‘నీతి’ లక్కీ డ్రా విజేతలకు రూ.54.90 కోట్లు | NPCI declares Rs 54.90 crore prize money for NITI Aayog's lucky draw schemes | Sakshi
Sakshi News home page

‘నీతి’ లక్కీ డ్రా విజేతలకు రూ.54.90 కోట్లు

Jan 16 2017 5:15 PM | Updated on Sep 5 2017 1:21 AM

లక్కీడ్రా పథకాల విజేతలకు ఎన్‌పీసీఐ రూ.54.90 కోట్ల నగదు బహుమతులను పంపిణీ చేసింది.

ముంబై: నీతి ఆయోగ్‌ డిజిటల్‌ చెల్లింపులకు ఉద్దేశించిన లక్కీడ్రా పథకాల విజేతలకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) రూ.54.90 కోట్ల నగదు బహుమతులను పంపిణీ చేసింది. లక్కీ గ్రాహక్‌ యోజన, డిజిధన్‌ వ్యాపార్‌ యోజనల కింద విజేతలైన 3.42 లక్షల మంది వినియోగదారులు, వ్యాపారులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది.

డిసెంబర్‌ 25న ప్రారంభమైన ఈ పథకాలు ఏప్రిల్‌ 14 వరకు అమల్లో ఉంటాయి. 15 వేల మంది రోజువారీ విజేతలకు రూ.1.5 కోట్లు, దీనికి అదనంగా వారానికి 14వేల విజేతలకు రూ.8.3 కోట్లు ఇవ్వనున్నట్లు ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు ఎక్కువ మంది విజేతలున్న రాష్ట్రాలుగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement