ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ కన్నుమూత | Noted writer and journalist Khushwant Singh has died at 99 | Sakshi
Sakshi News home page

ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ కన్నుమూత

Mar 20 2014 1:39 PM | Updated on Mar 23 2019 8:41 PM

కుష్వంత్  సింగ్ - Sakshi

కుష్వంత్ సింగ్

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు.

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.న్యూఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్లోని స్వగృహంలో తన తండ్రి ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారని కుష్వంత్ కుమారుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

ప్రస్తుతం పాకిస్థాన్ పంజాబ్లోని హడలిలో ఫిబ్రవరి 2 వ తేదీన ఆయన జన్మించారు. భారత్లో యోజన పత్రికకు ఆయన వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారు. అలాగే నేషనల్ హెరాల్డ్, హిందూస్థాన్ టైమ్స్, ది ఇలస్ట్రేట్రడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలకు సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు.  ట్రైయిన్ టూ పాకిస్థాన్, ఐ షెల్ నాట్ హియిర్ ద నైటింగేల్, ఢిల్లీ రచనలు ఆయన కలం పదును ఎంతో తెలియజేస్తాయి.

ఒకానొక సమయంలో దివంగత ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కుష్వంత్ సింగ్, ఆ తర్వాతి కాలంలో కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు రెండో వర్గం వైపు మొగ్గు చూపారు. అందువల్ల ఆయన ఇందిర వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అనంతర సమయంలో ఆయన రాసిన పలు వ్యాసాలు, సంపాదకీయాల్లో కూడా ఆ ముద్ర స్పష్టంగా కనిపించింది.

1974లో కుష్వంత్ సింగ్కు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే 1984 నాటి అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తు ఆ పురస్కారాన్ని తిరిగి భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. అయితే 2007లో కుష్వంత్ సింగ్ను భారత్ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తనను తాను గౌరవించుకుంది.1980 నుంచి1986 వరకు కుష్వంత్ సింగ్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement