digital payments
-
భారత్లో క్రెడిట్ కార్డుల జోరు
ముంబై: క్రెడిట్ కార్డుల సంఖ్య భారత్లో సుమారు 10.8 కోట్లకు చేరింది. అయిదేళ్లలో వీటి సంఖ్య రెండింతలకుపైగా దూసుకెళ్లిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2019 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా కస్టమర్లకు జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 5.53 కోట్లు నమోదైంది. అయితే డెబిట్ కార్డుల సంఖ్య క్రెడిట్ కార్డుల స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. డెబిట్ కార్డులు అయిదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. అంతా డిజిటల్మయం.. దశాబ్ద కాలంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2013లో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2024లో ఈ లావాదేవీలు పరిమాణంలో 94 రెట్లు, విలువలో 3.5 రెట్లు పెరిగి రూ.2,758 లక్షల కోట్ల విలువైన 20,787 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అయిదేళ్లలో డిజిటల్ చెల్లింపులు పరిమాణంలో 6.7 రెట్లు, విలువలో 1.6 రెట్లు ఎగశాయి. అయిదేళ్లలో వార్షిక వృద్ధి ఏటా సగటున పరిమాణంలో 45.9 శాతం, విలువలో 10.2 శాతం పెరిగింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 12 ఏళ్లలో సుమారు 100 రెట్లు దూసుకుపోయాయి. ఇవి 2012–13లో 162 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. 2023–24లో వీటి సంఖ్య ఏకంగా 16,416 కోట్లను తాకిందని నివేదిక తెలిపింది. విదేశాల్లోనూ యూపీఐ.. ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్తో యూపీఐని అనుసంధానించడం ద్వారా విదేశీ చెల్లింపులను మెరుగుపరిచేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందని నివేదిక పేర్కొంది. అధిక వ్యయం, తక్కువ వేగం, సేవలు పరిమితంగా ఉండడం, విదేశాలకు చెల్లింపులలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఇటువంటి అనుసంధానాలు సహాయపడతాయని పేర్కొంది. క్యూఆర్ కోడ్ల ద్వారా భారతీయ యూపీఐ యాప్లను ఉపయోగించి భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈలోని వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపుల మౌలిక వసతులు, పనితీరులో చెప్పుకోదగ్గ వృద్ధి ఆర్బీఐ ప్రచురించిన డిజిటల్ పేమెంట్ ఇండెక్స్లో స్పష్టంగా కనిపిస్తుందని నివేదిక వివరించింది. -
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
రూపాయికీ యూపీఐ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయికీ యూపీఐ.. అవును మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి చెల్లించాలన్నా స్మార్ట్గా యూపీఐ పేమెంట్ యాప్తో ‘స్కాని’చ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా పల్లెలకూ పాకింది. ఇదంతా అత్యంత వేగంగా చెల్లింపులను సుసాధ్యం చేస్తున్న టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాయాజాలం. క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరికైనా రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు.. బ్యాంకు ఖాతాకు, ఖాతా అనుసంధానమైన మొబైల్ నంబర్కు, యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్కు సురక్షితంగా, సులభంగా డిజిటల్ చెల్లింపులను యూపీఐ సుసాధ్యం చేసింది. చిరు వ్యాపారులకూ డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే ప్రధాన సాధనంగా మారిపోయింది. చిల్లర సమస్యలకు యూపీఐ చెక్ పెడుతోంది. 2025 జనవరి 1న రూ.81,015.79 కోట్ల విలువైన 56.84 కోట్ల లావాదేవీలతో కొత్త సంవత్సరంలో యూపీఐ శుభారంభం చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న ప్రజలు రూ.93,148 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. కొత్త రికార్డుల ప్రయాణం.. దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 2న రూ.95,915.6 కోట్ల విలువ చేసే లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ చరిత్రలో 2016 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 1 నాటికి ఇదే అత్యధికం. ఇక 2024 డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్ల విలువైన 54 కోట్ల లావాదేవీలు జరిగాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. కస్టమర్లు నవంబర్లో రోజుకు సగటున రూ.71,840 కోట్ల విలువైన 51.6 కోట్ల లావాదేవీలు జరిపారు. యూపీఐ లావాదేవీల సంఖ్య గత నెలలో 8 శాతం దూసుకెళ్లి మొత్తం 1,673 కోట్లుగా ఉంది. నవంబర్లో ఈ సంఖ్య 1,548 కోట్లు నమోదైంది. లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. భారత్ స్కాన్ చేస్తోంది.. దేశం ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు. రోడ్డు పక్కన ఉండే చిరు వర్తకుల వద్దా ఇవి దర్శనమిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 2024 నవంబర్ నాటికి భారత్ క్యూఆర్తో కలిపి మొత్తం యూపీఐ క్యూఆర్ కోడ్స్ 63.2 కోట్లు జారీ అయ్యాయి. 2023 నవంబర్లో ఈ సంఖ్య 31.4 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలో క్యూఆర్ కోడ్స్ రెట్టింపు అయ్యాయన్నమాట. వర్తకుల వద్ద దేశవ్యాప్తంగా 2024 మార్చి 31 నాటికి 34.9 కోట్ల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల వేగానికి ఈ అంకెలే నిదర్శనం. ఎన్పీసీఐ వేదికగా 55 శాతం.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్), ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఎన్ఏసీహెచ్, నెఫ్ట్, యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీవోఎస్ మెషీన్లు, చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టులు, నగదు.. ఇలా ప్రభుత్వ, రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా 2024 నవంబర్ నెలలో రూ.2,20,52,158 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇందులో యూపీఐ వాటా 9.77 శాతం. అలాగే నవంబర్లో ఎన్పీసీఐ వేదికగా జరిగిన రూ.38,94,079 కోట్ల రిటైల్ లావాదేవీల్లో యూపీఐ 55.34 శాతం వాటా కైవసం చేసుకుంది. ఫోన్పే టాప్లావాదేవీల పరంగా ఫోన్పే 48 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. గూగుల్ పే 37 శాతం, పేటీఎంకు 7% వాటా ఉంది. మిగిలిన 8% వాటాను క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్ వంటివి పంచుకున్నాయి. -
ఏటీఎంల సంఖ్య కుదింపు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ భారాన్ని తగ్గించుకొనే క్రమంలో ఏటీఎంల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని రాష్ట్రంలోని బ్యాంకులు నిర్ణయించాయి. ఏడాది కాలంలో 5 శాతం ఏటీఎంలను తొలగించిన బ్యాంకులు... వచ్చే ఏడాదిలో మరో 10 శాతం వరకు ఏటీఎంలను తగ్గించుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం 9,205 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. గతేడాది మార్చి నాటికి 9,660 ఏటీఎంలుండగా ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి 455 ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకుల సమితి గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ లావాదేవీలతో..: ఒక్కో ఏటీఎంపై నెలకు సగటున రూ. 2.5 లక్షల వరకు ప్రాథమికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రతి 8 గంటలకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున ముగ్గురు గార్డుల జీతాలు, ఏటీఎంను ఉంచే షాప్/షట్టర్ అద్దె, విద్యుత్ బిల్లుతోపాటు సాంకేతిక నిర్వహణ ఖర్చులు ఉంటున్నాయని వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతుండటం వల్ల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ తగ్గుతున్నట్లు బ్యాంకుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాష్ విత్డ్రాయల్స్ తక్కువగా ఉన్న ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేస్తున్నాయి. ఇకపై కేవలం బ్రాంచి పరిధిలోనే వాటిని పరిమితం చేసేలా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య 6 వేలకు పడిపోనుందని సమాచారం.పీఓఎస్ల జోరు... ఏటీఎంల సంఖ్యను ప్రాధాన్యత క్రమంలో తగ్గించాలని భావిస్తున్న బ్యాంకులు.. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ల వాడకాన్ని మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. వాటి ద్వారా బ్యాంకులకు అదనపు రాబడి ఉండటమే ప్రధాన కారణం. గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా 2,09,116 పీఓఎస్ మెషిన్లు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 2,74,602కు చేరింది. భవిష్యత్తులో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి. -
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ స్టోర్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 33 శాతం పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు దూసుకెళ్తున్నాయనడానికి ఇది నిదర్శనమని డిజిటల్ బ్యాంకింగ్, నెట్వర్క్ సేవల్లో ఉన్న పేనియర్బై నివేదిక తెలిపింది. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక, డిజిటల్ సేవలను అందిస్తున్న 10,00,000 కిరాణా, మొబైల్ రీఛార్జ్ వంటి చిన్న రిటైలర్ల నుండి సేకరించిన వాస్తవ లావాదేవీల సమాచారాన్ని విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు.2024 జనవరి నుండి నవంబర్ వరకు జరిగిన వ్యాపార లావాదేవీల సమాచారాన్ని 2023తో పోల్చారు. ‘ఈ ఏడాది బీమా పాలసీ కొనుగోళ్లు, ప్రీమియం వసూళ్లు లావాదేవీల పరిమాణంలో 127 శాతం పెరిగాయి. కొత్త కస్టమర్లు 96 శాతం అధికం అయ్యారు. భారత్ అంతటా బీమా చొచ్చుకుపోయే సవాళ్లను అధిగమించడంలో డిజిటల్ రిటైల్ దుకాణాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. నగదు ఉపసంహరణలు.. ‘గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో వ్యాపారం, బంగారం, వ్యక్తిగత రుణాలు, ఓవర్డ్రాఫ్ట్ సహా రుణ ఉత్పత్తులలో పరిమాణం 297 శాతం దూసుకెళ్లింది. ఈ గణనీయమైన పెరుగుదల అట్టడుగు స్థాయిలో రుణ పరిష్కారాల పట్ల పెరుగుతున్న అవగాహన, డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. మైక్రో ఏటీఎం, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్ వద్ద నగదు ఉపసంహరణలు 2024లో తగ్గాయి. లావాదేవీల పరిమాణం, ఒక్కో లావాదేవీకి సగటు నగదు ఉపసంహరణ రెండూ స్వల్ప క్షీణతను చవిచూశాయి.సగటు నగదు ఉపసంహరణ 2023లో రూ.2,624 నమోదైతే, ఈ ఏడాది ఇది రూ.2,482కి పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో నగదు ఉపసంహరణలు విలువలో 58 శాతం, పరిమాణంలో 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి’ అని నివేదిక తెలిపింది. బీమా, ఈ–కామర్స్, రుణాల వంటి విభిన్న సేవలను అందించే సాధనాలతో స్థానిక రిటైలర్లను సన్నద్ధం చేయడం ద్వారా.. అట్టడుగు స్థాయిలో ఆర్థిక లభ్యత, ఆర్థిక పురోగతికి కీలక సహాయకులుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తున్నాముని పేనియర్బై వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
రుణాల మంజూరులో కీలకంగా యూపీఐ
న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్ ఆధారంగా జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది. మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.75 శాతం యూపీఐ కైవసం..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్ నాటికి భారత్లోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్లను రూపొందించడానికి థర్డ్ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్ టైమ్లో ధృవీకరించదగిన డిజిటల్ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది. -
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను 2017లో ఈ లిస్ట్లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?
ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలా చేస్తారంటే..ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్లో మీ హ్యాండ్ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట. ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Rana Hamza Saif ( RHS ) (@ranahamzasaif) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
డిజిటల్ పేమెంట్స్లో మార్పులు.. ఆర్బీఐ ఆదేశం
ముంబై: వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ కోరింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.‘‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్పీలు/బ్యాంక్లు/నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్లు, నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’’అని ఆర్బీఐ తన సర్క్యులర్లో పేర్కొంది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
439 బిలియన్ యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ వినియోగం ఏటేటా గణనీయగా పెరుగుతూనే ఉంది. 2028–29 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి యూపీఐ లావాదేవీలు మూడు రెట్ల వృద్ధితో 439 బిలియన్లకు (ఒక బిలియన్ వంద కోట్లకు సమానం) చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 131 బిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ఈ కాలంలో లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ హవా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పుడు యూపీఐ వాటా 80 శాతాన్ని అధిగమించిందని.. 2028–29 నాటికి 91 శాతానికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఏటేటా చక్కని వృద్ధిని చూస్తోందంటూ.. లావాదేవీల పరిమాణంలో 57 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని చూసిందని, కొత్తగా 1.6 కోట్ల కార్డులను పరిశ్రమ జోడించుకున్నట్టు వివరించింది. దీంతో లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, లావాదేవీల విలువ 28 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. 2028–29 నాటికి క్రెడిట్కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఇక డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. లావాదేవీల పరిమాణం, విలువలోనూ క్షీణత కనిపించింది. వచ్చే ఐదేళ్లలో చెల్లింపుల పరిశ్రమ ఎకోసిస్టమ్ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, ప్రస్తుతమున్న ప్లాట్ఫామ్లపైనే కొత్త వినియోగ అవకాశాలను గుర్తించొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పేమెంట్స్ పార్ట్నర్ మిహిర్ గాంధీ అంచనా వేశారు. -
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్వాచ్లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్లో ఎంబెడెడ్ రూపే చిప్ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్నెస్తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్వాచ్ల మాదిరిగానే స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్ఫారమ్ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం
‘మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది.. మీ ఫోన్కు ఓటీపీ పంపాం.. అది చెప్పండి.. వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తాం’.. ఈ మాటలు నమ్మి ఎవరైనా ఓటీపీ నంబర్ చెప్పారో అంతే.. వారి ఖాతా ఖాళీ. కొన్నేళ్లుగా బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాల తీరిది. దాదాపు 65 శాతం సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవాంఛనీయమైన వ్యక్తులకు ఓటీపీ నంబర్ చెప్పేయడమేనని తేలింది. వేగం పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా పెరుగుతున్న ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అందుకే సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ చెల్లింపుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఓటీపీ నంబరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని విధానాలను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. – సాక్షి, అమరావతిమూడు ప్రత్యామ్నాయ విధానాలు..డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు ఆర్బీఐ ‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) విధానాలను ఆమోదించింది. అంటే ఓటీపీతోపాటు ఈ అదనపు అథంటికేషన్ను కూడా కచ్చితంగా పరిశీలించిన అనంతరమే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ అదనపు అథంటికేషన్ డైనమిక్గా ఉంటుంది. చెల్లింపు లావాదేవీ మొదలైన తరువాత అది జనరేట్ అవుతుంది. అది కూడా ఆ ఒక్క లావాదేవీకే పరిమితమవుతుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల్లో మూడు ప్రత్యామ్నాయ విధానాలను పొందుపరిచింది. అవి..నాలెడ్జ్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు)కు మాత్రమే తెలిసిన సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. ఆ ఖాతాదారుడు ముందుగా నిర్ణయించుకున్న పాస్వర్డ్, పాస్ఫ్రేజ్, పిన్ నంబర్లలో ఒకదాన్ని ఎంటర్చేస్తేనే డిజిటల్ చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. పొసెషన్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు) తాను వ్యక్తిగతంగా కలిగి ఉన్నవాటి సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లకు టోకెన్ల వంటి తనకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని ఎంటర్చేస్తేనే డిజిటల్ చెల్లింపు పూర్తవుతుంది. బయోమెట్రిక్ బేస్డ్: వేలిముద్రలు, ఐరీస్, ముఖ గుర్తింపు వంటివి. అవి సరిపోలితేనే డిజిటల్ చెల్లింపు సాధ్యపడుతుంది.వీటికి మినహాయింపులు..తాజా మార్గదర్శకాల పేరుతో రోజువారీ సాధారణ లావాదేవీలు, తక్కువ మొత్తం చెల్లింపుల ప్రక్రియకు ప్రతిబంధకం కాకుండా ఆర్బీఐ జాగ్రత్తలు కూడా తీసుకుంది. అందుకే ఈ కొత్త విధానం నుంచి కొన్నింటికి మినహాయింపులిచ్చింది. మినహాయింపులు ఇచ్చిన డిజిటల్ చెల్లింపులు ఏమిటంటే..» దుకాణాలు, వాణిజ్య కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో రూ.5వేల లోపు చెల్లింపులు.. » బ్యాంకుల ద్వారా రికరింగ్ చెల్లింపుల (నియమిత కాలంలో ఆటోమెటిగ్గా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు) కోసం ముందుగానే ఆమోదించి బ్యాంకుకు తెలిపిన లావాదేవీలు..» రూ.లక్షలోపు మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు..» బీమా ప్రీమియంల చెల్లింపులు.. » క్రెడిట్ కార్డు చెల్లింపులు..» రూ.15వేల వరకు ఇ–మ్యాండేట్ చెల్లింపులు..» టోల్గేట్ల వద్ద చెల్లింపులు. -
ఆన్లైన్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా
ఆన్లైన్ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్వర్డ్, పిన్, సాఫ్ట్వేర్ టోకెన్లు, బయోమెట్రిక్లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది. -
డిజిటల్ విప్లవంలో ఇదీ మన ఘనత.. ఆర్బీఐ నివేదిక
డిజిటల్ ఆర్థిక విప్లవంలో భారత్ ముందంజలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్లోనే జరిగాయి. గ్లోబల్ రెమిటెన్స్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపుల పరిమాణంలో 48.5 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మొబైల్ మనీ, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా 2023లో ప్రపంచవ్యాప్తంగా 857.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరగగా 115.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలతో భారత్ అగ్రగామిగా నిలిచిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.భారతదేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పదో వంతుగా ఉంది. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేట్ల ఆధారంగా 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు పెరుగుతుందని అంచనా. ఆర్బీఐ ప్రకారం, 2023-24లో రూ. 428 లక్షల కోట్ల విలువైన 16,400 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇవి గత ఏడు సంవత్సరాలలో పరిమాణం పరంగా 50 శాతం, విలువ పరంగా 10 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయి.డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని, ఆర్థిక సాంకేతికత (ఫిన్టెక్) మాత్రమే కాకుండా బయోమెట్రిక్ గుర్తింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ లాకర్స్, సమ్మతితో కూడిన డేటా షేరింగ్లోనూ మెరుగ్గా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. అయితే సైబర్ భద్రత ముఖ్యమైన సవాలు అని కూడా ఎత్తి చూపింది. -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్పూర్లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రిటైల్ డిజిటల్ చెల్లింపులు: 2030 నాటికి రూ.584 లక్షల కోట్లు!
భారతదేశంలో డిజిటల్ ట్రాన్సక్షన్స్ వేగంగా సాగుతోంది. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి డిజిటల్ రిటైల్ చెల్లింపులు ఏకంగా 7 ట్రిలియన్ డాలర్లు లేదా రూ. 584.6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని.. 'హౌ అర్బన్ ఇండియా పేస్' నివేదికలో వెల్లడించింది.డిజిటల్ పెరుగుదలకు ప్రధాన కారణం ఈ కామర్స్ రంగం అని తెలుస్తోంది. 2022లో ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల వాల్యూమ్లలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. కార్డ్లు, డిజిటల్ వాలెట్లు డిజిటల్ లావాదేవీ విలువలో 10 శాతం మాత్రమే.దేశంలోని 120 ప్రధాన నగరాల్లోని 6000 మంది ఆన్లైన్ సర్వేలో 90 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఇష్టపడుతున్నారు. సంపన్న కస్టమర్లు తమ లావాదేవీలలో 80 శాతం వరకు డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు. మిలినీయర్లలో 72 శాతం మంది డిజిటల్ లావాదేవీలను ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.సుమారు 1000 మంది భారతీయ వ్యాపారుల లావాదేవీల వాల్యూమ్లలో 69 శాతం డిజిటల్ చెల్లింపు విధానాలు ఉన్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరానా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇలా మొత్తం మీద రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. -
మరో బిజినెస్లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్కు చెందిన అదానీ వన్ యాప్లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
క్యూ ఆర్ స్కాన్తో సాధారణ రైలు టికెట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో విజయవాడ డివిజన్లో జనరల్ బుకింగ్ కౌంటర్ (అన్ రిజర్వ్డ్)లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్ బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, పిల్లలు/పెద్దల సంఖ్య, చార్జీలు వివరాలను బుకింగ్ క్లర్క్ నమోదు చేయగానే కౌంటర్ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని అక్కడ కనిపించే క్యూ ఆర్ కోడ్ను మొబైల్ ఫోన్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో టికెట్ జనరేట్ అవుతుందన్నారు. త్వరలోనే ఈ సౌకర్యాన్ని డివిజన్లోని అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్తో ఉన్న ఫోన్పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్తో వీడియోని ఎక్స్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్వర్క్తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి. ఫోన్పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా.. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ పంజాబ్ & సింధ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ కాస్మోస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. చిల్లర కష్టాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో శర్మ పోస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్కి (ఓసీఎల్) పీపీబీఎల్లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. -
ఈ – కామర్స్ వర్తక శకంలో...
వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే విపణిలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగదారులే. మారుతున్న కాలాన్ని బట్టి నేడు సామాన్యుడు సైతం అంతర్జాలంలో వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ రూపంలో నగదు చెల్లింపుల లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నా.. నేరస్థులకు నగదు దోచుకునేందుకు దగ్గరిదారిగా మారింది. గత ఏడాది మనదేశంలో 14 లక్షల సైబర్ నేరాలు జరగడం దీనికి తార్కాణం. ‘వినియోగదారుల రక్షణ చట్టం –2019’లో ‘ఈ–కామర్స్’ లావా దేవీలను స్పష్టంగా నిర్వచించడం జరిగింది. ‘డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ ఉత్పత్తులతో సహా వస్తువులు లేదా సేవలను కొను గోలు చేయడం లేదా విక్రయించడం’ ఈ–కామర్స్గా నిర్వచించబడింది. ‘మీకు లాటరీలో బహుమతి వచ్చింద’నీ; ‘కారు, టీవీ, మోటార్ సైకిల్ గెలుచుకున్నార’ంటూ తప్పుడు ప్రకటనల ద్వారా సైబర్ నేరస్థులు రెచ్చి పోతున్నారు. నిరుద్యోగులే కాదు ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వైద్యులు, ఇంజనీర్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదుకు చెందిన యువ వైద్యునికి రోజుకు రూ. 5 వేలు సంపాదించవచ్చంటూ రూ. 20 లక్షల రూపాయలు కాజేసిన ఘటన తెలిసిందే. గ్యాస్ ఏజెన్సీలు ఇస్తా మనీ; హోటళ్ళకు, సినిమాలకు రేటింగ్ ఇస్తామనీ, వ్యాపారంలో భాగ స్వామ్యం అనే ప్రకటనలతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక–2021 ప్రకారం చూస్తే, గత ఐదేళ్ళలో సైబర్ నేరాల సంఖ్య 141 శాతం పెరిగింది. న్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో ఆర్థికంగా నష్టం చేకూర్చడం, వినియోగదారులను మోసం చేయడం ద్వారా వినియోగదారుల హక్కులకు ఆటంకం కలిగించే సంస్థలు/కంపెనీలు/వ్యాపారుల గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం భారత్ 1986 డిసెంబర్ 24న ‘వినియోగదారుల రక్షణ చట్టా’న్ని తెచ్చింది. ఆ రోజును ప్రతి ఏడాదీ ‘జాతీయ వినియోగ దారుల హక్కుల దినం’గా పాటిస్తున్నారు. భద్రత హక్కు, ఎంచుకునే హక్కు, సమాచారం పొందే హక్కు, వినే హక్కు, పరిహారం కోరుకునే హక్కు, వినియోగదారుల విద్య హక్కులను పరిరక్షించడానికీ, వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికీ 2020 జూలై 20 నుండి ‘సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ’ (సీసీపీఏ) స్థాపించబడింది. చెల్లుబాటు అయ్యే ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్ఐ) మార్క్ లేని వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ సంస్థ రెండు భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది. ఆన్లైన్ షాపింగ్ చేసే చాలా మంది వ్యక్తులు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు, లోపభూయిష్ఠ ఉత్పత్తులు, ఉత్పత్తుల నకిలీ డెలివరీలు, అసురక్షిత ఉత్పత్తులు, చెల్లింపు సమస్యలు, భద్రత– గోప్యతా సమస్యలు, ఏకపక్ష ఒప్పందాలు వంటి వాటి కారణంగా బాధితులుగా మారారు. కానీ, అధికార పరిధుల సమస్యల కారణంగా చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల బాధిత వినియోగదారులను రక్షించడంలో చట్టాలు విఫలమవుతున్నాయి. ఆన్లైన్ లావాదేవీలతో వ్యవహరించేటప్పుడు నేటి జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ ఒప్పందాలను నియంత్రించేందుకు వినియోగదారుల రక్షణ చట్టం –2019లో అనేక అంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారుల రక్షణ చట్టం– 2019ని బలో పేతం చేసేందుకు పాఠశాలలో విద్యార్థులతో సుమారు 6,000 వినియోగ దారుల క్లబ్బుల ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల వ్యవహా రాలపై, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారికి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశ నుండే చట్టంపై అవగాహన కలిగించేందుకు ‘మేము సైతం’ అనే పుస్తకాన్నీ, సుమారు 10 రకాలైన గోడపత్రాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. తూనికలు కొలతల శాఖ వారు 3 రకాలైన గోడపత్రాలను రూపొందించడం జరిగింది. గోడపత్రాలనూ పాఠశాలతో పాటు గ్రామ/వార్డు సచి వాలయాలలో, పెట్రోలు బంకులలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింతగా ఈ చట్టం పట్ల అవగాహన ప్రజలలో కల్పించేందుకు ‘మేలుకొలుపు’ అనే మాస పత్రికను కూడా పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉంటే కొనుగోలు చేసే వస్తువులు / సేవలు / ఆన్లైన్ లావాదేవీలలో జరిగే నష్టాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. దాసరి ఇమ్మానియేలు వ్యాసకర్త ఏపీ వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ ‘ 90599 90345 (నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం) -
పేటీఎమ్ నుంచి బెర్క్షైర్ ఔట్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్లోగల మొత్తం 2.46 శాతం వాటాను ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్షైర్ హాథవే తాజాగా విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లోగల 1.56 కోట్లకుపైగా షేర్లను ఆఫ్లోడ్ చేసింది. షేరుకి రూ. 877.29 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ దాదాపు రూ. 1,371 కోట్లు. అనుబంధ సంస్థ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా మొత్తం వాటాను విక్రయించింది. కాగా.. దీనిలో 1.19 శాతం వాటాకు సమానమైన 75,75,529 షేర్లను కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయగా.. 42.75 లక్షల షేర్ల(0.67 శాతం వాటా)ను ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఎల్పీ సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 877.2 సగటు ధరలో దాదాపు రూ. 1,040 కోట్లు వెచ్చించాయి. ఈ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 895 వద్ద ముగిసింది. -
డిజిటల్ లావాదేవీలను మానిటరింగ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్
-
ప్రతీ రెండు రోజులకు ఇదే పరిస్థితి: ఎస్బీఐ వినియోగదారుల ఫిర్యాదులు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా యూపీఐ సేవల అంతరాయం ఖాతాదారుల్లో అసహనానికి దారి తీసింది. ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ కావడం, లేదంటే ఇన్ సఫీషియంట్ బ్యాలెన్స్ అన్న మెసేజ్ రావడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బందులతో కస్టమర్లు గందరగోళంలో పడి పోయారు. గత రెండు, మూడు రోజులుగా ఈ ఇబ్బందులు ఎదురు కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్లో నిలిచింది. ప్రతీ రెండు రోజులు ఇదే పరిస్థితి అంటూ కొంతమంది యూజర్లు ట్విటర్లో వ్యాఖ్యానించడం గమనార్హం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ లావాదేవీలు చాలాసార్లు ఫెయిల్ కావడంతో కస్టమర్లలో ఆందోళన తలెత్తింది. ఈ సమస్య గత రెండు రోజుల నుండి జరుగుతోంది, ఎవరు పట్టించుకోవడంలేదు. ఖాతాదారుల ఇబ్బందులను బ్యాంకు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒకరు ప్రశ్నించారు. టెక్నికల్ అప్డేట్ కోసం మూడురోజులా అంటూ మరొక యూజర్ ఎస్బీఐపై ధ్వజమెత్తారు. అయితే తమ కస్టమర్ల యూనిఫైడ్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో ఇబ్బందులు రావచ్చని బ్యాంకు ముందుగానే ఎక్స్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ నెల 14న వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ అందిస్తామని ట్వీట్ చేసింది. అయితే,ఇప్పటివరకు కొత్త అప్డేట్ ఏమీలేదు.. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అన్న అసహనం వినియోగదారుల్లో నెలకొంది. pic.twitter.com/yi5DVQjkYi — State Bank of India (@TheOfficialSBI) October 14, 2023 @TheOfficialSBI the UPI server of SBI is not working from today morning.. gpay, phonepe even yonosbi UPI isn't working. Could you please tell when these problems are solved? pic.twitter.com/hZmhtRm5mr — Gokul Kannan (@gokulanyms) October 14, 2023 Dear @RBI please investigate and give heavy penalty to @TheOfficialSBI for keeping UPI system down for days. @sbi_care Last few days its down. #sbi #upi #phonepe #paytm @nsitharamanoffc pic.twitter.com/grPrF0xgqV — Sudipta (@ghosh1s) October 15, 2023 -
డిజిటల్ లావాదేవీలు, నగదుపై నిఘా, లిమిట్ దాటితే..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో నగదు సరఫరా, పంపిణీపై రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అక్రమ నగదు రవాణా, పంపిణీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆన్లైన్ వేదికగా జరిపే డిజిటల్ నగదు బదిలీలపై కూడా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకర్లతో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే రూ.కోట్లలో నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్, యూపీఐ, ఇతర డిజిటల్ లావాదేవీలను ట్రాక్ చేయడానికి బ్యాంకర్లు ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అనుమానాస్పద బల్క్ లావాదేవీలపై పర్యవేక్షించేందుకు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒక బ్యాంకు ఖాతా నుంచి వివిధ అకౌంట్లకు లావాదేవీలు జరిపితే, వాటిని గుర్తించి వెంటనే పోలీసు శాఖను అప్రమత్తం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లినా, యూపీఐ ద్వారా ఎక్కువ మందికి డబ్బు పంపితే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆన్లైన్ లావాదేవీల వివరాలు బ్యాంకుల నుంచి సేకరిస్తారు. ఆస్పత్రులు, భూ క్రయవిక్రయాలు, వివాహాలకు సంబంధించి నగదు, బంగారం తీసుకెళితే సంబంధిత ఆధారాలు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. -
యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది. ఈ ఏడాది ఆగస్ట్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్లో టాప్–5లో వరుసగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. చిన్న మొత్తాలే అధికం.. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. -
డిజిటల్ సదుపాయాలతో 27 బిలియన్ డాలర్ల ఆదా - అజయ్సేథ్
న్యూఢిల్లీ: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వల్ల ప్రభుత్వ పథకాల అమలులో 27 బిలియన్ డాలర్లను (రూ.2.24 లక్షల కోట్లు) ఆదా చేయగలిగినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ ప్రకటించారు. అంతేకాదు స్వల్ప కాలంలోనే అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల లకి‡్ష్యత లబ్ధిదారులను చేరుకోగలిగినట్టు, బోగస్ ఖాతాలను తొలగించినట్టు తెలిపారు. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల ధనం పెద్ద ఎత్తున ఆదా అయినట్టు పేర్కొన్నారు. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో సాధించిన పురోగతిని అజయ్సేథ్ వివరించారు. బ్యాంకు ఖాతాల విషయంలో 20 శాతంగా ఉన్న విస్తరణను కేవలం 7–8 ఏళ్లలోనే 80 శాతానికి డీపీఐ సాయంతో పెంచినట్టు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికీ మెరుగైన సేవలు అందేలా పరిష్కారాలను అమలు చేసినట్టు చెప్పారు. 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రారంభించగా, 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నట్టు వెల్లడించారు. ఇందులో 56 శాతం మహిళలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే, 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భారత్ తన జ్ఞానాన్ని, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సేథ్ ప్రకటించారు. -
యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. డెబిట్ కార్డులు బేజారు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలతో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డబ్బు బదిలీ (మనీ ట్రాన్స్ఫర్)గా నేడు అవతరించింది. అందుకే మునుపెన్నడూ లేనంత స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్ల జోరు కొనసాగుతోంది. మూడు, నాలుగేళ్ల కిందట ప్రధానంగా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో అత్యధికంగా పలు రకాల లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి కాలం తెచ్చిన మార్పు చేర్పులతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తోసిరాజని యూపీఐ లావాదేవీలు ఇప్పుడు అగ్రపీఠాన్ని అధిరోహించాయి. యూపీఐ ద్వారా... చిన్న మొత్తంలో కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు అవకాశం ఉండడంతో వాటివైపే అత్యధికుల మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. రోజువారీ నిత్యావసర కొనుగోళ్లు మొదలు, మార్కెట్లో వివిధరకాల వస్తువుల కొనుగోలుకు యూపీఐ చెల్లింపు విధానాన్ని మెజారిటీ వినియోగదారులు అనుసరిస్తున్నారు. గత మూడేళ్లలో 428 శాతం యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరగ్గా, గత నెలలో (ఆగస్టులో) రూ.పది బిలియన్ల (బిలియన్ = 100 కోట్లు) ట్రాన్సాక్షన్ల నమోదుతో తొలిసారి రికార్డ్ సృష్టించాయి. మూడేళ్లుగా డిజిటల్ లావాదేవీలు కోవిడ్ నుంచి మూడేళ్లుగా క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎంతగా అంటే.. 2023–24 ఆర్థికసంవత్సరంలో (ఏప్రిల్–జూలైల మధ్య) చెల్లింపుల విషయానికొస్తే..క్రెడిట్కార్డుల ద్వారా రూ.5.57 ట్రిలియన్లు, డెబిట్కార్డులతో రూ.13 ట్రిలి యన్లు, యూపీఐ ద్వారా రూ.59.14 ట్రిలియన్ల (ట్రిలియన్ = లక్ష కోట్లు)లో జరిగినట్టు వెల్లడైంది. ఆర్బీఐ డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కరోనా తెచ్చిన మార్పులతో భారతీయులు అనుస రిస్తున్న వ్యయం తీరులో మార్పులు వచ్చి నట్టుఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చదవండి: పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్ కీలకాంశాలు ► 2020 జూలైలో డెబిట్కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు రూ.2.81 ట్రిలియన్లు కాగా. 2023 జూలైలో అవి రూ.3.15 ట్రిలియన్లుకు... అంటే 11.96 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేశాయి. ► ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు అనేవి రూ.2.90 ట్రిలియన్ల నుంచి రూ.15.33 ట్రిలియన్లకు.. అంటే 428 శాతం పెరుగుదలను రికార్డ్ చేశాయి ►మరోవైపు క్రెడిట్కార్డుల ద్వారా చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి ► 2020 జూలైలో రూ.0.45 ట్రిలియన్ల చెల్లింపులతో పోల్చితే 2023 జూలై నాటికి అవి రికార్డ్ స్థాయిలో రూ.1.45 ట్రిలియన్లకు చేరుకున్నాయి ► కస్టమర్లు చెల్లిస్తున్న పద్ధతుల్లో భారీ మార్పుల వస్తున్నా డెబిట్కార్డుల వినియోగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు లేవు. మార్కెట్లో వాటి స్థానం పదిలమని నిపుణుల అంచనా. 20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు చిన్న చిన్న మొత్తాల్లో చెల్లింపులు పెరగడం, ఫోన్ ద్వారా యూపీఐ లావాదేవీల వెసులుబాటుతో.. సంప్రదాయ చెల్లింపు పద్ధతిగా ఉన్న కస్టమర్ల డెబిట్కార్డుల వినియోగం అనేది బాగా తగ్గింది. దీనిని బట్టి వచ్చే 18–24 నెలల కాలంలో యూపీఐ లావాదేవీలు నెలకు రూ.20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యపడక్కర లేదు. –సునీల్ రంగోలా, సీనియర్ వైస్ప్రెసిడెంట్, హెడ్ –స్ట్రాటజీ,ఇన్నోవేషన్, అనాలిటిక్స్, వరల్డ్లైన్ ఇండియా -
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
-
నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు!
ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్ఫారమ్ ద్వారా సాధించిన 10 బిలియన్ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దాని ప్రత్యర్థి మాస్టర్ కార్డ్ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది. పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్ కార్డ్ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్ఫారమ్లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్స్ట్రమెంట్ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు. -
వారి కోసం పేటీఎం ‘సౌండ్ బ్యాక్స్’ లాంచ్, ధర ఎంతంటే?
చెల్లింపు సేవా సంస్థ పేటీఎం తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. ముఖ్యంగా తన ప్లాట్ఫాంలో చిన్న వ్యాపారుల డిజిటల్ చెల్లింపుల కోసం సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. డిఫాల్ట్ గా వచ్చే'ట్యాప్ అండ్ పే' ఫీచర్తో ఐకానిక్ సౌండ్బాక్స్ ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే నెట్వర్క్లలో మొబైల్, కార్డ్ చెల్లింపులను చేయవచ్చు. ఈ తరహా సౌకర్యాన్ని అందించే తొలి సంస్థ తామేనని పేటీఎం ప్రకటించింది. 999 రూపాయల (12.08డాలర్లు) 'కార్డ్ సౌండ్బాక్స్' ను లాంచ్ చేసింది. దీని ద్వారా వ్యాపారులు రూ.5,000 వరకు కార్డ్ చెల్లింపులను ఆమోదించగలరు. మేడ్ ఇన్ ఇండియా డివైస్ 4G నెట్వర్క్ కనెక్టివిటీతో వేగవంతమైన పేమెంట్స్ అలర్ట్స్ అందిస్తుంది. తమ సౌండ్బాక్స్ లేదా మొబైల్ చెల్లింపులతో కాంటాక్ట్లెస్ డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కలపడం ద్వారా వ్యాపారులకు చెల్లింపుల సౌలభ్యాన్ని విస్తరించడం ద్వారా డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది. పేటీఎం క్యూఆర్ కోడ్తో మొబైల్ చెల్లింపుల మాదిరిగానే వ్యాపారులు, వినియోగదారులకు కార్డ్ ఆమోదం అవసరమని, పేటీఎం సరికొత్త సౌండ్బాక్స్ ద్వారా కస్టమర్కు LCD డిస్ప్లే ద్వారా ఆడియో, దృశ్య చెల్లింపు నిర్ధారణ రెండింటినీ అందిస్తుంది. విభిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్ 11 భాషల్లో హెచ్చరికలను అందిస్తుందని, వీటిని వ్యాపారి Paytm ఫర్ బిజినెస్ యాప్ ద్వారా మార్చుకోవచ్చని పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. చెల్లింపు సేవలు, ఆర్థిక సేవల సమస్యల్ని పరిష్కరించడంలో Paytm కార్డ్ సౌండ్బాక్స్ మరో ముందడుగు అని చెప్పారు. ట్యాప్ ఫీచర్ని ఉపయోగించి వారి ఫోన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసుకో వచ్చన్నారు. India’s first Soundbox with Card Payments is here! 🚀 With contactless payments and long lasting 5 day battery, we are proud to be back with yet another pioneering device to drive in-store payments!#Paytm #PaytmKaro #PaytmSeUPI pic.twitter.com/taP5JmXCd2 — Paytm (@Paytm) September 4, 2023 Paytm కార్డ్ సౌండ్బాక్స్ చిన్న వ్యాపారులు కాంటాక్ట్లెస్ కార్డ్ చెల్లింపులను సులభంగా ఆమోదించడం ద్వారా వారి కస్టమర్లకు అంతరాయం లేని డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించే మరో ఆవిష్కరణ అన్నారు మాస్టర్కార్డ్, దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్. ప్రతి లావాదేవీని ప్రత్యేకంగా ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా చెల్లింపులు నష్టం లేదా నకిలీ , డబుల్ బిల్లింగ్ లాంటివి తగ్గుతాయన్నారు. Paytm కార్డ్ సౌండ్బాక్స్ తరహాలోనే ఇప్పటికే పైన్ ల్యాబ్స్ PhonePe వంటి కంపెనీలు సౌండ్బాక్స్ లాంటివాటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
15 రాష్ట్రాల్లోనే 90 శాతం డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: డిజిటల్ చెల్లింపుల విలువ, పరిమాణంలో 90 శాతం వాటా దేశంలో టాప్ 15 రాష్ట్రాలదేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ఉందని తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉంది. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల్లో ఏపీ వాటా 8–12 శాతం డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా 8–12 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో జిల్లాల వారీగా యూపీఐ డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువల్లో టాప్ 100 జిల్లాలే 45 శాతం వాటా కలిగి ఉన్నట్లు తేలింది. దేశ జీడీపీలో 2017లో ఏటీఎంల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరగ్గా.. 2023లో 12.1 శాతానికి ఇవి తగ్గిపోయాయి. గతంలో ఒక వ్యక్తి ఏడాదిలో ఏటీఎంలకు 16 సార్లు వెళ్తే ఇప్పుడు 8 సార్లుకు పడిపోయింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 60 శాతం వాటా.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ప్రభావం చూపలేదని నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్లో 414 బ్యాంకుల్లో యూపీఐ ద్వారా 890 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.14.1 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. దీన్నిబట్టి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు కూడా ఆశ్చర్యకరంగా 60 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 767 శాతానికి పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి 2016లో ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. మొత్తం డిజిటల్ చెల్లింపులు 2016లో దేశ జీడీపీలో 668 శాతం ఉండగా 2023 నాటికి 767 శాతానికి పెరిగాయి. రిటైల్ డిజిటల్ చెల్లింపులు (ఆర్టీజీఎస్ మినహా) 2016లో దేశ జీడీపీలో 129 శాతం ఉండగా 2023లో 242 శాతానికి పెరిగాయి. దేశంలో వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ విలువ 73 శాతం ఉంది. ఈ లావాదేవీల్లో దేశం కొత్త మైలురాళ్లను అందుకుంది. యూపీఐ లావాదేవీల పరిమాణం 2017లో 1.8 కోట్ల నుంచి 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ రూ.6,947 కోట్ల నుంచి రూ.139 లక్షల కోట్లకు చేరింది. అంటే.. 2004 రెట్లు పెరిగింది. -
పేటీఎమ్లో విజయ్కు అదనపు వాటా
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ఫిన్ విజయ్కు పేటీఎమ్లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్ఫిన్వద్దనే కొనసాగనున్నాయి. కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్లో యాంట్ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ చేపట్టింది. -
ఫ్రాన్స్లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఫ్రాన్స్లోకి ప్రవేశించింది. భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్ టవర్ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు. యూపీఐ విషయంలో భారత్ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్–సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్పీసీఐ సీఈవో రితేష్ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్పీసీఐ అని తెలిసిందే. ఎలా పనిచేస్తుంది? ఫ్రాన్స్కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్వర్క్స్తో ఎన్పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్ఆర్ఐలు ఇక నుంచి లైరా నెట్వర్క్ ఆధారిత అన్ని చెల్లింపుల టెరి్మనళ్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్లో బ్యాంక్ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్లో భీమ్ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్ ఖర్చులు సైతం తగ్గుతాయి. రోజుకు 100 కోట్ల లావాదేవీలు యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తుండడంతో రానున్న రోజుల్లో చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు సీమాంతర చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా చేసుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంది. 2025 నాటికి రోజువారీ బిలియన్ లావాదేవీలకు (100 కోట్లు) చేరుకుంటామని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు యూకే, నేపాల్, భూటాన్, సింగపూర్, ఆ్రస్టేలియా, ఒమన్, ఫ్రాన్స్లో యూపీఐ లావాదేవీలకు అవకాశం ఏర్పడినట్టు చెప్పారు. భారత్ 13 దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అవన్నీ తమ దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రకటించడం గమనార్హం. -
Fact Check: అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఓ పార్టీ నేత చేసిన ఆరోపణలను సోమవారం ఓ ప్రకటనలో ఖండించింది. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టామని.. సక్రమంగా అమలవుతోందని వెల్లడించింది. మద్యం నియంత్రణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని కూడా పేర్కొంది. కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహిస్తుండగా మరికొన్ని దుకాణాల్లో ఎస్బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. జూలై 8న ఒక్కరోజే అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం 67,818 డిజిటల్ చెల్లింపులు చేశారు. దాదాపు రూ.1.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను డిజిటల్ చెల్లింపుల ద్వారానే నిర్వహించారు. నగదు చెల్లింపులకు అనుమతి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులతో పాటు నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. పేదలు తక్కువ ధర ఉన్న మద్యం కొనుగోలు చేసేందుకు గాను నగదు చెల్లింపులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు స్మార్ట్ ఫోన్లు, యూపీఐ యాప్లు ఉండవు. అందువల్ల నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
భారత దేశం దూసుకుపోతోంది..
న్యూఢిల్లీ: భారత దేశంలో చాయ్ అమ్ముకుంటున్న మహిళకు నూటికి నూరు శాతం తనకు రావాల్సిన సొమ్ము నేరుగా ప్రభుత్వం నుండి డిజిటల్ చెల్లింపుల రూపంలోనే అందుతోంది. ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 89.5 మిలియన్ల డిజిటల్ చెల్లింపులతో భారతదేశం పెనుసంచలనం సృష్టించిందన్నారు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. ఇదీ నాయకత్వం అంటే.. గురువారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లోనూ, ఆర్ధిక సాంకేతికతలోనూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ గురించి ప్రస్తావించారు. మోదీ నాయకత్వంలో భారత దేశం సాంకేతికంగా దూసుకుపోతోందని, త్వరలో జరగబోయే అమెరికా పర్యటనతో మన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. అజిత్ ధోవల్ గురించి చెబుతూ ఆయన భారత దేశానికి దొరికిన గొప్ప సంపదని అన్నారు. ఒప్పందాలు.. పెనుమార్పులు.. ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని రాక కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే వారం వాషింగ్టన్ లో పర్యటించనున్న మోదీ రక్షణ విభాగంలోనూ, వాణిజ్య విభాగంలోనూ అమెరికాతో చేయనున్న ఒప్పందాలు రెండు దేశాల మధ్య అనేక అడ్డంకులను తొలగించి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే.. -
డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!
సాక్షి,ముంబై:డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా టాప్లో నిలిచింది. రికార్డు కలెక్షన్స్తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో భారత దేశం ఐదు దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు మొత్తం నాలుగు దేశాల లావాదేవీలను కలిపిన దానికంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వివరాలు మైగోవ్ఇండియా ట్విటర్లో షేర్ చేసింది. ఈ డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశం గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపులలో 46 శాతం వాటాను సొంతం చేసుకుంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ఇతర నాలుగు ప్రముఖ దేశాలతో కలిపిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డిజిటల్ చెల్లింపు ల్యాండ్స్కేప్లో భారతదేశం ఆధిపత్యం కొనసాగిస్తోందని ట్వీట్ చేసింది. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) ఈ జాబితాలో 29.2 మిలియన్లతో బ్రెజిల్ రెండో స్థానంలో, చైనా 17.6 మిలియన్ల లావాదేవీలతో మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక 16.5 మిలియన్లతో 4వ స్థానంలో థాయిలాండ్ ఉండగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో అయిదో స్థానంలో ఉందని MyGovIndia డేటా పేర్కొంది. ఇదీ చదవండి: తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు! 📈 India keeps dominating the digital payment landscape! 💸🇮🇳 With innovative solutions and widespread adoption, we're leading the way towards a cashless economy. 💻#9YearsOfTechForGrowth #9YearsOfSeva@GoI_MeitY @AshwiniVaishnaw @Rajeev_GoI@alkesh12sharma @_DigitalIndia pic.twitter.com/cSfsFsq0mW — MyGovIndia (@mygovindia) June 9, 2023 -
డిజిటల్ చెల్లింపుల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ముంబై: సైబర్సెక్యూరిటీ రిస్కులను సమర్ధమంతంగా ఎదుర్కొనేలా, డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మార్చేలా అధీకృత నాన్-బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు (పీఎస్వో) రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ముసాయిదాను ప్రకటించింది. సైబర్సెక్యూరిటీ రిస్కులను గుర్తించడం, మదింపు చేయడం, సమీక్షించడం, ఎదుర్కొనడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. ఇదీ చదవండి: రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్ డిజిటల్ పేమెంట్ లావాదేవీలను సురక్షితంగా చేసేందుకు తీసుకోతగిన భద్రతాపరమైన చర్యలను సూచించింది. సమాచార భద్రతపరంగా రిస్కులు తలెత్తకుండా పీఎస్వో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బోర్డు) బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదాలో ప్రతిపాదించింది. దీని ప్రకారం సైబర్ దాడులను గుర్తించి, స్పందించి, కట్టడి చేసి, రికవర్ చేసేందుకు పీఎస్వోలు .. సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళిక (సీసీఎంపీ)ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. (10.25 అంగుళాల టచ్స్క్రీన్తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?) తమ సంస్థలో కీలక హోదాల్లో ఉన్న వారు, అసెట్లు, ప్రక్రియలు, కీలకమైన కార్యకలాపాలు, థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు మొదలైన వివరాలను రికార్డు రూపంలో ఉంచాలి. డేటా భద్రతకు సంబంధించి సమగ్రమైన డేటా చోరీ నివారణ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ వర్గాలు ఈ ముసాయిదాపై జూన్ 30లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. మరిన్ని ముఖ్యమైన వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే
న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్ సెగ్మెంట్లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది. దేశీయంగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్ కార్డు లావాదేవీలను మించనుంది. ► క్రెడిట్ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్ కార్డును ఎక్కువగా నగదు విత్డ్రాయల్కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గనుంది. ► 2022–23లో బ్యాంకులు, ఫిన్టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కార్డుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది. -
‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!
సాక్షి, ముంబై: రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట. రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్గా భావిస్తున్నారట. ఆన్లైన్లో వేసవి సీజన్లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ తమ స్టోర్లో 2000 రూపాయల నోట్లు 60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ పెద్ద నోటుతోనే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు) కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
సింపుల్గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్పాయింట్’ ప్రకారం, భారత్లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
Her Payment Digital: నగదు రహిత వ్యవస్థ బాటలో భారత్!
ముంబై: నగదు రహిత వ్యవస్థ ఆవిష్కరణ దిశలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయంలో డిజిటల్ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని (డీపీఏడబ్ల్యూ) 2023 గవర్నర్ శక్తికాంతదాస్ సోమ వారం ప్రారంభించారు. ‘హర్ పేమెంట్ డిజిటల్’ (డిజిటల్లోనే ప్రతి చెల్లింపు) పేరుతో కీలక చొరవకు శక్తికాంతదాస్ శ్రీకారం చుట్టారు. బ్యాంకులు, సంబంధిత అన్ని వర్గాలూ ఆన్లైన్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటి ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అభ్యర్థించారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) పేమెంట్ వ్యవస్థ పట్ల ప్రస్తుతం జరుగుతున్న జీ20 దేశాల సమావేశాల్లోసహా పలు దేశాలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థతో సహకారానికి ప్రత్యేకించి ఆయా దేశాల చెల్లింపు ప్లాట్ఫారమ్లతో యూపీఐను అనుసంధానం చేయడానికి ముందడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దేశాలతో..: యూపీఐ వ్యవస్థ ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్లలో అందుబాటులో ఉంది. యూపీఐ స్వీకరించాలనుకునే 13 దేశాలతో భారత్ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని సమాచారం. ‘యూపీఐ’ – సింగపూర్ భాగస్వామి ‘పేనౌ’ మధ్య లింకేజీలు యాక్టివేట్ అయినప్పటి నుండి, చెల్లింపుల విషయంలో చాలా దేశాలు అటువంటి సహకారంలోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని దాస్ తెలిపారు. యూపీఐ విస్తరణ వేగం.. యూపీఐ ద్వారా చెల్లింపులు గత 12 నెలల్లో విపరీతంగా పెరిగాయని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. రోజువారీ లావాదేవీలు 36 కోట్లు దాటాయని అన్నారు. ఫిబ్రవరి 2022లో 24 కోట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, యూపీఐ లావాదేవీల విలువ 2022 ఫిబ్రవరిలో రూ.5.36 లక్షల కోట్లయితే, 2023 ఫిబ్రవరిలో ఈ విలువ రూ. 6.27 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022లో రూ. 5.36 లక్షల కోట్ల నుండి 17 శాతం వృద్ధిని నమోదు చేశాయని చెప్పారు. గత మూడు నెలల్లో మొత్తం నెలవారీ డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ప్రతి నెలా రూ. 1,000 కోట్ల మార్కును దాటాయని కూడా ఆయన చెప్పారు. -
త్వరలోనే నగదును మించి డిజిటల్!
