కుటుంబాన్ని చంపి తాను ఉరేసుకుని.. | Man kills wife and three children; commits suicide | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని చంపి తాను ఉరేసుకుని..

Published Fri, Aug 28 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

రాఖీ పౌర్ణమి మరొక్క రోజులో ఉందనగా.. ఉత్తరప్రదేశ్లోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.

పాంచ్కుల: రాఖీ పౌర్ణమి మరొక్క రోజులో ఉందనగా.. ఉత్తరప్రదేశ్లోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటి యజమాని తన భార్యను, ముగ్గురు కూతుళ్లను హత్య చేసి.. ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని ఉన్నావో జిల్లాలో నీరజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి ముందుగా తన భార్య రాజ్ కుమారిని (27) గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తన ముగ్గురు కూతుళ్లు నవిత(5), శివాని(2), అనన్య(7 నెలలు)లను కూడా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కుటుంబంలో మనస్ఫర్ధలే ఈ ఘటనకు దారి తీసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement