కొనసాగుతున్నారుు. 80 రోజులకు చేరుకున్నారుు. ఆదివారంనాటి దీక్షలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశం, యాదగిరి, శ్రీనివాస్, సంతోష్, నరేశ్, నారాయణరెడ్డి, ప్రమోద్, నరేందర్, లింగం, భాను, బాల్రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. దీక్షలకు అఖిలపక్ష కన్వీనర్ వెల్ముల సిద్దరాంలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేశ్రెడ్డి, ఇతర నాయకులు తీగల శ్రీనివాసగౌడ్, సుధాకర్రెడ్డి, అహ్మద్, చింతల రాములు, చింతల క్రిష్ణ, చింతల స్వామి, వెంకటి, మోతుకు రాజు, శేఖర్, దయానందరెడ్డి, నవాత్ రాజేంద్రప్రసాద్, మంగళి ముత్తయ్య, మర్కు రాములు, బాలచంద్రం, దోమకొండ యాదగిరి మద్దతు తెలిపారు. -
పీఆర్సీ కోసం దశలవారీ ఆందోళనలు
అనంతపురం అర్బన్ : మోడల్ స్కూల్ టీచర్లకు తక్షణమే పీఆర్సీని వర్తింపజేయాలని, లేకుంటే దశలవారీ కార్యక్రమాలతో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆ పాఠశాలల జేఏసీ చైర్మన్ యనమల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోడల్ స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాళ్లు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్షి, చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి మూడేళ్లు పూర్తయినా వారి సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసి రెండేళ్లు దాటినా తమకు వర్తింపజేయలేదన్నారు. ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు, పీఎఫ్, ఏపీజీఎల్ఐసీ అమలు చేయడం లేదన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో మల్లీశ్వరిదేవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ గేయానంద్, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్నాథ్రెడ్డి, ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానందరెడ్డి, ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఓబుళరావు, ఇతర సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో ఆదర్శ పాఠశాలల జేఏసీ నాయకులు వై.భాస్కర్రెడ్డి, విజయనరసింహ, పద్మశ్రీ, స్వర్ణలత, ప్రకాశ్నాయుడు, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ‘వికారాబాద్’ ఆందోళనలు
సీఎం దిష్టిబొమ్మ దహనం మోమిన్పేట: రంగారెడ్డి జిల్లాను రెండుగానే విభజించాలని అఖిలపక్ష నాయకులు గురువారం మండల కేంద్రంలో ర్యాలీ, మానవహరం నిర్వహించారు. మండల పరిధిలోని వెల్చాల్లో రోడ్డుకు అడ్డంగా మిషన్ భగీరథ పైపులను వేయడంతో నాలుగు గంటలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మోమిన్పేటలో అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. జిల్లాను రెండుగానే విభజించాలన్నారు. డ్రాప్టు నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం వెలువరించిన 19మండలాలలతో కూడిన జిల్లానే కావాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మోమిన్పేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పాలన పరంగా జిల్లా ప్రజలందరికి అందుబాటులో ఉండేలా వికారాబాద్ పేరు మీదనే జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ కోణంతో కాకుండా విభజన శాస్త్ర్రీయపరంగా చేయాలన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇజాజ్పటేల్, టీడీపీ మండల అధ్యక్షుడు సిరాజోద్దీన్, మోమిన్పేట సర్పంచ్ వడ్ల చంద్రయ్య, నాయకులు ఒగ్గు మల్లయ్య, మాణయ్య, చంద్రకాంత్, సురేందర్, హఫిజ్ఖాన్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సాధన దీక్షలు ప్రారంభం
మేడ్చల్: మేడ్చల్ జిల్లా సాధన కోసం.. జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం పట్టణంలో దీక్షలు ప్రారంభించారు. మేడ్చల్లోని వివేకానందుడి విగ్రహం వద్ద శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు రాగజ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’పై న్యాయపోరాటం
తొగుట: చట్టబద్ధత లేని జీఓలతో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఏటిగడ్డ కిష్టాపూర్, వేములగాట్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం సంఘీభావం తెలిపిన ప్రసంగించారు. తడ్కపల్లి వద్ద 1.5 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించాల్సిన రిజర్వాయర్ను కుట్ర పూరితంగా తొగుటకు తరలించారని ఆరోపించారు. రీ డిజైన్ పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్కు శాస్త్రీయత లేదని స్పష్టం చేశారు. జాతీయ హోదా కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి గ్రామాలను ముంపునకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన 123. 214 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి గ్రామాలు మునిగిపోకుండా ప్రజలను, గ్రామాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, గ్రామ సర్పంచ్ దాతారు సునందబాయి తదితరులు పాల్గొన్నారు. గ్రామాన్ని కాపాడుకునేందుకే దీక్షలు కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకే దీక్షలు చేపట్టినట్లు ఎర్రవల్లి గ్రామ ప్రజలు తెలిపారు. శుక్రవారం పలువురు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ నర్సింలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని వివరించారు. వీరికి మద్దతుగా వృద్ధులు అనాజి పోశవ్వ, తూర గంగవ్వ, సాకం ఐలవ్వ, గౌండ్ల భూమవ్వ, బక్క అక్కవ్వ దీక్షలో కూర్చున్నారు. సీపీఐ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా వృద్ధులు మాట్లాడుతూ ప్రాణాలు పోయినా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో తమ గ్రామం మునిగి పోకుండా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, సత్తయ్య, నర్సింలు, నాగరాజు, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘మల్లన్న సాగర్’ నిర్మాణం తగదు: చాడ కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ చేపట్టడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. 70, 80 శాతం మంది ప్రజల ఆమోదయోగ్యం లభించినప్పుడే నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో చేపట్టిన మల్లన్నసాగర్ ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండానే ఒకేచోట 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని చూడటం దారుణమన్నారు. తడ్కపల్లి వద్ద ఒక్క టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ ఇచ్చాకే భూసేకరణ చేయాలని చాడ డిమాండ్ చేశారు. -
వింత నిరసన...
అధికారులు ఏదైనా పనిని సకాలంలో చేయకపోతేనో, అసలు సమస్యలను పట్టించుకోకపోతేనో... జనం నిరసన తెలపడం సహజం. ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, చీపుళ్లు, బిందెలతో ప్రదర్శనలు... ఇవన్నీ రొటీన్. మహారాష్ట్రలోని బుల్దానా చత్రపతి శివాజీ మార్కెట్ వద్ద రోడ్డు గోతులు పడి పూర్తిగా పాడైపోయిందట. స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పబ్లిక్ వర్క్స్ విభాగం వారు అటువైపు కన్నెత్తి చూడలేదట. దాంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు పీడబ్ల్యూడీ అధికారులు మీటింగ్లో ఉండగా... లోనికి చొచ్చుకొచ్చి ఒక్కసారిగా ‘నాగిని డ్యాన్స్’ మొదలుపెట్టారంట. అందరూ మూకుమ్మడిగా నాగిని డ్యాన్స్ చేస్తూ తమ చుట్టూ తిరుగుతుండటంతో అధికారులు బిక్కమొహం వేశారట. -
ప్రజల నెత్తిన సమ్మెట
ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వోద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఇదే అదునుగా మరికొన్ని శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు. ఫలితంగా ప్రభుత్వంలో పాలన స్తంభించింది. ప్రభుత్వం సైతం సవాలు విసురుతున్నట్లుగా వ్యవహరిస్తూ సమ్మె కాలానికి జీతం చెల్లించేది లేదని ప్రకటించింది. * శాఖల వారీగా సమ్మెలు * సమ్మె కాలానికి జీతం కట్ * నేతన్నల దీక్షలు * తాజాగా జూడోల హెచ్చరిక చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని తదితర 20 డిమాండ్లపై తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమ డిమాండ్ల ఊసే లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జిల్లా కలెక్టర్ల, తహశీల్దార్ల కార్యాలయాల ముందు వంటావార్పుతో తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం నాటి సమ్మె సమయంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీకి దిగడంతో శుక్రవారం నుంచి సమ్మెను మరింత తీవ్రతరం చేశారు. ఈ కారణంగా సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ఇలా ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నర్సులు సమ్మెకు పూనుకున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్న నర్సులకు పదోన్నతులు కల్పించాలని తదితర 8 డిమాండ్లపై సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులు నర్సుల సంక్షేమ సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది తగిన హామీ ఇచ్చింది. 3,500 మంది తాత్కాలిక నర్సులను ఈనెల 10వ తేదీలోగా దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే కేవలం 400 మంది ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించి చేతులు దులుపుకుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది నర్సులు సమ్మెకు దిగారు. తేనాంపేట డీఎంఎస్ కార్యాలయం వద్ద నిరాహారదీక్షలో పాల్గొన్న ముగ్గురు నర్సులు స్పృహతప్పడంతో 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నర్సుల సమ్మె కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యసేవలు మందగించాయి. ప్రత్యేక ప్రతిభావంతులు ఆరు డిమాండ్ల కోసం జరుపుతున్న సమ్మె లాకప్డెత్ సంఘటనతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఎండలో పెట్టడంతో కుప్పుస్వామి అనే వికలాంగుడు మృతి చెందడం వారిని రెచ్చగొట్టినట్లయింది. నేతన్నల దీక్షలు: అవినాశి అత్తికడ్డవు నిలత్తడినీర్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీ నుంచి చేనేత కార్మికులు తిరుపూరు జిల్లా వ్యాప్తంగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సృ్పహతప్పడంతో ఆసుపత్రిలో చేర్చి జిల్లా నలుమూలల నిర్వహిస్తున్న నిరాహారదీక్షలను శుక్రవారం జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ మొండి వైఖరి ప్రదర్శింస్తోందంటూ 111 మంది గుండుకొట్టించుకుని నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం చేనేత ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. అలాగే శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేతపనులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 25 నుండి జూడాల సమ్మె: ఈనెల 25వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. 7వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు లోపభూయిష్టంగా ఉన్నందున దానిని సవరించాలని, ఖాళీలను భర్తీ చేయాలని తదితర 15 అంశాలతో కూడిన డిమాండ్ల సాధన కోసం సమ్మె పిలుపునిచ్చారు. మూడు రోజులుగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఈనెల 9వ తేదీన జరిపిన చర్చలు విఫలం కావడంతో 25వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు పూనుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల వేళ తమ డిమాండ్లు సాధించుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధులకు హాజరుకాని రోజులకు జీతాలు చెల్లించేది లేదనే ప్రకటనతో ప్రభుత్వం ఉద్యోగుల సమ్మెను నీరుకార్చేందుకు సిద్ధమైంది. -
ఈ ఏడాది ఉగ్రవాదుల టార్గెట్ అమెరికాపైనే..
వాషింగ్టన్: ఇప్పటి వరకు సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, భారత్వంటి తదితర దేశాలను తమ దాడులతో వణికించిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడిక తన దృష్టిని అమెరికాపై మరల్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తంలో ఐసిస్ అమెరికాలోని పలు చోట్ల దాడులు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆ దేశ పాలక వర్గాలను హెచ్చరించాయి. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ఇతర అధికారులు ఈ అంశంపై తాజాగా వివరాలు తెలియజేస్తూ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక కొత్త ఉగ్రవాద సమస్య అని అభివర్ణించారు. అది స్వయంగానైనా, వేరొకరిని ప్రోత్సహించడం ద్వారానైనా దాడులు నిర్వహించగలదని చెప్పారు. అది దాడులకు పాల్పడే ప్రాంతం పరిమితమైగానీ, విస్తృతమైగానీ ఉంటుందని చెప్పారు. ఏదేమైనా ఇసారి ఆ ఉగ్రభూతం అమెరికాపై కన్నేసిందని, ఈ సమయంలో తాము అప్రమత్తంగా ఉండకపోతే భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని పరోక్షంగా వారే దాడులు చేయడం ద్వారానైనా, వారి ద్వారా ప్రేరేపితులైన వారి ద్వారానైనా చవి చూడాల్సి వస్తుందని చెప్పారు. -
గోరఖ్పూర్లో భారీ కోండ చిలువ
-
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
డెమాస్కస్: చెప్పిన మాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటిపై కునుకులేకుండా చేస్తుంది. తమ దేశానికి చెందిన వైమానిక దళాన్ని రంగంలోకి దించి ఎక్కడికక్కడ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసిన రష్యా రాత్రిపూట కూడా దాడులు చేస్తోంది. రాత్రిపూట ప్రయోగించి నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించి సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలను కూల్చిపడేసింది. సిరియాలోని మూడు కీలక ఉగ్రవాద స్థావరాలపై భారీ మిసైల్స్తో రష్యా రాత్రి దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీని, ఆయుధ నిల్ల ప్రాంతాలను, ఇంధన స్టోరేజిలను, శిక్షణ ఇచ్చే క్యాంపులను ధ్వంసం చేసి పారేసిందని, దీంతో ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఒకప్పుడు ఘనమైన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లిన సిరియాలో నేడు ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కూడా భయాందోళనలతో తమ మాతృభూమిని వదిలి వివిధ యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో ప్రపంచంలోని శక్తిమంతమన దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు సిరియాలోని ఉగ్రవాదులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి. -
ఇమాంపేటలో గ్రామజ్యోతి బహిష్కరణ
సూర్యాపేట : సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామస్తులు సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సోమవారం ఉదయం అధికారులు గ్రామానికి వెళ్లారు. కాగా వార్డు సభ్యులు, ప్రజలందరూ సంతకాలు చేసి తాము గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తమ సర్పంచ్ రవినాయక్ గ్రామంలో ఉండటం లేదని, ఫలితంగా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడంలేదని, గ్రామ సమస్యలు పరిష్కారం కావడంలేదని వారు పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత
విజయనగరం: మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం వారు కలెక్టరేట్ ముట్టడి చేశారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టరేట్ ముట్టడిలో ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కూడా కలిసి రావడంతో భారీ సంఖ్యలో నిరసన కారులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. -
కదం తొక్కిన కార్మికులు..
