NPCI
-
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేశాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు ఈ రోజు (ఫిబ్రవరి 17) నుంచి అమలులోకి వస్తాయి.తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులలో ఆలస్యం లేదా బ్లాక్లిస్ట్ ఫాస్ట్ట్యాగ్లు కలిగిన వాహనదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు చెల్లించకుండా.. ఉండాలంటే, ఫాస్ట్ట్యాగ్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అవి బ్లాక్లిస్ట్లో ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత సంవత్సరం నవంబర్లో రూ.6,070 కోట్ల ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. డిసెంబర్ నాటికి లావాదేవీలు రూ.6,642 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ఈ ఏడాది మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు రద్దు!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై ప్రభావం చూపే కొత్త నిబంధనను 2025 ఫిబ్రవరి 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేయనుంది. తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.యూపీఐ లావాదేవీ ఐడీల జనరేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడానికి, యూపీఐ టెక్నికల్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండేలా చూడటానికి ఎన్పీసీఐ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 9, 2025న జారీ చేసిన ఆదేశాల ప్రకారం లావాదేవీ ఐడీలను జనరేట్ చేయడానికి యూపీఐ భాగస్వాములందరూ ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను (అక్షరాలు, సంఖ్యలు) మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చింది. ప్రత్యేక సింబల్స్ను వాడకూడదని సూచించింది. ఇదీ చదవండి: ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రంఈ చర్య వల్ల వ్యవస్థ సామర్థ్యాన్ని, భద్రతను పెంచడం, యూపీఐ లావాదేవీల అంతటా ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పేమెంట్ అగ్రిగేటర్లు ఈ ఆదేశాలను ఇప్పటికే పాటించినప్పటికీ, కొంతమంది ఇంకా ఈ నిబంధనలు పాటించలేదు. ఫలితంగా 2025 ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అక్షరాలతో ఉన్న యూపీఐ ఐడీలకు సంబంధించిన లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేయనుంది. కొత్త మార్గదర్శకాలను పాటించని యూపీఐ యాప్ల వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. -
గూగుల్ పే, ఫోన్పేకి ఎన్పీసీఐ ఊరట
ఫోన్పే, గూగుల్ పేలాంటి యూపీఐ యాప్లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే, ఫోన్పేలాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్ పే యాప్ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.ఆన్లైన్ చెల్లింపుల్లో కొన్ని థర్డ్పార్టీ యాప్లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సానుకూల పరిణామాలుసులువుగా లావాదేవీలు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.మరింత చేరువగా..ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.సౌలభ్యంగా..వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..ప్రతికూల పరిణామాలుమార్కెట్ ఆధిపత్యంకొన్ని థర్డ్ పార్టీ యాప్ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.సాంకేతిక సవాళ్లుకొన్ని థర్డ్పార్టీ యాప్లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.విదేశీ యాజమాన్యంఈ యాప్లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్మార్ట్ ఆధ్వర్యంలో ఫోన్పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది. -
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ లావాదేవీలు అధికమవుతున్నాయి. చాలామంది యూపీఐ, ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్(IMPS), ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సదుపాయాలు వినియోగిస్తుంటారు. అందులో యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా చేసిన లావాదేవీల్లో దాదాపు ఎలాంటి అవాంతరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసే చివరి దశలో ఒకసారి లుక్ అప్ ఫెసిలిటీ(ఖాతా దారుడి పేరుతో వివరాలు సరి చేసుకునే సదుపాయం) ఉంటుంది. కానీ రియల్టైం గ్రాస్ సెటిల్మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా చేసే లావాదేవీల్లో ఈ సదుపాయం ఉండదు. దాంతో కొన్నిసార్లు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)ను ఆర్బీఐ కోరింది.ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీల్లో ఏదైనా పొరపాటు జరిగి వేరే అకౌంట్లోకి డబ్బు జమైతే తిరిగి వాటిని రాబట్టడం పెద్దపని. కాబట్టి పేమెంట్ చేసేముందే అన్ని వివరాలు సరిచూసుకుంటే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో జరిగే మోసాలు అరికట్టడానికి, పొరబాట్లు జరగకుండా నగదు బదిలీ చేసేందుకు ఏ ఖాతాకైతే నగదు వెళుతుందో ఆ ఖాతాదారుడి పేరును తనిఖీ చేయడానికి వినియోగదార్లకు వీలు కల్పించేలా ఒక సదుపాయాన్ని (లుక్ అప్ ఫెసిలిటీ) అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)ను ఆర్బీఐ కోరింది. ఏప్రిల్ 1, 2025 వరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసు అందిస్తున్న అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ(RBI) సూచించింది.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్లను అనుమతించలేదు!యూపీఐ, ఐఎంపీఎస్లకు ఇలా..ఫోన్పే, జీపే.. వంటి థర్డ్పార్టీ యూపీఐ పేమెంట్ యాప్లు, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సమయంలో ఎవరికైతే డబ్బు పంపించాలో ఆ ఖాతాదారుడి పేరు వివరాలు ధ్రువీకరించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే లావాదేవీలకు ఆ సదుపాయం లేదు. -
ఎన్పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్పార్టీ యూపీఐ యాప్లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
యూపీఐ పేమెంట్స్లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది.లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. -
క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ.10,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. అందులో యూపీఐ సేవలందించే బ్యాంకులు తమ వినియోగదారులకు సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..‘యూపీఐ ద్వారా చేసే క్రెడిట్ కార్డుల వినియోగం రూ.10వేల కోట్లకు చేరింది. కార్డు లావాదేవీలను అసరాగా చేసుకుని బ్యాంకులు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రి అప్రూవ్డ్ లోన్లు ఇస్తున్నాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ ముందంజలో ఉంది. దాంతోపాటు స్వల్ప కాల వ్యవధి కలిగిన రుణాలను కూడా బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై చిన్నమొత్తంలో రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించాలని భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!క్రెడిట్కార్డు లావాదేవీలపై యూపీఐ ద్వారా లోన్లు ఇవ్వడం బ్యాంకులకు కొంత లాభాలు చేకూర్చే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వీసులను వినియోగదారులకు చేరవేసేందుకు బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫిన్టెక్లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి యూపీఐ ద్వారా బ్యాంకులు మాత్రమే లోన్లు ఇవ్వగలవు. ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్లు కూడా బ్యాంకుల మాదిరి లోన్లు ఇచ్చేలా వెసులుబాటు పొందాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఆర్బీఐ అనుమతులు కావాల్సి ఉంటుంది. -
ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ
హానికర సాఫ్ట్వేర్ (ర్యాన్సమ్వేర్) దాడికి గురైన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.ఎన్పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ-ఎడ్జ్ టెక్నాలజీస్పై ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్ను డిస్కనెక్ట్ చేశారు. తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్ హానికర సాఫ్ట్వేర్ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్లో ర్యాన్సమ్వేర్ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్ సిస్టమ్లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
ఖతార్లో యూపీఐ సేవలు..!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) తెలిపింది. ఈమేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్ఐపీఎల్ చెప్పింది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ చీఫ్ అనుభవ్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఖతార్లోని భారత వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఖతార్లోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. ఇటీవల యూఏఈలో యూపీఐ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. -
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. -
పెరూలో యూపీఐ చెల్లింపులు..
న్యూఢిల్లీ: ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ తాజాగా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భా గంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో అందుబాటులోకి తేనున్నాయి.ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా పెరూ స్థానం సంపాదించనుంది. రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ను ఆ దేశంలో స్థాపించడంతోపాటు వ్యక్తు లు, వ్యాపార సంస్థల మధ్య తక్షణ చెల్లింపులను అందించేందుకు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుంది.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
యూపీఐ సరికొత్త రికార్డ్.. రోజుకు రూ .65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ తెలిపింది.ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. -
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్ఎమ్ఎస్లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి. -
పేటీఎం కొత్త వ్యూహం
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్ బ్యాంక్ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్లైన్ పేమెంట్ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్ బ్యాంక్ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. నేరుగా క్రెడిట్కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్గేట్ల వద్ద ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్ సర్వీస్ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్ బ్యాంక్ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్పీసీఐ ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద పేటీఎం బ్రాండ్పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్లు పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్కు, కొత్త మర్చంట్స్కు యస్ బ్యాంక్ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ యస్ బ్యాంక్కు రీడైరెక్ట్ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్బ్యాంక్ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్బ్యాక్ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024 -
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది.మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్లో రూ.19.64 ట్రిలియన్లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్లో 13.3 బిలియన్లకు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్లో ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్లో 328 మిలియన్లకు తగ్గాయి.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..యూపీఐ చెల్లింపుల వాల్యూమ్లు, విలువలు నెలవారీగా తగ్గినా ఏడాది ప్రాతిపదికన మాత్రం ఘననీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్యూమ్ పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. -
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్పే, ఫోన్పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్పార్టీ చెల్లింపు యాప్లైన గూగుల్పే, ఫేన్పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్పే, జొమాటో, గ్రో, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్ఆఫ్ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్పే, గూగుల్పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే..
రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈమేరకు యూపీఐ ప్లాట్ఫామ్కు సంబంధించి వీటిని త్వరలో అమలు చేయబోతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. రూపే క్రిడిట్ కార్డును వినియోగించి యూపీఐ లావాదేవీలు జురుపుతుంటారు. అయితే సంబంధిత యూపీఐ యాప్లోనే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్ బిల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందిస్తున్న బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అమలులోకి తీసుకురావాలని ఎన్పీసీఐ తెలిపింది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్తో కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్ చేసిన యూపీఐ యాప్లోనే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈఎంఐ రేట్లకు సంబంధించిన జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదీ చదవండి: త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే.. క్రెడిట్ అకౌంట్ బిల్పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీచర్ ద్వారా యూపీఐ యాప్లోనే కార్డు బిల్లు చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంక్ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరే వెసులుబాటు ఉండనుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినమిమ్ బిల్, టోటల్ అమౌంట్, బిల్ డేట్ వంటివి యూపీఐ యాప్లోనే తెలుసుకోవచ్చు. -
పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ..
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్పైనా యూపీఐ సేవలందిస్తుంది. లైనెన్స్లో వివరాల ప్రకారం..బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్లు ఇకపై పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్స్గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్కు, కొత్త మర్చంట్స్కు యస్ బ్యాంక్ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ ఇకపై యస్ బ్యాంక్కు రీడైరెక్ట్ అవుతాయి. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్ ప్లాన్..! చాలా డబ్బు ఆదా.. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు, మర్చంట్స్ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
నేపాల్లోని భారతీయుల కోసం ప్రముఖ సేవలు ప్రారంభం
నేపాల్లో భారత్కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. గతేడాది సెప్టెంబరులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్), నేపాల్ అతిపెద్ద చెల్లింపు నెట్వర్క్ ఫోన్పే పేమెంట్ సర్వీస్ల మధ్య భాగస్వామ్యం కుదరగా, తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో యూపీఐ ఆధారిత యాప్ల ద్వారా భారత వినియోగదారులు నేపాల్లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్పే నెట్వర్క్పైన ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’ ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ శుక్లా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని, డిజిటల్ చెల్లింపుల్లో మార్పునకు కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్, నేపాల్ మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్య, పర్యాటకం గణనీయంగా మెరుగుపడటానికి యూపీఐ సేవలు ఉపకరిస్తాయని ఫోన్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ దివాస్ కుమార్ వెల్లడించారు. -
పేటీఎం, ఫాస్టాగ్పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
ఈఫిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు
ముంబై: ఇకపై ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్కి చెందిన ఈ–కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి, ఆన్లైన్లో ఈఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్ఐపీఎల్ తెలిపింది. -
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
గూగుల్పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే?
'గూగుల్పే' (Google Pay) తాజాగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCI)కు చెందిన 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం వెలుపల ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్పే ఇప్పుడు ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. విదేశాలకు వెళ్లే ప్రజలు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్వే చార్జీల భారం తగ్గిపోయింది. ఇది కేవలం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా.. సంస్థ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన.. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వల్ల.. గూగుల్పే కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ కోసం లేదా ఫారెక్స్ కార్డుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని NPCL సీఈఓ రితేష్ శుక్లా పేర్కొన్నారు. -
యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది. -
ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఎన్పీసీఐ ఒప్పందం
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం. -
హెలో.. యూపీఐ - ఇక వాయిస్ ఆధారిత చెల్లింపులు
ముంబై: యూపీఐ వేదికగా వాయిస్ ఆధారిత పేమెంట్స్ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ సందర్భంగా వీటిని ప్రకటించింది. ఇందులో హెలో!యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల ద్వారా వాయిస్ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. బ్యాంకులు మంజూరు చేసిన క్రెడిట్ లైన్ను యూపీఐ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇక ఆఫ్లైన్లోనూ నగదును పంపించేందుకు, అందుకునేందుకు లైట్ ఎక్స్ సాధనం ఉపయోగపడగలదని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే, యూపీఐ ట్యాప్ అండ్ పే విధానంతో ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత క్యూఆర్ కోడ్స్పై ట్యాప్ చేసి, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. -
నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు!
ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్ఫారమ్ ద్వారా సాధించిన 10 బిలియన్ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దాని ప్రత్యర్థి మాస్టర్ కార్డ్ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది. పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్ కార్డ్ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్ఫారమ్లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్స్ట్రమెంట్ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు. -
ఫోన్పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్పే కన్జ్యూమర్ ప్లాట్ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
వీసా,మాస్టర్కార్డ్తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..
న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. ఇదీ చదవండి: కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్చేంజ్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్పీసీఐ తాజా వివరణ ఇచ్చింది. మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్పే, గూగుల్పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్ను బట్టి ఇంటర్ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
భారత్పేపై అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు..15 కోట్ల మంది డేటా చోరీ!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పేపై ఆ కంపెనీ సహవ్యవస్ధాపకుడు, మాజీ సీఈఓ అష్నీర్ గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్పే ప్రస్తుత సీఈఓ భవిక్ కొలదియ 15 కోట్ల మంది భారత్పే యూజర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డారని అన్నారు. ఇదే అంశంపై ఎన్పీసీఐకి లేఖ రాశారు. భారత్లో పే యూజర్ల డేటా ఉల్లంఘనతో యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ గ్రోవర్ ఎన్పీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు గతంలో క్రెడిట్ కార్డు మోసంలో భవిక్ గతంలో దోషిగా తేలాడని, 18 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన అనంతరం అతడిని భారత్కు తరలించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫేక్ టికెట్ ఉపయోగించి గుజరాత్కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఎఫ్ఐఆర్ నమోదైందని గ్రోవర్ చెప్పారు. అందకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు. ఇక గ్రోవర్ చేస్తున్న ఆరోపణలపై భారత్పే కంపెనీ స్పందించింది. కంపెనీ నుంచి తొలగించినందుకు గ్రోవర్ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్పే సీఈఓ భవిక్ కొలదియ పేర్కొన్నారు. -