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలు అధిగమించగలవని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా తీర్చిదిద్దిన ఈ పేమెంట్ సిస్టమ్ అత్యంత సురక్షితమైనదిగా ఉంటోందనడానికి దీని ద్వారా భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతుండటమే నిదర్శనమని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సింగపూర్కు చెందిన పేనౌ, యూపీఐ మధ్య సీమాంతర కనెక్టివిటీని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు. మోదీ, సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్ సమక్షంలో యూపీఐ–పేనౌ లింకేజీని ఉపయోగించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ (ఎంఏఎస్) ఎండీ రవి మీనన్ లాంఛనంగా లావాదేవీ జరిపారు. ‘భారత్, సింగపూర్ మధ్య మైత్రిని, ఫిన్టెక్ .. నవకల్పనల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి సంబంధించి నేడు చాలా ప్రత్యేకమైన రోజు‘ అని మోదీ ట్వీట్ చేశారు. 2018లో మోదీ సింగపూర్లో పర్యటించినప్పుడు పేనౌ, యూపీఐని అనుసంధానించే ఆలోచనకు బీజం పడిందని లీ తెలిపారు. ‘అప్పటి నుంచి ఇరు దేశాల బ్యాంకులు ఈ దిశగా కృషి చేశాయి. మొత్తానికి ఇది సాకారం కావడం సంతోషదాయకం‘ అని ఆయన పేర్కొన్నారు. ఏటా 1 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు.. భారత్, సింగపూర్ మధ్య ఏటా 1 బిలియన్ డాలర్ల పైగా సీమాంతర రిటైల్ చెల్లింపులు, రెమిటెన్సుల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చౌకగా సీమాంతర లావాదేవీలు జరిపేందుకు యూపీఐ–పేనౌ అనుసంధానం తోడ్పడగలదని మోదీ చెప్పారు. వ్యక్తుల మధ్య సీమాంతర చెల్లింపులు జరిపేందుకు భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి దేశం సింగపూర్ అని ఆయన తెలిపారు. 2022లో యూపీఐ ద్వారా రూ. 126 లక్షల కోట్లకు పైగా విలువ చేసే 7,400 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇది దాదాపు 2 లక్షల కోట్ల సింగపూర్ డాలర్ల విలువకు సరిసమానమని ప్రధాని వివరించారు. ‘ఈ నేపథ్యంలో చాలా మంది నిపుణులు త్వరలోనే భారత్లో డిజిటల్ వాలెట్ లావాదేవీలు.. నగదు లావాదేవీలను అధిగమిస్తాయని అంచనా వేస్తున్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. లావాదేవీలు ఇలా... ఆర్బీఐ, ఎంఏఎస్, ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్), బ్యాంకింగ్ కంప్యూటర్ సరీ్వసెస్ (బీసీఎస్), ఇతరత్రా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు కలిసి యూపీఐ–పేనౌ లింకేజీని తీర్చిదిద్దాయి. దీనితో ఇరు దేశాల ప్రజలు తమ తమ మొబైల్ యాప్ల ద్వారా సురక్షితంగా సీమాంతర నిధుల బదలాయింపు లావాదేవీలు చేయవచ్చు. తమ బ్యాంక్ ఖాతాలు లేదా ఈ–వాలెట్లలో డబ్బును యూపీఐ ఐడీ, మొబైల్ నంబరు లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ద్వారా పంపించవచ్చని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. తొలి దశలో భారతీయ యూజర్లు రోజుకు రూ. 60,000 వరకూ (1,000 సింగపూర్ డాలర్లు) పంపించవచ్చు. లావాదేవీ చేసేటప్పుడే రెండు కరెన్సీల్లోనూ విలువను సిస్టమ్ చూపిస్తుంది. ఎస్బీఐ, ఐఓబీ, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ ఇన్వార్డ్, అవుట్వార్డ్ రెమిటెన్సుల సేవలను.. యాక్సిస్, డీబీఎస్ ఇండియా కేవలం ఇన్వార్డ్ రెమిటెన్సుల సేవలను అందిస్తాయి. -
పేటీఎం నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. ఈసాప్ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్ ఈవెన్) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. -
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఫోను నుంచే ‘ఫారిన్’ మనీ.. ఇక విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులు చేయాలంటే.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే ఎన్నారైలకు భారత్లో ఏదైనా బ్యాంకులో నాన్ రెసిడెంట్ ఎక్స్టెర్నల్ (ఎన్ఆర్ఈ) అకౌంట్ లేదా నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపించవచ్చు. ఈ–కామర్స్ పోర్టళ్లకూ చెల్లింపులు చేయొచ్చు. సాక్షి, అమరావతి: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు డబ్బులు పంపించడం ఇక సులువు కానుంది. విదేశాల నుంచి కూడా చేతిలో ఉన్న సెల్ఫోన్ నుంచే డిజిటల్ (యూపీఐ) చెల్లింపుల ద్వారా నిధులు పంపొచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే తదితర యూపీఐ పేమెంట్ మాధ్యమాల ద్వారా క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తారు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విధి విధానాలను ఖరారు చేసింది. ఈ తాజా విధాన నిర్ణయం 1.35 కోట్ల మంది ఎన్నారైలకు సౌలభ్యంగా మారనుంది. తొలి దశలో 10 దేశాలకు అనుమతి తొలి దశలో ఎన్నారైలు అధికంగా ఉన్న 10 దేశాల నుంచి చెల్లింపులకు ఎన్పీసీఐ అనుమతి మంజూరు చేసింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. విదేశాల నుంచి యూపీఐ చెల్లింపుల కోసం ఎన్పీసీఐ 2020లోనే ప్రత్యేకంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లోని డిజిటల్ పేమెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే నేపాల్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్లలోని సంస్థలు భారతీయ యూపీఏ చెల్లింపులను అనుమతించేలా ఒప్పందాలు చేసుకుంది. మన యూపీఐని సింగపూర్ పేనౌ సంస్థతో అనుసంధానించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు నేరుగా భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులకు అనుమతించింది. ప్రస్తుతం నగదు బదిలీకి 48 గంటలు ప్రస్తుతం ఎన్నారైలు భారత్లోని బంధువులకు అక్కడి బ్యాంకు ఖాతా నుంచి భారత్లోని బ్యాంకు ఖాతాకు నగదు పంపిస్తున్నారు. దీన్ని వైర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ విధానంలో నగదు బదిలీకి 48 గంటల సమయం పడుతుంది. ఇక వెస్ట్రన్ యూనియన్, యూఏఈ ఎక్సే్ఛంజ్ వంటి మనీ ట్రాన్స్ఫర్ కంపెనీల ద్వారా పంపాలంటే విదేశాల్లోని మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఆఫీసుకు వెళ్లి ఆ దేశం కరెన్సీని చెల్లించాలి. ఆ రోజుకు మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ నిర్దేశించిన మారక విలువనుబట్టి భారత్లో ఉన్న వారికి భారత కరెన్సీలో నగదు చెల్లిస్తారు. ఇవి కాకుండా మరికొన్ని ఆన్లైన్ చెల్లింపు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి డబ్బులు పంపేవారు, పొందేవారు ఇద్దరి నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. మనీ లాండరింగ్కు అవకాశం లేకుండా.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులపై భారత్లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)కు కట్టుబడిన బ్యాంకు అకౌంట్లకే డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించే ఖాతా ఉన్న బ్యాంకు, డబ్బులు తీసుకునే ఖాతా ఉన్న బ్యాంకు కచ్చితంగా విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపు లావాదేవీలు దేశంలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి అనుగుణంగా ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆర్థిక ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊపు.. ఎన్పీసీఐ తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకుల ద్వారా డిజిటల్ పేమెంట్లు మరింతగా పెరగనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. అప్పటి నుంచి ఇవి భారీగా పెరిగాయి. 2000లో దేశంలో రూ.4.2 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరగ్గా, 2022లో ఏకంగా రూ.12.8 లక్షల కోట్ల చెల్లింపులు జరగడం విశేషం. విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు మొదలైతే వీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. విదేశాల నుంచి నిధుల్లో భారత్దే అగ్రస్థానం విదేశాల్లో ఉన్న వారి నుంచి స్వదేశానికి వస్తున్న నిధుల్లో ప్రపంచంలో భారత్దే మొదటిస్థానం. 2021లో ఎన్నారైలు భారత్లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.7.15 లక్షల కోట్లు పంపించగా.. 2022లో రూ.8 లక్షల కోట్లు పంపించారు. అందులో 25 శాతం గల్ఫ్ దేశాల నుంచి, 20 శాతం అమెరికా నుంచి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులకు అనుమతించడంతో ఈ నిధుల వరద మరింతగా పెరగనుంది. -
పేమెంట్ అగ్రిగేటర్గా హిటాచీ: ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి,ముంబై: దేశీయ పేమెంట్ సేవల్లోకి మరో సంస్థ వచ్చి చేరింది. హిటాచీ చెల్లింపు సేవలకు ఆర్బీఐ తాజాగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ను మంజూరు చేసింది. దీంతో B2B కస్టమర్లకు EMI, పేలేటర్, BBPS , లాయల్టీ సొల్యూషన్స్ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీస్లతో పాటు అన్ని డిజిటల్ చెల్లింపులకు సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఆథరైజేషన్ ద్వారా కస్టమర్లకు వన్ స్టాప్ డిజిటల్ పేమెంట్ సేవలను కూడా అందించనున్నామనివెల్లడించింది. ఆర్బీఐ తమకందించిన పేమెంట్ అగ్రిగేటర్ ఆథరైజేషన్ ద్వారా దేశంలో పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే తమ దృష్టి మరింత బలోపేతం కానుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రుస్తోమ్ ఇరానీ అన్నారు. తద్వారా దేశ ప్రజలకు సులభమైన డిజిటల్ చెల్లింపులను అందించడంతోపాటు, డిజిటల్ ఇండియా చొరవకు మరింత దోహదపడుతుందనీ, అందరికీ ఆర్థిక సాధికారతను అందిస్తుందని ఇరానీ చెప్పారు. -
782 కోట్ల లావాదేవీలతో.. ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా గత డిసెంబర్లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి. 2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్ఫామ్ దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక సేవల విభాగం సోమవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. యూపీఐ చెల్లింపులు గతేడాది అక్టోబర్లో తొలిసారిగా రూ. 12 లక్షల కోట్ల మార్కును దాటాయి. నవంబర్లో రూ. 11.90 లక్షల కోట్లకు తగ్గినా, డిసెంబర్లో మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం దాదాపు 381 బ్యాంకులు యూపీఐ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. -
ఫ్లిప్కార్ట్ నుంచి విడివడ్డ ఫోన్పే
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ మాతృ సంస్థకాగా.. ఫోన్పేను 2016లో ఫ్లిప్కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్మార్ట్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్కార్ట్ సింగపూర్, ఫోన్పే సింగపూర్ వాటాదారులు ఫోన్పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వెరసి ఫోన్పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్ గ్రూపులలోనూ వాల్మార్ట్ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్ బేస్ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్పే స్వస్థలాన్ని(డొమిసైల్) సింగపూర్ నుంచి భారత్కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు. -
వీఎంసీలో డిజిటల్ పేమెంట్స్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర ప్రజలు ఆస్తి, డ్రెయినేజీ, నీటి, ఖాళీస్థలాలు ఇతర పన్నులను ఇక తమ ఇంటి నుంచే చెల్లించేలా నగర పాలక సంస్థ (వీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ – పోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో పన్నులు వసూలు చేసుకునేందుకు ఇప్పటికే ఒక దఫా బ్యాంకర్లతో చర్చలు జరిపింది. డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలు కల్పించింది. అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ దిశగా అడుగులు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కుంటున్న వీఎంసీ మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థ వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) అమర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో డంపర్ బిన్లను పర్యవేక్షిస్తోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంపిణీ వంటి తదితర అంశాలను స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్) ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా వివరాలను పర్యవేక్షిస్తోంది. ఇటీవల నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ తోపాటు వాట్సాప్, టెలిగ్రాంను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నులను కూడా డిజిటల్ విధానంలో వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేయడం ద్వారా ఆడిట్ సక్రమంగా ఉంటుందని, అవినీతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ–పోస్ ఎలా పనిచేస్తుందంటే.. వీఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులు, నీటి సరఫరా, డ్రెయినేజీ, ఖాళీ స్థలాల సమాచారాన్ని డివిజన్ల వారిగా ఈ–పోస్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా వార్డు సచివాలయాల సెక్ర టరీల ద్వారా సంబంధిత పన్నులు వసూలు చేస్తారు. చలానాలు, పన్నులు, చార్జీలు తదితర చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు మొబైల్ పేమెంట్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. ఇప్పటి వరకు మీ–సేవ, ఆన్లైన్, ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ల ద్వారా మాత్రమే ఆయా పన్నులు, చార్జీలు చెల్లింపులు జరిగాయి. అయితే కొన్ని రకాల సేవలు మాత్రమే ఇకపై మీ–సేవ ద్వారా చెల్లింపులకు ఆస్కారం ఉందని వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఆయా వార్డు సచివాలయ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇళ్ల పూర్తిస్థాయి సమాచారాన్ని (డోర్నంబర్, అసెస్మెంట్ నంబరు తదితర వివ రాలు) ఈ–పోస్ యంత్రాల్లో నమోదు చేశారు. చెల్లింపుదారులకు సంబంధించిన పూర్తివివరాలు ఈ–పోస్ యంత్రాల్లో ఉండటంతో క్షణాల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ సందర్భంగా కొన్ని డివిజన్లలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శివారు, కొండప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవటం, ఈ–పోస్ యంత్రాల బ్యాటరీ బ్యాకప్ చాలకపోవటం తదితర సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించి నగరవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ పేమెంట్లు అమలు చేయటానికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక పక్కాగా ఆడిట్ పన్నులు, ఇతర యూజర్ చార్జీలను డిజిటల్ విధానంలో వసూలు చేయడం ద్వారా ప్రతి పైసాకు ఆడిట్ సక్రమంగా ఉంటుంది. సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి కొంత వరకు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ట్రయల్ రన్ నిర్వహించాం. త్వరలో నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ -
లాభాలను చేరుకునే మార్గంలోనే పేటీఎం
న్యూఢిల్లీ: పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించే వన్97 కమ్యూనికేషన్స్.. లాభాలు, సానుకూల నగదు ప్రవాహాలను నమోదు చేసేందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వాటాదారులకు ఒక లేఖ రాశారు. తద్వారా సంస్థ భవిష్యత్తు పనితీరుపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అక్టోబర్ నెలలకు సంబంధించి పనితీరు గణాంకాలను తెలియజేశారు. దేశంలో ఎంతో అధిక డిమాండ్ ఉన్న రుణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు. ‘‘ఏడాది క్రితం పబ్లిక్ మార్కెట్ (ఐపీవో, లిస్టింగ్)కు వచ్చాం. పేటీఎం విషయంలో ఉన్న అంచనాలపై మాకు అవగాహన ఉంది. లాభదాయకత, మిగులు నగదు ప్రవాహాల నమోదు దిశగా కంపెనీ సరైన మార్గంలో వెళుతోంది. మరింత విస్తరించతగిన, లాభదాయక ఆర్థిక సేవల వ్యాపారం ఇప్పుడే మొదలైంది’’అని తన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ త్రైమాసికానికి పేటీఎం రూ.571 కోట్ల నష్టాలను ప్రకటించడం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రయాణంపై ఎంతో ఆసక్తి ఉందంటూ, ఎబిట్డా లాభం, ఫ్రీక్యాష్ ఫ్లో సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో రుణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తక్కువ మందికే రుణ సదుపాయం చేరువ కావడం, రుణ వ్యాపారంలో ఉన్న కాంపౌండింగ్ స్వభావం దృష్ట్యా, దీనిపై మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’అని శర్మ తెలిపారు. -
ఏటీఎం కార్డు లేకున్నా డిజిటల్ చెల్లింపులు బిగ్ బజార్ కోసం అంబానీ, అదానీ పోటీ
-
మూసధోరణికి తెర
బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. స్టార్టప్ల హబ్గా భారత్ పెట్టుబడులకు భారత్ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్–2ను మోదీ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు. ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ దిండిగల్: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు. -
పండుగ వేళ .. తగ్గిన నోట్ల వినియోగం
ముంబై: దీపావళి పండుగ వారంలో చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం రూ. 7,600 కోట్ల మేర తగ్గింది. రెండు దశాబ్దాల్లో ఇంత భారీ స్థాయిలో తగ్గడం జరగడం ఇదే ప్రథమం. డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు దోహదపడిందని ఒక నివేదికలో ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2009లో దీపావళి వారంలో కూడా సీఐసీ స్వల్పంగా రూ. 950 కోట్ల మేర తగ్గినప్పటికీ, అప్పట్లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రేరేపిత మందగమనం ఇందుకు కారణమని వారు తెలిపారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు భారత పేమెంట్ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయని ఆర్థికవేత్తలు చెప్పారు. నగదు ఆధారిత ఎకానమీ నుంచి స్మార్ట్ఫోన్ ఆధారిత పేమెంట్ వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని వివరించారు. చెల్లింపు విధానాల్లో సీఐసీ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 88 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి తగ్గింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 శాతానికి తగ్గుతుందని అంచనా. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో 11.26 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 80.4 శాతానికి చేరగా, 2027 నాటికి 88 శాతానికి చేరవచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. -
ఫోన్పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
Munugode Bypoll: గూగుల్ పే ఓకేనా.. ఫోన్ పే చేయాలా?
సాక్షి, నల్లగొండ/చౌటుప్పల్రూరల్: ఓట్ల కొనుగోళ్లలోనూ డిజిటల్ లావాదేవీలు వచ్చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులువేస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఓటర్లకు గతంలో మద్యం, డబ్బులు ఆశగా చూపి తమవైపు మళ్లించుకునే పార్టీలు ఈ ఉపఎన్నికలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బూత్ వారీగా నియమించిన ఇన్చార్జులు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుస్తూ డిజిటల్ లావాదేవీలవైపు మళ్లిస్తున్నారు. నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్న బూత్ ఇన్చార్జులు, సహ ఇన్చార్జులు.. రోజువారీ గా ఎంత మంది ఓటర్లను కలిశారు.. ఎవరెవరిని కలిశారన్న వివరాలను రాష్ట్ర పార్టీకి చేరవేస్తున్నారు. వారితో ఫొటోలు దిగి వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎవరెవరికి ఉంది.. గూగుల్ పే ఎవరికి ఉంది.. ఫోన్ పే ఎవరికి ఉందన్న వివరాలనూ పంపుతున్నారు. తమకు కేటాయించిన ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారు అడగకముందే హామీలిచ్చి తమవైపు మళ్లించుకుంటున్నారు. చౌటుప్పల్ ప్రచారంలో ఈ సందడి నెలకొంది. ఫోన్పే, గూగుల్పే లేదంటే... ఫోన్పే, గోగుల్ పే లేనివారికి నగదు రూపంలోనే డబ్బులు అందించేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అవి రెండు ఉన్నవారికి మాత్రం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేలా వారి ఫోన్ నంబర్లను రాసి పెట్టుకుంటున్నారు. ఇతర ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్కు రప్పించేలా వారితో ఫోన్లో మాట్లాడి ఒప్పిస్తున్నారు. అలాంటి వారికి ముందుగానే ఆన్లైన్లో డబ్బు జమ చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోవా ట్రిప్ కోసం.. యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ గోవా ట్రిప్కు ప్లాన్ చేస్తోందని సమాచారం. 10మంది యువకులు ఉండి, పార్టీ కండువాలు కప్పుకుంటే రూ.10 వేల చొప్పున ఖర్చులకు ఇచ్చి, విమానంలో వెళ్లి వచ్చేలా టికెట్లు ఇప్పించనున్నారని తెలిసింది. ఈ ఆఫర్కు 2గ్రూపులు ముందుకు వచ్చాయని సమాచారం. వచ్చే నాలుగైదు రోజుల్లో గోవాకు వెళ్లొచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నగదు రూపంలో అడ్వాన్స్లు ఓటర్లకు ఓ పార్టీ నగదు రూపంలో అడ్వాన్స్లిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన లీడర్లు తమ ఊళ్లలో అధిక ఓట్లను సాధించి, అభ్యర్థి మెప్పుపొందేందుకు ఓ గ్రామంలో ఓటర్లకు అడ్వాన్స్లు ఇస్తున్నారు. దసరా పండుగ రోజు కొన్ని కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇచ్చిన నాయకులు.. ఎన్నికలప్పుడు అవతలి పార్టీ వారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. తటస్థంగా ఉంటేనే మేలని.. పార్టీ కండువా కప్పుకొని తిరిగితే ఒక పార్టీ వారే డబ్బులు ఇస్తారని అదే తటస్థంగా ఉంటే మూడు పార్టీలు ఇస్తాయనే ఆలోచనల్లో కొంతమంది చోటామోటా నాయకులున్నారు. చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో ఇప్పటిదాకా రాజకీయాల్లో తిరిగిన ఓ చోటా నాయకుడు ఇప్పుడు ఆ పార్టీ వైపు వెళ్లడం లేదు. రూ.5 లక్షలిస్తే పార్టీలో తిరుగుతా అని చెబుతున్నాడట. ఇది తెలిసిన ఓ పార్టీ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని సమాచారం. -
జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
Digital Payments: క్యాష్తో పనిలేకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్తో పనిలేదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేయొచ్చు. ఆర్టీసీ యాజమాన్యం యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట ఇటీవల డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇన్నాళ్లూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణించే వారు టిక్కెట్టు కోసం నగదును చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ల ద్వారా చెల్లించే వెసులుబాటునూ కల్పించింది. దీనికి ప్రయాణికుల నుంచి కూడా ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజలు వివిధ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలకు నగదు రహిత డిజిటల్ చెల్లింపులకే ఎక్కువగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం దేశంలోనే తొలిసారిగా ప్రయాణికులు బస్సుల్లో టిక్కెట్ సొమ్ము చెల్లించేందుకు యూపీఐ (డిజిటల్ చెల్లింపుల) విధానాన్ని ప్రవేశపెట్టింది. విశాఖపట్నం జిల్లాలో దీనిని గత నెల ఏడో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. టిక్కెట్టు మొత్తాన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి స్వైపింగ్, ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటివి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చన్న మాట! ప్రయాణికుల ఆసక్తి ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు ఇప్పు డిప్పుడే ఆకర్షితులవుతున్నారు. తొలుత బస్సుల్లో డ్రైవర్లు/కండక్టర్లు డిజిట ల్ చెల్లింపుల సదుపాయం ఉందన్న విషయాన్ని ప్రయాణికులకు వివరి స్తున్నారు. అవకాశం, ఆసక్తి ఉన్న వారు చెల్లిస్తున్నారు. లేనివారు ఎప్పటిలాగే నగదు ఇచ్చి టిక్కెట్టు తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్న వారి సంఖ్య 10 శాతం ఉందని, క్రమంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 97 బస్సుల్లో అమలు.. విశాఖ జిల్లాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)కు 704 ఆర్టీసీ బస్సులు న్నాయి. తొలుత దూరప్రాంతాలకు నడిచే 97 ఎక్స్ప్రెస్, ఆపై (డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ తదితర) సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చారు. 580కి పైగా ఉన్న సిటీ బస్సుల్లో దశల వారీగా డిజిటల్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ చెల్లింపులు జరిపే ఈ–పోస్ యంత్రం మరిన్ని ప్రయోజనాలు.. ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులే కాదు.. మున్ముందు మరిన్ని సదుపా యాలు పొందే వీలుంది. ఇప్పటివరకు బస్సు కదిలే సమయానికి రిజర్వేషన్ చార్టును కట్ చేసి డ్రైవర్/కండక్టర్కు ఇస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఆ బస్సులో రిజర్వేషన్ ద్వారా సీటు పొందే వీలుండదు. ఇక మీదట చార్టు క్లోజ్ అయ్యే పనుండదు. ఈ–పోస్ యంత్రాల్లో అమర్చిన సాంకేతికతతో బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజిల్లో ఎక్కే వారు తెలుసుకుని రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదా ఏటీబీ (ఆథరైజ్డ్ టిక్కెట్ బుకింగ్) ఏజెంట్లు, బస్సులో కండక్టర్/డ్రైవర్ కేటాయించవచ్చు. డిజిటల్ చెల్లింపుల విధానంతో ప్రయాణికులు, కండక్టర్లను ఎప్పట్నుంచో వేధిస్తున్న చిల్లర సమస్యకు పరిష్కారం లభించినట్టయింది. టిమ్స్ స్థానంలో ఈ–పోస్ మిషన్లు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల జారీకి టిమ్స్ యంత్రాలను వినియో గిస్తున్నారు. ఇకపై వాటి స్థానంలో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను సమకూరుస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు ఇప్పటివరకు 180 ఈ–పోస్ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రయాణికుల్లో ఆసక్తి.. డిజిటల్ పేమెంట్ సదుపాయం గురించి ప్రయాణికులకు చెబుతున్నాం. దీంతో వారూ ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. అవకాశం ఉన్న వాళ్లు దీన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత టిమ్స్కంటే ఈ–పోస్లతోనే టిక్కెటింగ్ సులువుగా ఉంది. కొన్నిసార్లు నెట్ కనెక్ట్ కాక యూపీఐ, కార్డు పేమెంట్లు జరగడం లేదు. మున్ముందు ఆ సమస్య తలెత్తదని భావిస్తున్నాం. – ఆర్.టి.నాథం, ఆర్టీసీ డ్రైవర్, విశాఖపట్నం. ఎంతో సౌలభ్యంగా ఉంది.. ఇప్పుడు చాలామంది తమ అవసరాలకు డిజిటల్ పేమెంట్లే జరుపుతు న్నారు. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుల విధానం ఎంతో సౌలభ్యంగా ఉంది. నగదు చెల్లించి టిక్కెట్టు తీసుకోవడంతో తరచూ చిల్లర సమస్య తలెత్తుతోంది. ఇకపై చిల్లర సమస్యకు చెక్ పడుతుంది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తే మరింత ఆదరణ పెరుగుతుంది. – పి.రమేష్నాయుడు, ప్రయాణికుడు, శ్రీకాకుళం. దశల వారీగా అన్ని బస్సుల్లో.. ప్రస్తుతం జిల్లాలో 97 బస్సుల్లో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను ప్రవేశపెట్టాం. వీటికి ప్రయాణికుల నుంచి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. దశల వారీగా సిటీ బస్సులు సహా అన్ని బస్సుల్లోనూ అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వీటి వినియోగంపై డ్రైవర్/కండక్టర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ–పోస్ యంత్రాల్లో టిక్కెట్ల జారీలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా అవి తాత్కాలికమే. –ఎ.అప్పలరాజు, జిల్లా ప్రజారవాణా అధికారి, విశాఖపట్నం -
ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లలో డిజిటల్ పేమెంట్లు
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తోన్న రిటైల్ అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో పేటీఎం సంస్థతో రాష్ట్ర మత్స్యసహకార సంస్థ మంగళవారం ఒప్పందం చేసుకోనుంది. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు సమక్షంలో మత్స్యసహకార సంస్థ చైర్మన్ కె.అనిల్బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్శర్మ ఒప్పందం చేసుకోనున్నారు. ఒప్పందం మేరకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్, క్యూ ఆర్ కోడ్తో కూడిన పేమెంట్ ఆడియో సౌండ్ బాక్సులను పేటీఎం సంస్థ ఉచితంగా సమకూర్చనుంది. వీటిని ఫిష్ ఆంధ్ర యాప్తో అనుసంధానం చేస్తారు. ఒప్పందం మేరకు ఈ నెలాఖరుకల్లా 2వేల రిటైల్ అవుట్లెట్లలో పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వాటికి కూడా అందజేస్తారు. -
పుష్పక్ బస్సుల్లో డిజిటల్ సేవలు.. అలా చేస్తే చార్జీలపై 10 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్పే, ఫోన్పే, పేటీఎం, తదితర మొబైల్ యాప్ల ద్వారా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు. ఇందుకోసం కొత్తగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూ మిషన్లను ప్రవేశపెట్టారు. నగదు, డిజిటల్ రూపంలోనూ చార్జీలు చెల్లించే విధంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ‘టీఎస్ఆర్టీసీ ట్రాక్’ ద్వారా ప్రయాణికులు తాము బయలుదేరే మార్గంలో పుష్పక్ బస్సుల జాడను కనిపెట్టవచ్చు. ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థను కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే సమయానికి అనుగుణంగా అందుబాటులో ఉండే పుష్పక్ బస్సుల వివరాలు మొబైల్ ఫోన్లో లభిస్తాయి. దీంతో బస్సు కోసం ప్రత్యేకంగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల వేళలకు అనుగుణంగా పుష్పక్ బస్సులను 24 గంటల పాటు నడుపుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగిస్తున్న 40 పుష్పక్ బస్సులకు కొంతకాలంగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. ఈజీగా బస్సు.. ►జేబీఎస్, సికింద్రాబాద్ నుంచి తార్నాక, ఉప్పల్ల మీదుగా ఎయిర్పోర్టుకు కొన్ని బస్సులు నడుస్తుండగా, బేగంపేట్ పర్యాటక భవన్ నుంచి మెహిదీపట్నం, ఆరాంఘర్ల మీదుగా మరికొన్ని బస్సులు నడుస్తున్నాయి. అలాగే కేపీహెచ్బీ జేఎన్టీయూ నుంచి గచ్చిబౌలి మీదుగా ఔటర్ మార్గంలో ఇంకొన్ని బస్సులు ఎయిర్పోర్టుకు అందుబాటులో ఉన్నాయి. ►ప్రయాణికుల నిరాదరణ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ బస్సులు కొద్ది రోజులుగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో 45 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 4500 మందికి పైగా ప్రయాణికులు ప్రతి రోజు ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ►ప్రయాణికులను పుష్పక్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులు, వెహికిల్ ట్రాకింగ్ వల్ల గత నెల రోజుల వ్యవధిలో సుమారు 500 మందికి పైగా ప్రయాణికులు అదనంగా వచ్చి చేరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తిరుమల దర్శనం... ►మరోవైపు పుష్పక్ బస్సుల్లో తాజాగా లక్కీ డిప్లను ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి ఈ లక్కీడిప్ ద్వారా ముగ్గురు ప్రయాణికులను ఎంపిక చేసి వారికి తిరుమలలో ఉచిత దర్శనం కల్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం పుష్పక్లో ప్రయాణం అనంతరం టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి లక్కీడిప్ బాక్సుల్లో వేస్తే సరిపోతుంది. టికెట్లపై రాయితీలు.. ►హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు బయలుదేరే ప్రయాణికులు ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు, తిరిగి ఎయిర్పోర్టు నుంచి ఇంటికి ఒకేసారి టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా తీసుకొనే టికెట్లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ►ఎయిర్పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే మరో 3 గంటల పాటు వాళ్లు అదే టిక్కెట్ పై సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఉదాహరణకు ఎయిర్పోర్టు నుంచి జేబీఎస్కు వచ్చినవారు అక్కడి నుంచి ఎక్కడికైనా సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. పర్యావరణ పరిరక్షణను ఆదరించండి పుష్పక్ బస్సులు వంద శాతం పర్యావరణహితమైనవి. విద్యుత్తో నడిచే ఈ బస్సులను ప్రయాణికులు ఆదరించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుంది. – వెంకన్న, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, సికింద్రాబాద్ -
తెలియక ఈ తప్పులు చేశారో..బుక్కైపోతారు! బీ కేర్ఫుల్!!
ఒకప్పుడు తెలిసిన వారికే డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చేది. కానీ, నేడు చెల్లింపులన్నీ డిజిటల్ అయ్యాయి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. కూరగాయల దగ్గర్నుంచి ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. సినిమా, రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటళ్లలో బుకింగ్లు.. ఈ జాబితా చాలా పెద్దదే. కానీ, ఆన్లైన్ చెల్లింపుల్లో (యూపీఐ, ఇతరత్రా) ఎంత సౌకర్యం ఉందో, అంతకంటే ఎక్కువే రిస్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన, జాగ్రత్తలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి మోసపోతే కనుక దొంగ దొరికి, పోయిన మొత్తం వెనక్కి రావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను వివరించేదే ఈ కథనం. ►తెలియని వ్యక్తులతో లావాదేవీలు వద్దు ►తెలియని సంస్థలతోనూ ఇదే పాటించాలి ►యూపీఐకి బదులు , నెఫ్ట్, ఐఎంపీఎస్ మేలు ►ట్రూకాలర్ సాయం తీసుకోవచ్చు ►సామాజిక మాధ్యమాల తోడ్పాటు కూడా తీసుకోవాలి... ► పూర్తి నిర్ధారణ తర్వాతే చెల్లింపు అదేపనిగా కాల్స్ చేస్తే.. మోసగాళ్లు అయితే కాల్స్, మెస్సేజ్ల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. ఒకటికి నాలుగు సార్లు కాల్ చేయడం, ఎస్ఎంఎస్లు పంపిస్తుంటే ముందుగా అనుమానించాలి. వారితో మాట్లాడినప్పుడు ఈ ఆఫర్/అవకాశం మళ్లీ ఉండదని/రాదని చెప్పడం, వారి మాటల్లో ఏకరూపత లేకపోతే స్కామ్గానే సందేహించాలి. అలాగే, వాట్సాప్ చేస్తున్నా ఇలాగే అనుమానించాలి. కొందరు నేరస్థులు ఏ మాత్రం అనుమానం కలగనీయని రీతిలో సంప్రదింపులు చేస్తుంటారు. అటువంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కోరాలి. హోటల్ బుకింగ్ అయితే నేరుగా వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పాలి. మొదటగా తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫలానా ఆఫర్ అనో, ప్యాకేజీ అనో, లాటరీ వచ్చిందనో చెప్పే మాటలకు మెతకగా స్పందించడం, ఆసక్తి చూపడం, అయోమయంగా అనిపించేలా వ్యవహరించకండి. అవతలి వ్యక్తి మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని నంబర్, మెయిల్ ఐడీ నుంచి ఏదైనా ఆఫర్లు, సందేశాలు వస్తే, లింక్లు వస్తే వాటిని తెరవడం, అందులోని నంబర్లను సంప్రదించడం చేయవద్దు. పేరున్న సంస్థలు అయితే నేరుగా వాటి సైట్కు వెళ్లి చెక్ చేసుకోవాలి. అంతేకానీ, మొబైల్కు తెలియని మూలాల నుంచి ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే వెబ్లింక్లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాల్ చేసి, తమది ఫలానా ఎన్జీవో, చిన్న పిల్లల ఆరోగ్య అవసరాల కోసం విరాళాలు సమీకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇలాంటివి అసలు నమ్మనే వద్దు. ఎవరికైనా సాయం చేయాలంటే ప్రత్యక్షంగా చేయడమే మంచిది. అవసరం లేని ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం... రిస్క్ను ఆహ్వానించడమే. యూపీఐ వద్దు.. యూపీఐ చెల్లింపులకు బదులు నెఫ్ట్/ఐఎంపీఎస్ నగదు బదిలీ మార్గాలను అనుసరించడం కొంచెం సురక్షితమైనది. యూపీఐ సాధనం సురక్షితమైనదే. కానీ, సరైన వ్యక్తికి పంపినప్పుడే. నగదు స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు ఇందులో తెలియవు. అదే నెఫ్ట్/ఐఎంపీఎస్లో డబ్బు పంపాలంటే పూర్తి వివరాలు కావాల్సిందే. అందుకే అవతలి వ్యక్తి మాటలు నమ్మదగినవిగా అనిపించకపోతే, సందేహం వస్తే ఖాతా వివరాలు ఇవ్వాలని కోరాలి. కంగారు పడొద్దు... పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటే వేగం ప్రదర్శించొద్దు. సమయం తీసుకోండి. తొందరపడితే ప్రాథమిక అంశాలను కూడా విస్మరిస్తుంటాం. తొందరపడి మోస పోయినట్టుగా ఉంటుంది. అది నిజమా, మోసమా అని గుర్తించేందుకు వ్యవధి ఇవ్వాలి. అవతలి వ్యక్తితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడాలి. కొన్ని రోజులు ఆగి చూడాలి. అప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఆధారంగా నిజా, నిజాలను గుర్తించే వెసులుబాటు ఉంటుంది. ముందే మొత్తం వద్దు.. ఇక నగదు పంపించేందుకు సిద్ధమైతే కనుక మొత్తం ఒకేసారి చెల్లించేయవద్దు. సాధారణంగా నమ్మకం ఏర్పడినప్పుడు ఎక్కువమంది ఒకే విడత డిస్కౌంట్ కోరి చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాయిదాలుగా చెల్లించడం అందరికీ నచ్చదు. ఆన్లైన్ మోసాలను నివారించాలంటే.. ఒకేసారి మొత్తం పంపకుండా ఉండడమే మంచి మార్గం. దీనివల్ల మోసం అయితే కొద్ది మొత్తంతోనే ఆగిపోతుంది. గూగుల్ సెర్చ్.. డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్, ఈమెయిల్ను ఆన్లైన్లో ఓసారి సెర్చ్ చేయాలి. అదే నంబర్, అదే ఈ మెయిల్ పేరిట అప్పటికే ఎవరైనా మోసపోయి ఉంటే, ఆ వివరాలు లభిస్తాయి. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్ను టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే.. అదే నంబర్ పలు వ్యాపారాలకు సంబంధించి చూపించొచ్చు. గూగుల్లో ఒకటికి మించిన కంపెనీలకు ఆ నెంబర్ చూపిస్తే కచ్చితంగా మోసపూరితమైనదే. ట్రూకాలర్ అయితే, అన్ని ఫోన్ నంబర్ల వివరాలు గూగుల్లో కనిపించాలని లేదు కదా? మోసగాళ్లు ఒక్కో పెద్ద మోసానికి ఒక్కో ఫోన్ నంబర్ వాడుతున్న రోజులు ఇవి. కనుక గూగుల్లో వివరాలు లభించకపోతే అప్పుడు ఫోన్లో ట్రూకాలర్ యాప్ వేసుకుని అందులో సెర్చ్ చేయడమే మార్గం. సదరు నెంబర్తో ఎవరైనా మోసపోయి ఉంటే.. ఫ్రాడ్, స్కామ్, స్పామ్గా చూపిస్తుంది. కచ్చితంగా దాన్ని ఒక సంకేతంగానే చూడాలి. పూర్తి పేరుతో వస్తే అప్పుడు తదుపరి పరిశీలనకు వెళ్లాలి. తెలియని పోర్టళ్లు.. తెలియని సంస్థల సేవలకు దూరంగా ఉండడమే భద్రతా పరంగా మంచి విధానం అవుతుంది. ఉదాహరణకు మూవీ టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే బుక్మైషో, పేటీఎం ఇలాంటివి అందరికీ తెలుసు. ఇవి నిజమైన వ్యాపార వేదికలు. కానీ, ఎప్పుడూ వినని వెబ్సైట్ లేదా యాప్లో ఒకటి కొంటే ఒకటి ఉచితానికి ఆశపడొద్దు. ఉచితమేమో కానీ, మన కార్డు వివరాలు, ఇతర కీలక సమాచారం పక్కదారి పట్టొచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాలన్స్ను కొట్టేయవచ్చు. వేరే వారికి స్టీరింగ్ టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ నుంచి వచ్చే రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయవద్దు. చేశారంటే మీ స్క్రీన్ను వారితో షేర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మీ తరఫున అవతలి వ్యక్తి లావాదేవీలు నిర్వహిస్తాడు. ఫోన్, కంప్యూటర్లోని సమాచారం మొత్తాన్ని కొట్టేస్తారు. ఇటీవలే గచ్చిబౌలిలో పనిచేసే 28 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఒక కాల్ వచ్చింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్రెడిట్ కార్డుకు ఇచ్చిన చిరునామా వివరాల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపాడు. ఇందుకోసం ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫోన్ చేసింది బ్యాంకు ఉద్యోగేనని నమ్మి, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాడు. అదే సమయంలో క్రెడిట్ కార్డు నుంచి రూ.52,000 డెబిట్ అయినట్టు సందేశం వచ్చింది. ఇంకేముంది కాల్ కట్. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆత్మ పరిశీలన ముందు చెప్పుకున్నట్టు కొంత సమయం తీసుకుని, మనలో మనమే ఓ సారి అన్ని అంశాలను బేరీజు వేసుకుని, కచ్చితత్వాన్ని రూఢీ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా ఉందని అనిపిస్తే.. ఇక ఆ డీల్కు అంతటితో ముగింపు పలకాలి. -
పేటీఎమ్: 2023 సెప్టెంబర్కల్లా లాభాల్లోకి
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. 2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
యూపీఐ సేవలపై చార్జీలు!.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానంలో (యూపీఐ) లావాదేవీలపై చార్జీలు విధించే యోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రజలకు మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రయత్నం మాత్రమేనని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు ఇతరత్రా మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో తెలిపింది. డిజిటల్ చెల్లింపులు, పేమెంట్ ప్లాట్ఫాంలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు ప్రభుత్వం గతేడాది ఆర్థిక సహకారం అందించిందని, ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తామని ప్రకటించిందని ఆర్థిక శాఖ వివరించింది. ఐఎంపీఎస్ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్ బ్యాంక్ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2) — Ministry of Finance (@FinMinIndia) August 21, 2022 -
అమెరికాను మించిపోయిన్ భారత్.. ఆన్లైన్ @ 34.6 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్లో ఇంటర్నెట్’ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్తో సమానంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్లో 90 కోట్లను తాకుతుంది. యూపీఐ వినియోగం భేష్: ప్రధాని న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. -
క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా?
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారా....జేబులో డబ్బులు ఉంటేనే క్యాబ్ బుక్ చేసుకోండి. లేకుండా కష్టమే. చార్జీలు ఆన్లైన్లో చెల్లించవచ్చుననుకుంటే మీరు బుక్ చేసుకున్న క్యాబ్ మరో క్షణంలోనే రద్దయిపోవచ్చు. ఇది నిజమే. నగరంలో ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలకు అనుసంధానమై తిరుగుతున్న క్యాబ్లు, ఆటోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్లైన్, యూపీఐ చెల్లింపులకు నిరాకరిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్న మరుక్షణంలోనే డ్రైవర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. చార్జీలు నగదు రూపంలో చెల్లిస్తేనే వస్తామంటూ పేచీ పెడుతున్నారు. ఆన్లైన్లో చెల్లిస్తామంటే వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. దీంతో మరో క్యాబ్ కోసం, ఆటో కోసం తిరిగి మొబైల్ యాప్ను ఆశ్రయించాల్సి వస్తుంది. అలా గంటల తరబడి బుకింగ్ల కోసమే నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాలనుకొంటే కష్టమే. తీరా గమ్యం చేరుకున్న తరువాత చార్జీల చెల్లించేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు.’అని సీతాఫల్మండికి చెందిన సురేష్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీ వరకు క్యాబ్ బుక్ చేసుకొనేందుకు గంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చినుకు పడితే బండి కష్టమే... ఒకవైపు ఆన్లైన్ చెల్లింపులపైనా రైడ్కు డ్రైవర్లు నిరాకరిస్తుండగా ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు క్యాబ్ సంస్థలు సైతం ఉన్నపళంగా చార్జీలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా, ఏ కొంచెం వర్షం కురిసినా చాలు క్యాబ్ లభించడం కష్టంగా మారుతుంది. రద్దీ వేళల నెపంతో చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటే వర్షాన్ని సాకుగా చేసుకొని కొన్ని సంస్థలు రూ.550 నుంచి రూ.750వరకు పెంచేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ను పెంచుకొనేందుకు కొన్ని క్యాబ్ సంస్థలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని రెగ్యులర్ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేస్తున్నారు. దీంతోపాటు సర్ చార్జీల రూపంలోనూ ప్రయాణకులపైన అదనపు వడ్డింపులకు పాల్పడడం గమనార్హం. ‘ప్రతికూలమైన వాతావరణం వల్ల త్వరగా ఇల్లు చేరాలంటే డిమాండ్ మేరకు చెల్లించక తప్పడం లేదు.’ అని అమీర్పేట్కు చెందిన నవీన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పారు. క్యాబ్ సంస్థల జాప్యం.. మరోవైపు నగదు చెల్లింపుల పైన డ్రైవర్ల వాదన మరో విధంగా ఉంది. క్యాబ్ సంస్థల ఖాతాలో పడే చార్జీలు తిరిగి తమ ఖాతాలోకి చేరేందుకు పడిగాపులు కాయవలసి వస్తుందని పేర్కొంటున్నారు. డ్రైవర్లు ప్రతి రోజు చేసే రైడ్లపైన క్యాబ్ సంస్థలు 30 శాతం వరకు కమిషన్ తీసుకొని మిగతా 70 శాతం వారి ఖాతాలో జమ చేయాలి. కానీ డ్రైవర్కు చెల్లించవలసిన డబ్బులు రెండు, మూడు రోజుల తరువాత మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తమ రోజువారీ అవసరాలకు కష్టమవుతుందని అంబర్పేట్కు చెందిన క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు ఖాతాలో జమ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బంది వస్తున్నట్లు చెప్పారు. -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్ను ఓపెన్ చేయద్దు. ఫోన్కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్లు లేదా షార్ట్ లింక్లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్.. ‘‘క్యూఆర్’ కోడ్తో పేమెంట్ చేస్తున్నారా?!
ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంట డబ్బులు ఉండనక్కర్లేదు. డెబిట్ కార్డ్ కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్.. అందులో డిజిటల్ చెల్లింపుల ఎంపిక ఉంటే చాలు. దీంట్లో భాగంగానే ‘క్యూఆర్’ కోడ్ వచ్చాక మన జీవితం మరింత సులభం అయిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ పద్ధతి వల్ల మోసాల బారినపడుతున్నవారూ ఉన్నారు. అందుకే డిజిటల్ పేమెంట్స్ చేసేవారు తప్పనిసరిగా ‘క్యూ ఆర్’ కోడ్ గురించి తెలుసుకోవాల్సిందే! నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు చెల్లించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా మన జీవితం మరింత సులభతరంగా మారిపోయింది. క్షణాల్లో చెల్లింపులు నెఫ్ట్ లేదా ఆర్టిజిఎస్ లావాదేవీలను పూర్తి చేయడానికి యుపిఐ అనేది స్వల్పకాలిక చెల్లింపు పద్ధతి. ఆర్థిక లావాదేవీని జరపడానికి .. క్యూఆర్ కోడ్ స్కాన్, నగదు మొత్తం, అంకెల పిన్ చేస్తే చాలు లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది. క్యూఆర్ కోడ్లను ఉపయోగించే యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ లు ప్రధానమైనవి. తర్వాత జాబితాలో భీమ్ యాప్, మొబిక్విక్, పేజ్యాప్, రేజర్పే మొదలైనవి ఉన్నాయి. క్విక్ రెస్పాన్స్ అనే క్యూఆర్ కోడ్ బార్కోడ్ డేటాతో ఎన్కోడ్ చేసే స్కాన్. బాధితుల డబ్బు దొంగిలించడానికి మోసగాళ్లు వారి సొంత క్యూఆర్ కోడ్లను సృష్టిస్తారు. లేదా బాధితుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా రాబడతారు. లింక్స్ ద్వారా ఎర సాధారణంగా బయట షాపింగ్ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తదు. ఆన్లైన్ బిజినెస్లో భాగంగా తమ వస్తువును విక్రయించడానికి చేసే పోస్టులో మోసగాళ్లు క్యూఆర్ కోడ్ కూడా రూపొందిస్తారు. ఈ లింక్ను వాట్సప్ లేదా ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీనికి ఆకర్షితులై లింక్ ఓపెన్ చేశాక, నగదు చెల్లింపులకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయమని బాధితుడిని కోరుతారు. బాధితులు తమ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. డబ్బులు జమ చేస్తామని నమ్మించి, మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తారు. ఫోన్ చేసి.. రాబట్టే ప్రక్రియ ఒక సైబర్ నేరస్థుడు మీకు ఫోన్ చేసి ఫలానా బహుమతి గెలుచుకున్నారని నమ్మబలుకుతాడు. ఆ బహుమతిని పొందడానికి తాను పంపిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని కోరుతాడు. మీకు తెలిసిన లేదా నమ్మకం కలిగించే వ్యక్తిగా వ్యవహరిస్తాడు. దీని నుంచి వారు మీ డేటాను పొందవచ్చు. చాలా నేరాలు ఫిషింగ్ కాల్స్, ఎసెమ్మెస్/ఇ–మెయిల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా జరుగుతాయి. స్కామర్లు ఇప్పుడు వారి మోడస్ ఆపరెండీని క్యూఆర్ కోడ్లకు కూడా మార్చారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ►మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త, సృజనాత్మక మార్గాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. వాటిలో క్యూఆర్ కోడ్ ఒకటి. స్కామర్లు మీకు క్యూఆర్ కోడ్తో కూడిన ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియాలో సందేశాన్ని పంపుతారు. క్యూఆర్ కోడ్తో మీరు డబ్బును తిరిగి పొందవచ్చుని పేర్కొంటారు. ►మనం చూసిన క్యూఆర్ కోడ్ చట్టబద్ధమైనదిగా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన ప్రకటనలుగా వాట్సప్, సోషల్ మీడియా సందేశాలు ఉంటాయి. ఉదా: క్యూఆర్ కోడ్ చిత్రంతో పాటు మీరు రూ. 5,00,000 గెలుచుకున్నందుకు అభినందనలు అని ఉందనుకోండి. ఆ మెసేజ్కు ఆకర్షితుడైన బాధితుడు కోడ్ని స్కాన్ చేసి, మొత్తాన్ని నమోదు చేసి, తన బ్యాంకు అకౌంట్కు బదిలీచేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఖాతాలోకి నగదును స్వీకరించడానికి పిన్ ఉంటుంది. తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని బాధితులు నమ్ముతారు. కానీ డబ్బును స్వీకరించడానికి బదులుగా మన ఖాతా నుండి నగదు వేరే అకౌంట్కు బదిలీ అవుతుంది. తప్పుడు క్యూఆర్ కోడ్స్ ఫిషింగ్ ఇ–మెయిల్లు, టెక్ట్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్లలో తప్పుడు క్యూఆర్కోడ్లను ఉపయోగించడం మరొక పద్ధతి. తప్పుడు కోడ్ను స్కాన్ చేసిన తర్వాత, వినియోగదారులు వాస్తవికంగా కనిపించే పేజీలతో వెబ్సైట్లకు మళ్లించబడతారు, అక్కడ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం అందించడం ద్వారా బాధితుడు అకౌంట్ లాగిన్ అయ్యేలా చూడచ్చు. సురక్షితమైన చెల్లింపులకు... అంతటా క్యూఆర్ కోడ్ చెల్లింపులు జరుగుతున్నాయి. మీరు బాధ్యతాయుతంగా ఈ లావాదేవీలు జరిపినప్పుడు మీ బ్యాంకు ఖాతా నగదు సురక్షితంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ తో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే అవి యంత్రాల ద్వారా మాత్రమే చదవబడతాయి. మీరు స్నేహితుడికి కొంత డబ్బును బదిలీచేయాలనుకుంటే ఉదాహరణకు.. డబ్బును పంపే ముందు మీరు వారి ఖాతా నంబర్, మొత్తం, ఇతర సమాచారాన్ని ధృవీకరించాలి. క్యూఆర్ కోడ్తో ఆ అవసరం లేదు. అందుకని.. తెలియని కోడ్ను స్కాన్ చేయకూడదు. ►డబ్బు చెల్లించడానికే క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. వివరాలు తెలియజేయడానికి కాదు. డబ్బును స్వీకరించడానికి బదులుగా, మీకు మొత్తం క్రెడిట్ చేయబడుతుంది స్కాన్ చేయమని అడిగితే అది స్కామ్ కావచ్చని గ్రహించండి. మీ వ్యక్తిగత ఖాతా వివరాలు మోసగాళ్లచే దొంగిలించబడుతున్నాయని తెలుసుకోండి. వివరాల ఆధారంగా మీ బ్యాంక్ ఖాతా నుండి స్కామర్లు ఎక్కువ మొత్తం నగదు దొంగిలించవచ్చు. ►మీ బ్యాంక్ పంపిన ఈ–మెసేజ్లు, మెయిల్ల గురించి విచారించడానికి నేరుగా బ్యాంక్ను సంప్రదించండి. అంతేకాని, మీ బ్యాంక్ ద్వారా పంపబడినట్లు భావిస్తున్న క్యూఆర్ కోడ్తో స్పామ్ లేదా అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించకండి. ►మీరు నమ్మని క్యూఆర్ కోడ్ని మీరు చూసినట్లయితే, మీరు అందించే సేవ లేదా ఉత్పత్తి గురించిన మరింత సమాచారాన్ని మాన్యువల్గా చూసేందుకు ప్రయత్నించండి. ►క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని మిమ్మల్ని అడిగే స్పామర్లకు ‘నో‘ చెప్పడానికి భయపడకండి. మీకు కష్టంగా అనిపిస్తే, వాటిని బ్లాక్ చేసి సంబంధిత వెబ్సైట్ లేదా బ్యాంక్ లేదా సోషల్ మీడియాకు తెలియజేయండి. ►మీరు క్యూఆర్ కోడ్ స్కామ్కి బాధితులుగా మారితే వెంటనే చేయాల్సింది... cybercrime.gov.in/uploadmedia/MHA-CitizenManualReportOtherCyberCrime-v10.pdfలో ఫిర్యాదును నమోదు చేయండి. లేదా ఫిర్యాదు చేయడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. ►హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయవచ్చు, ఇది సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారిచే నిర్వహించబడుతుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు! -
పెట్రోల్పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!
న్యూఢిల్లీ: పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. ‘‘ఇంధన కొనుగోళ్లపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తెలిపింది’’ అంటూ పీఎన్బీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మే నెల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు పీఎన్బీ తెలిపింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నాటి నిర్ణయం వల్ల వ్యవస్థలో నగదుకు కొంత కాలం పాటు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు డిజిటల్ రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు 0.75 శాతం రాయితీ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కోరింది. దీంతో 2016 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులపై రాయితీ లభించింది. ఈ ప్రోత్సాహకాన్ని క్రెడిట్ కార్డులపై ముందే తొలగించారు. ఇప్పుడు మిగిలిన డిజిటల్ చెల్లింపులపైనా ఎత్తేసినట్టు అయింది. చదవండి: ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు.. -
డిజిటల్ పేమెంట్స్ బాటలో చిన్న సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కష్టాల నుంచి క్రమంగా బైటపడుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎక్కువగా డిజిటల్ పేమెంట్ విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాదీ సంస్థలు మరింత ముందున్నాయి. 76 శాతం సంస్థలు వీటిని వినియోగించుకుంటున్నాయి. దేశంలోనే ఇది అత్యధికం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలిచ్చే ఫిన్టెక్ సంస్థ నియోగ్రోత్ విడుదల చేసిన ఎంఎస్ఎంఈ ఇన్సైట్ రిపోర్ట్ 2022 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020 మార్చి–2022 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 88 పరిశ్రమల వ్యాప్తంగా 40,000 పైచిలుకు ఎంఎస్ఎంఈలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నియోగ్రోత్ ఈ నివేదిక రూపొందించింది. మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంఎస్ఎంఈలకు డిమాండ్పరంగా ఎదురైన పరిస్థితులు, రికవరీపై సహాయక చర్యల ప్రభావం, వ్యాపార నిర్వహణ కోసం డిజిటల్ వైపు మళ్లడం, రెండేళ్లుగా నిలదొక్కుకునేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంది. ‘డిమాండ్ పడిపోయి, రుణాల చెల్లింపు భారం పెరిగిపోవడంతో 2020–21లో చాలా మటుకు ఎంఎస్ఎంఈలు చాలా సతమతమయ్యాయి. వ్యాపారం నిజంగానే దెబ్బతినడం వల్లే చాలా మటుకు సంస్థలకు అదనపు సహాయం అవసరమైందని కరోనా తొలినాళ్లలో మేము గుర్తించాము. సాధారణంగా ఎంఎస్ఎంఈ కస్టమర్లు నిజాయితీగానే ఉంటారు. రుణాలు తిరిగి చెల్లించే యోచనలోనే ఉంటారు. అందుకే వారికి అవసరమైన తోడ్పాటును మా వంతుగా మేము కూడా అందించాము‘ అని నియోగ్రోత్ సీఈవో అరుణ్ నయ్యర్ తెలిపారు. నివేదికలో మరిన్ని అంశాలు .. ► కోవిడ్–19 కష్టాల నుంచి గట్టెక్కడానికి దేశీయంగా 46 శాతం ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా సహాయం అవసరమైంది. ► కోవిడ్–19 రెండో వేవ్ వచ్చేనాటికి ఎంఎస్ఎంఈలు కాస్త సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో ఒకటో వేవ్తో పోలిస్తే రెండో వేవ్లో 30 శాతం సంస్థలు మాత్రమే ఆర్థిక సహాయం తీసుకున్నాయి. ► మెట్రోయేతర నగరాల్లో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ ఈ ఏడాది మార్చిలో తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంది. మెట్రో నగరాలు స్వల్పంగా వెనుకబడ్డాయి. బెంగళూరు, చెన్నైలో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ .. కోవిడ్ పూర్వ స్థాయిని మించింది. ► పెట్రోల్ బంకులు, ఇన్ఫ్రా, ఆటోమొబైల్ వంటి విభాగాలు మిగతా రంగాలతో పోలిస్తే వేగంగా కోలుకున్నాయి. ► గడిచిన రెండేళ్లలో ఎంఎస్ఎంఈలకు కొత్త అవ కాశాలు అందుబాటులోకి వచ్చాయి. రుణాలు పొందేందుకు, వ్యాపారాలను నిర్వహించుకునేందుకు పాటిస్తున్న సంప్రదాయ విధానాల స్థానంలో కొత్త తరం డిజిటల్ విధానాలు వచ్చేశాయి. చిన్న సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంలో డిజిటల్ రుణాలకు ప్రాధాన్యం పెరిగింది. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలదే హవా!,10 ట్రిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రజలు నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం ప్రతీ 10 లావాదేవీల్లో నాలుగు డిజిటల్ రూపంలోనే నమోదవుతున్నాయి. 2026 నాటికి యూపీఐ తదిర నగదు రహిత లావాదేవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని బీసీజీ, ఫోన్పే సంయుక్త నివేదిక అంచనా వేసింది. అలాగే, 2026 నాటికి డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని.. అది ప్రస్తుతం 3 ట్రిలియల్ డాలర్ల స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. 2020–21 నాటికి దేశ ప్రజల్లో 35 శాతం మందికే చేరువ అయిన యూపీఐ చెల్లింపుల సేవలు వచ్చే ఐదేళ్ల కాలంలో 75 శాతం ప్రజలను చేరుకుంటాయని పేర్కొంది. కరోనా అనంతరం దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక వెలువడడం గమనార్హం. మర్చంట్ పేమెంట్స్ ప్రస్తుత స్థాయి నుంచి ఏడు రెట్లు పెరిగి 2026 నాటికి 2.5–2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని పేర్కొంది. మరింత మంది మర్చంట్లు (వర్తకులు) డిజిటల్ చెల్లింపులను అమోదిస్తే.. చిన్న వర్తకులకు రుణ సదుపాయం విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని బీసీజీ ఎండీ ప్రతీక్ రూంగ్తా చెప్పారు. చిన్న పట్టణాల నుంచి తదుపరి డిజిటల్ పేమెంట్స్ వృద్ధి టైర్ 3 నుంచి టైర్ 6 పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత రెండేళ్ల కాలంలో కొత్త కస్టమర్లలో 60–70 శాతం ఈ పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపులను వర్తకులు ఆమోదించేలా వారిని ప్రోత్సహించాలని.. ఇందుకు వీలుగా స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. తక్కువ విలువ లావాదేవీలపై ఎండీఆర్ రేటు 0.2–0.3 శాతం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అప్పుడు బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ‘‘డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతోంది. కొన్ని బ్యాంకులు డిమాండ్ను తట్టుకోలేకున్నాయి. యూపీఐ లావాదేవీల వైఫల్యానికి ఇదే కారణం. అందుకుని బ్యాంకులు కోర్ బ్యాంకింగ్కు వెలుపల క్లౌడ్ తదితర ఆప్షన్లను పరిశీలించాలి’’ అని ఈ నివేదిక సూచించింది. -
డబ్బులు వద్దు.. డిజిటల్ ముద్దు
సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు. అన్నిచోట్ల ఆన్లైన్ లావాదేవీలు కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్పే అంటున్నారు. సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు. ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్ల సాయంతో ప్రజలు ఆన్లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్యాంకులలో డిజిటల్కే ప్రాధాన్యం జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది. సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప. -
బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల(టిమ్స్) స్థానంలో ఈ–పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్/క్రెడిట్ కార్డులు, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్ బుకింగ్ స్టాఫ్కు కూడా ఈ–పోస్ యంత్రాలను సమకూర్చనున్నారు. ఇక్సిగో–అభిబస్తో ఒప్పందం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) సాంకేతికతతో కూడిన ఈ–పోస్ యంత్రాల సరఫరాకు ఇక్సిగో–అభిబస్ సంస్థతో ఆర్టీసీకి ఒప్పందం కుదిరింది. ఈ యంత్రాల ద్వారా సాధారణ టికెట్లతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితరులు కూడా రాయితీ టికెట్లు పొందొచ్చు. -
ఆర్థిక మోసాలు.. నయా రూటు!
గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్గా చేస్తున్నాం. మొబైల్ నుంచే షాపింగ్ చేస్తున్నాం. కొన్ని క్లిక్లతో ఇన్స్టంట్గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఫోన్ కాల్ వెరిఫికేషన్ టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్ నంబర్, పాన్, ఆధార్తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్ను డిస్కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్కు.. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్ఎంఎస్ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్ కాల్ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి. అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు. ఏంటి మార్గం..? ఆధార్, పాన్ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్కు వచ్చే ఎస్ఎంఎస్ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్అప్లికేషన్ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఫీజు ఎత్తివేత 2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్ కార్డు అయినా ఉంది. క్రెడిట్ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్ నంబర్కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్ కట్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్కు వరుసగా వచ్చే డెబిట్ లావాదేవీల ఎస్ఎంఎస్లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు. ఏంటి మార్గం..? తెలియని వ్యక్తులు కాల్ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్ కనెక్ట్ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి, మీ క్రెడిట్ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్ను కట్ చేయాలి. బ్యాంకు యాప్లోకి వెళ్లి కార్డు ఆన్లైన్ లావాదేవీల యాక్సెస్ను, అంతర్జాతీయ యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చెల్లింపుల కోసం నగదు, క్రెడిట్ కార్డుల నుంచి డిజిటల్ వాలెట్లు, బై నౌ, పే లేటర్ (బీఎన్పీఎల్) విధానాలకు మళ్లే ధోరణులు పెరుగుతున్నాయని ఫిన్టెక్ సంస్థ వరల్డ్పే ఫ్రం ఎఫ్ఐఎస్ ఒక నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో 2023 నాటికి డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు .. నగదు లావాదేవీల పరిమాణాన్ని అధిగమించనున్నట్లు గ్లోబల్ పేమెంట్స్ రిపోర్టులో (జీపీఆర్) పేర్కొంది. 2021–2025 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ మార్కెట్ 96 శాతం వృద్ధి చెంది 120 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు తెలిపింది. టెక్నాలజీ, డిజిటలీకరణ పెరగడంతో భారత్లో నగదురహిత చెల్లింపుల విధానాలు గణనీయంగా ఊపందుకున్నట్లు పేర్కొంది. 2021లో ఈ–కామర్స్ చెల్లింపుల కోసం అత్యధికంగా డిజిటల్ వాలెట్లు (45.4 శాతం), డెబిట్ కార్డులు (14.6 శాతం), క్రెడిట్ కార్డులను (13.3 శాతం) వినియోగించినట్లు జీపీఆర్ తెలిపింది. ప్రీపెయిడ్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, క్యాష్ ఆన్ డెలివరీ వంటి విధానాల మార్కెట్ వాటా తగ్గుతోందని, 2025 నాటికి ఈ–కామర్స్ లావాదేవీల విలువలో వీటి పరిమాణం కేవలం 8.8 శాతానికి పరిమితం కావచ్చని వివరించింది. డిజిటల్ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపుల వాటా 52.9 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చదవండి: సిప్.. సిప్.. హుర్రే! -
సాధారణ బీమా రంగంలోకి పేటీఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేయనున్నట్టు వెల్లడించింది. బీమా కంపెనీలో 74 శాతం ముందస్తు ఈక్విటీ కలిగి ఉంటామని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ బీమా విభాగంలో అపార వ్యాపార అవకాశాల నేపథ్యంలో తమ ప్రణాళిక విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నట్టు వివరించింది. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్టు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కాగా, రుణ వ్యాపారం రూ.20,000 కోట్ల వార్షిక రన్ రేట్ కలిగి ఉందని పేటీఎం వెల్లడించింది. ఏప్రిల్లో రూ.1,657 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు అందించినట్టు వివరించింది. గత నెలలో పేటీఎం వేదికగా జరిగిన లావాదేవీలు రూ.95,000 కోట్లకు చేరుకున్నాయి. నెలవారీ యూజర్ల సంఖ్య 7.35 కోట్లుగా ఉంది. -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్పే, గూగుల్పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్లు, బ్యాంక్ యాప్లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్ట్యాగ్ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్ట్యాగ్ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ డిజిటల్ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలందిస్తున్న పోస్టల్ శాఖ తాజాగా పోస్టాఫీసుల్లో జరిగే సాధారణ లావాదేవీలను సైతం డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. స్పీడ్, రిజిస్టర్డ్, పార్శిల్ సర్వీస్ చార్జీలను డిజిటల్ చెల్లింపులకు అనుమితిస్తోంది. నగదుతో పని లేకుండా జీ పే, ఫోన్పే ద్వారా చార్జీలను స్వీకరిస్తోంది. వినియోగదారులకు వెసులుబాటు కలిగినట్లయింది. (చదవండి: సిలిండర్ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్) -
యాచన.. డిజిటల్ యోచన
అర్వపల్లి: అంతా డిజిటల్మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్పే, గూగుల్పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్ పేమెంట్ స్కానర్ను చూపించాడు. దీంతో గోవర్దన్ తన సెల్తో స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లించాడు. ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్) గ్రామమని తెలిపాడు. హనుమాన్ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. -
'ఫోన్ పే' భారీగా నియామకాలు, ఏయే విభాగాల్లో జాబ్స్ ఉన్నాయంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ వేదిక అయిన ఫోన్పే 2022 డిసెంబర్ నాటికి కొత్తగా 2,800 మందిని నియమించుకోనుంది. ఇప్పటికే సంస్థలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో కొత్త ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్, అనలిటిక్స్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ప్రకటించింది. -
Funny Meme: ఫేస్ రికగ్నేషన్తో పేమెంట్స్ వస్తే.. ఇలాంటి దారుణాలు జరుగుతాయా?
డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. నోట్ల రద్దు తర్వాత ఊహించినదాని కంటే వేగంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్లో స్కాన్ చేసి పాస్కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపులయితే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా పకడ్బంధీగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా సరే రోజుకు ఏదో మూల ఎవరో ఒకరు డిజిటల్ చెల్లింపుల్లో మోసగాళ్ల బారిన పడుతున్నారు. డిజిటల్ చెల్లింపులు ఇచ్చిన ఊపుతో త్వరలోనే ఫేస్ రికగ్నేషన్ చెల్లింపులు కూడా అమల్లోకి తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి వస్తే మోసాలు ఎలా జరుగుతాయో చెబుతూ రూపొందించిన మీమ్ వీడియో నవ్వులు పూయిస్తోంది. కొంత మంది ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని చెబుతుండగా మరికొందరు టెక్నాలజీ ఎంత సమర్థంగా పని చేస్తుందో వివరిస్తూ వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు. On a lighter note, new challenges with payment with face recognition! #contactlesspayments #DigitalPayments #facial_recognition pic.twitter.com/DrNmuuquLU — Sanjay Katkar (@sanjaykatkar) March 22, 2022 -
డిజిటల్ చెల్లింపులకు ఆర్టీసీ రైట్ రైట్
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ డిజిటల్ బాట పడుతోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి సదరు మొత్తాన్ని నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులను కూడా స్వీకరించేందుకు ఆర్టీసీ మార్గం సుగమం చేస్తోంది. దీనికోసం ‘యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్)’ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన టెండర్ను అభి బస్ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా.. మూడు కంపెనీలు అర్హత సాధించాయి. రివర్స్ టెండరింగ్లో అభి బస్ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది. దేశంలోనే అతి తక్కువ రేటుకు కాంట్రాక్ట్ను ఖరారు చేసింది. యూటీఎస్ విధానమిలా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీ కోసం వినియోగిస్తున్న టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్) స్థానంలో ఇ–పాస్ మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్లు, బస్పాస్లు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్లకూ అవకాశం కల్పిస్తారు. బస్ లైవ్ ట్రాకింగ్ తెలుసుకునే అవకాశంతోపాటు ప్రయాణికుల సమాచారం, సెంట్రల్ కమాండ్ స్టేషన్ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా అన్ని సేవలను ఏకీకృతం చేసి ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ యూటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వచ్చే రెండు నెలల్లో దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తారు. ఆరేడు నెలల్లో రాష్ట్రమంతటా యూటీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆర్బీకేల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవల్లో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారంలేని రీతిలో మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యమైన ఎరువులు, సబ్సిడీ, నాన్సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, దాణా, రొయ్యలు, చేపల మేత చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభిస్తోంది. రైతులు ఆర్బీకేల్లో తమకు అవసరమైన వాటిని బుక్ చేసుకునే ముందు సబ్సిడీని మినహాయించుకొని మిగతా మొత్తాన్ని సంబంధిత ఏజెన్సీలకు లేదా ఆర్బీకే ఖాతాలకు జమ చేసేవారు. ఈ రసీదును చూపిస్తే సిబ్బంది ఇండెంట్ పెట్టేవారు. ఈ ప్రక్రియతో సమయం వృధా అవుతోంది. సాంకేతిక సమస్యలూ వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు ఆర్బీకేల్లోనే నగదు చెల్లింపులకు అనుమతినిచ్చారు. ఈ సొమ్ము నాలుగైదు రోజులకోసారి ఆర్బీకే ఖాతాల నుంచి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు జమ చేసే వారు. నగదు చేతికొచ్చాక వీఏఏలు ఇండెంట్ పెట్టేవారు. తమ ఖాతాలకు జమ కాలేదన్న కారణంతో ఏజెన్సీలు సరుకు పంపడంలో జాప్యం జరిగేది. పైగా వసూలు చేసిన నగదును ఆర్బీకే సిబ్బంది రెండు మూడు రోజులు తమ వద్దే ఉంచుకోవడం, కొన్ని చోట్ల పక్కదారి పట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల జాప్యం, అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా పంపిణీ చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ముందుగా విత్తనాలకు ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీలో విత్తనాభివృద్ధి సంస్థదే కీలక పాత్ర. ఏటా రాష్ట్రంలో రూ.1,500 కోట్ల విత్తనాలు విక్రయిస్తున్నారు. దాంట్లో రూ.670 కోట్ల విలువైన సబ్సిడీ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుంది. సబ్సిడీ పోను రైతుల నుంచి రూ.400 కోట్లు వసూలు చేస్తుంది. రానున్న ఖరీఫ్ నుంచి సబ్సిడీతో పాటు కనీసం పది శాతం నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాలెట్స్ ద్వారా నేరుగా సంస్త ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ క్యూ ఆర్ కోడ్ ఇస్తారు. చెల్లింపులు బయటకు విన్పించేలా ఓ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ను అందిస్తారు. రైతులు వారికి అవసరమైన వాటిని బుక్ చేసుకొనే సమయంలో తగిన సొమ్మును స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లించాలి. వెంటనే వారికి విత్తనాలను అందిస్తారు. డిజిటల్ చెల్లింపులను దశలవారీగా ఎరువులు, పురుగుల మందులు, పశువుల దాణా, రొయ్యలు, చేపల మేతకు కూడా అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు రైతుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతున్నాం. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి డిజిటల్ చెల్లింపులతోనే ఆర్బీకేల ద్వారా జరిగే విత్తన విక్రయాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
హైటెక్ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు
గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్ కోడ్తో దానాలు స్వీకరించే వీడియోను గతంలో షేర్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వృద్ధికి ప్రతీకగా ఆ వీడియోను మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పట్టికలో అట్టడుగున ఉండే బీహార్లో ఓ బిచ్చగాడు మెడలో క్యూఆర్ కోడ్ తగిలించుకుని అడుక్కుంటూ వార్తల్లో ట్రెండవుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో బెట్టియా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడే ఉన్నాడు హైటెక్ బిచ్చగాడు రాజు పటేల్ (40). రైల్వేస్టేషన్లు, రైళ్లలో అడుక్కుంటూ రాత్రి వేళ అక్కడే పడుకుంటూ కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ఎవరిని ధర్మం అడిగినా చిల్లర లేదంటూ చెప్పడం కామన్ అయిపోయింది. దీంతో రాజు పటేల్కి బిచ్చం తగ్గిపోయింది. మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యాడు రాజు పటేల్. గతంలో బిచ్చం ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో సమీపంలో బ్యాంకుకి వెళ్లి ఖాతా ఓపెన్ చేశాడు. బ్యాంకు అకౌంట్ ఆధారంగా ఓ డిజిటల్ పేమెంట్ సర్వీస్ అందించే సంస్థ నుంచి ఈ వాలెట్ - క్యూ ఆర్ కోడ్ సాధించాడు. అక్కడితో ఆగిపోలేదు.. తనకు బిచ్చం వస్తుందో రావట్లేదో తెలుసుకునేందుకు ఓ ట్యాబ్ కూడా కొనుక్కున్నాడు. ఎప్పటిలాగే స్టేషన్ ఆవరణలో బిచ్చం అడుక్కోవడం ప్రారంభించారు. అయితే కొత్త పద్దతిలో దీన్ని ప్రారంభించారు. మెడలో క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డు, చేతిలో ట్యాబ్తో.. ధర్మం చేయండి బాబు అని వేడుకుంటాడు. ఎవరైనా బిచ్చం వేయబోతే వెంటనే మెడలో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. ధర్మం వచ్చింది లేనిది ట్యాబ్లో చెక్ చేసుకుంటాడు. Bihar | Raju Patel, a beggar in Bettiah, goes digital; accepts PhonePe & puts a QR code around his neck "I accept digital payments, it's enough to get the work done & fill my stomach," said Raju Patel Visuals from Bettiah railway station pic.twitter.com/nbw83uXop6 — ANI (@ANI) February 8, 2022 రాజు పటేల్ బిచ్చం అడుక్కునే తీరుతో తోటి బిచ్చగాళ్లు అవాక్కవుతున్నారు. ఆ నోటా ఈ నోటా చివరకు రాజు పటేల్ స్టోరీ సోషల్ మీడియాకు చేరుకుంది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ విస్త్రృతికి ఇదో ఉదాహరణగా కొందరు చెబుతుంటే మరికొందరు డిజిటల్ పేమెంట్స్ వచ్చినా పేదరికం మాత్రం పోవడం లేదంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. -
పేటీఎమ్కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 778 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. పేటీఎమ్ బ్రాండు సర్వీసుల ఈ కంపెనీ గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 536 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే మొత్తం టర్నోవర్ మాత్రం 88 శాతం జంప్చేసి రూ. 1,456 కోట్లయ్యింది. వినియోగదారులకు అందించిన పేమెంట్ సర్వీసుల ద్వారా లభించిన ఆదాయం 60 శాతం ఎగసి రూ. 406 కోట్లకు చేరింది. -
డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా?
ఈసారి కేంద్ర బడ్జెట్ డిజిటల్ మంత్రం జపించింది. అన్నింటా ఆధునికత ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపులు, పేపర్ లెస్ పేమెంట్స్ ప్రక్రియ వేగవంతం చేసేలా పలు నిర్ణయాలు ప్రకటించింది. అయితే సరైన మౌలిక సదుపాయలు లేకుండా ప్రభుత్వం కంటోన్న డిజిటల్ కల నెరవేరుతుందా? డిజిటల్ ఇండియా లక్క్ష్యంగా చేసుకునే కేంద్రం బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్కు మరింత ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ భారత్లో భాగంగా మొదలైన కాంటాక్ట్ లెస్ చెల్లింపుల వ్యవహారం.. కరోనా టైంలో ‘నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి’ కారణంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ 61 బిలియన్ డాలర్లు ఉండగా 2021 నాటికి అది ఏకంగా 300 బిలియన్ డాలర్లకి చేరుకుంది. టీ కొట్టు నుంచి.. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్టార్టప్లు కీలకంగా మారాయి. పేటీఎం, ఫోన్పే వంటి స్టార్టప్లు టీ స్టాల్, పాన్ డబ్బా నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల వరకు చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఫోన్ రీచార్జ్ ఆన్లైన్లో చేస్తూ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేశాయి. డిజిటల్ పేమెంట్స్లో ప్రస్తుతం కొనసాగుతున్న బూమ్ 2026 నాటికి ఏకంగా వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటికీ ఇండియాలో జరిగే పేపర్ లెస్ లావాదేవీల్లో ఈ వన్ ట్రిలియన్ వాటా కేవలం 30 శాతమే అని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. మందకొడిగా.. ప్రైవేటు సెక్టార్లో త్వరితగతిన డిజిటల్ పేమెంట్స్ జరుగుతుండగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ, రైల్వేస్, రిజిస్ట్రేషన్లు, రేషన్ దుకాణాలు ఇలా చాలా సర్కారీ శాఖల్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇంకా ఊపందుకోలేదు. గ్రామీణ భారతంలో ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ నగదు నోట్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ పేపర్ లెస్ ట్రాన్జాక్షన్స్ లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. దీన్ని అధిగమించేందుకు డిజిటల్ మంత్రాన్ని కేంద్రం జపిస్తోంది. అందుకే ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసింది. డిజిటల్ బడ్జెట్ డిజిటల్ యూనివర్సిటీతో పాటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదన సైతం బడ్జెట్లో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ కీలకమైన ఇంటర్నెట్ విస్తరణపైనా కేంద్రం దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల కోసం భారత్నెట్ ప్రాజెక్టును చేపట్టింది. భారత్నెట్ ద్వారా 2025 నాటికి దేశమంతటా తక్కువ ధరకే బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తామని ప్రభుత్వం అంటోంది. ఏకంగా డిజిటల్ యూనివర్సిటీ కూడా నెలకొల్పుతామంది. ఆఖరికి వివాదాలు, విమర్శలు పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీకి కూడా సై అంది కేంద్రం. స్లో అయితే కష్టం అయితే ప్రభుత్వం లక్ష్యాలు అర్బన్, సెమీ అర్బన్ రీజియన్ల వరకు ఓకే. మరి రూరల్ భారత్ సంగతి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన 5జీ, భారత్నెట్ ప్రాజెక్టులు ఇంకా లక్ష్యానికి దూరంగా ఉండి పోయాయి. ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వైన్స్ తదితర చోట్ల డిజిటల్ పేమెంట్స్ చేస్తే అదనపు చార్జీలను కస్టమర్ల మీద మోపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఎక్కడా అడ్డుకట్ట పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం జపిస్తున్న డిజిటల్ మంత్ర ఎంత వరకు సిద్ధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!) డబుల్ వేగం వేగవంతమైన ఇంటర్నెట్తో యాక్సెస్ వస్తే డిజిటల్ పేమెంట్స్ అందనంత వేగంతో దూసుకుపోతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లు 2021 సెప్టెంబరు నాటికి డిజిటల్ పేపెంట్స్ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయనుకున్నారు. అందరీ అంచనాలు తారుమారు చేస్తూ డిజిటల్ పేమెంట్స్ ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగడంతో యాభైకి పైగా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. 250 బ్యాంకులు యూపీఐ పేమెంట్స్ని అంగీకరిస్తున్నాయి. సగటున ప్రతీ రోజు యూపీఐ ద్వారా రోజుకు 14 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల్లో యాభై శాతం రూ.200లోపువే కావడం గమనార్హం. (క్లిక్: అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..) ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే రూరల్ ఇండియా, పేద, మధ్య తరగతి ప్రజలు ముందస్తు అంచనాలు తలకిందులు చేస్తూ వేగంగా డిజిటల్ వైపు మళ్లగా భారీ లావాదేవీలు మాత్రం ఇప్పటికీ నగదుతోనే జరుగుతుంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుతో జరిగే లావాదేవీల మొత్తం కంటే యూపీఐ లావాదేవీల మొత్తమే ఎక్కువ. కాబట్టి భారీ డీల్స్ కూడా డిజిటల్ పద్దతిలో జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. భారీ లావాదేవీలను కూడా డిజిటల్ పరిధిలోకి తీసుకువస్తే పారదర్శకత పెరిగి పన్ను వసూళ్లు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఆన్లైన్ మెసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సైబర్ సెక్యురిటీ, డేటా ప్రైవసీ విషయంలో ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన చర్యలు అవసరం. - సాక్షి, వెబ్ స్పెషల్ -
దేశంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల హవా..!
ముంబై: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మంచి వృద్ధిని చూస్తున్నాయి. వీటి తీరును ప్రతిఫలించేందుకు ఆర్బీఐ ‘డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ (ఆర్బీబీ-డీపీఐ)ను ఏర్పాటు చేసింది. ఈ సూచీ 2021 మార్చి నాటికి 270.59 దగ్గర ఉంటే.. 2021 సెప్టెంబర్ నాటికి 304.06కు చేరుకుంది. 2020 సెప్టెంబర్ నాటికి ఈ సూచీ 217.74గా ఉండడం గమనార్హం. అంటే కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు నిరంతరాయంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ-డీసీఐ సూచీ దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ఆమోదం, విస్తృతిని తెలియజేస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ-డీపీఐ ఐదు ప్యారామీటర్ల ఆధారంగా దేశంలో డిజిటల్ చెల్లింపుల తీరును విశ్లేషిస్తుంటుంది. ఆరు నెలలకోసారి ఈ సూచీ గణాంకాలను ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. (చదవండి: పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్ సీఎన్జీ కార్స్!) -
ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు.. పేటీఎంలో కొత్త ఫీచర్
హైదరాబాద్: మొబైల్లో ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసుకొనే సదుపాయాన్ని పేటీఎం తీసుకొచ్చింది. ఇందుకోసం ‘ట్యాప్ టు పే’ అనే సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. దీని ద్వారా కస్టమర్లు నగదు లావాదేవీలను పేటీఎం రిజిస్టర్ చేసిన కార్డు ద్వారా పీఓఎస్ మెషీన్లో ఫోన్ ట్యాప్ చేసి నగదు పూర్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఫోన్ లాక్ చేసి ఉన్నా, మొబైల్లో డేటా లేకున్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోయినా ఈ లావాదేవీలను సులభంగా చేయవచ్చని వివరించింది. ఇది ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ ‘ట్యాప్ టూ పే’ సేవల ద్వారా రిటైల్ స్టోర్ల వద్ద వేగవంతమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందని తెలిపింది. -
దేశీ డిజిటల్ పే ప్లాట్ఫామ్లో ఇదే నంబర్ వన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవితకాల నమోదిత యూజర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 35 కోట్లు దాటిందని ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే వెల్లడించింది. 2021 జనవరితో పోలిస్తే ఇది 28 శాతం వృద్ధి అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ‘నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్పే వాడుతున్నారు. డిసెంబర్ నెల యాక్టివ్ యూజర్లు 15 కోట్లు నమోదైంది. గత నెలలో 50 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఫోన్పే వేదికగా ఏడాదిలో రూ.48,34,977 కోట్ల చెల్లింపులు జరిగాయి’ అని వివరించింది. భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్గా అవతరించామని ఫోన్పే కంజ్యూమర్ ప్లాట్ఫాం, పేమెంట్స్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. లావాదేవీలు విజయవంతంగా పూర్తి అయ్యేలా నిరంతరం శ్రమిస్తున్న సాంకేతిక బృందం కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. 15,700 పట్టణాలు, గ్రామాల్లో 2.5 కోట్ల స్టోర్లలో వ్యాపారులు ఫోన్పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. -
ఇంటర్నెట్ లేకపోయినా.. డిజిటల్ పేమెంట్స్ చేయోచ్చు
ముంబై: గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా ఆర్బీఐ ఆఫ్లైన్ చెల్లింపుల సేవల అమలుకు కార్యాచరణను ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా లేదా కనెక్టివిటీ సరిగ్గా లేని చోట్ల.. ఆఫ్లైన్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించినట్టయింది. ఆఫ్లైన్ విధానంలో చెల్లింపులను ప్రాక్సిమిటీ మోడ్ (ఫేస్ టు ఫేస్) విధానంలో నిర్వహిస్తారు. కార్డులు, వ్యాలెట్లు, మొబైల్ డివైజెస్లతో ఈ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. కనుక ఈ లావాదేవీలకు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ (మరో అంచె ధ్రువీకరణ) అవసరం ఉండదని ఆర్బీఐ తెలిపింది. రూ.200 ఒక్కో లావాదేవీ పరిమితి రూ.200 వరకు, మొత్తం మీద అన్ని లావాదేవీలకు గరిష్ట పరిమితి రూ.2,000 వరకే ఉంటుందని (తిరిగి ఆన్లైన్ ద్వారా బ్యాలన్స్ను నింపుకునే వరకు) పేర్కొంది. 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఆర్బీఐ పరీక్షించింది. ‘‘బలహీనమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచేందుకు ఆఫ్లైన్ లావాదేవీలు తోడ్పడతాయి. నూతన విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అని ఆర్బీఐ ప్రకటించింది. కస్టమర్ ఆమోదంతో ఆఫ్లైన్ చెల్లింపుల విధానాన్ని యాక్టివేట్ చేయొచ్చని తెలిపింది. ఈ విధానంలోనూ కస్టమర్కు లావాదేవీల పరంగా రక్షణ ఉంటుందని (కస్టమర్ ప్రమేయం లేని సందర్భాల్లో) స్పష్టం చేసింది. చదవండి: ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు -
అలా అని ఏ చట్టం చెబుతోంది?
సాక్షి, అమరావతి : మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో తమ ముందుంచాలని హైకోర్టు పిటిషనర్ను ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ, డిజిటల్ చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చట్ట నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని, ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం ద్వారా మద్యం తాగే పేదల వెంట ఎందుకు పడ్డారని ధర్మాసనం సరదాగా పిటిషనర్ను ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో చట్ట నిబంధనలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది. -
డిజిటల్ పేమెంట్లపై వడ్డన.. ఆర్బీఐ ‘నో’ క్లారిటీ
RBI Monetary Policy | UPI for Feature Phone Users: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. ఫీచర్ ఫోన్లకు సైతం(స్మార్ట్ ఫోన్లు కాకుండా బేసిక్ ఫోన్లు) యూపీఐ ఆధారిత పేమెంట్ పద్దతులను.. అదీ ఆర్బీఐ పర్యవేక్షణ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తద్వారా చిన్నాచితకా ట్రాన్జాక్షన్లు జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే యూపీఐ ఆధారిత ఫీచర్ ఫోన్ ప్రొడక్టులు ఎలా పని చేయనున్నాయనేది ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పేమెంట్ వ్యవస్థలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ తీరును మరింత సరళీకరించే ఉద్దేశంతో ఆర్బీఐ ఉంది. ఇందుకోసం కార్డులు, వాలెట్లు, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఛార్జీల మీద చర్చా పత్రాన్ని విడుదల చేయబోతోంది. కార్డులు, వాలెట్ల వరకు ఓకే. కానీ, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన బేసిక్ పేమెంట్ యాప్స్ ఏవీ ఇప్పటివరకు పేమెంట్ల మీద పైసా ఛార్జీ వసూలు చేయలేదు. దీంతో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల మీద ఛార్జీలు వసూలు చేస్తారా? అనే కోణంలో చర్చ మొదలైంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్లో యూపీఐ మోస్ట్ పాపులర్ పేమెంట్ మెథడ్గా ఉంది. ఒక్క నవంబర్లోనే 4.1 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ ద్వారా 6.68 లక్షల కోట్లు యూపీఐ ద్వారా జరిగింది. ప్రస్తుతం యూపీఐ పరిధిలోని గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే ఏవీ కూడా ట్రాన్జాక్షన్స్కి యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, నాన్ యూపీఐ పరిధిలోని కొన్ని మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు యూపీఐ పరిధిలోని ప్లేయర్స్(గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే లాంటివి).. మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించాలని ఎప్పటి నుంచో ఆర్బీఐను డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫోన్ ఫే ఫౌండర్ సమీర్ నిగమ్ గతంలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. యూపీఐ పరిధిలోని ప్లేయర్స్ ‘జీరో ఎండీఆర్’తోనే 85 నుంచి 90 శాతం ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాయని ప్రస్తావించారు. మరి ఆర్బీఐ యూపీఐ ప్లేయర్ల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా?.. ఒకవేళ తీసుకుంటే డిజిటల్ ట్రాన్జాక్షన్స్పై సామాన్యుల మీదే భారం వేస్తుందా? ఆ చర్చా పత్రంలో ఎలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే విషయాలపై బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే బాదుడే.. ఎప్పటినుంచంటే.. -
Anand Mahindra: ఈ విషయంలో చైనా, అమెరికాలను వెనక్కి నెట్టిన భారత్
Anand Mahindra Tweets that India at Top Position In Financial Olympics: అక్షరాస్యత తక్కువని, సరైన ఆర్థికాభివృద్ధి లేదంటూ ఇండియాను చిన్నబుచ్చే దేశాలకు షాక్లాంటి వార్తను ప్రజలతో పంచుకున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి రియల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా, చైనాలను ఇండియా వెనక్కి నెట్టిన వివరాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఫైనాన్షియల్ ఒలంపిక్స్లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో ఇండియా ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఎకానమిక్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే (ఈఐయూ) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్, రియల్ టైం ట్రాన్సాక్షన్లకు సంబంధించి సర్వే చేపట్టింది. అందులో ఇండియా 25.5 బిలియన్ల ట్రాన్సాక్షన్లతో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఇండియా తర్వాత చైనా 15.7 దక్షిణ కొరియా 6, థాయ్లాండ్ 5.2, జిబ్రాల్టర్ 2.8, జపాన్ 1.7, బ్రెజిల్ 1.3, అమెరికా 1.2 బిలియన్ల రియల్టైం ట్రాన్సాక్షన్లు ఉన్నట్టు ఈఐయూ ప్రకటించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఊ) సిస్టమ్ వచ్చిన తర్వాత ఇండియాలో డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నట్టు పేర్కొంది. Almost 26 bn payments. In these ‘financial Olympics’ a pleasure to see us standing tall on top of the podium… @ErikSolheim pic.twitter.com/phe66RXXtj — anand mahindra (@anandmahindra) November 26, 2021 చదవండి: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు.. లీగల్ యాక్షన్కు సిద్ధమన్న ఆనంద్ మహీంద్రా -
మొబైల్ యూజర్లకు గుడ్న్యూస్..! ఇక వాటిపై ఛార్జీలుండవు..!
మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలను ఉచితంగా అందించే ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను పూర్తి ఉచితంగా సేవలను అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. చదవండి: క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..! డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా..! డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను రిజర్వ్ బ్యాంక్ చేసిన సూచనల మేరకు నవంబర్ 24న జరిగిన టెలికామ్టాక్లో మొబైల్ యూజర్లందరికీ USSD సందేశాలను ఉచితంగా అందించాలనే ప్రతిపాదనను ట్రాయ్ పలు టెలికాం ఆపరేటర్లకు తెలియజేసింది. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..! -
యూఎస్ఎస్డీ చార్జీల తొలగింపుపై ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సర్వీసులకు సంబంధించి యూఎస్ఎస్డీ మెసేజీలపై చార్జీలను తొలగించాలని భావిస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విషయంలో ఒకో యూఎస్ఎస్డీ సెషన్కు టెలికం సంస్థలు విధిస్తున్న టారిఫ్లు .. ఒక నిమిషం అవుట్గోయింగ్ వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ సగటు కన్నా అనేక రెట్లు అధికంగా ఉంటున్నాయని ట్రాయ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనపై డిసెంబర్ 8లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. ఉదాహరణకు, కాల్ చేసినప్పుడు లేదా ఎస్ఎంఎస్ పంపినప్పుడు మొబైల్ బ్యాలెన్స్ నుంచి ఎంత ఖర్చయ్యింది అన్నది స్క్రీన్పై కొంత సేపు చూపించి మాయమయ్యే మెసేజీలను యూఎస్ఎస్డీగా వ్యవహరిస్తారు. ఇవి ఎస్ఎంఎస్ల తరహాలో ఫోన్లో సేవ్ కావు. ప్రస్తుతం ఒకో యూఎస్ఎస్డీ సెషన్కు చార్జీలు గరిష్టంగా 50 పైసలుగా ఉన్నాయి. ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలకు మాత్రం చార్జీలు ఉండవు, కానీ ఇతర సర్వీసులకు మాత్రం అమల్లోనే ఉంటాయి. చదవండి: శాటిలైట్ ఆపరేటర్ల నిబంధనలు సరళతరం కావాలి -
డిజిటల్ చెల్లింపులతో చిన్న దుకాణాలకు ఊతం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల విధానం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో చిన్న దుకాణాదారుల భారీగా ఊరట లభిస్తోంది. వారి దగ్గర అరువుగా (బీఎన్పీఎల్– ఇప్పుడు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం విధానం) తీసుకున్న వాటికి వినియోగదారులు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారు. దీపావళి తర్వాత దేశీయంగా అసంఘటిత రంగంలోని చిన్న స్థాయి దుకాణాదారులకు బీఎన్పీఎల్ విధానంలో చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. సగటుతో పోలిస్తే 12 శాతం అధికంగా నమోదయ్యాయి. అలాగే పండుగ సీజన్ సందర్భంగా రెండు వారాల్లో దుకాణాదారుల వ్యాపారం 15 శాతం వృద్ధి చెందింది. డిజిటల్ బుక్ కీపింగ్ యాప్ ఓకేక్రెడిట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సత్వర చెల్లింపులు వినియోగదారులు రుణంపై షాపింగ్ చేయడం పెరిగిన్నప్పటికీ వారు సత్వరం చెల్లింపులు జరిపే ధోరణి కూడా పెరిగిందని నివేదిక పేర్కొంది. కిరాణా షాపులు, ఆభరణాలు, తినుబండారాల దుకాణాదారులు మొదలైన వారు గతంలో తమ బాకీలను వసూలు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపింది. కానీ ఈసారి పండుగ సీజన్లో 30 లక్షల మంది పైగా కస్టమర్లు తమ బాకీలను సకాలంలో కట్టేశారని పేర్కొంది. మరోవైపు, రిటైల్ చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఖాతాల నిర్వహణకు డిజిటల్ సొల్యూషన్స్ వినియోగించడం 70 శాతం పెరిగిందని ఓకేక్రెడిట్ తెలిపింది. దాదాపు 1.1 లక్షల కోట్ల దేశీ రిటైల్ మార్కెట్లో దాదాపు 95 శాతం వాటా 6 కోట్ల పైచిలుకు స్థానిక వ్యాపారాలదే ఉంటోందని వివరించింది. -
పేటీఎంలో లావాదేవీలు రెట్టింపు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) రెట్టింపై రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జీఎంవీ రూ. 94,700 కోట్లు. నిర్దిష్ట కాల వ్యవధిలో తమ యాప్, పేమెంట్ సాధనాలు మొదలైన వాటి ద్వారా వ్యాపారస్తులకు మొత్తం చెల్లింపు లావాదేవీలను పేటీఎం జీఎంవీగా పరిగణిస్తుంది. వినియోగదారుల మధ్య జరిగే నగదు బదిలీ వంటి పేమెంట్ సర్వీసులను పరిగణనలోకి తీసుకోంది. కంపెనీ గణాంకాలను బట్టి జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నెలవారీగా లావాదేవీలు జరిపే యూజర్ల సంఖ్య 33 శాతం పెరిగి 4.3 కోట్ల నుంచి 5.7 కోట్లకు పెరిగింది. ఇక పేటీఎం ద్వారా మంజూరు చేసిన రుణాల విలువ 500 శాతం ఎగిసి రూ. 210 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు చేరింది. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన తర్వాత పేటీఎం బోర్డ్ తొలిసారిగా ఆర్థిక ఫలితాలను ఆమోదించేందుకు నవంబర్ 27న సమావేశం కానుంది. సోమవారం ఎన్ఎస్ఈలో పేటీఎం షేరు సుమారు 13 శాతం క్షీణించి రూ. 1,362 వద్ద క్లోజయ్యింది. -
గ్రామాలకూ డిజిటల్ చెల్లింపులు
ముంబై: చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో.. పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకం కింద సెప్టెంబర్ నాటికి 2.46 లక్షల డివైస్లు అందుబాటులోకి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. వీటిలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), మొబైల్ పీవోఎస్, జనరల్ పాకెట్ రేడియో సర్వీస్, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ ఉన్నాయని వివరించింది. పీఐడీఎఫ్ పథకం కింద యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్తోసహా 55,36,678 డిజిటల్ పరికరాలు ఏర్పాటయ్యాయి. పథకంలో భాగంగా విక్రేతలకు అధీకృత కార్డ్ నెట్వర్క్స్, బ్యాంక్లు సబ్సిడీతో పరికరాలను మంజూరు చేస్తాయి. ఈ స్కీమ్ కోసం ప్రస్తుతం రూ.614 కోట్ల నిధి ఉందని ఆర్బీఐ తెలిపింది. -
పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్ సబ్స్క్రైబ్ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. నవంబర్ 15న షేర్లను అలాట్ చేయనుండగా, 18న లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్ ఇండియాను మించిన ఇష్యూ.. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్ శేఖర్ శర్మ 2000లో వన్97 కమ్యూనికేషన్స్ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్ రీచార్జి, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్కు 1.07 రెట్ల స్పందన న్యూఢిల్లీ: కేఎఫ్సీ, పిజా హట్ అవుట్లెట్స్ నిర్వహణ సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్ వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్స్క్రైబ్ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్ ఫుడ్స్ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్ ఫుడ్స్ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. -
పేటీఎమ్ ఐపీవోకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: షేరుకి రూ. 2,080–2,150 ధరలో డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్ర స్పందనే లభిస్తోంది. రెండో రోజు మంగళవారానికల్లా ఇన్వెస్టర్ల నుంచి 48 శాతం బిడ్స్ మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే మంగళవారానికల్లా 2.34 కోట్ల షేర్ల కోసమే దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ద్వారా కంపెనీ భారీ స్థాయిలో రూ. 18,300 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో కంపెనీ ఆఫర్ చేసిన 2.63 కోట్ల షేర్లకుగాను 1.2 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోసం 1.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 5%కే దరఖాస్తులు వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.23 రెట్లు స్పందన లభించడం గమనార్హం. 87.98 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేయగా.. 1.08 కోట్ల షేర్లకు బిడ్స్ లభించాయి. ఇష్యూ నేడు(బుధవారం) ముగియనుంది. -
డీమానిటైజేషన్తో పెరిగిన డిజిటల్ చెల్లింపులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కాస్త మందకొడిగా అయినప్పటికీ చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ పరిస్థితుల మధ్య ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల వినియోగం ఎగిసింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016లో రూ. 17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉండగా 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కి చెందిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ).. పేమెంట్లకు ప్రధాన మాధ్యమంగా మారుతోంది. 2016లో యూపీఐని ఆవిష్కరించగా కొన్ని సందర్భాలు మినహా ప్రతి నెలా లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 అక్టోబర్లో లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబర్లో యూపీఐ ద్వారా 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: మెటావర్స్పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
నిన్న ఆర్థిక మంత్రి, నేడు ఆనంద్ మహీంద్రా.. ఆకట్టుకుంటున్న క్యూఆర్ గంగిరెద్దు
భారత్లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయంటూ ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021 నివేదిక ప్రకటించిన రోజే .. అందులోని అంశాలు నిజమే అన్నట్టుగా ఓ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. గంగిరెద్దు ఆడించే వ్యక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారను. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గంగిరెద్దు తలకు క్యూఆర్ కోడ్ ఉంచి నగదు స్వీకరిస్తున్న వీడియోను చూసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ పేమెంట్స్ శరవేగంతో విస్తరిస్తున్నాయంటూ తన ట్విట్టర్ పేజీలో స్పెషల్గా పోస్ట్ చేశారు. మరుసటి రోజే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా సైతం ఇదే వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. డిజిటల్ పేమెంట్స్ భారీ ఎత్తున విస్తరిస్తున్నాయని అని చెప్పడానికి ఇంత కంటే పెద్ద ఉదాహారణ ఏమైనా కావాలా ? అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయగా.. అది కూడా వైరల్గా మారింది. Do you need any more evidence of the large-scale conversion to digital payments in India?! pic.twitter.com/0yDJSR6ITA — anand mahindra (@anandmahindra) November 6, 2021 -
‘పే’యాప్ల జోరు.. ఏటీఎం, క్రెడిక్ కార్డుల బేజారు
న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను (యూపీఐ/క్యూఆర్కోడ్) ఆమోదిస్తుండడం ఈ వృద్ధికి దోహదపడుతున్నట్టు ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021’ నివేదిక తెలిపింది. 67 శాతం వృద్ధి మొబైల్ యాప్స్ ద్వారా చేసే చెల్లింపుల విలువ 2020లో 67 శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021లో ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ‘‘భారత్లో మొబైల్ ఫోన్ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. యాప్ద్వారా చెల్లింపులు ఆదరణ పొందడం ఇందుకు తోడ్పడుతోంది’’ అని ఈ నివేదికను విడుదల చేసిన ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పరిశోధన బృందం తెలిపింది. స్మార్ట్ ఫోన్లతో చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నందున కార్డు చెల్లింపులకు కంటే ఇవే ఎక్కువగా వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. తగ్గుముఖం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల విలువ 2020లో 14 శాతం తగ్గి 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నివేదిక అంచనా మేరకు.. 2020లో బ్యాంకులు 524 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ కార్డుల ఇంటర్చేంజ్ ఆదాయాన్ని కోల్పోయాయి. లాక్డౌన్లతో కార్డు చెల్లింపులు తగ్గిపోవడం తెలిసిందే. అనుకూలమైన ఎంపిక.. ‘‘చెల్లింపుల యాప్ల ద్వారా లావాదేవీలు (పీర్ టు పీర్ సహా), మొబైల్ చెల్లింపులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్ మాధ్యమాలకు అనుకూలమైన ఎంపికగా మారుతోంది. మొబైల్ చెల్లింపులు ప్రాచుర్యం కావడంతో నగదు వినియోగానికి డిమాండ్ నిదానించింది. 2020లో ప్రతీ ఏటీఎం నగదు ఉపసంహరణతో పోల్చి చూస్తే 3.7 మొబైల్ లావాదేవీలు నమోదయ్యాయి. రానున్న సంవత్సరాల్లోనూ భారత్లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయి’’ ఈ నివేదిక పేర్కొంది. ఇన్స్టంట్ చెల్లింపుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే.. 2020లో భారత్లోనే అధిక సంఖ్యలో రియల్టైమ్ లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఎంతకాలం ఈ అగ్రస్థానం ‘‘ఫోన్పే, గూగుల్పే అత్యంత ప్రాచుర్యమైన యూపీఐ చెల్లింపులు యాప్లుగా భారత్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2021లో మొదటి ఆరు నెలల్లో ఫోన్పే 44 శాతం మార్కెట్ వాటాతో ఉండగా, గూగుల్ పే 35 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండు యాప్లు కలసి 338 బిలియన్ డాలర్ల విలువైన 12 బిలియన్ల లావాదేవీలు నిర్వహించాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. పేటీఎం, అమెజాన్ పే సంస్థలు పోటీలో వెనుకబడినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 14 శాతమే కాగా, అమెజాన్ పే 2 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే ఫోన్పే, గూగుల్ పే యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటికీ ఆధిపత్యం కొనసాగించే అవకాశం లేదని గుర్తు చేసింది. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీల్లో 30 శాతం పరిమితి (మొత్తం లావాదేవీల్లో) విధించింది. ఫోన్పే, గూగుల్పే మాత్రమే ఈ పరిమితిని దాటేశాయి. ఈ నిబంధనల అమలుకు 2022 వరకు సమయం ఉంది’ అని నివేదిక వివరించింది. చదవండి: పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ -
ఆన్లైన్ సేల్స్ అదరహో!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53% మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65% మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుం టే.. 68% మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. -
పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ
కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం మరింత స్పీడందుకోనుంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్సహా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. వెరసి సెకండరీ మార్కెట్ మరింత కళకళలాడనుంది. న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం ఐపీవోల సందడి నెలకొననుంది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్తోపాటు.. కేఎఫ్సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. మూడు కంపెనీల ఇష్యూలనూ కలిపితే రూ. 21,000 కోట్లను సమకూర్చుకునే అవకాశముంది. కాగా.. ఈ వారం ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్, నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పీబీ ఫిన్టెక్(పాలసీబజార్), ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలను చేపట్టిన సంగతి తెలిసిందే. పేటీఎమ్ ఐపీవో సోమవారం(8న) ప్రారంభమై బుధవారం(10న) ముగియనుంది. సఫైర్ ఫుడ్స్ ఐపీవో 9–11 మధ్య, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ 10–12 మధ్య పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. పేటీఎమ్ జోరు ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ. 18,300 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు షేరుకి రూ. 2,080–2,150 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. దీంతో కంపెనీ విలువ రూ. 1.48 లక్షల కోట్లను తాకనుంది. ఐపీవో విజయవంతమైతే.. కోల్ ఇండియా తదుపరి రెండో పెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇంతక్రితం 2010లో కోల్ ఇండియా అత్యధికంగా రూ. 15,200 కోట్లు సమకూర్చుకుంది. బుధవారం పేటీఎమ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,235 కోట్లు సమీకరించింది. సఫైర్ ఫుడ్స్ ఇలా ఐపీవోకు రూ. 1,120–1,180 ధరల శ్రేణిని సఫైర్ ఫుడ్స్ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన సంస్థలు 1.757 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 2,073 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. సఫైర్ ఫుడ్స్ మారిషస్ 55.69 లక్షలు, డబ్ల్యూడబ్ల్యూడీ రూబీ 48.46 లక్షలు, అమెథిస్ట్ 39.62 లక్షలు, క్యూఎస్ఆర్ మేనేజ్మెంట్ ట్రస్ట్ 8.5 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఐపీవోకు రూ. 190–197 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ వి.వెంకటరామన్ రూ. 60.14 కోట్లు, వాటాదారుడు రమేష్ హరిహరన్ రూ. 35 కోట్లు, గోపీనాథ్ కోటీశ్వరన్ రూ. 23.52 కోట్ల విలువైన వాటాలను ఆఫర్ చేయనున్నారు. 46 కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 46 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 80,102 కోట్లను సమీకరించాయి. ఏడాది పూర్తయ్యేసరికి ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ రూ. లక్ష కోట్లను మించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది(2020)లో ఐపీవోల ద్వారా 15 కంపెనీలు కేవలం రూ. 26,611 కోట్లు సమకూర్చుకున్నాయి. గతంలో 2017లో మాత్రమే ఈ స్థాయిలో 36 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 67,147 కోట్లను అందుకోవడం ద్వారా రికార్డు నెలకొల్పాయి! -
గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో
ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్ చెల్లింపులు అయిపోయాయి. ఇక భారత్లో డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిచోటా నగదుకు బదులు ఫోన్లోని యాప్స్ ద్వారానే పే చేసేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సక్షన్స్కే మొగ్గు చూపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇది దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది. చదవండి: కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్ కోడ్ ట్యగా్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ..‘గంగరెద్దలాటకు చెందిన వీడియో ఇది. డిజిటల్ చెల్లింపు విప్లవం జానపద కళాకారులకు చేరువైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో గంగిరెద్దులవాళ్లు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎద్దులకు పలమాలలు వేసి ఇంటింటికి వెళ్లి నాదస్వారం వాయిస్తూ భిక్ష తీసుకుంటారు.’ అని పేర్కొన్నారు. Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v — Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021 -
పేటీఎం విలువ రూ. 1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం కంపెనీ వేల్యుయేషన్ దాదాపు రూ. 1.48 లక్షల కోట్లుగా ఉండనుంది. 2010లో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా ఐపీవో (రూ. 15,200 కోట్లు) కన్నా పేటీఎం మరింత భారీ స్థాయిలో ఉండనుండటం గమనార్హం. నవంబర్ 8న ప్రారంభమై 10న పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోకు ముందస్తు నిర్వహించిన కార్యక్రమంలో వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ‘పేటీఎం నిర్ణయించిన షేరు ధర శ్రేణిని చూస్తే కంపెనీ విలువ సుమారు 19.3–19.9 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుత మారకం రేటు బట్టి ఇది రూ. 1.44 లక్షల కోట్లు–1.48 లక్షల కోట్లుగా ఉండవచ్చు‘ అని గోల్డ్మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ ఎండీ సుదర్శన్ రామకృష్ణ తెలిపారు. ఇది భారత దశాబ్దం..: 2010–20 దశాబ్దం.. ఆసియాలోని చైనా, జపాన్ తదితర దేశాలకు చెందినదైతే.. 2020–30 దశాబ్దం మాత్రం పూర్తిగా భారత్దేనని శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత యుగం. మీది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, కొత్త స్టార్టప్ కావచ్చు, లిస్టెడ్ కంపెనీ లేదా లిస్టయ్యే అవకాశాలు ఉన్న సంస్థ కావచ్చు. ప్రస్తుత తరుణంలో ప్రపంచం మీకు నిధులు అందిస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. తాము ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించినప్పటి నుంచి దేశ, విదేశ బ్లూ చిప్ ఇన్వెస్టర్లు .. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేటీఎం ప్రెసిడెంట్ మధుర్ దేవరా తెలిపారు. ఐపీవోలో భాగంగా శర్మ రూ. 402.65 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన యాంట్ఫిన్ హోల్డింగ్స్ రూ. 4,704 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నాయి. -
నవంబర్ 8 నుంచి పేటీఎం ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్తో పాటు సాఫ్ట్బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది. కానీ తాజాగా ప్రస్తుత షేర్హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్బ్యాంక్, ఇతర షేర్హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్బ్యాంక్ పేరు లేదు. స్విస్ రీఇన్సూరెన్స్కి వాటాలు.. పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు. -
పేటీఎమ్ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ను పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోప్యత పాటించే షరతుతో అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్ ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో ద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ భావిస్తోంది. వెరసి దేశీ ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఇష్యూగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2010లో పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా రూ. 15,200 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డ్ సాధించింది. కాగా.. వేగవంత లిస్టింగ్కు వీలుగా ఐపీవోకు ముందు నిర్వహించే(ప్రీఐపీవో) షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకునే యోచనలో పేటీఎమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విలువ నిర్ధారణలో వ్యత్యాసాలు ఇందుకు కారణంకాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 1.47–1.78 లక్షల కోట్ల విలువను పీటీఎమ్ ఆశిస్తోంది. యూఎస్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న విలువ మదింపు నిపుణులు అశ్వథ్ దామోదరన్ తాజాగా పేటీఎమ్ అన్లిస్టెడ్ షేర్లకు ఒక్కొక్కటీ రూ. 2,950 చొప్పున విలువను అంచనా వేయడం గమనార్హం! పబ్లిక్ ఇష్యూలో భాగంగా పేటీఎమ్ రూ. 8,300 కోట్ల విలువైన తాజా ఈక్వి టీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. -
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా... జర భద్రం
మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్ల ద్వారా క్యాష్ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా మీరు నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. కుమారి (పేరు మార్చడమైనది) టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. ‘మేడమ్, మీరు ఆన్లైన్ షాపింగ్లో ఫోన్ కొనుగోలు చేశారు కదా! మీకు రూ.4,999 క్యాష్బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఆ మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే నేను చెప్పే పద్ధతులను జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఈ మొత్తం మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది’ అని చెప్పింది అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ పే ద్వారా ఫోన్లో అవతలి వ్యక్తి చెబుతున్న విధంగా వివరాలను జాగ్రత్తగా పొందుపరిచింది కుమారి. ‘మీ బ్యాంక్లో నగదు జమ అయింది. చెక్ చేసుకోండి మేడమ్, థాంక్యూ’ అని ఫోన్ కట్ అయింది. పే యాప్లో చెక్ చేసుకుంది కుమారి. క్రెడిట్ అవ్వాల్సిన నగదు కాస్తా డెబిట్ అయ్యింది. తన అకౌంట్లో నుంచి నగదు తగ్గిపోయి, వేరేవాళ్ల అకౌంట్లోకి వెళ్లినట్టుగా యాప్ హిస్టరీలో ఉండటంతో షాక్ అయ్యింది కుమారి. స్మూత్గా కొల్లగొడతారు వేల రూపాయలే కాదు లక్షల్లోనూ డబ్బును యాప్ల ద్వారా కొల్లగొట్టే ఉపాయాలు పన్నుతున్నారు మోసగాళ్లు. ఫోన్ మాట్లాడుతూనే క్రెడిట్ చేస్తామని చెప్పిన నగదు మొత్తాన్ని, మన అకౌంట్ నుంచి మన చేత్తోనే డెబిట్ చేసుకుంటారు. పూర్తిగా వారి మాటలతో మనల్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిలువునా ముంచేస్తారు. బోనస్ పాయింట్లు వచ్చాయనో, లాటరీ తగిలిందనో, స్క్రాచ్ కార్డులో క్యాష్బ్యాక్ వచ్చిందనో, బ్యాంక్ మేనేజర్ అనో .. ఇలా ఈ కామర్స్ ఫ్రాడ్స్కి తెరలేపుతారు. అకౌంట్లో ఉన్న నగదును దోచేస్తారు. పద్ధతిగా మోసం మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు బుక్ చేశారనుకోండి. ఆ వస్తువు డెలివరీ అయిన అరగంటలో మీకో ఫోన్ కాల్ వస్తుంది. అంటే, రకరకాల మార్గాల ద్వారా మీ ఫోన్ నెంబర్ను హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. మీ వివరాలన్నీ తెలియజేస్తూ, వాటి పనితనం గురించి చెబుతూ తిరిగి సర్వీస్ అందించాలంటే ఫలానా ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతారు. ఆ ‘కబుర్ల’ను నమ్మి ఫోన్ చేస్తే, బ్యాంకు వివరాలన్నీ రాబట్టడానికి ఎన్ని పద్ధతులు అవలంబించాలో అన్నీ అమలులో పెట్టేస్తారు. సులభమైన మార్గాలు డిజిటల్ లావాదేవీలు జీవితాన్ని సులభతరం చేశాయి. UPI ఇటీవలి కాలంలో ఎంచుకున్న సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీ ఆర్థిక లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మీకు కావలసిందల్లా కేవలం 4 అంకెల పిన్, మొత్తం బదిలీ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాదాపు అన్నిUPI యాప్లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ సాంకేతికంగా సురక్షితమైనవి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్,ఐఎమ్ క్లోన్..ఇతరత్రా మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి మోసగాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తుంటారు. ఇ–మోసగాళ్లకు సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉండటం వల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. కబుర్లతో వల మోసగాళ్లు సాధారణంగా ఇతరులను ఆకర్షించడానికి రకరకాల టార్గెట్లను ఎంచుకుంటారు. వాటిలో.. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు, కెవైసీ అప్డేట్ చేస్తున్నామని, బోనస్ పాయింట్లు వచ్చాయని, క్యాష్ బ్యాక్లను రిడీమ్ చేస్తున్నామని.. వంటి వాటిని ఫోన్ కాల్ రూపంలో మనతో మాట్లాడుతారు. స్క్రీన్ షేరింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటారు. స్కామర్లు మన ఫోన్కి వచ్చిన OTPని అడగచ్చు. కోడ్ చెప్పిన తర్వాత వారి ఫోన్ నుండే అనుమతిని ఓకే చేయమని కూడా అడగచ్చు. యాప్కు అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ మన ఫోన్ని మనకే తెలియకుండా పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తాడు. పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్ పాస్వర్డ్లను దొంగిలించి, UPI ఖాతాతో లావాదేవీని ప్రారంభిస్తాడు. అకౌంట్లో ఉన్న మోత్తాన్ని ఖాళీ చేస్తాడు. సురక్షిత చెల్లింపులకు http: // ప్యాడ్ లాక్ సింబల్తో ఉన్న URL లింక్లను క్లిక్ చేయడం సురక్షితం. కొనుగోలుదారు లేదా విక్రేతకు OTP/ MPIN/UPI నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా షార్ట్ లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను అస్సలు పూరించవద్దు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. మీరు స్కాన్ చేస్తున్న సమయంలోనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు అంటే స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ మొదలైన వాటిని స్మార్ట్ఫోన్ లలో ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి.మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం గూగుల్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వెతకవద్దు. -
పండుగ సీజన్ మార్కెటింగ్కు రూ.100 కోట్లు: పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్లో ప్రచార కార్యక్రమాల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. క్యాష్బ్యాక్ ఆఫర్లు, యూపీఐపరమైన ప్రోత్సాహకాలు, ’బై నౌ, పే లేటర్ (ఇప్పుడు కొనుక్కోండి, తర్వాత కట్టండి)’ వంటి ఆఫర్లు మొదలైన వాటికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 14 దాకా ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతూ ’పేటీఎం క్యాష్బ్యాక్ ధమాకా’ ఆఫర్ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ‘పండుగ సీజన్ డిమాండ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రోజు 10 మంది లక్కీ విన్నర్లు తలో రూ. 1 లక్ష గెల్చుకోవచ్చు. అలాగే 10,000 మంది విజేతలు రూ. 100 క్యాష్బ్యాక్, మరో 10,000 మంది యూజర్లు రూ. 50 క్యాష్బ్యాక్ అందుకోవచ్చు. ఇక దీపావళి దగ్గరపడే కొద్దీ (నవంబర్ 1–3) యూజర్లు రోజూ రూ. 10 లక్షల దాకా గెల్చుకోవచ్చు‘ అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్, బ్రాడ్బ్యాండ్ డీటీహెచ్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్, ట్రావెల్ టికెట్ల బుకింగ్, కిరాణా దుకాణాల్లో చెల్లింపులు మొదలైన లావాదేవీలకు క్యాష్బ్యాక్ ఆఫర్లు అందుకోవచ్చు. -
డిజిటల్ వద్దు క్యాషే ముద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాలతో డిజిటల్ చెల్లింపుల విధానాలకు మారినా, ఇప్పటికీ దేశీయంగా ప్రజలు ఎక్కువగా నగదు చెల్లింపుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 (పీఎస్ఎస్)ను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ (వీసీఎల్పీ) ఒక నివేదికలో ఈ అంశాలు పేర్కొంది. భారత్లో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దాదాపు దశాబ్దకాలం క్రితం పేమెంట్స్ వ్యవస్థల నియంత్రణ కోసం పీఎస్ఎస్ చట్టం చేశారని నివేదిక తెలిపింది. మారుతున్న పరిస్థితులను బట్టి నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ మధ్యమధ్యలో పలు మార్గదర్శకాలు చేస్తున్నప్పటికీ, ఇవి సరిపోవని వివరించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు, దీనికి సంబంధించిన చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని వీసీఎల్పీ తెలిపింది. -
Digital Payments: నెట్ లేకున్నా పేమెంట్ ఎలా చేస్తారో తెలుసా?
టీ కొట్టు, హోటల్, రెస్టారెంట్, కిరాణ షాప్, మార్ట్లు, మెడికల్ షాప్, దుస్తుల షోరూం, క్యాబ్లు ఇలా ఏ సేవల్ని ఉపయోగించుకున్నా .. పది రూపాయలలోపు నుంచి వేల రూపాయల దాకా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నాం. ఇక కార్డుల స్వైపింగ్ సంగతి సరేసరి. ఇంటర్నెట్ లేదంటే వైఫై సౌకర్యం ద్వారా ఈ చెల్లింపులు చేస్తున్నాం కదా. క్యాష్లెస్ ట్రాన్జాక్షన్స్ను ప్రొత్సహించడం కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రణాళికే ఇదంతా. మరి అసలు ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ చెల్లింపులు జరిపితే ఎలా ఉంటుంది!? ఇంటర్నెట్ లేకున్నా, ఆఫ్లైన్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొదలుపెట్టింది. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఆఫ్లైన్ రిటైల్ డిజిటల్ పేమెంట్ పద్దతిని అమలు చేసి పరిశీలించింది కూడా. ఈ ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు షురూ చేసింది. చెల్లింపులు ఎలాగంటే.. ఆఫ్లైన్ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్టెక్ సంస్థలు ప్రత్యేక కార్డు లేదంటే టోకెన్లు ఇస్తాయి. ఒకరకంగా ఇవి డెబిట్ కార్డులాంటివే. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా చెల్లింపును పూర్తి చేయొచ్చు. మామూలుగా అయితే పీవోఎస్ యంత్రానికీ నెట్ అవసరం. కానీ, ఈ ప్రత్యేక పీవోఎస్ మెషిన్కు చెల్లింపుల టైంలో ఇంటర్నెట్తో పని లేదు. ఓటీపీ లేదంటే ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ద్వారా చెల్లింపు చేయొచ్చు. కాకపోతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. అంతేకాదు.. వాయిస్ బేస్డ్ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్ ద్వారా సూచనలు ఇచ్చి కూడా చెల్లింపులను పూర్తి చేయొచ్చు. అయితే వాలెట్లు, కార్డులు, మొబైల్ డివైస్లు, యూపీఐ పేమెంట్స్(ఫోన్ పే, గూగుల్ పే..)తోనూ ఈ తరహా చెల్లింపులు సాధ్యమవుతుందని చెప్తున్నారు క్యాష్ప్రీ పేమెంట్స్ కో ఫౌండర్ రీజు దత్తా. అసలు కారణం.. నెట్వర్క్ సరిగ్గా లేకపోతే డిజిటల్ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ఆఫ్లైన్ విధానం తీసుకురాబోతున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే.. ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ.. గ్రామీణ ప్రాంతాల్లో, నిరక్షరాస్యులకు, వయసు పైబడిన వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ ఆఫ్లైన్ చెల్లింపుల ప్రక్రియ ద్వారా వాళ్లకు ఊరట లభించనుంది. అంతేకాదు ఫిన్టెక్ సంస్థలకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేయడంతో పాటు, యంత్రాలను తయారు చేయడం, వాటిని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండని గ్రామీణ ప్రాంతాలకు.. కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో అందించేందుకు వీలు ఉంటుంది. ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఫిన్టెక్ సంస్థలకు సరికొత్త వ్యాపారావకాశాలను సృష్టించే వీలుంది. జాగ్రత్త అవసరమే.. ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆఫ్లైన్ కార్డులతో ఆ రిస్క్ తక్కువ. అయినప్పటికీ మరింత అప్రమత్తత అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే, చెల్లింపులకు జియోట్యాగింగ్ చేయడంలాంటి వాటివల్ల వీటికి అడ్డుకట్ట వేసే వీలుందని అంటున్నారు. సాధ్యమేనా? ఇదేం కొత్త విధానం కాదు. ఇంటర్నెట్ అవసరం లేకుండా నగదు బదిలీ సేవలు దాదాపు దశాబ్దం కిందే ఉండేవి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్మార్ట్ ఫోన్లు అంతగా వాడకంలో లేనిటైంలో అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీసెస్ డేటా (యూఎస్ఎస్డీ)తో పనిచేసే *99H కు ఫోన్ చేయడం ద్వారా, సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్ఎంఎస్) బ్యాంకు లావాదేవీలను నిర్వహించే వీలును తీసుకొచ్చింది. యూఎస్ఎస్డీ ద్వారా బ్యాంకు ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ చేయడం నిర్వహించుకోవచ్చు. ఇందుకు నెట్ అవసరం లేదు. కాబట్టి, ఆఫ్లైన్లో నగదు చెల్లింపు లావాదేవీలు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నమొత్తం చెల్లింపులను సులభంగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆర్బీఐ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్ ఇన్షియేటివ్లో మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ జరిగింది. చదవండి: కార్డు చెల్లింపులు.. కొత్త రూల్స్ గుర్తున్నాయా?.. ఇవే! -
మద్యంపై ఎవరెంత ఖర్చుపెడితే మీకెందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని మద్యం షాపుల్లో త్వరలో డిజిటల్ రూపంలో చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నామని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) గురువారం హైకోర్టుకు నివేదించింది. దసరా నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది పి.నరసింహమూర్తి కోర్టుకు వివరించారు. బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఆన్లైన్/డిజిటల్ రూపంలో చెల్లింపులను ఆమోదించడం లేదని, అన్నిచోట్లా డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దసరా నాటికి డిజిటల్ చెల్లింపులు.. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. ఏపీబీసీఎల్ న్యాయవాది దసరా కల్లా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ స్పందిస్తూ.. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానించడం ఏమిటంటూ ప్రశ్నించింది. మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని.. వారు రోజూ రూ.200–రూ.300 వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ చెప్పారు. మద్యంపై ఎవరెంత ఖర్చు పెడుతున్నారు.. ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్కెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ నిలదీసింది. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగిచూస్తున్నారని ప్రశ్నించింది. అందరి సమాచారం అడుగుతున్నారు.. మరి పిటిషనర్ ఏం చేస్తుంటారని ప్రశ్నించింది. దీనికి ప్రవీణ్ సమాధానం చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పడానికి ఇష్టపడరు.. మిగి లిన వారి గురించి మాత్రం మీకు అన్నీ కావాలా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘ఆ ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేశాం’ ఇద్దరు వ్యక్తులను నిర్బంధించి కొట్టిన వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐని సస్పెండ్ చేశామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గురువారం హైకోర్టుకు నివేదించారు. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల ఒంటిపై గాయాలున్నాయన్న వైద్యుల నివేదికను పరిశీలించాక తగిన విధంగా స్పందిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైద్యుల నివేదికను ఏజీకి అందచేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.రాజారెడ్డి చెప్పడంతో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన భర్త కంచర్ల నవీన్బాబు, అతని స్నేహితుడు అశోక్ బాబులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ గుంటూరు జిల్లా, తోకలవానిపాలెంకు చెందిన షేక్ అక్తర్ రోషన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఈ వ్యాజ్యంపై గురువారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో నవీన్బాబు, అశోక్ బాబులకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వైద్య పరీక్షల నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదకను పరిశీలించిన ధర్మాసనం ఇద్దరి ఒంటిపై గాయాలున్నట్లు తెలిపింది. పాదాలపై కొట్టడం ఇక్కడమేన్నా ఆచారంగా వస్తోందా? అంటూ వ్యాఖ్యానించింది. అలాంటిది ఏమీ లేదని ఏజీ చెప్పారు. ‘ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో సరికాదు’ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన జడా రవీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి ఫొటో ముద్రణపై ఉన్న అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిటిషనర్ను ఆదేశించింది. ఆ అభ్యంతరాలపై అధికారులు ఆరు వారాల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ముందుకు అధికారులు కోర్టు ధిక్కార కేసులో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుకు చెందిన ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ పాఠశాలల యజమాన్యాల సంఘంతోపాటు మరికొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో బి.రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, మరికొందరు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం కోర్టు ముందు హాజరయ్యారు. ఆత్మహత్యలొద్దు.. న్యాయం చేస్తాం: కాంట్రాక్టర్లకు హైకోర్టు విజ్ఞప్తి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవద్దని కాంట్రాక్టర్లకు హైకోర్టు గురువారం విజ్ఞప్తి చేసింది. అసహనం, ఆగ్రహం, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని హితవు పలికింది. కొంత ఆలస్యమైనా న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపింది. అధికారుల చర్యల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికే న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాలపై ఆయన కొద్ది వారాలుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలపై ఆయన మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. బిల్లులు అందక అనంతపురం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. -
సురక్షిత డిజిటల్ విధానాలు రూపొందించాలి - బ్రిక్స్ నివేదిక
ముంబై: సంబంధిత వర్గాల నమ్మకం చూరగొనేలా, సభ్య దేశాల్లో అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చేలా సురక్షితమైన డిజిటల్ వ్యవస్థాను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ కూటమి ఒక నివేదికలో పేర్కొంది. బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండో సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ పలు నివేదికలను ఆవిష్కరించింది. వీటిని బ్రిక్స్ సభ్య దేశాల సెంట్రల్ బ్యాంకులు రూపొందించాయి. బ్రిక్స్ దేశాల్లో డిజిటల్ ఆర్థిక సేవల పరిధి విస్తరణ (డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్–డీఎఫ్ఐ) నివేదికను ఆర్బీఐ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. కోవిడ్–19 మహమ్మారి రాకతో డీఎఫ్ఐపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం పెరిగిందని నివేదిక వివరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ సైబర్ దాడులు, ఆన్లైన్ మోసాలు వంటి సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్గా వ్యవహరిస్తున్నారు. చదవండి: Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో -
డిజిటల్ చెల్లింపుల్లో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘డిజిటల్ చెల్లింపు’లు చేసే వారి సంఖ్య విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 44 శాతం జనాభా ‘డిజిటల్ పేమెంట్స్’ద్వారా తమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ మాధ్యమాల ద్వారా అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రధానంగా నగదు లావాదేవీలు జరిపే సంప్రదాయ దేశంగా ఉన్న భారత్లో గత కొన్నేళ్లలో నగదు వినియోగం తగ్గించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఐయితే 2016లో విభిన్న అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావితం చేయడంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా ఊపందుకోవడం మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో పాటు హైస్పీడ్ డేటా రావడంతో వీటి వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభు త్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తో పాటు, గత ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, జనజీవనాన్ని అస్తవ్య స్తం చేసిన ‘కోవిడ్ మహమ్మారి’పరిణామాలతో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ జెట్స్పీడ్ను అందుకున్నాయి. ఇదీ అధ్యయనం... ఐదేళ్ల కాలంలో తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలు, ఇతర అంశాలపై తాజాగా విడుదలైన ఫోన్పే పల్స్ ‘బీట్ ఆఫ్ ద ప్రోగ్రెస్’నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఈ ఏడాది జులైలో 324 కోట్ల లావాదేవీలతో ›ప్రపంచస్థాయిలోనే రికార్డ్ను సృష్టించింది. ఇప్పటిదాకా యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా (గత జూలై ఆఖరుకు) రూ.6,06,281 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఫోన్పే ద్వారా జరిపిన 2,240 కోట్ల లావాదేవీలను ప్రాంతాలు, కస్టమర్ల నివాస ప్రాంతాలు, కేటగిరీ తదితరాలను విశ్లేషించారు. దీంతోపాటు డిజిటల్ పేమెంట్స్, వాటి వల్ల తమ జీవితంపై ప్ర«భావం, తదితర అంశాలపై వ్యాపారులు, వినియోగదారులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా, అధ్యయన నివేదికలు, వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు, విశ్లేషణలు, డేటాబేస్ తదితర అంశాలన్నింటినీ విశ్లేషించి దేశంలో డిజిటల్ చెల్లింపుల తీరుతెన్నులపై ‘పల్స్’నివేదికను రూపొందించారు. -
UPI Payments: ఆగస్టులో ఎంతమంది ఉపయోగించారంటే..
కరోనా కారణంగా డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్లైన్ పేమెంట్లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో అన్ని పేమెంట్ యాప్ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. యూపీఐ సంబంధిత లావాదేవీలు రికార్డు లెవెల్ను చేరుకున్నాయి. ఒక్క ఆగష్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల విలువైన చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు నెలలో సుమారు 3.5 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ యూపీఐ యాప్ చెల్లింపుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా కిందటి నెలతో పోలిస్తే ట్రాన్జాక్షన్స్ రేటు 9.5 శాతం పెరగ్గా.. ట్రాన్జాక్షన్స్ విలువ 5.4 శాతం పెరిగింది. ►ఏప్రిల్ మే నెల మధ్య సెకండ్ వేవ్ ప్రభావంతో కొంతవరకు తగ్గినా.. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇక యూపీఐ మోడ్లో చెల్లింపులు జులైలో 3.24 బిలియన్ ట్రాన్జాక్షన్స్(జూన్తో పోలిస్తే 15.7 శాతం) జరగ్గా.. ఆగష్టులో అది మరింత పెరిగింది. 2016లో మొదలైన యూపీఐ సర్వీస్ చెల్లింపులు.. కరోనా కారణంగా పుంజుకున్నాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే(వాల్మార్ట్), గూగుల్పే(గూగుల్) ఆ తర్వాత పేటీఎం, అమెజాన్ పే.. డిజిటల్ మార్కెట్లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాయి. ►యూపీఐతో పాటు ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ద్వారా ఆగష్టులో 377.94 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరిగాయని, జులైతో పోలిస్తే అది 8.5 శాతం పెరుగుదలగా ఉందని, ట్రాన్జాక్షన్స్ విలువ 3.18 ట్రిలియన్ రూపాయలుగా పేర్కొంది. ►ఎన్పీసీఐ డెవలప్ చేసిన ఫాస్ట్ట్యాగ్(టోల్ కలెక్షన్ కోసం రూపొందించిన ప్రోగ్రాం).. ద్వారా ఆగష్టులో 201.2 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. విలువ మూడువేల కోట్ల రూపాయలుగా ఉంది. అదే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 58.88 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. వాటి విలువ పది వేల కోట్లకుపైనే ఉంది. చదవండి: అకౌంట్ లేకుండానే ఫిక్స్డ్ డిపాజిట్! -
Digital Loan: రంగంలోకి టెక్ కంపెనీలు
India Digital Loan Market: కరోనా టైం నుంచి దేశంలో ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇండియా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్పై టెక్ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సుమారు ఒక ట్రిలియన్ డాలర్లతో డిజిటల్ లోన్ మార్కెట్ను విస్తరించాలని ప్రణాళిక వేసుకుంటున్నాయి. ఫేస్బుక్, షావోమీ, అమెజాన్, గూగుల్.. టెక దిగ్గజాలు ఇప్పుడు భారత దేశంలోని డిజిటల్ లోన్ మార్కెట్ మీద కన్నేశాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. షావోమి ఇండియా హెడ్ మనూ జైన్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ ప్రొడక్టులు ఇందుకోసం దేశంలోని రుణదాతల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారాయన. ఇది వరకే చిరు వ్యాపారులు, స్టార్టప్లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. స్టార్టప్లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ప్రక్రియలో తలమునకలైంది. గూగుల్ కూడా చిన్నస్థాయి రుణదాతలతో ఒప్పందాలు ఇదివరకే చేసుకుంది. గూగుల్ పే ద్వారా డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ నిర్వాహణను ప్రారంభించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ కూడా ఆన్లైన్ రుణదాతల్ని రెగ్యులేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. చదవండి: డిపాజిటర్లకు మరింత రక్షణ -
కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే!
చెన్నై: కరోనా వైరస్ మహమ్మారిపరమైన అనిశ్చితితో కొనుగోలుదారుల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కటింగ్లు వంటి పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని చేతిలో ఉన్న డబ్బును కొనుగోళ్లకు ఖర్చు చేయకుండా, దాచిపెట్టుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. నగదు పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానాల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫ్రిజ్లు, టీవీలు, ఫోన్లు మొదలుకుని ద్విచక్ర వాహనాలు దాకా అన్నీ ఈఎంఐల్లో లేదా ’బై నౌ పే లేటర్’ (ముందు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం–బీఎన్పీఎల్) మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీఎన్పీఎల్ స్కీములకు ఆదరణ పెరుగుతోంది. చదవండి: పసిడి బాండ్ ధర @ రూ. 4,732 డిజిటల్ చెల్లింపుల సంస్థ ఈజీట్యాప్ ద్వారా జరిగే ఈఎంఐ లావాదేవీల పరిమాణం గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 220 శాతం వృద్ధి చెందడం ఇందుకు నిదర్శనం. ‘‘క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాయింట్ ఆఫ్ సేల్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా కూడా ఈఎంఐలను ప్రాసెస్ చేసే సౌలభ్యం ఉండటం .. అలాగే యువతలో బీఎన్పీఎల్ స్కీములకు పెరుగుతున్న ప్రాధాన్యత తదితర అంశాలు నెలవారీ వాయిదాల మార్గంలో కొనుగోళ్లు జరగడానికి దోహదపడుతున్నాయి’’ అని ఈజీట్యాబ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ భాస్కర్ చటర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా పలు బీఎన్పీఎల్ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తమ యాప్లో పే–లేటర్ సర్వీసులను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తమ అనుబంధ సంస్థ ఫ్రీచార్జి ద్వారా కొత్త కస్టమర్ల కోసం బీఎన్పీఎల్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ లావాదేవీల జోరు.. కరోనా వైరస్ కట్టడి కోసం తొలిసారి లాక్డౌన్ అమలు చేసిన 250 రోజులతో పోలిస్తే (2020 మార్చి 25 నుంచి నవంబర్ 29 మధ్యకాలం), తర్వాతి 250 రోజుల్లో (2020 నవంబర్ 30 నుంచి 2021 ఆగస్టు 6 వరకూ) డిజిటల్ లావాదేవీలు ఏకంగా 80 శాతం పెరిగాయని ఫిన్టెక్ సంస్థ రేజర్పే వెల్లడించింది. వ్యాపార సంస్థలు ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చే కొద్దీ డిజిటల్ లావాదేవీల పరిమాణం సదరు 500 రోజుల్లో గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. పే లేటర్, కార్డురహిత ఈఎంఐలు వంటి కొత్త విధానాల వినియోగం కూడా పెరిగినట్లు పేర్కొంది. పే లేటర్ లావాదేవీలు 220 శాతం, కార్డురహిత ఈఎంఐ లావాదేవీలు 207 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. చౌకైన చెల్లింపు విధానాలకు కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని రేజర్పే తెలిపింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డిజిటల్ చెల్లింపుల గణాంకాల ప్రకారం.. తరచుగా జరిగే డెబిట్ లావాదేవీలు (ఈఎంఐలు, బీమా ప్రీమియం మొదలైనవి) 4.13 కోట్ల నుంచి 5.77 కోట్లకు పెరిగాయి. విలువపరంగా చూస్తే రూ. 35,351 కోట్ల నుంచి రూ. 61,303 కోట్లకు ఎగిశాయి. ‘‘కోవిడ్ కారణంగా దాదాపు అందరి ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం పడింది. దీంతో చాలా మంది వీలైనంత ఎక్కువగా డబ్బు చేతిలో ఉంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, ఈఎంఐల వైపు మొగ్గుచూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి’’ అని మొబైల్ ఆధారిత ఇన్స్టంట్ క్రెడిట్ కార్డుల సంస్థ గెలాక్సీకార్డ్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ తెలిపారు. చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. -
డిజిటల్ చెల్లింపులో సరికొత్త ఒరవడిని సృష్టించనున్న ఇండియన్ స్టార్టప్..!
బెంగళూరు: డిజిటల్ పేమెంట్లు, యూపీఐల రాకతో పూర్తిగా వ్యాపార లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్లు ప్రజల నిత్యజీవితంలో ఒక భాగమైపోయాయి. చిన్న పాన్ డబ్బా నుంచి సూపర్ మార్కెట్ల వరకు డిజిటల్ పేమెంట్లను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా ఎక్కువగా యూపీఐ, డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు. గూగుల్ పే, ఫోన్పే, పేటియం, యోనో,వంటి యాప్లను ఉపయోగించి చెల్లింపులను జరుపుతున్నారు. ఈ యాప్లతో నగదు బదిలీ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కావాల్సిందే. (చదవండి: Google: గూగుల్కు మరోసారి భారీ షాక్...!) డిజిటల్ చెల్లింపులు గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం థర్డ్పార్టీ యాప్స్ల జోక్యం తగ్గించడం కోసం తాజాగా ఈ-రూపీని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ-రూపీ తో ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు జరిపే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ లేకుండా నగదు చెల్లింపుల వ్యవస్థపై బెంగళూరుకు చెందిన స్టార్టప్ టోన్టాగ్ కూడా పనిచేస్తోంది. డిజిటల్ చెల్లింపుల విధానంలో సరికొత్త ఒరవడిని టోన్టాగ్ సృష్టించనుంది. ప్రత్యేకమైన సౌండ్ వేవ్ టెక్నాలజీనుపయోగించి డిజిటల్ పేమెంట్లు జరిగేలా టోన్టాగ్ పనిచేస్తోంది. పలు మార్కెట్స్లో, షాపింగ్ మాల్స్లో చెల్లింపులు జరిపే సమయాన్ని సుమారు 22 సెకండ్లకు కుదించింది. అంతేకాకుండా షాపింగ్మాల్స్లో, సూపర్మార్కెట్లలో పిక్ అండ్ గో షాపింగ్ అనుభూతిని టోన్ట్యాగ్ అందిస్తోంది. టోన్ ట్యాగ్ తన చెల్లింపు నెట్వర్క్ భాగంగా 5 లక్షల మంది వ్యాపారులను, తన బ్యాంకింగ్ భాగస్వామి నెట్వర్క్ ద్వారా 14 లక్షల మంది వ్యాపారులను ఆన్బోర్డ్ చేసింది. టోన్ట్యాగ్ ఇప్పటివరకు 4,500 స్మార్ట్ స్టోర్లను ప్రారంభించింది. టోన్టాగ్ స్టార్టప్కు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఫండ్ చేసింది. అంతేకాకుండా మాస్టర్కార్డు, రిలయన్స్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా టోన్టాగ్ స్టార్టప్కు నిధులను సమకూర్చాయి. (చదవండి: WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్లో కనిపించకుండా చేయవచ్చు.!) -
ఇ–రూపీ వచ్చేసింది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చిం ది. వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ను సోమవారమిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘ఇ–రూపీ ద్వారా డిజిటల్ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది‘ అని ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. లీకేజీలకు అడ్డుకట్ట... ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా (లీకేజీ) రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్ వోచర్ అనేది సుపరిపాలన విజన్ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. ఇది ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేటు సంస్థలు లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు, విద్య లేదా ఇతరత్రా ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఇ–రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధాని వివరించారు. దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు. ప్రైవేటు రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు ఈ డిజిటల్ వోచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్, రేషన్ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో డీబీటీ ఎంతగా ఉపయోగపడిందనేది ప్రధాని వివరిస్తూ... జామ్ (జన్ధన్ ఖాతా, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు)తో డిజిటల్ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ దీని కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. డీబీటీ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ‘వంట గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్ యోజన, స్కాలర్షిప్లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ డీబీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయింది’ అని చెప్పారు. సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారత్ కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు. -
ఈ-రూపీని ప్రారంభించిన మోదీ
e-RUPI Launch సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగదు రహిత లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని మరింత ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ-రూపీ((E-RUPI))ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా దీనిని ప్రారంభించారు మోదీ. భారత్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ-రూపీ అంటే.. డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-రూపీని తీసుకొచ్చారు. సేఫ్, సెక్యూర్ ఆధారంగా ఈ-రూపీ వినియోగం ఉండనుంది. ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లను లబ్ధిదారుడికి పంపడం ద్వారా చెల్లింపులు జరుగుతాయి. బ్యాంక్ ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా వినియోగదారుడు లావాదేవీలు జరుపవచ్చు. దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే కార్డు, పేమెంట్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ-రూపీ అంటే ఏమిటి.. ఎలా ఉపయోగించాలి?
e-RUPI: నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా రేపు(ఆగస్టు 2) ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థ(E-RUPI)ను ప్రవేశపెట్టనుంది. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ-రూపీ వోచర్లను ఎలా ఉపయోగించాలి? ఈ వోచర్లు ఇ-గిఫ్ట్ కార్డులు వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కార్డుల కోడ్ ని ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పంచుకోవచ్చు. ఉదాహరణకు, కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు మీరు ఈ-రూపీ వోచర్లను తీసుకున్నట్లయితే వాటిని కేవలం వ్యాక్సిన్ల కొరకు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఇతర పేమెంట్స్ కంటే ఈ-రూపీ ఎందుకు భిన్నం? ఈ-రూపీ అనేది ఎలాంటి ఫ్లాట్ ఫారం కాదు. ఇది నిర్ధిష్ట సేవల కొరకు ఉద్దేశించబడిన వోచర్. ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులోని ప్రధాన తేడా. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి. కార్పొరేట్లు తమ ఉద్యోగుల కొరకు ఈ వోచర్లను జారీ చేయవచ్చు. వ్యాక్సిన్ ఈ-వోచర్ కోసం ఒక ఆప్షన్ తీసుకువస్తామని కేంద్రం ఇంతకు ముందు తెలిపింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం ఈ-వోచర్ కొనుగోలు చేయవచ్చు, అలాగే మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. ఎలా రీడీమ్ చేసుకోవాలి? వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. -
ఇక ఫోన్పే, గూగుల్ పేతో పనిలేకుండానే ఈ-ట్రాన్జాక్షన్స్!
e-RUPI: ఫోన్పే, గూగుల్ పే, డెబిట్కార్డ్, క్రెడిట్ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది. ఎలాగంటే.. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తొలిదశలో వీళ్లకే? ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం. క్లారిటీ రేపే! ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని లాంఛ్ చేయనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్కి క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలిసేది రేపే!. -
ఆ విషయంలో అమెరికా, చైనాను దాటేసిన భారత్!
చాలా విషయాల్లో చైనాతో పోటీ పడుతున్న భారత్ ఈ సారి ఒక అడుగు ముందుకు వేసి చైనాను, అమెరికాను కూడా అధిగమించేసింది. డిజిటల్ లావాదేవీల పరంగా అమెరికా, చైనాలను భారతదేశం దాటేసింది. దీనికి సంబంధించిన డేటాను ఐటీ మంత్రి అశ్వినీ వైష్నావ్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 2020లో భారత్ 25.4 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసినట్లు వైష్ణవ్ శుక్రవారం ఒక ట్వీట్ లో పోస్ట్ చేశారు. చైనా 15.7 బిలియన్ డిజిటల్ లావాదేవీలతో పోలిస్తే ఇది 1.6 రెట్లు, అమెరికా 1.2 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే 21 రెట్లు ఎక్కువ. పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంత్రి వైష్ణవ్ ట్వీట్ ను చిన్న, చమత్కారమైన శీర్షికతో పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మేలో నీతి ఆయోగ్, మాస్టర్ కార్డ్లు 'కనెక్టెడ్ కామర్స్: సమ్మిళిత డిజిటల్ భారత్ కోసం రోడ్ మ్యాప్ సృష్టించడం' పేరుతో ఒక నివేదికను విడుదల చేశాయి. భారతదేశంలో డిజిటల్ ఆర్థిక చేరికను వేగవంతం చేయడంలో సవాళ్లను ఈ నివేదిక గుర్తించింది. దేశంలోని మొత్తం జనాభాకు డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచడానికి సిఫార్సులను చేసింది. ఎన్ బీఎఫ్ సీ, బ్యాంకులకు మధ్య ఒక పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి చెల్లింపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. 🚀 https://t.co/576X1Q5vEb — Vijay Shekhar Sharma (@vijayshekhar) July 30, 2021 -
వ్యాపారులకు పేటిఎమ్ బంపర్ ఆఫర్.. ఉచితంగా సౌండ్బాక్స్
భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ పేటిఎమ్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఉచితంగా పేటిఎమ్ సౌండ్బాక్స్ సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం ఫర్ బిజినెస్(పీ4బి) యాప్ను ద్వారా 40% తగ్గింపుతో రూ.299కు లభిస్తున్న పేటీఎం సౌండ్బాక్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారులు పేటిఎమ్ ద్వారా ఒక నెలలో 50 కంటే ఎక్కువ లావాదేవీల చేస్తే వ్యాపారులు ప్రతి నెలా 60 రూపాయల క్యాష్బ్యాక్ పొందుతారు. ఇలా మీరు గనుక ఐదు నెలల పాటు 50 కంటే ఎక్కువ లావాదేవీలు పేటీఎం ద్వారా చేస్తే మీకు 300 రూపాయలు క్యాష్బ్యాక్ లభిస్తాయి. ఇలా మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేసే విధంగా ప్రోత్సహించినట్లు అవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు అందుబాటులో ఉంది. వ్యాపారులలో పేటిఎమ్ సౌండ్బాక్స్ అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. నకిలీ స్క్రీన్లు, తప్పుడు నిర్ధారణలను చూపించే కస్టమర్లచే మోసపోకుండా వారిని కాపాడుతుంది. ఈ పరికరం అనేక ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇది వారి మాతృభాషలో లావాదేవీ నిర్ధారణను పొందడానికి సహాయపడుతుంది. -
మీ ఫోన్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..లేకపోతే..!
స్మార్ట్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. పెరుగుతున్న సాంకేతికతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్ఫోన్ అందిస్తోంది. రకరకాల యాప్లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం తక్కువైంది. కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను వాడుతున్నాం. మనలో చాలా మంది ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోండి ! ఒక వేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలు కొట్టేసినా అప్పుడు ఎలా...! సింపుల్గా మరో కొత్త ఫోన్ తీసుకుంటామని అనుకుంటున్నారా..! అయితే మీ బ్యాంకు ఖాతాలోని నగదును మర్చిపోవడం మంచింది. ఔను మీరు చూసింది నిజమే.. తాజాగా స్మార్ట్ఫోన్లను కొట్టేసిన దొంగలు సాంకేతికతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మీ ఫోన్ను బ్లాక్ మార్కెట్ విక్రయించడంతో పాటు, మీ ఫోన్లో ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్లనుంచి నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీ ఫోన్ పోతే వెంటనే ఇలా చేయండి. మొబైల్ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా బ్లాక్ చేయండి. మీ సిమ్ కార్డుతో రిజిస్టర్ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి. మీ నంబర్పై రిజిస్టర్ ఐనా అన్ని మొబైల్ వ్యాలెట్లను బ్లాక్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. -
దూకుడుమీదున్న మార్కెట్లు, ఐపీఓ బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు చూపుతున్న దూకుడు నేపథ్యంలో తాజాగా డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,900 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
Digital Payments: యాప్స్ నుంచి చెల్లిస్తున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం.. పేరు ఏదైనా ఇప్పుడు రియల్ టైం చెల్లింపుల కోసం వినియోగదార్లు తమ స్మార్ట్ఫోన్లో ఏదైనా ఒక పేమెంట్ యాప్ వాడుతున్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్స్ వినియోగం దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీ వంటి లావాదేవీలు క్షణాల్లో పూర్తి కావడం.. కచ్చితత్వం, అదనపు వ్యయాలు లేకపోవడం తదితర ప్రయోజనాలు ఉండడంతో వీటి పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా యూపీఐ యాప్స్ నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. 2020లో రియల్ టైమ్ లావాదేవీల పరిమాణం చైనాలో 1,500 కోట్లు దాటితే.. భారత్ ఏకంగా 2,500 కోట్లు నమోదైందంటే ఎంత వేగంగా కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్య విషయమేమంటే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిమగ్నమైంది. ఇవీ యూపీఐ గణాంకాలు.. దేశంలో యాక్టివ్ యూపీఐ యూజర్లు సుమారు 20 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్యను 2025 నాటికి 50 కోట్లకు చేర్చాలన్నది మొబైల్ పేమెంట్స్ ఫోరం ఆఫ్ ఇండియా లక్ష్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువ రెండేళ్లలో మూడింతలు దాటింది. 2019 మే నెలలో రూ.1,52,449 కోట్ల విలువైన 73.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.4,90,638 కోట్ల విలువైన 253.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 49 పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, 175 బ్యాంకులు, 16 థర్డ్ పార్టీలకు చెందిన యూపీఐ ఆధారిత యాప్స్ భారత్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో థర్డ్ పార్టీ యాప్స్దే హవా. పరిశ్రమలో వీటి వాటా ఏప్రిల్ గ ణాంకాల ప్రకారం ఫోన్పే 45%, గూగుల్ పే 34.3, పేటీఎం 12.14% వాటా దక్కించుకున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం.. యూపీఐ లావాదేవీల మీద సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 2021 ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో పరిమాణం 4.14 శాతం తగ్గి 253.9 కోట్లు, విలువ 0.61% పడిపోయి రూ.4,90,638 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా రూ.5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం 273.2 కోట్లుంది. సున్నా లావాదేవీల నుంచి ఈ స్థాయికి అయిదేళ్లలో రావడం విశేషం. అయితే ప్రభుత్వం 2019 డిసెంబరులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) తొలగిస్తూ లావాదేవీల ఫీజును లేకుండా చేయడంతో దేశంలో యూపీఐ యాప్స్ హవాకు దారి తీసింది. కాగా, ఎండీఆర్ ఎత్తివేయడం వల్ల పేమెంట్ గేట్వే సంస్థల మనుగడపై ప్రభావం చూపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ గతేడాది జూలైలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచిందని, ఉద్యోగాలు కోల్పోతున్నారని, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల విస్తరణ నెమ్మదించిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే యూపీఐ లావాదేవీలపై ఫీజును కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకులకూ మేలు జరుగుతోంది.. డిజిటల్ లావాదేవీలను అన్ని బ్యాంకులూ ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. గతంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకు శాఖలు నెలకొని ఉండేవి. ప్రస్తుతం తదుపరి తరం శాఖలు 1,500 చదరపు అడుగుల లోపుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకానొక దశలో ఏటా 80,000 మందిని నియమించుకున్నాయి. 2020లో ఈ సంఖ్య 5,113 మాత్రమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ కన్వీనర్ బి.ఎస్.రాంబాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 80,000 పైచిలుకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు నేడు 63,000లకు వచ్చి చేరాయని వెల్లడించారు. శాఖల విస్తరణ క్రమంగా తగ్గుతోందని, యూపీఐ యాప్స్ కారణంగా బ్యాంకులకూ మేలు జరుగుతోందని చెప్పారు. -
ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్పే
దుబాయ్: డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ కంపెనీ అయిన భారత్పే మూడేళ్ల కాలం పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు సోమవారం ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 2023 వరకు బ్రాడ్కాస్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై వీరి కలయికను భారత్పే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అభిమానులతో ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ ప్రచారాలను సైతం నిర్వహించనుంది. కాగా, ఈ మూడేళ్ల కాలంలో చాలా ముఖ్యమైన ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తోపాటు పురుషుల టీ20 ప్రపంచకప్(2021, 2022), మహిళల వన్డే ప్రపంచకప్(2022), అండర్-19 ప్రపంచకప్(2022), వుమెన్స్ టీ20 వరల్డ్కప్ (2022), పురుషుల వన్డే ప్రపంచకప్(2023), ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(2023).. ఇలా మూడేళ్లపాటు ఐసీసీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే భారత్పే తన బ్రాండ్ను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. 11 మంది క్రికెటర్లు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సంజు శాంసన్, చహల్, శుభ్మన్ గిల్ భారత్పేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, భారత్పేను అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు 2018లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి దాదాపు 100 నగరాల్లో 60 లక్షల మంది మర్చంట్లు ఉన్నారు. చదవండి: పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు -
10 కోట్లు దాటిన భారత్పే యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ భారత్ పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021-22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని లక్షించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్టెక్ పరిశ్రమలో భారత్పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్పే యూపీఐ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్పే గ్రూప్ అధ్యక్షుడు సుహైల్ సమీర్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. కరోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్షించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్ డాలర్ల టీపీవీ (టోటల్ పేమెంట్స్ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ అలర్ట్! -
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలైతే.. రూ.100 నష్టపరిహారం
ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజు(ఏప్రిల్ 1) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడ్డాయి. బ్యాంకుల మూసివేత కారణంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో చాలా మంది వినియోగదారుల డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఫెయిలయ్యాయి. కొన్ని సందర్భాలలో కస్టమర్ అకౌంట్లలో కట్ అయిన డబ్బులు బెనిఫిషియరీ ఖాతాలో జమ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాన్సక్షన్ ఫెయిల్ అయితే సదురు ఖాతాలో తిరిగి అమౌంట్ రీ ఫండ్ అవ్వాలి. ఒకవేళ అమౌంట్ రీఫండ్ కాకపోతే బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1న చాలా మంది కట్ అయిన డబ్బులు తిరిగి జమ కాలేదు అని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్పీసీఐ వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. “మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఏప్రిల్1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు డౌన్ అయినట్లు పేర్కొంది. తర్వాత సేవలను పునరుద్దరించినట్లు" పేర్కొంది. సెప్టెంబర్20, 2019న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత కాలపరిమితిలో లావాదేవీల పరిష్కారం, డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం వంటివి జరిగితే బ్యాంకు ఆ వినియోగదారుడికి పరిహారం చెల్లించాలి. యూపీఐ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు చెల్లించేవరకు ప్రతిరోజు రూ.100 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. యూపీఐ ట్రాన్సక్షన్ విఫలమై.. కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయితే టీ+1 రోజుల్లో డబ్బులు తిరిగి ఖాతాలో జమచేయాలి. చదవండి: ఈ స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్! -
డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి భాగా విస్తరించడంతో అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చింది. నగదు చెల్లింపుల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి చిన్న వస్తువు కొనడానికి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. దీంతో ప్రతి రోజు లావాదేవీలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. ఇటువంటి సైబర్ నేరగాళ్ల భారిన పడకండా సౌకర్యవంతంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కార్డు వివరాలను సేవ్ చేయకండి మీరు ఆన్లైన్లో కొనుగోళ్లు చేసేటప్పుడు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయకుండా చూసుకోవడం మంచిది. మనలో చాలా మంది ఆన్లైన్లో త్వరగా చెల్లింపులు చేయడానికి వారి వివరాలను సేవ్ చేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల మీ ఆన్లైన్ కొనుగోలు పూర్తైన తర్వాత మీ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువ. అందుకని, మీ ఆన్లైన్ కొనుగోలు తర్వాత కార్డు వివరాలు సేవ్ చేయకపోవడం లేదా క్లియర్ చేయడం మంచిది. లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడండి డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైనది అనుమానాస్పద యాప్లు, వెబ్సైట్లను వాడకపోవడం. యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న విశ్వసనీయ అధికారిక యాప్లను మాత్రమే ఉపయోగించడం మంచిది. అలాగే, ప్రైవేట్/వర్చువల్ బ్రౌజర్లను, HTTPS://తో ప్రారంభమయ్యే సురక్షిత కనక్షన్లను ఎంచుకుని మరింత భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఆన్లైన్ లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడటం మంచిది. దీనివల్ల మీ కార్డు వివరాలు సేవ్ కావు. పాస్వర్డ్లు షేర్ చేయవద్దు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లు ఎల్లప్పుడూ బలంగా ఉంచేలా చూసుకోవడం మంచిది. పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం, సైబర్ దాడులకు గురికాకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పాస్వర్డ్లు మార్చుతూ ఉండాలి. అలాగే, మీ పాస్వర్డ్లు లేదా ఎటిఎం పిన్ వంటి వివరాలను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంకుకు తెలియజేయండి. ఒన్-టైమ్-పాస్వర్డ్(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. పేవరల్డ్ సీఈఓ ప్రవీణ్ దాబాయ్ మాట్లాడుతూ - "సురక్షితమైన లావాదేవీల కోసం విశ్వనీయ వెబ్సైట్లలో మాత్రమే డెబిట్/ క్రెడిట్ కార్డులను ఉపయోగించాలని, ఓటీపీని ఎవరితోనూ పంచుకోకూడదని, వెర్చువల్ కీ బోర్డును మాత్రమే ఉపయోగించాలని, వెబ్సైట్ నుంచి తప్పనిసరిగా లాగవుట్ అవ్వాలి" అని తెలిపారు. పబ్లిక్ కంప్యూటర్లు/వై-ఫై నెట్వర్క్లు వాడొద్దు ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, ఇతర మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ. కావున పబ్లిక్ పరికరాలు లేదా వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అలాగే ధృవీకరించబడిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్సైట్లు ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలకు ఎక్కువ రక్షణను అందిస్తాయి. మోసపూరిత యాప్లతో జాగ్రత్త.. యాప్ స్టోర్, ప్లే స్టోర్లో కూడా చాలా నకిలీ యాప్లు ఉన్నాయి. వీటిని నెగటివ్ రివ్యూలు, తక్కువ సంఖ్యలో డౌన్లోడ్లు, 'ధృవీకరించబడిన' బ్యాడ్జ్ లేకపోవడం ద్వారా గుర్తించవచ్చు. మీరు మీ స్మార్ట్ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో దృవీకరించబడిందా లేదా అని నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్లను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్, ఎస్ఎమ్ఎస్ మొదలైన వాటికి అనుమతి నిరాకరించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
డిజిటల్ లావాదేవీల జోరు!!
ముంబై: రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగే మొత్తం చెల్లింపు లావాదేవీల్లో వీటి వాటా 71.7 శాతానికి చేరనుంది. నగదు, చెక్కులతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాల వాటా 28.3 శాతానికి పరిమితం కానుంది. పేమెంట్ సేవల సంస్థ ఏసీఐ వరల్డ్వైడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020లో 2,550 కోట్ల రియల్ టైమ్ పేమెంట్స్ లావాదేవీలతో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఈ తరహా లావాదేవీల సంఖ్య 1,570 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది మొత్తం చెల్లింపుల్లో ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 15.6 శాతంగాను, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 22.9 శాతంగాను ఉండగా.. పేపర్ ఆధారిత చెల్లింపుల విధానాల వాటా 61.4 శాతంగా నమోదైంది. 2025 నాటికి ఇది పూర్తిగా మారిపోనుందని నివేదిక తెలిపింది. అప్పటికి ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 37.1 శాతం, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 34.6 శాతానికి చేరుతుందని, నగదు ఇతరత్రా పేపర్ ఆధారిత చెల్లింపు విధానాల వాటా 28.3 శాతానికి తగ్గుతుందని వివరించింది. అన్ని వర్గాల మధ్య సమన్వయం.. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యం దిశగా భారత్ వేగంగా ముందుకు సాగేందుకు .. ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు వంటి అన్ని వర్గాల మధ్య సమన్వయం తోడ్పడుతోందని ఏసీఐ వరల్డ్వైడ్ వైస్–ప్రెసిడెంట్ కౌశిక్ రాయ్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వినియోగదారులు, వ్యాపార విధానాలు మారే కొద్దీ పేమెంట్స్ వ్యవస్థలోని బ్యాంకులు, వ్యాపారులు, మధ్యవర్తిత్వ సంస్థలు కూడా తదనుగుణమైన మార్పులు, చేర్పులను వేగంగా చేపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2020లో రియల్ టైమ్ లావాదేవీల నిర్వహణలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, బ్రిటన్ టాప్–5 దేశాల జాబితాలో నిల్చాయి. గతేడాది మొబైల్ వాలెట్ల వినియోగం చారిత్రక గరిష్ట స్థాయి 46 శాతానికి ఎగిసింది. 2018లో ఇది 19 శాతంగాను, 2019లో 40.6 శాతంగాను నమోదైంది. ఎక్కువగా నగదు లావాదేవీలకు ప్రాధాన్యమిచ్చే బ్రెజిల్, మెక్సికో, మలేసియా తదితర దేశాల ప్రజలు వేగంగా మొబైల్ వాలెట్ల వైపు మళ్లినట్లు నివేదిక తెలిపింది. -
భారత్కు రెమిటెన్సుల్లో మహిళలే టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల నుంచి భారత్లోని బంధువులకు, స్నేహితులకు నగదు చెల్లింపుల్లో (రెమిటెన్సులు) మహిళలూ ముందున్నారు. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వరల్డ్రెమిట్ వేదికగా 2015 సెప్టెంబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ నుంచి భారత్కు వచ్చిన రెమిటెన్సుల ప్రకారం.. మొత్తం చెల్లింపుల్లో భారతీయ మహిళలు పంపినవి ఆస్ట్రేలియాలో 18 నుంచి 26 శాతానికి, యూకేలో 21 నుంచి 32 శాతానికి పెరిగాయి. యూఎస్ఏ విషయంలో ఇది 25 నుంచి 24 శాతానికి వచ్చింది. ఆస్ట్రేలియా, యూకేల్లో సేవల రంగం విస్తృతి ఈ పెరుగుదలకు కారణం కావొచ్చు. ఆస్ట్రేలియాలో మొత్తం ఉద్యోగుల్లో సేవల రంగం వాటా అత్యధికంగా 87 శాతం ఉంది. యూఎస్ఏ, యూకే నుంచి భారత్కు నగదు పంపుతున్న మహిళల్లో 35, ఆపైన వయసున్న వారు అధికంగా ఉన్నారు. ఆస్ట్రేలియా విషయంలో 25–30 ఏళ్ల వయసున్న వారు ఎక్కువ. పరిమాణం పరంగా యూఎస్ఏ నుంచి భారత్కు అత్యధికంగా హైదరాబాద్కు చెల్లింపులు జరుగుతున్నాయి. లుధియానా, అమృత్సర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వరల్డ్రెమిట్ దక్షిణాసియా డైరెక్టర్ రుజాన్ అహ్మద్ తెలిపారు. భారత్కు నగదు పంపుతున్న టాప్–10 దేశాల వాటా ఏటా రూ.5.81 లక్షల కోట్లు అని చెప్పారు. అత్యధికంగా నగదును స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు. -
ఫ్లెక్స్పే డిజిటల్ క్రెడిట్ కార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన హైదరాబాద్కు చెందిన వివిఫై ఇండియా ఫైనాన్స్.. ఫ్లెక్స్పే పేరుతో భారత్లో తొలిసారిగా యూపీఐ చెల్లింపుల ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్ తనకున్న క్రెడిట్ లిమిట్ మేరకు ఫ్లెక్స్పే యాప్ ద్వారా దుకాణాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్స్, యూపీఐ ఐడీని స్కాన్ చేసి చెల్లింపులు జరపవచ్చు. లేదా తన బ్యాంకు ఖాతాకు క్రెడిట్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. కస్టమర్ ఆదాయం, గతంలో తీసుకున్న రుణం, చెల్లింపుల తీరు, సిబిల్ స్కోర్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి ఆధారంగా చేసుకుని 15 నిమిషాల్లో డిజిటల్ క్రెడిట్ కార్డ్ రెడీ అవుతుంది. రూ.500 మొదలుకుని రూ.2 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. క్రెడిట్ లిమిట్, వినియోగదారుడినిబట్టి వడ్డీ ఏడాదికి 36 శాతం వరకు వసూలు చేస్తారు. వాడుకున్న మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎలా పనిచేస్తుందంటే.. ఫ్లెక్స్పే యాప్ డౌన్లోడ్ చేసి, పాన్ కార్డ్, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. కంపెనీ ఏజెంట్ వీడియో కాల్ ద్వారా కస్టమర్ను, పత్రాలను ధ్రువీకరించుకుంటారని వివిఫై ఇండియా ఫైనాన్స్ ఫౌండర్ అనిల్ పినపాల బుధవారం తెలిపారు. ‘15 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. 5,000 డేటా పాయింట్ల ఆధారంగా కస్టమర్ అర్హుడా కాదా, ఎంత క్రెడిట్ ఇవ్వాలనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది. నగదు వాడుకున్న కాలానికే వడ్డీ ఉంటుంది. అంటే రెండు రోజుల్లో కూడా వెనక్కి చెల్లించవచ్చు. ఇప్పటికే 30,000 మంది ఫ్లెక్స్పే కస్టమర్లు ఉన్నారు. 2017లో ప్రారంభమైన వివిఫై ఇప్పటి వరకు 60,000 మంది వినియోగదార్లకు రూ.220 కోట్లు రుణంగా ఇచ్చింది’ అని ఆయన వివరించారు. వివిఫై ఫౌండర్ అనిల్ -
భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులను భారీగా ప్రోత్సహిస్తోంది. దీంతో గత ఐదేళ్లలో ఈ డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని ఆర్బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2015 – 2020 మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు 55.1 శాతం చక్రీయ వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. 2016 మార్చి నాటికి 593.61 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు సంఖ్య మార్చి 2020 చివరి నాటికి 3,434.56 కోట్లకు చేరినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. విలువ పరంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు 15.2 శాతం వృద్ధిని సాధించి రూ.920.38 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 కోట్లకు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికగా పరిశీలిస్తే... డిజిటల్ చెల్లింపుల సంఖ్య 2015–16లో 593.61 కోట్లుగా ఉంది. 2016–17 నాటికి 969.12 కోట్లకు చేరింది. చెల్లింపుల విలువ రూ.1,120.99 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2017–18లో డిజిటల్ చెల్లింపుల వ్యాల్యూమ్ వృద్ధి 1,459.01 కోట్లుగా ఉండగా, విలువ రూ.1,369.86 లక్షల కోట్లుగా నమోదైంది. 2018 –19లో చెల్లింపుల సంఖ్య 2,343.40 కోట్లుగా నమోదైంది. చెల్లింపు విలువ రూ.1,638.52 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో లావాదేవీలు పెరిగాయ్... విలువ తగ్గింది ... ఇక 2019–20లో డిజిటల్ చెల్లింపులు వాల్యూమ్స్ 3,434.56 కోట్లుగా నమోదయ్యాయి. అయితే చెల్లింపు విలువ మాత్రం రూ.1,623.05 లక్షల కోట్ల కు పరిమితమైంది. ఆర్థిక వ్యవస్థ క్షీణత, భారీగా ఉద్యోగాలను కోల్పోవడం తదితర అంశాలు ప్రజల వినియోగ సామర్థ్యాన్ని తగ్గించా యి. ఈ ఏడాదిలో ప్రజలు సొమ్ము భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అనుకున్న స్థాయిలో చెల్లింపుల విలువ నమోదుకాలేదని విశ్లేషకులంటున్నారు. విలువ కొంత తగ్గొచ్చు కరోనా అంటువ్యాధి, లాక్డౌన్ పరిమితులు డిజిటల్ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి. అయితే కోవిడ్–19 అంటువ్యాధితో ప్రతి ఒక్కరూ అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో చెల్లింపుల విలువ మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశాబ్దం నుంచి క్రమంగా పెరుగుతూ... పదేళ్ల క్రితం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈసీఎస్ పేమెంట్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ తర్వాత కేంద్రం నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులకు మరింత ప్రాధాన్యత పెరిగింది. యూపీఐ ఆధారిత, యాప్ ఆధారిత చెల్లింపులు.... డిజిటల్ చెల్లింపుల సరిహద్దులను చెరివేశాయి. వీటికి తోడు అనేక సంస్థలు.., బ్యాంకింగ్యేతర కంపెనీలు డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రవేశించడంతో కస్టమర్లు కూడా నగదు చెల్లింపుల నుంచి డిజిటల్ చెల్లింపులకు మారడం జరిగింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి చెల్లింపు వ్యవస్థలలో పదేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆవిష్కరణలు ఇప్పటికీ సురక్షితంగా పనిచేస్తున్నాయి. ఆర్బీఐ కృషి అమోఘం డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువ పెరిగేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. ఈ చెల్లింపుల వ్యవస్థకు పర్యవేక్షక పాత్ర పోషిస్తూ, నియంత్రణాధికారి బాధ్యత వహిస్తూ డిజిటల్ చెల్లింపుల వృద్ధికి కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ‘‘సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి, ప్రోత్సాహం’’ అనే తన విధాన లక్ష్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తోంది. కస్టమర్ల భద్రతే లక్ష్యం.. కస్టమర్ల భద్రత, సౌలభ్యత లక్ష్యంగా డిజిటల్ చెల్లింపుల బాటలో ఆర్బీఐ పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్ పేమెంట్ల పట్ల విశ్వాసం పెంచేందుకు అనేక చర్యలను తీసుకుంది. అందులో భాగంగా గతేడాది(2019) జనవరి నుంచి ఈవీఎం చిప్, పిన్ ఆధారిత క్రెడిట్/డెబిట్ కార్డులను మాత్రమే చెల్లింపులకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టోకనైజేషన్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దేశం దాటి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంది. -
మూతపడుతున్న ఎటిఎమ్లు
-
డిజిటల్ టోకెన్తో చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ వాలెట్ ప్లాట్ఫాం, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయిన గూగుల్ పే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్ టోకెన్తో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్ పే ఆన్డ్రాయిడ్ యూజర్లు ఈ డిజిటల్ టోకెన్తో చెల్లింపులు జరపవచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్తోపాటు ఆన్లైన్ లావాదేవీలూ దీని ఆధారంగా సులువుగా పూర్తి చేయవచ్చని కంపెనీ సోమవారం ప్రకటించింది. 3డీ సెక్యూర్ సైట్స్కు రీడైరెక్ట్ చేయకుండానే ఓటీపీతో ఈ–కామర్స్ లావాదేవీలు జరుపవచ్చు. ప్రస్తుతం యాక్సిస్, ఎస్బీఐ కార్డుదారులు ఈ సేవలు పొందవచ్చు. పెరుగుతున్న కస్టమర్లకు భద్రతతో కూడిన చెల్లింపులకు కట్టుబడి ఉన్నామని గూగుల్ పే బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు. మోసాలకు తావు లేకుండా డిజిటల్ టోకెన్ సాయపడుతుందని, కార్డు వివరాలు ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని అన్నారు. గూగుల్ పే భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు భద్రమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అందించేందుకు వీలైందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. -
పేటీఎంకు గూగుల్ షాక్!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్ దిగ్గజం గూగుల్ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్బ్యాక్’ ఫీచర్ను పేటీఎం తొలగించడంతో యాప్ను సాయంత్రానికి గూగుల్ మళ్లీ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచింది. గూగుల్ నిబంధనలకు అనుగుణంగా క్యాష్బ్యాక్ కింద ఆఫర్ చేస్తున్న స్క్రాచ్ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్ వంటి) కొన్ని ప్లాట్ఫామ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే... ప్లేస్టోర్లో పేటీఎం యాప్ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్లో ఉన్న యాప్ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం .. ప్లే స్టోర్లో కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, యాప్ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. క్రికెట్ లీగ్ తెచ్చిన తంటా.. క్రికెట్ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్బ్యాక్ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్ యాప్లో ఇటీవల ’పేటీఎం క్రికెట్ లీగ్’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్బ్యాక్ పొందవచ్చు. క్యాష్బ్యాక్ భారత్లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ను తొలగించింది‘ అని వివరించారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ తొలగింపు.. క్రీడలపై బెట్టింగ్ చేసే యాప్స్ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ తమ బ్లాగ్లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్ప్లే డెవలపర్ అకౌంట్ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ పేర్కొన్నారు. -
దెబ్బకు జల్సాలకు కళ్లాలు పడ్డాయి..
మార్కెట్ మారింది. జనాల కొనుగోలు ప్రాధాన్యాలూ మారాయి. మహమ్మారి దెబ్బకు జల్సాలకు కళ్లాలు పడ్డాయి. జనాల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. వస్తువులను కొనే ముందు ఆచి తూచి ఆలోచించే ధోరణి పెరిగింది. ‘కరోనా’ విజృంభణతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి అన్లాక్ పరిస్థితి వరకు చూసుకుంటే విపణి ధోరణిలోనూ వినిమయ వైఖరిలోనూ భారీ మార్పులే వచ్చాయి. మహమ్మారి కాలంలో ప్రజల కొనుగోలు తీరుతెన్నులే ఈ మార్పులకు అద్దం పడుతున్నాయి. ‘కరోనా’ వ్యాప్తి మొదలవడంతో ఈ ఏడాది మార్చి చివరివారంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ‘కరోనా’ వైరస్కు మందు లేదని, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే దీనిని నివారించుకోవచ్చని విస్తృతంగా ప్రచారం చేసింది. పత్రికలు, టీవీ చానెళ్లు, వెబ్సైట్లలో పుంఖాను పుంఖాలుగా ‘కరోనా’ కథనాలు వస్తుండటంతో జనాల్లో సహజంగానే భయాందోళనలు వ్యాపించాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న జనాలు ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ‘లాక్డౌన్’ దెబ్బకు చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. చిరువ్యాపారులు చతికిలపడ్డారు. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు కంపెనీల పరిస్థితి కూడా దిగజారడంతో వాటిలో పనిచేసే చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసి, అన్లాక్ ప్రకటించిన తర్వాత ప్రైవేటు కార్యాలయాలు తిరిగి పనిచేయడం మొదలైంది. లాక్డౌన్లో మూతబడ్డ వ్యాపారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చాలావరకు చిన్నా చితకా దుకాణాలు తెరుచుకున్నాయి. మార్కెట్ కార్యకలాపాలు తిరిగి మొదలైనా, లాక్డౌన్ దెబ్బకు ఉపాధి పోగొట్టుకున్న వారిలో చాలామందికి ఇంకెక్కడా ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితులే ఉన్నాయి. పెద్దసంఖ్యలో జనం ఉపాధికి దూరం కావడంతో, జనాల కొనుగోలు శక్తి కూడా గణనీయంగా తగ్గింది. ఫలితంగా అన్లాక్ దశలో దుకాణాలు తిరిగి తెరుచుకున్నా, ఇదివరకటి స్థాయిలో లావాదేవీలు జరగడం లేదు. ‘కరోనా’ కారణంగా కొన్ని వస్తువులు, సేవలకు మాత్రం గిరాకీ తగ్గకపోగా, ఇదివరకటి కంటే పెరగడం విశేషం. మహమ్మారి కాలంలో జనాలు ఎక్కువగా వేటిపై ఖర్చు చేస్తున్నారంటే... రోగనిరోధక సాధనాలు ‘కరోనా’ విజృంభణ మొదలైన నాటి నుంచి జనం ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. రోగనిరోధకతను పెంచుకోవడానికి పనికి వస్తాయనుకున్న వస్తువులను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ‘కరోనా’ విజృంభణ తర్వాత ముఖ్యంగా సంప్రదాయ ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. రోగ నిరోధకతను పెంచే ‘చ్యవనప్రాశ’ అమ్మకాలు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఊహించని రీతిలో పెరిగాయి. ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు ఉత్పత్తి చేసే ‘చ్యవనప్రాశ’ అమ్మకాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మూడు నెలల్లోనే ఏకంగా 283 శాతం, బ్రాండెడ్ తేనె అమ్మకాలు 39 శాతం పెరిగినట్లు ‘నీల్సన్’ అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులు ‘కరోనా’ వైరస్ నిరోధానికి భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత అత్యంత కీలకమనే దానిపై ప్రజలందరిలోనూ అవగాహన పెరిగింది. దీంతో వ్యక్తిగత శుభ్రతకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, లిక్విడ్ హ్యాండ్వాష్లు, వాషింగ్ పౌడర్లు, డిటర్జెంట్లు, ఇంటి శుభ్రతకు అవసరమయ్యే బాత్రూమ్ క్లీనర్లు, ఫ్లోర్ క్లీనర్లు వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 48 శాతం పెరిగినట్లు ‘ఆక్సెంచ్యూర్ కన్జూమర్ పల్స్’ అధ్యయనం వెల్లడించింది. ప్యాకేజ్డ్ చిరుతిళ్లు లాక్డౌన్ దెబ్బకు వీధుల్లోని పానీపూరీ వ్యాపారాలు, పకోడీ బజ్జీ వ్యాపారాలు మూతబడ్డాయి. అన్లాక్లో ఇవి తెరుచుకున్నా, వీటి జోలికి వెళ్లడానికి భయపడే జనాలే ఎక్కువగా ఉంటున్నారు. చిరుతిళ్లకు అలవాటు పడ్డవారు వీధుల్లోని బళ్లలో దొరికే చిరుతిళ్లకు బదులు ప్యాకేజ్డ్ చిరుతిళ్లను విరివిగా కొంటున్నారు. ఇన్స్టంట్ నూడుల్స్, ఓట్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కట్లు, రస్కులు, చాక్లెట్లు వంటి వాటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 10.7 శాతం పెరిగాయి. జనాలు ఆరుబయటకు వచ్చి తినడం కంటే ఇంట్లోనే తినడానికి ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల అమ్మకాలు బాగా పెరిగాయని ‘ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ వెల్లడించింది. గృహోపకరణాలు మన్నిక గల గృహోపకరణ వస్తువుల అమ్మకాలు సాధారణంగా నిలకడగానే ఉంటాయి. పండగ పర్వాల వంటి ప్రత్యేక సందర్భాల్లో వీటి అమ్మకాలు కాస్త పెరుగుతూ ఉంటాయి. ‘కరోనా’ కాలంలో వీటి అమ్మకాలు అమాంతంగా పెరగడం విశేషం. మిక్సర్లు, జ్యూసర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, టోస్టర్లు, డిష్ వాషర్లు, వాక్యూమ్ క్లీనర్లు వంటి గృహోపకరణాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది జూలైలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. జనాల్లో వ్యక్తిగత ఆరోగ్య స్పృహ పెరగడంతో ముఖ్యంగా డిష్వాషర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తమ వద్ద ఉన్న సరుకుకు మించి డిష్వాషర్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతుండటంతో హావెల్స్ ఇండియా లిమిటెడ్ సహా చాలా కంపెనీలు డిష్ వాషర్లకు కొత్తగా ఆర్డర్లు తీసుకోవడాన్ని నిలిపివేశాయంటే గృహోపకరణాలకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల పొదుపుమార్గం ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి వినియోగదారులు పొదుపుమార్గం పట్టారు. ఇదివరకటిలా వినోదాలు, విలాసాల కోసం చేసే ఖర్చులను దాదాపుగా తగ్గించేసుకున్నారు. దేశంలోని సుమారు 90 శాతం వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్షణ అవసరం లేని వస్తువుల కొనుగోలును మానుకుంటున్నారని, లేదా వాయిదా వేసుకుంటున్నారని ‘ఆక్సెంచ్యూర్’ నిర్వహించిన ‘కన్జూమర్ పల్స్’ అధ్యయనంలో వెల్లడైంది. ‘కరోనా’ మహమ్మారి వినియోగదారుల వైఖరిని సమూలంగా మార్చేసిందని, ఈ మార్పు దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ‘కరోనా’ మహమ్మారి కారణంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యాల మేరకు వారి అవసరాలను తీర్చడం ద్వారా వారిని ఆకట్టుకోవడానికి వివిధ బ్రాండ్ల ఉత్పత్తిదారులు కూడా తమ మార్కెటింగ్ పద్ధతులను మార్చుకుంటున్నారు. ‘కరోనా’ దెబ్బకు వినియోగదారుల షాపింగ్ అలవాట్లు కూడా మారిపోయాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్న వినియోగదారులు, అవసరమైన వస్తువులను ఇళ్లకు దగ్గర్లోని దుకాణాల్లోనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదివరకటి మాదిరిగా వారాంతాల్లో దూరంలో ఉన్న షాపింగ్మాల్స్కు వెళ్లి షాపింగ్ చేసే అలవాటును జనాలు దాదాపుగా మానుకున్నారు. డిజిటల్ సేవలు ‘కరోనా’ దెబ్బకు భౌతికదూరం అనివార్యం కావడంతో జనాలు ఎక్కువగా డిజిటల్ సేవలపై ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాస్లు, వర్క్ఫ్రమ్ హోమ్ కోసం తప్పనిసరిగా ఇళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టించుకుంటున్నారు. ఇళ్లలో ఇంటర్నెట్ వాడకం తప్పనిసరి కావడంతో ఇంతవరకు డెస్క్టాప్, ల్యాప్టాప్ వంటి పరికరాలు లేకుండా నెట్టుకొచ్చిన వాళ్లు సైతం వీటిని కొనుగోలు చేయడం ప్రారంభించడంతో డెస్క్టాప్, లాప్టాప్, ట్యాబ్ పరికరాలకు గిరాకీ బాగానే పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సినిమా థియేటర్లు మూతబడటంతో వినోదానికి అలవాటు పడ్డ జనాలు వినోదం కోసం ఓవర్ ది టాప్ (ఓటీటీ) సేవలపై ఆధారపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య 45 శాతం పెరిగింది. అమెజాన్ ప్రైమ్, బిగ్ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ, జీ 5 వంటి మిగిలిన ఓటీటీ ప్లాట్ఫామ్స్కు కూడా యూజర్లు దాదాపు ఇదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలను నేరుగా విడుదల చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారానే విడుదల చేస్తున్నారు. వినిమయ వైఖరిలో కీలక మార్పులు ‘కరోనా’ మహమ్మారి కాలంలో వినిమయ ధోరణిలో చాలా మార్పులే వచ్చాయి. దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాతి నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలైన కాలం వరకు వినియోగదారుల వినిమయ సరళిలో వచ్చిన కీలకమైన మార్పులపై అధ్యయనాలు జరిపిన మార్కెటింగ్ సంస్థలు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తించాయి. అవి: వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు బ్రాండ్ల ఎంపికలో నాణ్యతకు, భద్రతకు, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 71 శాతం పెరిగింది. ఇదే కాలంలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆరోగ్యంపై ఇదివరకటి కంటే మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నామని, ఆహార వృథాను చాలావరకు అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని దాదాపు 85 శాతం వినియోగదారులు వివిధ సర్వేల్లో చెప్పారు. బ్రాండ్ల ఎంపిక విషయంలో వాటి ధరలను ఆచి తూచి పరిశీలిస్తున్నట్లు 75 శాతం మంది చెబుతున్నారు. ఇదివరకటి కంటే ఇప్పుడు స్థానిక ఉత్పత్తులకు, స్థానిక బ్రాండ్లకే తాము ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు 79 శాతం వినియోగదారులు చెబుతున్నారు. భౌతిక దూరం అనివార్యమైనందున బంధు మిత్రులు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బంధుమిత్రులతో సంబంధాలు కొనసాగించడానికి దాదాపు 71 శాతం మంది వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్లపైనే ఆధారపడుతున్నారు. మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వారంతా అభిప్రాయపడుతున్నారు. ‘కరోనా’ వైరస్ నిరోధానికి రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ను తీసుకొచ్చింది. మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొద్ది నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, తద్వారా ‘కరోనా’ తగ్గుముఖం పట్టినా సరే వినియోగదారులు ప్రస్తుతం కొనసాగిస్తున్న ధోరణి మరికొంత కాలం ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ‘ఆక్సెంచ్యూర్’ అధ్యయనం అభిప్రాయపడుతోంది. బంగారాన్ని కుదువ పెడుతున్నారు... ‘కరోనా’ మహమ్మారి దెబ్బకు జనాలు ఆచి తూచి ఆరోగ్య స్పృహతో ఖర్చు చేస్తుండటం ఒకింత మంచి పరిణామమే అయినా, ఇందులో నాణేనికి మరోవైపు కూడా ఉంది. ఉపాధి పోవడంతో అనుకోని ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చాలామంది బంగారాన్ని కుదువ పెడుతున్నారు. మరో ఉపాధి దొరికే వరకైనా రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కోసం బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకునే వారి సంఖ్య ఏప్రిల్–జూన్ నెలల మధ్య కాలంలో గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే, ఈ ఏడాది వీరి సంఖ్య 57 శాతం వరకు పెరిగినట్లు దేశంలోనే అతి పెద్ద గోల్డ్లోన్ ఫైనాన్సింగ్ సంస్థ ‘ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్’ వెల్లడించింది. వినియోగదారుల పొదుపుమార్గం ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి వినియోగదారులు పొదుపుమార్గం పట్టారు. ఇదివరకటిలా వినోదాలు, విలాసాల కోసం చేసే ఖర్చులను దాదాపుగా తగ్గించేసుకున్నారు. దేశంలోని సుమారు 90 శాతం వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్షణ అవసరం లేని వస్తువుల కొనుగోలును మానుకుంటున్నారని, లేదా వాయిదా వేసుకుంటున్నారని ‘ఆక్సెంచ్యూర్’ నిర్వహించిన ‘కన్జూమర్ పల్స్’ అధ్యయనంలో వెల్లడైంది. ‘కరోనా’ మహమ్మారి వినియోగదారుల వైఖరిని సమూలంగా మార్చేసిందని, ఈ మార్పు దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ‘కరోనా’ మహమ్మారి కారణంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యాల మేరకు వారి అవసరాలను తీర్చడం ద్వారా వారిని ఆకట్టుకోవడానికి వివిధ బ్రాండ్ల ఉత్పత్తిదారులు కూడా తమ మార్కెటింగ్ పద్ధతులను మార్చుకుంటున్నారు. ‘కరోనా’ దెబ్బకు వినియోగదారుల షాపింగ్ అలవాట్లు కూడా మారిపోయాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్న వినియోగదారులు, అవసరమైన వస్తువులను ఇళ్లకు దగ్గర్లోని దుకాణాల్లోనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదివరకటి మాదిరిగా వారాంతాల్లో దూరంలో ఉన్న షాపింగ్మాల్స్కు వెళ్లి షాపింగ్ చేసే అలవాటును జనాలు దాదాపుగా మానుకున్నారు.