- సంగారెడ్డిలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ముట్టడి - కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి - కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి - సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు సంగారెడ్డి క్రైం : రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెలు, ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ధ్వజమెత్తారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కార్మికులు స్థానిక ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం మాట తప్పారన్నారు. గత నెల 15 నుంచి కార్మికుల సమస్యలపై కార్మిక పోరుబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశామన్నారు. సర్వేలో ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని తేలిందన్నారు. కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితరులకు వేతనాలు పెంచినప్పటికీ, రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న అసంఘటిత కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలోసీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కె.రాజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ నాయకులు సర్దార్, ప్రవీణ్, నాగేశ్వర్రావు, నర్సమ్మ,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో దయానంద్కు అందజేశారు. -
నిబంధనలకు పాతర..ఊరూరా మద్యం జాతర
సాక్షి, గుంటూరు: లాటరీ ద్వారా మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న వ్యాపారులు సిండికేట్లుగా మారి జిల్లాలో దందా కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లాటరీలో దక్కించుకున్న వారి నుంచి షాపులు కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. అయితే నిబంధనలను కాదని వ్యాపారాలు చేసేందుకు సిండికేట్లు సిద్ధమవుతున్నారు. గత ఏడాది అనేక ప్రాంతాల్లో జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడం, అక్కడ మహిళలు, ప్రజాసంఘాలు తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు, పోలీసులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు సిండికేట్లు అనుకున్నచోటే దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. ప్రభుత్వ దుకాణాలు ఎక్కడ ? జిల్లాలో ఈ ఏడాది 35 ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాపారాలు ప్రారంభించగా, జిల్లాలో సగానికి పైగా ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోలేదు.ఇప్పటివరకు మద్యం షాపుల్లో ఉండే ఉద్యోగుల నియామకానికి దరఖాస్తులు కోరకపోవడం చూస్తుంటే ప్రభుత్వ దుకాణాలు కేవలం అలంకార ప్రాయంగా మారనున్నాయనే విషయం స్పష్టమవుతోంది. దేవుడి పేర్లు పెట్టటం హేయం.. మద్యం దుకాణాలకు అధిక శాతం దేవుడి పేర్లు పెట్టటం హేయమైన చర్య అని ఆధ్యాత్మిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే దుకాణాలపై దేవుడి బొమ్మలను సైతం వాడుతున్నారని, ప్రభుత్వం స్పందించి మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు పెట్టకుండా నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నడికుడి దుకాణానికి డిమాండ్ .. నడికుడి గ్రామంలో సుమారు 17 వేల మంది జనాభా ఉంది. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణం అద్దంకి-నార్కెట్పల్లి స్టేట్ హైవేకు పక్కనే ఉండటం కలిసొచ్చే అంశాలుగా మారాయి. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. టెండర్లు పిలిచినప్పుడు రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 5.20 కోట్లు బిడ్ వేసి ఈ దుకాణాన్ని దక్కించుకున్నారు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడ మరో మద్యం దుకాణం ఏర్పాటు చేయకపోవడం వెనుక అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిడే కారణంగా చెపుతున్నారు. ప్రస్తుతం ఈ దుకాణాన్ని రామారావు అనే వ్యక్తి దక్కించుకున్నారు.. షాపు ఎవరికి వచ్చినా 50 శాతం వాటా ఇవ్వాల్సిందే ... నడికుడిలో మద్యం షాపు ఎవరు దక్కించుకున్నా 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట డివిజన్లో ఓ ముఖ్య నేత తనయుడు, ఓ సీనియర్ ఎమ్మెల్యే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తమకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. నడికుడి మద్యం దుకాణానికి రూ.1.50 కోట్లు ఇచ్చి కొను గోలు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ అధికార పార్టీ ముఖ్యనేతకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. -
భూప్రకోపానికి మరోసారి భీతిల్లిన నేపాల్
-
‘ఫాస్ట్’పై సర్కారు మీనమేషాలు
కోర్టుకు కౌంటర్ దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వం నామమాత్రంగానే బకాయిల విడుదల ఇంకా చెల్లించాల్సింది రూ.3,200 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాల విడుదలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం మూడు, నాలుగు సార్లు మొట్టికాయలు వేసినా, తాజాగా కోర్టుకు సమర్పించాల్సిన కౌంటర్ను కూడా దాఖలు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా, మంత్రుల ఇళ్లను ముట్టడించినా,చివరకు బంద్లకు పిలుపునిచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఉమ్మడి నిరసనలకు సిద్ధమవుతున్నాయి. మరో 2 నెలల్లోనే వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండగా, దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం తేలక ఆందోళనలకు గురవుతున్నారు. స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉపకారవేతనాలు అందుతాయో.. లేదో.. అన్న మీమాంస నెలకొంది. రూ.460 కోట్ల మేర ఫీజుల బకాయిలను విడుదల చేసినా, అవి అరకొరే అయ్యాయి. పాతబకాయిల చెల్లింపునకే ఇంకా రూ.600 కోట్లపైగా కావాల్సి ఉండగా, గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్కు రూ.2600 కోట్ల వరకు చెల్లించాలి. అన్నీ కలిపి రూ.3,200 కోట్లకు పైగా చెల్లించాలి. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీలు ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తమ డిగ్రీ చదువు పూర్తయినా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకపోవడంతో వీరు పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఈ విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటుందని విద్యార్థిసంఘాలు అంచనావేస్తున్నాయి. కర్కశంగా వ్యవహరిస్తోంది ‘‘ఫాస్ట్ పథకంపై తేల్చాలని, ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సంక్రాంతి తర్వాత విద్యార్థి సంఘాల ఉమ్మడి ఆందోళనలకు సిద్ధ మవుతున్నాం.’’ - శోభన్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు 22న ఫీజు దీక్ష ‘‘ఫీజుల రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఈ నెల 22న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నేను ఒకరోజు దీక్ష చేస్తాం. తరువాత జిల్లాల్లో రిలే దీక్షలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తాం. సమస్యపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం’’ - శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు -
అఫిడవిట్లతో వైద్య విద్యార్థులకు టెన్షన్..
17వ తేదీ నుంచి పరీక్షలు... అఫిడవిట్లు ఇస్తేనే అనుమతి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్లో హాజరు శాతం తగ్గితే అఫిడవిట్లు సమర్పించాలన్న వైద్య విద్యాశాఖ ఉత్తర్వులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు రాయాలంటే 75 శాతం హాజరు తప్పక ఉండాలి. రెండు నెలలపాటు జూనియర్ డాక్టర్లు నిర్వహించిన సమ్మెలో పాల్గొనడంతో ఎంబీబీఎస్ విద్యార్థుల హాజరు శాతం తగ్గింది. దీంతో వారంతా తల్లిదండ్రులు, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకంతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య విద్యశాఖ డెరైక్టర్ అంతర్గత ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు సమ్మెలు, ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొనబోనని పూచీకత్తు ఇవ్వాలని స్పష్టంచేసింది. దీనికి గత శుక్రవారం వరకే గడువు అని చెప్పడంతో విద్యార్థులంతా అఫిడవిట్లు సిద్ధం చేసుకొని తమ తరగతి ప్రతినిధులకు అందజేశారు. వారు వీటిని సోమవారం వైద్య విద్యాశాఖకు అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. మరోవైపు వైద్య విద్యాశాఖ నిర్ణయంపై జూడాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఫిడవిట్లన్నింటినీ సమర్పించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో విద్యార్థులున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,500 మందికి పైగా ఎంబీబీస్ చదివే వారున్నారు. అందరూ సమ్మెలో పాల్గొనలేదు. జూడాలు తరగతులు జరగనీయకుండా చేయడంతో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా, కొందరు సమ్మెలో పాల్గొన్నారు. ఎలా ఉన్నా అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందేనని వైద్య విద్యా శాఖ స్పష్టం చేసింది. అధికారుల ఆదేశాలను ధిక్కరించి అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఎదుర్కోవాలని కొందరు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అందరూ చేస్తే అధికారులే దిగి వస్తారని అంటున్నారు. కాగా, హాజరు తక్కువున్న విద్యార్థులు అఫిడవిట్లు దాఖలు చేయాలని నిర్ణయించిన విషయం వాస్తవమేనని, పదేపదే జూడాలు సమ్మెలు చేస్తున్నారని, దీని వల్ల విద్యా వాతావరణం దెబ్బతింటోందని, నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తామని వైద్య విద్యా శాఖ డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్ పేర్కొన్నారు. -
సీఆర్టీల దీక్ష విరమణ
ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్ర మ పాఠశాలల సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు)లు శుక్రవారం రాత్రి దీక్షలు విరమించారు. సమస్యల పరిష్కారం కోసం 11రోజులుగా స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అటవీ,పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సమస్యల పరిష్కారానికి హామీనిచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పదిహేను రోజుల్లో సీఆర్టీల వేతనాలను ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు. సీఆర్టీల్లో ఎస్జీటీలకు రూ.10,900, స్కూల్అసిస్టెంట్లకు రూ.14,860 పెంచుతామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందించిన తర్వాత ప్రభుత్వం వేతన పెంపును అమలు చేస్తుందని చెప్పారు. క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అని, అన్ని శాఖల్లో విధులు నిర్వర్తించే కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వర్తించే వారికి ఒకే విధమైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు రూపొందించే అధికారుల కొరత ఉందని, స్వామినాథన్ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తి కాగానే రాష్ట్రంలో సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని వివరించారు. 11రోజుల దీక్ష కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించాలని ఐటీడీఏ పీవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఐటీడీఏ పీవో ప్రశాంత్పాటిల్, డీడీటీడబ్ల్యూ భీమ్, సీఆర్టీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మర్సకొల తిరుపతి, ఉపాధ్యక్షుడు వసంత్కుమార్, అధ్యక్షుడు మునీనాయక్, కన్వీనర్ కమలాకర్, కోశాధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు జగ్జీవన్, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్కెరావ్, కందుకురి రమేశ్, టీడబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల విజయ్ శేఖర్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు ఆత్రం భూజంగ్రావ్, సీఆర్టీలు పాల్గొన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా ఆదిలాబాద్ రూరల్ : సీఆర్టీల సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని కొమురం భీం చౌక్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పీడీఎస్యూ జిల్లా నాయకులు చంటి, రమేశ్, అరుణ్, మల్లేశ్, రాకే శ్ పాల్గొన్నారు. -
మాయ చేయడం బాబు నైజం
అనంతపురం అర్బన్:‘రుణమాఫీ అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టినప్పుడల్లా ఏదో ఓ తప్పుడు ప్రకటన చే సి జనం దృష్టి మరల్చడం చంద్రబాబుకు అలవాటే. ఇలా గిమ్మిక్కులు చేసి గద్దెనెక్కిన బాబు.. ఇకపై కూడా జనాల్ని మోసగించాలని చూస్తే కుదరదు. ఆయన గిమ్మిక్కులను ఇప్పుడెవరూ నమ్మే స్థితిలో లేర’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్నారాయణ ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్దాల చంద్రబాబును నిలదీయడానికి ఎప్పుడు ధర్నాలు చేపట్టినా, ఒక రోజు ముందు ఏదో ఒక ప్రకటన చేసి గండం నుంచి గట్టెక్కాలని చూస్తున్నారన్నారు. నవంబర్ 5న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు ముందు రోజు కూడా ఇలాంటి ప్రకటన చేశాడని గుర్తు చేశారు. నేడు చేపట్టబోయే మహాధర్నాకు డ్వాక్రా మహిళలు, రైతులు, చేనేతలు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివస్తున్న నేపథ్యంలో భయం పుట్టుకున్న చంద్రబాబు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గురువారం రుణమాఫీపై మరో మోస పూరితమైన ప్రకటన గుప్పించారన్నారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాధర్నాను నిర్వీర్యం చేయడానికి బాబు కుట్ర పన్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడడానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యూడని తెలిపారు. నేడు కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపడుతున్న మహాధర్నాకి పార్టీ రాష్ట్ర పరిశీలకులు విజయసాయిరెడ్డి, ఐటీ విభాగం నాయకులు చల్లా మధుసూదన్మోహన్రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సలామ్ బాబు, పార్టీ నేతలు హరీష్ యాదవ్, పెన్నోబలేసు, చింతకుంట మధు, మల్లికార్జున, సాకే ఆదినారాయణ పాల్గొన్నారు. -
బాబుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఐదు నెలల్లోనే ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ధర్నాలు విజయవంతమవడమే ఇందుకు నిదర్శనమని తెలి పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నిరసన వెల్లువెత్తిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు చేసి ప్రభుత్వంపై నిరసనను తెలియజేశారని వివరించారు. రుణాల మాఫీ జరగకపోవడంవల్ల నష్టపోతున్న రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, మరమగ్గాల వారు, పింఛన్ల తొలగింపునకు గురైన నిరుపేదలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీల్లో, ధర్నాల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 663 మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు జరి గాయని, ఆ తరువాత అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. బుధవారంనాటి ధర్నాలు ఒక హెచ్చరిక మాత్రమేనని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇది వంచన, ప్రజాద్రోహం కాదా! అనంతపురం జిల్లాలో 2012లో పాదయాత్ర చేసినప్పుడు రుణాలు, వడ్డీలు చెల్లించవద్దని రైతులు, మహిళలకు బాబు చెప్పారని.. అధికారంలోకి వచ్చాక కాలం వెళ్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరవడం వంచన, ద్రోహం కాదా అని ప్రశ్నించారు. -
టాపార్డర్ పైనే ధోనీ సేన భారం
-
మెగా డీల్తో మరోసారి సత్తా చాటిన ధోనీ
-
ఫిలిప్పీన్స్లో భారీ తుపాను..
-
అవిశ్రాంత పోరు
సాక్షి, విజయవాడ : విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో సమైక్యవాదులు అవిశ్రాంత పోరు సాగిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు అన్ని మండలాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు తెరవలేదు. పోస్టల్ సేవలు అందలేదు. దీంతో ఆయా సంస్థల నుంచి ప్రజలకు సేవలు అందకపోవడంతో జనజీవనం స్తంభించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జనజీవనం అంధకారంలో మగ్గిపోయింది. జనం ఉక్కపోతతో విలవిలలాడారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అనేకచోట్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణాలు, పల్లెల్లో జనం విలవిల్లాడారు. మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ కోత విధించారు. దీంతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లు విద్యుత్ లేక చాలాచోట్ల మొరాయించాయి. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో రోగులు విల విల్లాడారు. విద్యుత్ జేఏసీ నాయకులు ట్రాన్స్కో కార్యాలయాల వద్ద, ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అయినా సమైక్యం కోసం ఈ బాధలు పడడానికి సిద్ధమని... ప్రభుత్వం గద్దె దిగేవరకు తాము ఇబ్బందులు ఓర్చుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. రాధా దీక్ష భగ్నం... రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఎమ్మెల్యే విష్ణు దౌర్జన్యం సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ సమైక్య జేఏసీ న్యాయవాదులు ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిలదీశారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే న్యాయవాదులపై తన ప్రైవేటు సైన్యంతో దౌర్జన్యానికి దిగారు. దీంతో తిరగబడ్డ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో బెజవాడ కోర్టుల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ ఎంపీ లగడపాటి కనబడటం లేదంటూ విద్యార్థి జేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న దీక్షలు... కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 60వ రోజూ కొనసాగాయి. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 48వ రోజుకు చేరాయి. వేకనూరుకు చెందిన 70 మంది రైతులు దీక్షలో పాల్గొన్నారు. తొలుత వారు ట్రాక్టర్లతో వేకనూరు నుంచి అవనిగడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలో ప్రభుత్వ రంగసంస్థలు బంద్ పాటించాయి. జేఏసీ నాయకులు బ్యాంకులు, ఎల్ఐసీ, టెలికాం, పోస్టాఫీస్లను మూసివేయించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తిరువూరులో రిలేదీక్షలు ఏడోరోజుకు చేరాయి. పార్టీ నాయకురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో కృష్ణా థియేటర్ సెంటర్లో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో బజ్జీలు వేసి నిరసన తెలిపారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 62వ రోజుకు చేరాయి. విద్యుత్ ఉద్యోగులు జంక్షన్రోడ్డులో ధర్నా నిర్వహించారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు కూర్చున్నారు. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు లక్ష రూపాయల విలువైన బియ్యాన్ని పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 43వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. -
సడలని దీక్ష.. సమైక్య రక్ష
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సమైక్యవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలు.. మానవహారాలతో పాటు ఆమరణ దీక్షలకూ వెనకడుగు వేయకపోవడం వారి పోరాటస్ఫూర్తికి నిదర్శనం. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం.. ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించడంతో సమైక్య ఉద్యోమం మహోద్ధృతమవుతోంది. సోమవారం సుంకేసుల జలాశయం వద్ద చేపట్టిన రైతు శంఖారావం రైతులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. మాజీ ఎంపీపీ విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే బ్యారేజీ పైకి వెళ్లకుండా కేసీ కెనాల్ గట్టుపై సభ జరుపుకోవాలని పోలీసులు సూచించడంతో రైతులు ససేమిరా అన్నారు. జలాశయంపైనే సభ జరిపి తీరుతామని ముందుకు కదలడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసు అధికారులు ఎస్పీతో చర్చించి జలాశయంపై 13వ గేటు వరకు వెళ్లేందుకు అనుమతివ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇక విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఆదివారం జిల్లా అంధకారంలో మగ్గడం తెలిసిందే. సోమవారం కూడా శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కేబినెట్ తీర్మానానికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. రోజూ సుమారు 1500 మంది వరకు చికిత్స నిమిత్తం వచ్చే ఆసుపత్రి ఓపీ బోసిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్యులంతా కలెక్టరేట్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. నగరంలో పలుచోట్ల సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆలూరులో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా వేషధారులు చీరలు కట్టుకుని ర్యాలీ చేశారు. వీరికి కూరగాయల దండ వేసి చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు పట్టణంలో ర్యాలీ చేపట్టి భీమాస్ కూడలిలో మానవహారం నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా రాస్తారోకో చేపట్టారు. అధ్యాపక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. డోన్లో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోవెలకుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేసి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కోసిగిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, లద్దగిరి, గూడూరు, పోలకల్లుకు చెందిన వైద్యులు సోనియా దిష్టిబొమ్మకు పోస్టుమార్టం చేసి గుండె, బ్రెయిన్ లేదని తేల్చారు. నందవరంలో సమైక్యవాదులు ఎమ్మిగనూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆత్మకూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేయడంతో రాకపోకలు స్తంభించాయి. -
జిల్లాలో 61వ రోజూ ఆందోళనలు
ఒంగోలు టౌన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమకారులు 61 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాస్తారోకోలు, మానవహారాలు, రిలే దీక్షలు, ప్రదర్శనలతో నిరసన తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఎన్ఎన్ఎన్ స్కేటింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు చర్చి సెంటర్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై స్కేటింగ్ విన్యాసాలు ప్రదర్శించి రాష్ట్ర సమైక్యత కోసం నినదించారు. మార్కెట్ యార్డు వద్ద సిబ్బంది చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. అద్దంకి పట్టణంలో సమైక్యవాదుల రిలే దీక్షలు 42వ రోజు కొనసాగాయి. వీరికి రాజస్థాన్కు చెందిన వ్యాపారులు సంఘీభావం తెలిపారు. కొరిశపాడు మండలం రావినూతలలో ఇంజినీరింగ్ విద్యార్థులు రిలే దీక్షలకు కూర్చున్నారు. చీరాలలో సమైక్యాంధ్ర నిరసనలు మార్మోగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ యూత్ఫోర్స్ సభ్యులు వాడరేవులోని సముద్రతీరంలో జలదీక్ష నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పర్చూరులో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు 56వ రోజుకు చేరాయి. మార్టూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు భారీ మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. అలాగే కర్నూలులో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్కు జేఏసీ నాయకులు భారీగా తరలివెళ్లారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కనిగిరి పట్టణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దేవాంగనగర్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాధన కళాశాల విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గార్లపేట బస్టాండ్లో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేసి, సర్వమత వేషధారణలతో నిరసన తెలిపారు. అలాగే హెచ్ఎంపాడులో ఆటో కార్మికులు ర్యాలీగా వచ్చి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు. వంటా- వార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు 14వ రోజు రిలేదీక్ష చేపట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామూరులో వికలాంగులు రిలే దీక్షలకు కూర్చున్నారు. మార్కాపురం పట్టణంలో క్రిస్టియన్ యూత్ఫోర్స్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోరుతూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదిలిలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేశారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆకులు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దోర్నాల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. -
ఇప్పటి వరకు దాదాపుగా ఆర్టీసీకి రూ.200 కోట్ల నష్టం
-
పొద్దుటూరులో 10 వేల మంది విద్యార్థులతో దీక్షలు
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమానికి విరామం ఉండటం లేదు. అప్రతిహతంగా సాగుతున్న పోరుతో జిల్లా అట్టుడుకుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, వినూత్న రీతిలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.రాష్ట్రాన్ని విడదీసి సీమాంధ్ర భవిష్యత్తును అగమ్యగోచరం చేయవద్దంటూ ఆందోళనకారులు నినదిస్తున్నారు. 41 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం సమైక్యపోరు 54వ రోజు పూర్తి చేసుకుంది. కడపలో వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు, ఏజేసీ సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ గెస్ట్హౌస్లో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. కడపలో మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వాణిజ్యపన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సమైక్య పరిరక్షణవేదిక, వృత్తి విద్య కళాశాలల సమాఖ్య దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో 10 వేల మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి సా యంత్రం 5వరకు దీక్షలు చేపట్టారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. జమ్మలమడుగులో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో బోయినపల్లెకు చెందిన గౌడ పెంచలయ్య ఆధ్వర్యంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పద్మ శాలీయులు తోట బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో కవలకుంట్లకు చెందిన 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చైతన్య స్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేపట్టారు. రోడ్డుపైనే ఓం అనే ఆకారంలో నిరసన తెలియజేశారు. ఎన్జీఓలు రోడ్లపైనే నిలబడి ఆందోళన చేశారు. కమలాపురం పట్టణంలో రోడ్లపైన వాహనాలను నిలిపి సమైక్యాంధ్ర స్టిక్కర్లు అంటించి నిరసన తెలిపారు. మైదుకూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పులివెందులలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. రాయచోటిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా రిలే దీక్షలు
-
నిగ్గదీసి అడుగు.. సిగ్గులేని నేతలను
సాక్షి, కర్నూలు: ఇప్పటి వరకు వినూత్న నిరసనలు.. ఆందోళనలకే పరిమితమైన సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనవుతోంది. కలసి రండి.. రాజీనామాలు చేయండి.. అంటూ నేతలను ప్రాధేయపడిన ప్రజల్లో సహనం నశిస్తోంది. విభజనతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.. ఒక్కసారి ఆలోచించండని.. వేడుకున్న ఉద్యోగులు ఇక తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారు. గురువారం సమైక్య సెగతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగుదేశం నేతలు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు కాబోలు.. ప్రజల్లోకి వచ్చేందుకూ జంకుతున్నారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ మాత్రం ఎప్పటిలానే ఉద్యమ పథంలో తమ వంతు భాగస్వామ్యాన్ని నెరవేరుస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి సతీమణి విజయ నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా 48 గంటల నిరాహారదీక్ష చేపట్టిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సంఘీభావం ప్రకటించినడానికి వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిని ఉపాధ్యాయ జేఏసీ ఘోరావ్ చేసింది. దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కాటసానితో పాటు ఆయనను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యుసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించిన సమరభేరి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని లాయర్లు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని పట్టుపట్టగా.. తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన కాటసాని దీక్షకు సంఘీభావం తెలిపారు. ఇక యాదవ మహసభ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డికీ సమైక్య సెగ తగిలింది. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. విభజనను నిరసిస్తూ నీటిపారుదల ఉద్యోగుల జేఏసీ ఆధ్వరంలో 2వేల మంది ఉద్యోగులు జలమండలి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన్ వద్ద ఉపాధ్యాయులు వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. ఆదోనిలో ప్రాంతీయ ఆసుపత్రి.. స్త్రీలు,పిల్లల ఆసుపత్రి నర్సులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి భీమాస్ సర్కిల్లో వంటావార్పు చేపట్టారు. శస్త్ర చికిత్స ద్వారా కేసీఆర్ గుండె మార్పిడి చేసి సమైక్యవాదిగా మార్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. వేలాది మంది రోడ్డెక్కి ఆట, పాటలతో నిరసన తెలపడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి క్రీడా మైదానాన్ని తలపించింది. నంద్యాల పట్టణంలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్స్ ర్యాలీ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్లో బట్టలు ఉతికి నిరసన తెలిపారు. -
స్వరం పెంచిన విద్యార్థి లోకం
సాక్షి, ఏలూరు : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 24వ రోజైన శుక్రవారం దీక్షలు, ర్యాలీలు, బంద్లతో హోరెత్తింది. ఏలూరులో 23 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళనలు చేసిన న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను న్యాయ శాఖ సీమాంధ్ర 13 జిల్లాల జేఏసీ చైర్మన్ ఎం.రమణయ్య ప్రారంభించారు. అట వీ, సంక్షేమ శాఖల ఉద్యోగులు దీక్షలు మొదలుపెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మోటార్సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోటదిబ్బలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఫైర్స్టేషన్ సెంటర్కు చేరుకుని రోడ్లు దిగ్బంధం చేశారు. సీఆర్ఆర్ కళాశాల దీక్షా శిబిరం వద్ద విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్లో హాలులో ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఎల్ విద్యా సాగర్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీంతో కాన్ఫరెన్స్ హాలు నుంచి వారు వెళ్లిపోయారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్ లో రెండో రోజు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 16 ఆటో యూని యన్లు రిలయన్స్, మార్కు పెట్రోలు బంకుల వద్ద, జయలక్ష్మి ధియేటర్ వద్ద రోడ్డపై వంటా వార్పు కార్యక్రమం చేపట్టాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తోట గోపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగాయి. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసు ఆధ్వర్యంలో నారాయణపురం లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నిడదవోలులో సుమారు 8 వేల మంది విద్యార్థులు ఓవర్బ్రిడ్జిని దిగ్బంధం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన కుమారుడు జీఎస్ నాయుడుకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య గంటన్నరపాటు మాటల యుద్ధం జరిగింది. పెనుగొండలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం కాపు యువత ఆధ్వర్యంలో భారీ మోటార్సైకిళ్ల ర్యాలీ జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్యసంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్, చింతలపూడిలో వెఎస్సా ర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయ కర్త కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాజారావును పరామర్శించారు. మట్టా సురేష్కు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, పలువురు నాయకులు, ముస్లిం సోదరులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజారావు, సురేష్ ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేశారు. భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్షలకు మద్దతుగా ప్రకాశంచౌక్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన శిబిరానికి మాగంటి బాబు వెళ్ళి సంఘీబావం తెలిపారు. స్థానిక కోర్టు వద్ద ఎంపీలను కుక్కలతో పోలుస్తూ పోస్టర్ను ప్రదర్శించారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు భీమవరం వచ్చిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులో వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టిన రిలే దీక్షలు తాళ్లపూడి, చాగల్లు మండలాల్లో ఐదో రోజుకు, కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో నాలుగో రోజుకు చేరాయి. చాగల్లు దీక్షకు వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేన్రాజు హాజరై సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. పాలకొల్లులో పశుసంవర్థక శాఖ, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, అంగర రామమోహన్ పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర సమ్మెతో కుదేలవుతున్న ఆర్టీసీ
-
జూడాల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోరుతూ గత ఇరవై రోజులుగా సమ్మె చేసిన జూనియర్ వైద్యులు సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. తమ సమస్యల పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో కోర్టుపై గౌరవంతో విధుల్లోకి వస్తున్నట్టు జూడాలు పేర్కొన్నారు. సోమవారం నుంచి సాధారణ, అత్యవసర సేవల్లో పాల్గొంటామని తెలిపారు. 2011లో ప్రభుత్వానికి, జూడాలకు మధ్య ఒప్పందం జరిగినా అందులోని ఒక్క సమస్యనూ పరిష్కరించకపోవడం వల్లనే సమ్మెకు దిగినట్టు వెల్లడించారు. ఏడాది గ్రామీణ సర్వీసులు కాకుండా శాశ్వత ఉద్యోగాలు (పల్లెల్లో పనిచేయడానికి) ఇవ్వాలని, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా అభ్యర్థుల నుంచి రూ.2.9 లక్షలకు మించి వసూలు చేయకూడదని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జీవో నెం.834 ద్వారా కాకుండా పాత పద్ధతిలో కొనసాగించాలని, ప్రభుత్వానికి, జూడాలకు మధ్య జరిగిన ఒప్పందంలోని అంశాలను తక్షణమే పరిశీలించాలనే డిమాండ్లతో జులై 29న జూడాలు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని సమ్మె కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారని, పదేపదే సమ్మె చేయడం సరికాదని, జూడాలు తక్షణమే విధుల్లోకి రావాలని ఆదేశించింది. అలాగే జూడాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో సమావేశమైన జూడాలు.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో జూనియర్ వైద్యులు వంశీకృష్ణ, ఇమ్రాన్, హరిప్రసాద్, కిరీటి, ముత్యంరెడ్డి, రాజేష్, ప్రసన్న, జయదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది... జూనియర్ వైద్యుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నామని జూనియర్ వైద్యుల సంఘం ప్రభుత్వానికి ఆదివారం లేఖ రాసింది. జూడాల సమస్యలపై ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వేసిన పిల్ నెం.391/13 అలాగే ఉందని, మొన్నటి తీర్పులో సైతం సమస్యల పరిష్కారంపై హైకోర్టు మండిపడిన విషయాన్ని సర్కారు గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే జూనియర్ వైద్యుల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. -
వానలోనూ.. సమైక్య జోరు
సాక్షి, కడప : సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో బలంగా వినిపిస్తోంది. జోరువానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలతో జిల్లా వేడెక్కుతోంది. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ఎన్జీఓల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పులివెందుల, రాయచోటిలో సమైక్య బంద్ సక్సెస్ అయింది. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్బంధంచేశారు. కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలను సైతం ముందుకు కదనీయలేదు. సోనియా, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను తగలబెడుతునే ఉన్నారు. కడప, పులివెందులలో మహిళా ఉపాధ్యాయులు రోడ్లపైనే శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. వైఎస్సార్ సీపీనేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ముస్లింల ఆధ్వర్యంలో కడప నగరంలో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. జేఏసీ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, నగర పాలక సంస్థ, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఉద్యానశాఖ అధికారులు, ఉద్యోగులు ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు,ఏడీలు దశరథరామిరెడ్డి, మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ప్రైవేటు వైద్యులు చేస్తున్న స్కూటర్ ర్యాలీని పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేశారు. అంబులెన్స్లు నిరసనల్లో పాల్గొనగా వాటిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి,మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి ఆమరణ దీక్ష శుక్రవారంతో ఐదవ రోజు పూర్తి చేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమందిగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేశారు. జోరువాన, చలిని సైతం లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో ఆందోళన కొనసాగిస్తున్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్బాబు, అంజాద్బాష దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలిపారు.జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో పట్టణం నలువైపుల ఉన్న రహదారులను పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారు. ద్విచక్ర వాహనాలను సైతంముందుకు కదలనీయలేదు. మార్కెట్ వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, అల్లె ప్రభావతి పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో రెండవ రోజుపూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి సంఘీభావం తెలిపారు. వైస్సార్ సీపీ, మెడికల్ షాప్, పెయింటర్స్, కళ్లుగీత కార్మికుల ఆధ్వర్యంలో వర్షంలోనూ వైఎస్సార్ సర్కిల్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అక్కడే వంటా వార్పు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్ష శుక్రవారం రెండవరోజు పూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షలకు మద్దతు తెలిపారు. ముస్లింలు సైతం భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు తమ సంఘీభావాన్ని తెలిపారు. బద్వేలులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పెద్ద ఎత్తున జేఏసీ, ఆర్టీసీ, ఉపాధ్యాయ ఐక్య కార్యచరణసమితి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. పోరుమామిళ్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కలసపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వైపులా రహదాలను దిగ్బంధనంచేశారు. ద్విచక్ర వాహనాలను సైతం తిరగకుండా అడ్డుకున్నారు. వర్షంలోనే తడుస్తూ వైఎస్సార్ సీపీ నేతరాచమల్లు ప్రసాద్రెడ్డి,మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి ఆందోళనను పర్యవేక్షించారు. రెవెన్యూ ఉద్యోగులు, బీఈడీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టైలర్స్, వాకర్స్, అర్నాడ్డ్ జిమ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం నిర్వహించి బంద్ పాటించారు. తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నడిరోడ్డుపై క్రికెట్ ఆడుతూ, వంటా వార్పు చేపట్టారు.టైలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో న్యాయవాదులు, ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రరాయచోటిలో బంద్ సక్సెస్ అయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జమాతె ఉలేమా హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాలుగురోడ్ల కూడలిలో రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పుకార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి బంద్ను పర్యవేక్షించారు. వీరబల్లిలో సమైక్యవాదులు రెండు వేల మందికి పైగా అన్నదానం చేశారు. -
పోరు మాని పోజులు!
సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా రగిలిపోతోంది. ఉద్యోగ సంఘాల సమ్మె బాటతో పాలన స్తంభించింది. రూ.కోట్లు నష్టం వస్తున్నా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. పదహారు రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం మద్దతుకే పరిమితమవుతున్నారు. ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఒకటి రెండు రోజులు వచ్చి ఫొటోలకు పోజులివ్వడం మినహా.. ప్రత్యక్ష ఉద్యమానికి దిగడం లేదు. దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడప్పుడు కనిపించి వెళ్లడం తప్ప ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీక్ష, ధర్నా, ర్యాలీలు చేస్తున్న వారి శిబిరాలకు ఎమ్మెల్యేలు రావడం, మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పడం, పత్రికల కోసం ఫొటోలు దిగడం, అనంతరం వెళ్లిపోవడం మినహా చేసేదేమీ ఉండడం లేదని విమర్శిస్తున్నారు. ఒకవైపు సమైక్యాంధ్ర అంటూనే మరోవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామనడం వారి చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. పీఎన్జీవోలు సమ్మెకు దిగి పాలనను స్తంభింపచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. అంటే ఉద్యమం తీవ్రత రెట్టింపవుతోంది. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష పోరాటానికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. రాజీనామాలు చేశారా! : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జిల్లాలో ఉద్యమం పెల్లుబికింది. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాకు ఒత్తిడి తీవ్రమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు మినహా మిగిలినవారంతా రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్కు చేరాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వపరమైన సౌకర్యాలను పొందుతున్నారు. ప్రభుత్వ వాహనాలతో పాటు సెక్యూరిటీ కూడా కొనసాగుతోంది. దీంతో వీరు నిజంగా రాజీనామాలు చేశారా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించకపోగా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సమైక్యవాదులలో వేరు కుంపట్లు పెట్టేలా ప్రేరేపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో మూడు శిబిరాల వెనుక ఓ మంత్రి ‘హస్తం’ ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి బాలరాజు తీరుపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా రాజీనామా చేయకపోవడంతో పాటు చేయమని అడిగిన ఉపాధ్యాయ సంఘాలపై ఒంటికాలిపై లేవడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. -
సమైక్య గళం వినిపిస్తున్న యావత్ సీమాంధ్ర
-
సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం
సాక్షి నెట్వర్క్: సమైక్యమే శ్వాసగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులకు సకల జనుల సమ్మె తోడవడంతో సమైక్యపోరాటం తారస్థాయికి చేరింది. మలిరోజూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. సమ్మెకు తోడుగా అడుగడుగునా సమైక్యవాదులు బుధవారం నిరసనలను హోరెత్తించారు. ప్రజలే కదలివచ్చి స్వచ్ఛందంగా భాగస్వాములైతే ఉద్యమం ఏ రూపులో ఉంటుందో ప్రస్తుత సమైక్యాంధ్ర పోరు అద్దంపడుతోంది. తెలుగు మాట్లాడే వారంతా కలిసుందామనే భావోద్వేగంతో రాజకీయాలు, వర్గాలు, కులాలు, మతాలకతీతంగా జనం ముందుకొచ్చి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా విస్పష్ట ప్రకటన చేసిన వైఎస్సార్ సీపీకి బాసటగా నిలుస్తూ, వేర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ నేతలపైనా, రెండు కళ్ల సిద్ధాంతంతో ఇరువర్గాలనూ ఏమారుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఎక్కడికక్కడ సమైక్యవాదులు కాంగ్రెస్, టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతల అడ్డగింత కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కేయీ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ రాగా, నీటిపారుదల శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన సింహగర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతుండగా దొంగ రాజీనామాలు చేసిన వారికి మాట్లాడే హక్కు లేదంటూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో డిజిటల్ ప్లెక్సీల్లో చిరంజీవి, లగడపాటి, సాయిప్రతాప్, పురంధేశ్వరి చిత్రాలను ముద్రించి సీమాంధ్ర దొంగలుగా ప్రకటించారు. ఈ దొంగలను పట్టించినవారికి రూ.10లక్షలు నగదు బహుమతి ఇస్తామంటూ రాసిన ఫ్లెక్సీలను ఊరేగించారు. మంత్రి వట్టి వసంతకుమార్ను గణపవరంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించడానికి రాగా, అప్పటి వరకు కూర్చొన్న వారంతా ‘మీ మొహాలు చూపించవద్ద’ంటూ లేచి వెళ్లిపోయారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రెండువేల మందికి పైగా రెవెన్యూ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి దీక్షలు చేపట్టారు. రాజమండ్రిలో ట్రాన్స్కో ఉద్యోగులు ఆకులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్నన చేశారు. వివిధ శాఖల ఉద్యోగులు కాకినాడలో కలెక్టరేట్ను ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేశారు. రాజమండ్రి, కాకినాడ, ఏలేశ్వరం డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై స్నానం చేస్తూ రంపచోడవరం ఎంపీడీవో విశ్వనాథ్ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదురుగా భారీ మానవహారం ఏర్పాటు చేశారు. షార్ ఉద్యోగుల ర్యాలీ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో ఉద్యోగులు, వారి సతీమణులు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు.అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జెడ్పీ ఎదురుగా పీఆర్జేఏసీ చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్రెడ్డి సంఘీభావం ప్రకటించారు. 20వేలమందితో భారీ ప్రదర్శన హిందూపురంలో రెడ్డి సేవా సంఘం, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి సారథ్యంలో 20వేలమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో చెన్నై-కోల్కతా జాతీయరహదారిపై పలుచోట్ల వంటావార్పులు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. అటు ఒడిశా, కోల్కతా వెళ్లాల్సిన లారీలు, సరకుల వాహనాలు, ఇటు చెన్నై, కేరళ వెళ్లాల్సిన సరకుల లోడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ పోర్టుకు లారీల రాక ఆలస్యమవడంతో నౌకలు సకాలంలో కార్గోతో వెళ్లలేకపోయాయి. థింసా నృత్యంతో గిరిజనుల నిరసన విశాఖ ఏజెన్సీలోని 11మండలాల్లో బంద్ పూర్తిస్థాయిలో జరిగింది. పర్యాటక ప్రాంతమైన అరకులో గిరిజనులంతా కలిసి విభజనకు వ్యతిరేకంగా సాంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. శ్రీకాకుళంలో రెవెన్యూ, జిల్లా పరిషత్ ఉద్యోగుల దీక్షా శిబిరాలను పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. సీతంపేట ఐటీడీఏ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎన్జీఓల మానవహారం ఏలూరులో ఎన్జీవోలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సత్తి చంద్రారెడ్డి అనే రైతు పెనుమంట్ర మండలం మార్టేరులో బుధవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’ ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకు సుముఖత వ్యక్తం చేయలేదంటూ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లతో రూపొందించిన పోస్టర్లను వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆవిష్కరించారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వైద్య విద్యార్ధులు మహానాడు జంక్షన్లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. దీంతో హైవేపై రెండుగంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి లాడ్జి సెంటర్ వరకు వేలాదిమంది కార్యకర్తలు పాదయాత్ర చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ మేకతోటి సుచరిత, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మెట్లుదిగుతున్న సుచరిత స్వల్ప అస్వస్థతకు లోనై కాసేపు అక్కడే కూర్చుండిపోయారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు. మోకాళ్లపై కూర్చుని టీచర్ల నిరసన ఆత్మకూరులో టీచర్లు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. అనంతరం గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలిచి నిరసన వ్యక్తం చేశారు. కడపలో ఆర్టీపీపీ ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్లపైనే నిరసన తెలియజేస్తూ రిలే దీక్షలు ప్రారంభించారు. బద్వేలులో పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారులపై రోడ్లకు అడ్డంగా కంపచెట్లు వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థుల రక్తదానం విజయనగరం పట్టణంలో వివిధ వర్గాల ఉద్యమకారులు ప్రతీ ఐదు నిమిషాలకు మానవహారాలు, నిరసనలు నిర్వహించారు. 80మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ‘వేర్పాటు’పై యుద్ధమే.. విశాఖ సింహగర్జనలో తీర్మానం కేంద్రం తీసుకున్న వేర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు సమైక్య పోరాటం ఆపేది లేదని విశాఖలో జరిగిన సింహగర్జనలో సమైక్యవాదులు తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్ర యూనివర్సిటీలకు చెందిన జేఏసీ నేతలు, ఎమ్మెల్యేలు, కళాకారులు, విద్యార్థులు హాజరయ్యారు. వంగపండు ప్రసాదరావు బృందంతో పాటు వివిధ సంఘాలకు చెందిన కళాకారులు గజ్జెకట్టి ఆటపాట వినిపించారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర పౌరులకు రక్షణ కల్పించడం కోసం రాజధానిలో భారీ బహిరంగ సభ, త్వరలో ఛలో ఢిల్లీ చేపట్టాలని తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 350కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించారు. విభజన భయానికి మరో తొమ్మిదిమంది బలి సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. సీమాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తొమ్మిదిమంది తనువు చాలించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలంలోని ఎం. బండపల్లెకు చెందిన ముత్తుస్వామి(46) రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయేమోనన్న అనుమానంతో తీవ్ర ఆందోళనకు గురై బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి.కొత్తకోట మండలం నామాలపల్లె దళితవాడకు చెందిన వ్యవసాయ కూలీ గోపాలు(47) గుండెపోటుతో మృతిచెందాడు. కార్వేటినగరం మండలం ఎంఎం విలాసం పంచాయతీ ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన టైలర్ సీ భాస్కర్(40), వీ.కోట మండలం నక్కనపల్లెకు చెందిన చలపతి(41) టీవీల్లో వార్తలు చూస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. కృష్ణాజిల్లా కూచిపూడి మండలం మొవ్వ అంబేద్కర్ నగర్కు చెందిన గద్దె సుబ్బారావు (60) మంగళవారం టీవీ చూస్తూ హఠాత్తుగా కిందపడిపోయి చనిపోయినట్టు బంధువులు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న డి. మునిస్వామి రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను చూసి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం పి. ధర్మవరం గ్రామానికి చెందిన చిందాడ అప్పారావు (58) సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో బుధవారం టీవీ చూస్తూ భావోద్వేగానికి గురై హఠాన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పారావుకు కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియల బాధ్యతను అతని నలుగురు కుమార్తెలూ భుజానకెత్తుకున్నారు. సమైక్యాంధ్ర ఇక సాధ్యం కాదేమోనని మనస్తాపం చెంది అనంతపురం జిల్లా లేపాక్షి మండలం విభూదిపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరప్ప (62) గుండెపోటుతో మృతి చెందాడు. విభజన వార్తలతో గత వారంరోజులుగా మనస్తాపంతో ఉన్న వైఎస్సార్ జిల్లా వేంపల్లె దళితవాడకు చెందిన శీలం రాజు (28) ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. -
సమ్మెలు వద్దు.. సమస్యలపై చర్చిద్దాం: తెలంగాణ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని తీసుకుందని, దానిపై సీమాంధ్రలో ఉద్యోగులు, నాయకులు సమ్మెలు, ఆందోళనలకు దిగడం సరికాదని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, వెంటనే ఆందోళనలను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యోగులతో పాటు హైదరాబాద్లోని ప్రజలందరి భద్రతకూ తాము భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల క్వార్టర్స్ వద్ద డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్బాబు, సారయ్య, ఉత్తమ్కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. సీమాంధ్రలో ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, తెలంగాణ అంశంలో ఢిల్లీ పరిణామాలపై వారు చర్చించారు. తెలంగాణ మంత్రులుగా భరోసా ఇచ్చి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని, పలు ఇతర అంశాలపైనా ఆ ప్రాంత నేతలతో సానుకూల వాతావరణంలో చర్చించాలని అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఆంటోనీ కమిటీకి తెలంగాణకు సంబంధించిన అంశాలను వివరించాలని నిర్ణయించారు. ఈ మేరకు 18వ తేదీన తెలంగాణ ప్రాంత నేతలు సమావేశమై నివేదికను రూపొందించనున్నారు. అదే సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మన్మోహన్సింగ్లకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. భేటీ అనంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగ భద్రత, పెన్షన్లు, ఇతర అంశాలపై ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విధివిధానాలు పూర్తయ్యేవరకు సీమాంధ్ర ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో భాగమేనని జానారెడ్డి స్పష్టం చేశారు. ఆందోళనలు చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎన్జీవోలు కూడా సీమాంధ్ర ఉద్యోగుల్ని రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని కోరారు. వారితో సయోధ్యతో వ్యవహరించి సమ్మె విరమించేలా చేయాలన్నారు. హైదరాబాద్పై ఆందోళన అనవసరమని, అది అంత ర్జాతీయ కేంద్రంగా మారిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమయాభావం వల్ల వారిని ఆహ్వానించలేకపోయామని, ఇకపై వారు ప్రతి సమావేశానికి వచ్చేలా చూస్తామని శ్రీధర్బాబు తెలిపారు. -
టీ ఎన్జీఓ బెదిరింపులకు బెదరం-అశోక్ బాబు
-
ఏపీ ఎన్జీవోలను అడ్డుకున్న టీఎన్జీవోలు
హైదరాబాద్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీవో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతు కూడగట్టడానికి బుధవారం ఆర్టీసీ క్రాస్రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఏపీ ఎన్జీవో నగర నేతలను టీఎన్జీవో నాయకులు అడ్డుకుని వెళ్లగొట్టారు. ఏపీ ఎన్జీవో నగర అధ్యక్షుడు జీవీ సత్యానారాయణ ఆధ్వర్యంలో పలువురు సీమాంధ్ర ఉద్యోగులు కార్మిక శాఖలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులను సమ్మెకు సిద్ధం చేయడానికి వచ్చి వారితో మాట్లాడేందుకు వచ్చారు. సమాచారమందుకున్న అదే శాఖలోని టీఎన్జీవో నాయకులు ‘తెలంగాణ ముద్దు.. సమైకాంధ్ర వద్దు అన్నదమ్ములుగా విడిపోయి కలిసుందాం.. జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఎన్జీవో నాయకులు వెనుదిరిగారు. 12న సచివాలయం ముట్టడి: ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపు ఈ నెల 12న సచివాలయం ముట్టడి, భారీ ర్యాలీ కార్యక్రమానికి ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి కరాటే రాజు విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో తిష్టవేసి తెలంగాణలోని అన్నిరంగాలను నష్టపరిచి... ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ఏపీఎన్జీవోస్ నేతలను హెచ్చరించారు. సీఎం కిరణ్ ఏపీఎన్జీవోల వెనక ఉండి ఆందోళనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. -
జూడాల సమ్మె ఉధృతం
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు స్టైఫండ్ను మూడేళ్లకు ఒకేసారి డిపాజిట్ చేసేలా జారీ చేసిన జీవో 93 రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు(జూడా) సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె మంగళవారం నాటికి తొమ్మిది రోజులకు చేరగా.. రోజుకో తీరులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందడం లేదని, ఉదయం వైద్యులు చూసి వెళ్లిన తర్వాత ఎంత అత్యవసరమైనా చూడడానికి ఎవరూ రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 66 మంది హౌస్ సర్జన్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. శస్త్రచికిత్సల సమ యంలో హౌస్సర్జన్లు తప్పనిసరిగా అవసరం. వారు సమ్మెలో ఉండడంతో సీనియర్ వైద్యు లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగుల తాకిడి వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల కారణంగా రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు వెయ్యి మంది నుంచి 1500 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ఓపీ విభాగంలో ఉదయం నుంచి 12గంటల వరకు రోగులను పరీక్షిస్తారు. అనంతరం అత్యవసర విభాగంలో ఆరుగురు హౌస్సర్జన్లు 24గంటలు అందుబాటులో ఉంటారు. వీరు ఆయా వార్డుల్లో రోగులతోపాటు, అత్యవసర సమయంలో వైద్య పరీక్షలు చేస్తుంటారు. ప్రస్తుతం వీరంతా సమ్మెలో ఉండడంతో అత్యవసర విభాగంలో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పెద్ద ఎత్తున రోగులు బారులు తీరుతున్నారు. ఇద్దరే వైద్యులు పరీక్షలు చేస్తుండడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వసతులు కరువు తమ న్యాయమైన డిమాండ్లతోపాటు రిమ్స్లో నెలకొన్న సమస్యలూ పరిష్కరించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అత్యవసర విభాగంలో జూడాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో హాస్టల్కు ఎవరు వస్తున్నారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్, డీఎంఈకి సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం జూడాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ వైద్య సేవలకు సంబంధించి పీహెచ్సీ, సీహెచ్సీలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలి. - ఉప్పరి మల్లేశ్, రిమ్స్ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు వసతులు కల్పించాలి రిమ్స్ ఆస్పత్రిలో జూడాలకు సరైన వసతులు లేవు. అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తించే జూడాలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు ఉద్యోగ భద్రత కరువైంది. ఎవరు గొడవకు దిగుతారో తెలియని పరిస్థితి. మాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సమస్యలపై పరిష్కారంపై అధికారులు పట్టించుకోవడం లేదు. - ఆదిత్య, జూడా ఉపాధ్యక్షుడు నిర్ణయం మార్చుకోవాలి.. జూడాలకు రావాల్సిన స్టయిఫండ్ను ప్రతి నెలా చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలి. పీజీ మెడికల్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. - సౌమ్య, జూడా సంఘం ఉపాధ్యక్షురాలు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె జూడాల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసిన వైద్యులకు ఆయా పీహెచ్సీల్లో శాశ్వత ఉద్యోగం కల్పించాలి. శాశ్వత ఉద్యోగాలిస్తే ఎక్కడైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లరు. - గీత, జూనియర్ డాక్టర్