ఫోను నుంచే ‘ఫారిన్’ మనీ.. ఇక విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులు చేయాలంటే.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే ఎన్నారైలకు భారత్లో ఏదైనా బ్యాంకులో నాన్ రెసిడెంట్ ఎక్స్టెర్నల్ (ఎన్ఆర్ఈ) అకౌంట్ లేదా నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపించవచ్చు. ఈ–కామర్స్ పోర్టళ్లకూ చెల్లింపులు చేయొచ్చు. సాక్షి, అమరావతి: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు డబ్బులు పంపించడం ఇక సులువు కానుంది. విదేశాల నుంచి కూడా చేతిలో ఉన్న సెల్ఫోన్ నుంచే డిజిటల్ (యూపీఐ) చెల్లింపుల ద్వారా నిధులు పంపొచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే తదితర యూపీఐ పేమెంట్ మాధ్యమాల ద్వారా క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తారు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విధి విధానాలను ఖరారు చేసింది. ఈ తాజా విధాన నిర్ణయం 1.35 కోట్ల మంది ఎన్నారైలకు సౌలభ్యంగా మారనుంది. తొలి దశలో 10 దేశాలకు అనుమతి తొలి దశలో ఎన్నారైలు అధికంగా ఉన్న 10 దేశాల నుంచి చెల్లింపులకు ఎన్పీసీఐ అనుమతి మంజూరు చేసింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. విదేశాల నుంచి యూపీఐ చెల్లింపుల కోసం ఎన్పీసీఐ 2020లోనే ప్రత్యేకంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లోని డిజిటల్ పేమెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే నేపాల్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్లలోని సంస్థలు భారతీయ యూపీఏ చెల్లింపులను అనుమతించేలా ఒప్పందాలు చేసుకుంది. మన యూపీఐని సింగపూర్ పేనౌ సంస్థతో అనుసంధానించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు నేరుగా భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులకు అనుమతించింది. ప్రస్తుతం నగదు బదిలీకి 48 గంటలు ప్రస్తుతం ఎన్నారైలు భారత్లోని బంధువులకు అక్కడి బ్యాంకు ఖాతా నుంచి భారత్లోని బ్యాంకు ఖాతాకు నగదు పంపిస్తున్నారు. దీన్ని వైర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ విధానంలో నగదు బదిలీకి 48 గంటల సమయం పడుతుంది. ఇక వెస్ట్రన్ యూనియన్, యూఏఈ ఎక్సే్ఛంజ్ వంటి మనీ ట్రాన్స్ఫర్ కంపెనీల ద్వారా పంపాలంటే విదేశాల్లోని మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఆఫీసుకు వెళ్లి ఆ దేశం కరెన్సీని చెల్లించాలి. ఆ రోజుకు మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ నిర్దేశించిన మారక విలువనుబట్టి భారత్లో ఉన్న వారికి భారత కరెన్సీలో నగదు చెల్లిస్తారు. ఇవి కాకుండా మరికొన్ని ఆన్లైన్ చెల్లింపు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి డబ్బులు పంపేవారు, పొందేవారు ఇద్దరి నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. మనీ లాండరింగ్కు అవకాశం లేకుండా.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులపై భారత్లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)కు కట్టుబడిన బ్యాంకు అకౌంట్లకే డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించే ఖాతా ఉన్న బ్యాంకు, డబ్బులు తీసుకునే ఖాతా ఉన్న బ్యాంకు కచ్చితంగా విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపు లావాదేవీలు దేశంలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి అనుగుణంగా ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆర్థిక ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊపు.. ఎన్పీసీఐ తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకుల ద్వారా డిజిటల్ పేమెంట్లు మరింతగా పెరగనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. అప్పటి నుంచి ఇవి భారీగా పెరిగాయి. 2000లో దేశంలో రూ.4.2 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరగ్గా, 2022లో ఏకంగా రూ.12.8 లక్షల కోట్ల చెల్లింపులు జరగడం విశేషం. విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు మొదలైతే వీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. విదేశాల నుంచి నిధుల్లో భారత్దే అగ్రస్థానం విదేశాల్లో ఉన్న వారి నుంచి స్వదేశానికి వస్తున్న నిధుల్లో ప్రపంచంలో భారత్దే మొదటిస్థానం. 2021లో ఎన్నారైలు భారత్లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.7.15 లక్షల కోట్లు పంపించగా.. 2022లో రూ.8 లక్షల కోట్లు పంపించారు. అందులో 25 శాతం గల్ఫ్ దేశాల నుంచి, 20 శాతం అమెరికా నుంచి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులకు అనుమతించడంతో ఈ నిధుల వరద మరింతగా పెరగనుంది. -
ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్.. ఈ 10 దేశాల వారికే అవకాశం!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంతోషకర వార్త చెప్పింది. యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్పీసీఐ ప్రకటించింది. ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాలకు అనుసంధానంగా యూపీఐ ద్వారా నగదు బదిలీని చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నాటికి ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఐ భాగస్వాములను ఎన్పీసీఐ కోరింది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్కాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకేలోని ప్రవాస భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పది దేశాల టెలికం కోడ్పై యూపీఐ పనిచేసే ఏర్పాటును తీసుకువస్తున్నట్టు, సమీప భవిష్యత్తులో ఇతర దేశాలకూ దీన్ని విస్తరించనున్నట్టు ఎన్పీసీఐ తెలిపింది. ఎన్ఆర్ఐలు భారత్కు వచ్చినప్పుడు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుందని ఎన్పీసీఐ చైర్మన్ విశ్వాస్ పటేల్ పేర్కొన్నారు. చదవండి: ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి -
‘స్మార్ట్’ తెలంగాణ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి వ్యవసాయంలో ఆధునికత పెరిగిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో సాగు దాదాపుగా కనుమరుగైపోతోంది. విత్తనాలు నాటాలన్నా యంత్రాలే..కోత కోయాలన్నా యంత్రాలే. ఇక మధ్యలో పంటలను ఆశించే తెగుళ్లను నిర్మూలించేందుకూ ఆధునిక స్ప్రే పరికరాలు వచ్చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి..కానీ ఏ పనికి ఏ పరికరం వాడాలి?, ఏ తెగులు సోకితే ఏ మందు వాడాలి?, పంటల ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఏం చేయాలి?..ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, పరిష్కారం దొరికినట్టేనని అంటున్నాడు కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం రామానుజరెడ్డి. తనకున్న యాభై ఎకరాల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తూ చీడపీడలకు ‘స్మార్ట్ ఫోన్ వైద్యం’చేస్తున్నాడు. తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్లాంటిక్స్, అగ్రిసెంటర్, కిసాన్ తదితర యాప్ల సహాయంతో మొక్కలు ఎదగకపోయినా లేదా తెగులు కనిపించినా ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తే గంటల వ్యవధిలోనే తగు సలహాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్లో శోధించడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ–పేమెంట్లు కూడా పెరిగిపోవడం స్మార్ట్ ఫోన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తోంది. జోరుగా ఆన్లైన్ సర్వీసులు 2022లో తెలంగాణలో టెలిడెన్సిటీతో పాటు డిజిటల్ లైఫ్ గణనీయంగా పెరిగిపోయింది. దేశ సగటుకు మించిన స్మార్ట్ సిటిజెన్ (స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు), డేటా వినియోగంతో పాటు ఆన్లైన్ సర్వీసులు, పేమెంట్లు జోరుగా సాగుతున్నాయి. టెలిడెన్సిటీ (ఎంత మందికి ఎన్ని సిమ్లు)ని తీసుకుంటే 2022 ట్రాయ్ తాజా నివేదిక మేరకు తెలంగాణలో 100 మంది 110 సెల్ఫోన్ సిమ్కార్డులున్నాయి. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 4.22 కోట్ల సిమ్ కార్డులుండగా వీటిలో 1.80 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కేరళ 100 మందికి 123 సిమ్లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్ ప్లేస్కు చేరింది. రాష్ట్రాల వారీగా ప్రతి 100 మందికి వాడుతున్న సిమ్ల వివరాలు ఈ పేమెంట్లలో టాప్ ఫైవ్లో హైదరాబాద్ కోవిడ్తో వేగం పుంజుకున్న ఈ పేమెంట్ల జోరు 2022లో కూడా కొనసాగింది. ఒకరి నుండి ఒకరికి, సంస్థల నుండి బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ మినహాయిస్తే.. వ్యక్తిగత లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ – 2022) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఈ కామర్స్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, ముంబై అనంతరం హైదరాబాద్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లావాదేవీల కోసం అత్యధికంగా ఫోన్పే (47.8%), గూగుల్పే (33.6%), పేటీఎం (13.2%) లను ప్రజలు వినియోగిస్తున్నారు. నగదు వాడేదే లేదు..! ప్రపంచంలో 63 దేశాలు చుట్టివచ్చా. ఇండియాలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లా. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి కరెన్సీ తీసుకుంటా. ఇండియాలో మాత్రం నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. ఇక హైదరాబాద్లో అయితే అన్నీ ఆన్లైన్లోనే. – నీలిమారెడ్డి, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటిజెన్ సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వ, ప్రైవేటు సేవలు చాలావరకు ఆన్లైన్లోకి రావటం వల్లే టెలిడెన్సిటీ పెరిగింది. దీంతో పాటు ఆన్లైన్ లావాదేవీలు పెరిగి తెలంగాణలో స్మార్ట్ సిటిజెన్ సంఖ్య దేశ సగటు కంటే పెరుగుతూ వస్తోంది. అలాగే దేశంలో అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీని ఫలితాలు అన్ని రంగాల్లోనూ రావటం మొదలయ్యాయి. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ -
ఇక ఈ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు...ఫస్ట్ చాన్స్ వారికే
సాక్షి,ముంబై: యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్ యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో వస్తాయి. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభమైనట్లు రేజర్ పే ప్రకటించింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్సీపీఐ ఫీచర్ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్వే తామేనని రేజర్ పే తెలిపింది. తమ చెల్లింపుల గేట్వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని రేజర్పే ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డిఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను మొదట పొందుతారని తెలిపింది. ఇప్పటికే రూపేక్రెడిట్ కార్డ్ల చెల్లింపులు మొదలైన సంగతి తెలిసిందే. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) యూపీఐ క్రెడిట్ కార్డ్ లింకింగ్ ద్వారా కస్టమర్లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్లను అన్ని సమయాల్లో తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.తద్వారా చోరీ, లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలు లేకుండా కస్టమర్లకు భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్ల వద్ద సున్నితమైన కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పునుంచి తప్పిస్తుంది. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) కాగా దాదాపు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నారు మరియు దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్లను కలిగి ఉన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాలలో 30 శాతం పెరిగింది. -
ఊపిరి పీల్చుకోండి.. ఫోన్పే, గూగుల్పే యూజర్లకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల మొత్తం లావాదేవీల్లో థర్డ్ పార్టీ యూపీఐ సంస్థల (ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, ఫ్రీచార్జ్ తదితర) వాటా ఒక్కోటీ 30 శాతం మించకూడదన్న నిబంధన అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది. దీంతో 2024 డిసెంబర్ చివరి వరకు అదనపు సమయం లభించినట్టయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో 30 శాతానికి పైగా వాటా కలిగిన ఫోన్పే, గూగుల్పే సంస్థలకు ఊరటనివ్వనుంది. యూపీఐ నిర్వహణను ఎన్పీసీఐ చూస్తుంటుంది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తుండడం తెలిసిందే. ఒక్క థర్డ్ పార్టీ యాప్ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్లో ఎన్పీసీఐ తీసుకొచ్చింది.ఈ నిర్ణయం వాస్తవానికి అయితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి. అయితే 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్లు అయిన గూగుల్, ఫోన్పే సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది. ‘‘యూపీఐ ప్రస్తుత వినియోగం, భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. నిర్ధేశిత పరిమితికి మించి (30 శాతానికి పైగా) లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్ సంస్థలకు నిబంధనల అమలుకు ఇచ్చిన రెండేళ్ల అదనపు గడువును, 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించాం’’అని ఎన్పీసీఐ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ఉన్న భారీ అవకాశాల దృష్ట్యా బ్యాంకులు, నాన్ బ్యాంకులు సైతం ఈ విభాగంలో మరింత వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే వాటా సుమారు 46 శాతం, గూగుల్పే వాటా 33 శాతంగా, పేటీఎం వాటా 11 శాతం మేర ఉంది. చదవండి: 17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్ మస్క్తో కలిసి -
షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
గుడ్న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్!
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు.. ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్వర్క్తో పనిలేకుండా కేవలం ఆఫ్లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి ► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. ► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది.. ►1.Send Money ►2. Request Money ►3. Check Balance ►4. My Profile ►5. Pending Request ►6. Transactions ►7. UPI Pin ► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయండి. ► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి (send) ఎంటర్ చేయండి. ► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. ► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపండి. ► ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి (send) ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది. చదవండి: అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! -
అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్తో బోలెడు లాభాలు!
ఆన్లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్ (Rupay credit card)లను భీం యాప్ (BHIM UPI) యాప్కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్లో షాపింగ్తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డులను స్వైపింగ్ మిషన్ల వద్ద స్వైప్ చేయాల్సిన అవసరం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం! క్రెడిట్ కార్డ్ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్లైన్ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్పీసీఐ మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా.. భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లేకుండానే కేవలం భీం యాప్కి లింక్ చేసిన మీ యూపీఐ అకౌంట్తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే సమస్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి. ఈ బ్యాంకులకు మాత్రమే.. కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే తొలుత భీం యాప్తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేరకు గత సెప్టెంబర్ 20న ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. చదవండి: ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
వామ్మో రూ.12.11 లక్షల కోట్లు.. ఏం వాడకం రా బాబు!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్ని ఏఈపీఎస్తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్! -
షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా షావోమి Mi Pay, Mi క్రెడిట్ యాప్లను స్థానిక ప్లే స్టోర్, అలాగే తన సొంత యాప్ స్టోర్ నుండి తీసివేసిందని టెక్ క్రంచ్ శుక్రవారం నివేదించింది. (Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం) ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, వినియోగదారులను బిల్లు చెల్లింపులు, నగదు బదిలీల సేవలకు సంబంధించి యాప్, రెగ్యులేటరీ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన Mi Pay ఇకపై అందుబాటులో ఉండదని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే దీనిపై షావోమి కానీ, ఎన్పీసీఐ కానీ అధికారింగా ఇంకా స్పందించ లేదు. కాగా భారతదేశంలో భారీ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటోంది షావోమి. దీనికి సంబంధించి ఈడీ దాడుల్లో 676 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల స్వాధీం చేసుకుంది. దీన్ని ఎత్తివేయడానికి భారతీయ కోర్టు ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. -
త్వరలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్ఫాంకు లింక్
ముంబై: దేశీయంగా మూడో వంతు జనాభా డిజిటల్ చెల్లింపులకు మళ్లితేనే నగదు వినియోగం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈవో దిలీప్ అస్బే తెలిపారు. ప్రస్తుతం ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) వంటి సర్వీసులను జనాభాలో దాదాపు అయిదో వంతు ప్రజలే వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చలామణీలో ఉన్న నగదు పరిమాణం చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడానికి 12–18 నెలలు పట్టొచ్చని దిలీప్ చెప్పారు. కొన్నాళ్లుగా ఇటు డిజిటల్ చెల్లింపులు అటు చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం ఒకే తరహాలో పెరుగుతుండటం ఒక పజిల్గా మారిన నేపథ్యంలో దిలీప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో 2016లో స్థూల దేశీయోత్పత్తిలో సీఐసీ 12 శాతంగా ఉండగా .. ప్రస్తుతం ఇది 14 శాతానికి పెరిగింది. సంపన్న దేశాల్లో ఇది సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉంటోంది. దేశీయంగా చిత్రమైన పరిస్థితి నెలకొనడంపై దిలీప్ వివరణ ఇచ్చారు. నగదు బదిలీ స్కీముల వంటి పథకాల సొమ్ము నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ అవుతున్నప్పటికీ వారు డిజిటల్ చెల్లింపులను ఎంచుకోకుండా .. ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకుని వాడుకుంటుండటం కూడా సీఐసీ పెరగడానికి ఒక కారణమని ఆయన తెలిపారు. మరోవైపు, భవిష్యత్తులో భారతీయులు రోజుకు వంద కోట్ల పైగా డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నిర్వహిస్తారని దిలీప్ చెప్పారు. మరికొద్ది నెలల్లో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్ఫాంనకు అనుసంధానించనున్నట్లు వివరించారు. దీనిపై ఎస్బీఐ కార్డ్స్, బీవోబీ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మొదలైన వాటితో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఎన్పీసీఐ ఈ మాట సచివాలయాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు సొమ్ము పడలేదంటూ సచివాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వార్డు వలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులు బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న ఖాతాలకే సొమ్ము పడుతుందని చెప్పడంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు. అటువంటి సమయంలో లబ్ధిదారులు సదరు బ్యాంకులకు వెళ్లి ఏ ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం జరిగి ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు తమకు నచ్చిన బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం కోరుకుంటే సంబంధిత బ్యాంకులో ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంప్రదించాల్సి ఉంటుంది. తరువాత ఎన్పీసీఐ అనుసంధానం గల బ్యాంకు ఖాతా జెరాక్స్ మాత్రమే ఆయా పథకాలకు దరఖాస్తు సమయంలో సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది. -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్పే, గూగుల్పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్లు, బ్యాంక్ యాప్లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్ట్యాగ్ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్ట్యాగ్ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
షాకింగ్ నిర్ణయం..! యూపీఐ పేమెంట్స్తో వాటిని కొనలేరు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు భారీ ఆదరణను పొందుతోంది. భారత్లో కూడా క్రిప్టోపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత క్రిప్టోకరెన్సీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ అమెరికన్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫాం కాయిన్బేస్ కూడా భారత్లో ఏప్రిల్ 7 న ఎంట్రీ ఇచ్చింది.మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లు సదరు క్రిప్టో కరెన్సీలను కొనుగోలుచేసేందుకుగాను యూపీఐ పేమెంట్స్ ఆప్షన్స్ను కాయిన్బేస్ తీసుకొచ్చింది. కాగా 3 రోజుల క్రితమే తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్స్ ఫీచర్పై కాయిన్బేస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్రిప్టోకరెన్సీలను యూపీఐ పేమెంట్స్ ద్వారా కొనుగోలుచేసే ఆప్షన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు క్రిప్టో ట్రేడింగ్ ఫ్లాట్ఫాం కాయిన్బేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర ప్రత్యామ్నాయ పేమెంట్స్ ఆప్షన్స్ను ఉపయోగించి క్రిప్టోలను కొనుగోలు చేయాలని కాయిన్బేస్ సదరు క్రిప్టో ఇన్వెస్టర్లకు వెల్లడించింది. గతంలో ప్రముఖ మొబైల్ ఫిన్టెక్ సంస్థ మొబిక్విక్ వ్యాలెట్ కూడా దిగ్గజ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే క్రిప్టో ట్రేడింగ్పై మద్దతును మొబిక్విక్ ఉపసంహరించుకుంది. ఎన్పీసీఐ సీరియస్..! ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫాం కాయిన్బేస్ ఏప్రిల్ 7 న బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్లో యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుగోలుచేయవచ్చునని వెల్లడించింది. కాయిన్బేస్పై వచ్చిన తాజా నివేదికలపై...నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అలర్ట్ అయ్యింది. కాయిన్బేస్ నిర్ణయంపై ఎన్పీసీఐ సీరియస్ కాగా, భారత్లో యూపీఐ పేమెంట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసుకోవడాన్ని అనుమతించిన కంపెనీ నిర్ణయం ప్రస్తుతం రెగ్యులేటరీ స్క్రూటీనిలోకి వచ్చిందని ఎన్పీసీఐ పేర్కొంది. యూపీఐ పేమెంట్స్ను ఉపయోగించే క్రిప్టో ఎక్సేఛేంజ్ల గురించి తెలియదని ఎన్పీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. Statement by NPCI as on 7th April 2022. With reference to some recent media reports around the purchase of Cryptocurrencies using UPI, National Payments Corporation of India would like to clarify that we are not aware of any crypto exchange using UPI. Please see attached document pic.twitter.com/lGTcaSLKeC — NPCI (@NPCI_NPCI) April 7, 2022 చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..! -
గుడ్న్యూస్.. ఏటీఎం కార్డు లేకపోయినా.. ఈ సేవలు పొందొచ్చు
దేశంలో రోజు రోజుకి యుపీఐ చెల్లింపుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ వంటి యుపీఐ థర్డ్ పార్టీ సంస్థలు తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో దేశంలో డీజిటల్ యుపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఈ యుపీఐ లావాదేవీలు చేయడానికి యూజర్లు మొదట తమ డెబిట్ కార్డు వివరాలను నమోదుజేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డు లేకపోవడం, ఉన్న పని చేయక పోవడం కారణాల వల్ల ఈ సేవలు అందడం లేదు. అయితే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డు లేకున్నా యుపీఐ సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎన్పీసీఐ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్పీసీఐ ఆదేశాల ప్రకారం.. దేశంలో డిజిటల్ లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఎన్పీసీఐ ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు యుపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది. ఇప్పుడు, ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని/ డెబిట్ కార్డు పనిచేయని వినియోగదారులకు యుపీఐ సేవలను అందజేయవచ్చు అని తెలిపింది. ఎన్పీసీఐ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 15 నాటి నుంచి సర్క్యులర్ నిబంధనలను పాటించాలని బ్యాంకులను కోరింది. ఆ తర్వాత గడువు తేదీని 2022, మార్చి 15 వరకు పొడగించింది. "ఈ సేవలను డెబిట్ కార్డు లేని వారికి ఎన్పీసీఐ పేర్కొన్న విధంగా అందజేయడానికి బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు పట్టవచ్చు" నిపుణులు తెలిపారు. అయితే, ఈ సేవలు పూర్తిగా అందాలంటే, వినియోగారుడు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి లింకు చేసిన మొబైల్ నెంబర్ ఒకటే కావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సేవలు మీకు అందనున్నాయి. (చదవండి: ఒకేరోజు డీజిల్పై రూ.75, పెట్రోల్పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?) -
ఫిబ్రవరిలో తగ్గిన యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్ఫామ్పై రిటైల్ చెల్లింపుల లావాదేవీలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి రూ.8.27 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. సంఖ్యా పరంగా 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం నెల 2022 జనవరిలో 461 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.8.32 లక్షల కోట్ల మేర ఉంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఆధారిత లావాదేవీలు 24.36 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3,613 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. జనవరిలో ఫాస్టాగ్ టోల్ వసూళ్ల లావాదేవీలు 23.10 కోట్లుగాను, వీటి విలువ రూ.3,604 కోట్లుగా ఉంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ జనవరిలో రూ.3.87 లక్షల కోట్లు. ఫిబ్రవరిలో రూ.3.84 లక్షల కోట్లకు తగ్గింది. జనవరిలో 31 రోజులు కాగా, ఫిబ్రవరిలో 28 రోజులే కావడం గమనార్హం. (చదవండి: వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!) -
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!
Money Transfer Using UPI Without Internet: ప్రస్తుత ఈ డీజీటల్ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్ది కొత్త కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో స్మార్ట్ఫోన్ నుంచి పేమెంట్స్ చేసే విధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు స్మార్ట్ఫోన్లోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ సులువుగా జరుగుతున్నాయి. ప్రజలు రోజుకు లక్షల రూపాయలను క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే, ఈ సేవలన్నీ వాడుకోవాలంటే స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి. కానీ, ఇంటర్నెట్ లేకున్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయం మనలో ఎందరికి తెలుసు. అవును, మీరు విన్నది నిజమే!. మన స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా ఇతరులకు డబ్బులు పంపించే అవకాశం ఉంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఆఫ్లైన్లో యూపీఐ లావాదేవీలు ఉపయోగించుకోవడానికి యూజర్లు *99# డయల్ చేయాల్సి ఉంటుంది. USSD 2.0 పద్ధతి ద్వారా ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అయితే, ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. ఆగస్టు 2016లో ఎన్పీసీఐ రెండు డీజీటల్ చెల్లింపు పద్ధతులను(యుపీఐ & *99#) ఇంటిగ్రేట్ చేసింది. ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు ఇదే నెంబర్ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి. స్మార్ట్ఫోన్లో *99# సౌకర్యాన్ని ఎలా ఉపయోగించాలి? మీ స్మార్ట్ఫోన్లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేయండి. ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ పేమెంట్స్ మెథడ్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. డబ్బు బదిలీ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడితో పాటు ఇతర లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. భవిష్యత్తు లావాదేవీల కోసం లబ్ధిదారుడీగా గ్రహీతను సేవ్ చేయమని మిమ్మల్ని కోరుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించడం వల్ల రూ.0.50 స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!) -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. ఈ రోజు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది. వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని వారు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యపై ఎన్పీసీఐ స్పందించింది. ఎన్పీసీఐ ఒక ట్వీట్ చేస్తూ యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. Regret the inconvenience to #UPI users due to intermittent technical glitch. #UPI is operational now, and we are monitoring system closely. — NPCI (@NPCI_NPCI) January 9, 2022 అయితే, ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 It's more than 5 hours now #UPI transaction are stuck as servers are down..!!! What's going on here @HDFC_Bank @GooglePay @Paytm !! — Niral Mehta (@NiralMehta1) January 9, 2022 (చదవండి: కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి తయారీ కంపెనీల షాక్..!) -
జియో యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ .. ఇక రీఛార్జ్ చేయడం చాలా తేలిక..!
ముంబై: రిలయన్స్ జియో తన యూజర్లకు తీపికబురు అందించింది. ఇకపై జియో యూజర్లు సులభంగా రీఛార్జ్ చేసుకునేందుకు సరికొత్త ఫీచర్ అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. ప్రముఖ రిలయన్స్ జియో కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో మిలియన్ల మంది యుపీఐ, జియో వినియోగదారుల కోసం ఆటోపే ఫీచర్ ప్రారంభించింది. యూపీఐ ఆటోపే ఫీచర్ను తీసుకొచ్చిన తొలి టెలికాం కంపెనీగా జియో నిలిచింది. ఈ యుపీఐ ఆటోపే ఫీచర్ జియో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు. యూజర్లు ఇకపై యూపీఐ ద్వార తమ టారిఫ్ ప్లాన్ రీచార్జ్ కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్తో ఆటో డెబిట్ ఫీచర్ను సెట్ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయకున్న ఆటో డెబిట్ ఫీచర్ వల్ల ఆటోమెటిక్గా మీ ఖాతాలో నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఈ ఫీచర్ వల్ల ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే భాద తప్పుతుంది. ఎంత ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ను పొందాలంటే యూజర్లు మైజియో యాప్లో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5,000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ లావాదేవీ కోసం మీరు యుపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదు. (చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!) -
వాట్సాప్లో యూపీఐ పిన్ మార్చడం ఎలానో తెలుసా..?
తన ప్లాట్ ఫారంలోని వినియోగదారులకు అంతరాయం లేని అనుభవాన్ని అందించడానికి వాట్సప్ యూపీఐ సేవలను కూడా అందిస్తుంది. ఈ యూపీఐ సేవల వల్ల వాట్సాప్ యాప్ నుంచి ఇతరులకు నేరుగా డబ్బును బదిలీ చేయవచ్చు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2018లో భారతదేశంలో ఈ ఫీచర్ ట్రయల్ రన్ చేసింది. ఆ తరువాత 2020లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) ఆమోదం తర్వాత విడుదల చేసింది. ఈ యాప్ 227కు పైగా బ్యాంకుల సేవలను అందిస్తుంది. యూజర్లు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అలాగే, యుపీఐ పిన్ కూడా మార్చవచ్చు. వాట్సాప్లో యూపీఐ పిన్ ఎలా మార్చాలి..? మొదట స్మార్ట్ఫోన్లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఎగువ కుడివైపున ఉన్న మూడు చుక్కల ఐకాన్ మీద ప్రెస్ చేసి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ పేమెంట్స్ సెక్షన్ కింద యూపీఐ పిన్ నెంబరు మార్చాలనుకుంటున్న బ్యాంకు అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత Change UPI PIN మీద క్లిక్ చేయండి. ఇప్పటికే ఉన్న యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఆ తర్వాత కొత్త యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. చివరిగా పిన్ను కన్ఫామ్ చేస్తే సరిపోతుంది. మీ పిన్ చేంజ్ అవుతుంది. (చదవండి: కొత్త ఏడాదిలో భారీగా పడిపోతున్న బంగారం ధర..!) -
యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..!
యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్..! ఇకపై విదేశాల్లోని భారతీయులు జరిపే నగదు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ యూపీఐ నగదు లావాదేవీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ యూనియన్తో ఒప్పందం.. భారత నగదు చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) ప్రముఖ విదేశీ నగదు ట్రాన్స్ఫర్ సంస్థ వెస్ట్రన్ యూనియన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతరులు యూపీఐ పేమెంట్ యాప్స్ను ఉపయోగించి నగదు లావాదేవీలను జరపవచ్చునని ఎన్ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లాతో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్రన్ యూనియన్, పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో నివసిస్తోన్న 30 మిలియన్ల భారతీయులకు లబ్ధి చేకూరనుంది. మరింత సులువుగా..వేగంగా..! ఇతర దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతర వ్యక్తులు భారత్లోని యూపీఐ కస్టమర్లు నగదు లావాదేవీలను సులభంగా, వేగంగా జరుపవచ్చును. వెస్ట్రన్ యూనియన్ , యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్ల ద్వారా డబ్బు పంపించుకోవచ్చును. ఛార్జీలు ఏలా ఉంటాయంటే..! విదేశీ మార్కెట్లో రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిపే లావాదేవీలోని ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, అందుబాటులోని ఛానెల్లపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఎన్పీసీఐ , వెస్ట్రన్ యూనియన్ భాగస్వామ్యంతో ఆయా లావాదేవీల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్న్యూస్..! -
ఎన్నారైలకు శుభవార్త ! రెమిటెన్సులు ఇకపై సులభం
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి భారతీయులు ఇక మరింత సులభంగా డబ్బును అందుకునే (రెమిటెన్సులు) వెసులుబాటు ఏర్పడింది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించడం ద్వారా సరిహద్దు నగదు బదిలీని సులభతరం చేయడానికి ఉద్దేశించి ఎన్పీసీఐతో (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇండస్ఇండ్ బ్యాంక్ అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. తాజా చొరవతో రెమిటెన్సులు లేదా ఎన్ఆర్ఐ చెల్లింపుల కోసం యూపీఐ ఐడీని వినియోగంలోకి తీసుకువస్తున్న తొలి భారతీయ బ్యాంక్గా ఇండస్ఇండ్ నిలవనుందని ప్రకటన వివరించింది. ఈ విధానం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఆపరేటర్లు (ఎంటీఓ).. ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపు వ్యవస్థలో అనుసంధానం కావడానికి, లబ్దిదారుల ఖాతాల్లోకి రెమిటెన్సుల చెల్లింపులకు ఇండస్ఇండ్ బ్యాంక్ చానెల్ని వినియోగించుకుంటారు. థాయ్లాండ్తో ప్రారంభం థాయ్లాండ్తో తన తాజా రెమిటెన్సుల విధానాన్ని బ్యాంక్ ప్రారంభించింది. ఇందుకుగాను థాయ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ సేవల సంస్థ– ‘డీమనీ’ సేవలను బ్యాంక్ వినియోగించుకోనుంది. నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ అత్యుత్తమ సేవలను అందిస్తోంది. డీమనీ వెబ్సైట్లో భారతదేశంలోని లబ్ధిదారుల యూపీఐ ఐడీలను జోడించి, విదేశాల్లోని భారతీయులు ఎవరైనా సులభంగా నిధులను బదిలీ చేయవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. భారత్దేశంలోని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పనిలేకుండా కేవలం వారి యూపీఐ ఐడీలను యాడ్ (జోడించడం) చేసుకోవడం ద్వారా ఎన్ఆర్ఐలు తేలిగ్గా నిధుల బదలాయింపు జరపడంలో తమ చొరవ కీలకమైనదని ప్రకటనలో బ్యాంక్ హెడ్ (కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్) సౌమిత్ర సేన్ పేర్కొన్నారు. యూపీఐ వినియోగించే అంతర్జాతీయ పర్యాటకులకు తాజా ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీన్ రాయ్ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా రెమిటెన్సులకు సంబంధించి తాజా చొరవ గొప్ప ముందడుగని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం -
ఆర్థిక నేరాల కట్టడికి ‘ఆధార్’ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలను గుర్తించేందుకు ఆధార్ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. రాబోయే మూడు–నాలుగేళ్లలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగలదని ఆధార్ 2.0 వర్క్షాప్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందే గుర్తించే వీలు విశిష్ట గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ ఎంతో విలువైనదని, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దిలీప్ అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడమనేది పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రస్తుతం పాన్ను, ఆధార్ను అనుసంధానించడం వల్ల, ఒక వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అన్నీ కూడా ఆధార్కు లింక్ అయి ఉంటాయి. అనుమానాస్పద కేసుల్లో ఈ డేటాను మరింత లోతుగా పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత సందర్భాలను కూడా గుర్తించవచ్చు‘ అని దిలీప్ చెప్పారు. ఎవరైనా కస్టమర్ ఆర్థిక మోసానికి పాల్పడితే .. పలు సంస్థలపై దాని ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి మోసాలను ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. అయితే, ఆధార్లాంటి విశిష్టమైన పత్రంతో మోసాలకు సంబంధించిన ఒక రిపాజిటరీని తయారు చేయొచ్చు. ఒక వ్యక్తి మోసం చేస్తే వారికి సిమ్ కార్డ్ మొదలుకుని బ్యాంక్ ఖాతా, వాలెట్ లాంటివి ఏవీ మళ్లీ లభించకుండా చేయొచ్చు. ఈ విధంగా మోసగాళ్లను ఆదిలోనే గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయొచ్చు’ అని అన్నారు. చదవండి:‘ఆధార్పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’ -
డీమానిటైజేషన్తో పెరిగిన డిజిటల్ చెల్లింపులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కాస్త మందకొడిగా అయినప్పటికీ చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ పరిస్థితుల మధ్య ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల వినియోగం ఎగిసింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016లో రూ. 17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉండగా 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కి చెందిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ).. పేమెంట్లకు ప్రధాన మాధ్యమంగా మారుతోంది. 2016లో యూపీఐని ఆవిష్కరించగా కొన్ని సందర్భాలు మినహా ప్రతి నెలా లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 అక్టోబర్లో లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబర్లో యూపీఐ ద్వారా 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: మెటావర్స్పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
అక్టోబర్లో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు!
UPI Records: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ నెలలో 4 బిలియన్లకు పైగా యుపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. పండుగ సీజన్ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. విలువ పరంగా అక్టోబర్ నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.7.71 ట్రిలియన్లకు సమానం. సెప్టెంబర్ నెలలో రూ.6.5 ట్రిలియన్ విలువైన 3.65 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ప్రతి నెల యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం జంప్ అయితే, అక్టోబర్ నెలలో లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ప్రతి సంవత్స రం లావాదేవీల పరిమాణం రెట్టింపు అవుతూ వస్తున్నాయి. 2016లో ప్రారంభించబడిన యూపీఐ అద్భుతమైన ప్రజాదరణ పొందింది. కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. 2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది. (చదవండి: మార్క్ జుకర్బర్గ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
ఈ-రూపీని ప్రారంభించిన మోదీ
e-RUPI Launch సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగదు రహిత లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని మరింత ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ-రూపీ((E-RUPI))ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా దీనిని ప్రారంభించారు మోదీ. భారత్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ-రూపీ అంటే.. డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-రూపీని తీసుకొచ్చారు. సేఫ్, సెక్యూర్ ఆధారంగా ఈ-రూపీ వినియోగం ఉండనుంది. ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లను లబ్ధిదారుడికి పంపడం ద్వారా చెల్లింపులు జరుగుతాయి. బ్యాంక్ ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా వినియోగదారుడు లావాదేవీలు జరుపవచ్చు. దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే కార్డు, పేమెంట్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ-రూపీ అంటే ఏమిటి.. ఎలా ఉపయోగించాలి?
e-RUPI: నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా రేపు(ఆగస్టు 2) ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థ(E-RUPI)ను ప్రవేశపెట్టనుంది. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ-రూపీ వోచర్లను ఎలా ఉపయోగించాలి? ఈ వోచర్లు ఇ-గిఫ్ట్ కార్డులు వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కార్డుల కోడ్ ని ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పంచుకోవచ్చు. ఉదాహరణకు, కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు మీరు ఈ-రూపీ వోచర్లను తీసుకున్నట్లయితే వాటిని కేవలం వ్యాక్సిన్ల కొరకు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఇతర పేమెంట్స్ కంటే ఈ-రూపీ ఎందుకు భిన్నం? ఈ-రూపీ అనేది ఎలాంటి ఫ్లాట్ ఫారం కాదు. ఇది నిర్ధిష్ట సేవల కొరకు ఉద్దేశించబడిన వోచర్. ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులోని ప్రధాన తేడా. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి. కార్పొరేట్లు తమ ఉద్యోగుల కొరకు ఈ వోచర్లను జారీ చేయవచ్చు. వ్యాక్సిన్ ఈ-వోచర్ కోసం ఒక ఆప్షన్ తీసుకువస్తామని కేంద్రం ఇంతకు ముందు తెలిపింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం ఈ-వోచర్ కొనుగోలు చేయవచ్చు, అలాగే మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. ఎలా రీడీమ్ చేసుకోవాలి? వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. -
నగదు రహిత లావాదేవీలు ఎంత పెరిగాయంటే ?
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికి యూపీఐ లావాదేవీలు నెలకు 11.6 శాతం వృద్ధి రేటుతో రూ.5.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో యూపీఐ లావాదేవీలు రూ.4.91 లక్షల కోట్లుగా ఉన్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. యూపీఐ లావాదేవీల సంఖ్య జూన్లో 280 కోట్లుగా ఉండగా.. మే నెలలో 253 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యాజమాన్యంలో దేశంలో రిటైల్ చెల్లింపులు, పరిష్కార వ్యవస్థలను నిర్వహించే వ్యవస్థనే ఎన్పీసీఐ. ఇది ఒకే మొబైల్ అప్లికేషన్లో బహుళ బ్యాంక్ ఖాతాల నుంచి ఆర్ధిక లావాదేవీలను నిర్వహించే వీలు కల్పిస్తుంది. చదవండి : కాఫీడే....చేదు ఫలితాలు -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్పే టాప్లో నిలిచింది. ఫ్లిప్కార్ట్ మద్దతున్న ఫోన్పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్మార్ట్కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్గా ఫోన్పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్తో ఉన్న ఫోన్పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి
న్యూఢిల్లీ: యుపీఐ ప్లాట్ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి ముఖ్య గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) యుపీఐ ప్లాట్ఫాం అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రాబోయే కొద్ది రోజులు పాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్ చేయకండి అని యుపీఐ యూజర్లను కోరింది. అయితే అది ఎన్ని రోజులు అనేది ఎన్పిసిఐ పేర్కొనలేదు. కేవలం “రాబోయే కొద్ది రోజులు” అని మాత్రమే పేర్కొన్నారు. వినియోగదారులు ఎన్పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా తెలిపింది.(చదవండి: 'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్పే) To create a better architecture for the growth of UPI transactions, the UPI platform will be under an upgradation process for next few days from 1AM - 3AM. Users may face inconvenience, so we urge you all to plan your payments. pic.twitter.com/oZ5A8AWqAB — India Be Safe. India Pay Digital. (@NPCI_NPCI) January 21, 2021 ఆన్లైన్ లావాదేవీల కోసం చాలా మంది వినియోగదారులు యుపీఐ యాప్ ల మీద ఆధారపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం భీమ్ యుపీఐ ప్లాట్ఫామ్లో 165 బ్యాంకులు లింక్ అయ్యి ఉన్నాయి. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు భారీ మొత్తంలో జరిగాయి. అంతేకాకుండా ఈ యుపీఐ యాప్ లో డిస్కౌంట్ కూపన్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వినియోగదారులను వీటికి ఆకర్షితులు అవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ) యాప్గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు ఎన్పిసిఐ పేర్కొంది. -
'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్పే
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) యాప్గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. మరోవైపు గూగుల్ పేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రెండు యాప్లు మొత్తం 4,16,176.21 కోట్ల యుపిఐ లావాదేవీల వాల్యూమ్లో 86 శాతానికి పైగా ఉన్నాయి.(చదవండి: అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం) ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం, ఫోన్పే డిసెంబరులో లావాదేవీ విలువ గత నెల లావాదేవీల విలువతో పోల్చితే 3.87(868.4 మిలియన్) శాతం పెరుగుదల కనిపించింది. అలాగే, నవంబర్లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది. అదే గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం(960.02 మిలియన్)లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది. 31,291.83 కోట్ల రూపాయల విలువైన 256.36 మిలియన్ లావాదేవీలతో పేటీఎం మూడో స్థానంలో నిలువగా, కొత్తగా డిజిటల్ పేమెంట్ రంగంలోకి ప్రవేశించిన వాట్సాప్ రూ.29.72 కోట్ల విలువైన 810,000 లావాదేవీలను నిర్వహించింది. -
‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు డబ్బులను పంపించడం కోసం ఆన్లైన్ చెల్లింపులు మీద ఆధారపడుతున్నారు. దీంతో 2020లో యూపీఐ లావాదేవీల విలువ 105 శాతం పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ) 2019 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు లావాదేవీల విలువలో 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్ చివరిలో యుపీఐ ప్లాట్ఫాం లావాదేవీల మొత్తం విలువ రూ.2,02,520.76 కోట్లుకు పైగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 2020 డిసెంబర్ నాటికి రూ.4,16,176.21 కోట్లకు చేరుకుంది.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?) గత ఏడాది 2020 సెప్టెంబర్లో రూ.3 లక్షల కోట్ల బెంచ్మార్క్ను దాటింది. యుపీఐ ప్లాట్ఫాం ద్వారా 2019 డిసెంబర్ చివరి నాటికి 1308.40 మిలియన్ లావాదేవీలను జరపగా.. అదే 2020 డిసెంబర్ చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 2234.16 మిలియన్లకు చేరుకుంది. యుపీఐ ప్రతి నెలా లావాదేవీల సంఖ్య అక్టోబర్ నుండి రెండు బిలియన్ల మార్కును దాటుతోంది. అక్టోబర్ 2020లో మొదటిసారి ఈ సంఖ్యను దాటింది. అయితే, ఇటీవల ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధిస్తారనే రూమర్లు బాగా వినిపిస్తాయి. మొత్తానికి ఈ ప్రచారం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరిపే వారికి ఇది గొప్ప ఉపశమనం. ఎప్పటి లాగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్ కార్నివాల్’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్ డెలివరి, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్లెస్, క్యాష్లెస్ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్పీసీఐ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాతియా తెలిపారు. -
ఎన్పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు భారీ షాక్ ఇవ్వనుంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్దమవుతోంది. తద్వారా ఎన్పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ చెప్పాలని భావిస్తోంది. అంతేకాదు ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం. (ఎస్బీఐ కొత్త చైర్మన్గా దినేష్ కుమార్) దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ప్రాధమిక వాటాదారుగా ప్రవేశించే ప్రణాళికలను ఎస్బీఐ సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి మొదటి దశ చర్చలు పూర్తి చేసిందని, ఆర్బీఐ న్యూ అంబరిల్లా ఎంటిటీ(ఎన్ఈయూ) ఫ్రేమ్వర్క్ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తను ప్రధాన ప్రమోటర్ గా, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులతో కన్సార్షియం ఏర్పాటుకు ఆహ్వానిస్తోంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన నిబంధనల ప్రకారం, డిజిటల్ చెల్లింపులకు ఆమోదం పొందిన ఏ కొత్త గొడుగు సంస్థ అయినా ఎన్పీసీఐ తరహా అధికారాలను సొంతం చేసుకోవచ్చు. 500 కోట్ల రూపాయల నికర పెట్టుబడి అవసరం. ఇందుకు దరఖాస్తు సమర్పించడానికి జనవరి, 2021 గడువుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ కొత్త వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. (ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట) కాగా ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఎ) సంయక్త ఆధ్వర్యంలో 2008లో ఎన్పీసీఐ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 60 శాతం చెల్లింపు లను వాల్యూమ్లను ఎన్పీసీఐ నియంత్రిస్తుంది. ఎస్బీఐ సహా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపిఎస్), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) వంటి సేవలను అందిస్తోంది. -
ప్రతి గడపకూ ప్రభుత్వ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలు, పరిపాలనను తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీనికోసమే గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వలంటీర్ల వ్యవస్థను తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయాల్లో .డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించారు. దీనిద్వారా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత సులభంగా, సురక్షితంగా, డిజిటల్, క్యూ ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అందుతుంది. కెనరా బ్యాంకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో సచివాలయాల్లో యూపీఐ సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 545కిపైగా సేవలందిస్తున్నాం. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించి వారికి బాధ్యతను అప్పగించాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డిజిటల్ పేమెంట్ వ్యవస్థను తెచ్చాం. కెనరా బ్యాంకును అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ► కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్ పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్లో కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్.వి.ప్రభాకర్, ఎన్పీసీఐ ఎండీ, సీఈవో దిలీప్ అస్బే పాల్గొన్నారు. భాగస్వామి కావడం సంతోషంగా ఉంది ‘రాష్ట్రంలో సామాన్యుడికి కూడా డిజిటల్ చెల్లింపులు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 15004 సచివాలయాల్లో క్యూఆర్ కోడ్ విధానంలో చెల్లింపులు చేసే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ – ఎల్.వి. ప్రభాకర్, ఎండీ, సీఈవో, కెనరా బ్యాంకు చరిత్రాత్మకం ‘సచివాలయాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ తేవడం చరిత్రాత్మకం. కోవిడ్ 19 సమయంలో డిజిటల్ పేమెంట్స్ పెంచడంపై దృష్టి సారించాం. జూలైలో దేశంలో 149 కోట్ల లావాదేవీలు జరిగాయి’ – దిలీప్ అస్బే ఎండీ, సీఈవో, ఎన్పీసీఐ -
నగరంలో ‘పేమెంట్’ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పేమెంట్ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వ హించడం, వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డేటా సెంటర్ను ఎన్పీసీఐ నిర్మి స్తోంది. ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్/ ఆన్లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భ స్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరం గా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచు కోవడానికి దోహదపడ్డాయి. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ డేటా సెంటర్ను నిర్మించను న్నారు. ఎల్అండ్టీ సంస్థకు ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యక్యాదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్లో గూగుల్ పే బ్యాన్? ఎన్పీసీఐ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో గూగుల్ పే యాప్ను ఆర్బీఐ బ్యాన్ చేసిందంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్ పే యాప్ను ఇండియాలో బ్యాన్ చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అంతకు క్రితం గూగుల్ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్ పే యాప్ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది. తమ యాప్ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. ( గూగుల్ పే.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు) కాగా, గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని ఆర్బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే గూగుల్ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్లతో కూడిన బెంచ్కు ఆర్బీఐ నివేదించింది. -
వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్పాం వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వాట్సాప్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాట్సాప్ పే సేవల్లో జాప్యానికి కారణమైన డేటా లోకలైజేషన్ నిబంధనలపై నియంత్రణసంస్ధలకు భరోసా ఇవ్వడంతో క్లియరెన్స్లు లభించాయి. డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వాట్సాప్ రెగ్యులేటర్లకు స్పష్టం చేసింది. తొలి దశలో భాగంగా వాట్సాప్ భారత్లో కోటి యూజర్లకు చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇతర నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టే క్రమంలో పూర్తిస్ధాయిలో వాట్సాప్ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం. వాట్సాప్ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా ఇది మారుతుందని భావిస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పేలను 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్ పే దీటుగా అధిగమిస్తుందని అంచనా. కాగా 2018 ఫిబ్రవరిలో ట్రయల్ రన్ కింద ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యం ద్వారా వాట్సాప్ పదిలక్షల మంది యూజర్లకు చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ ప్రమాణాలతో వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు వాట్సాప్ నియంత్రణ సంస్ధల అనుమతుల కోసం వేచిచూస్తోంది. చదవండి : వాట్సాప్ వండర్ బాక్స్ : భలే షార్ట్కట్ -
రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డులు @ 2.5 కోట్లు
న్యూఢిల్లీ: రూపే డిస్కవర్ గ్లోబల్ కార్డుల సంఖ్య 2.5 కోట్ల మైలురాయిని అధిగమించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేర్కొంది. బ్యాంకులు 2014 నుంచి ఈ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. ఎన్పీసీఐ ఈ రూపే కార్డుల అంతర్జాతీయ ఆమోదాన్ని విస్తరించడానికి డిస్కవర్ పైనాన్షియల్ సర్వీసెస్తో (డీఎఫ్ఎస్) భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలిసిందే. 2.5 కోట్ల మంది అంతర్జాతీయంగా 185 దేశాల్లో, 4 కోట్ల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టర్మినల్స్లో, 19 లక్షలకుపైగా ఏటీఎంలలో డిస్కవర్ గ్లోబల్ కార్డులను వినియోగిస్తున్నారని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ) దిలిప్ అస్బె తెలిపారు. కాగా రూపే గ్లోబల్ కార్డు.. గ్లోబల్ క్లాసిక్ డెబిట్ కార్డ్, గ్లోబల్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డ్, సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అనే ఐదు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూపే గ్లోబల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులను 32 బ్యాంకులు ఇష్యూ చేస్తున్నాయి. కాగా ఎన్పీసీఐ భారత్ వెలుపల లావాదేవీల కోసం డిస్కవర్ కార్డులను జారీ చేస్తుంది. రూపే తొలి అంతర్జాతీయ భాగస్వామిగా సింగపూర్! దేశీ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ రూపే కార్డు ప్రమోషన్కు సాయమందిస్తామని సింగపూర్ ప్రకటించింది. రూపే కార్డుకు తొలి అంతర్జాతీయ భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ను పెంచడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉబెర్ రైడ్స్కు యూపీఐ ద్వారా చెల్లింపు
ఎన్పీసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో భాగస్వామ్యం న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ తాజాగా తన ప్లాట్ఫామ్కు యూపీఐ సేవలను అనుసంధానించింది. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఉబెర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన 4.5 లక్షలకుపైగా డ్రైవర్లు యూపీఐ ద్వారా పేమెంట్స్ను స్వీకరించొచ్చు. అంటే మనం కూడా ఉబెర్ రైడ్స్కు అయిన మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. కాగా ఇప్పటి వరకు యూజర్లు క్యాష్, డెబిట్/క్రెడిట్ కార్డులు, పేటీఎం వాలెట్ ద్వారా ఉబెర్ రైడ్స్కు చెల్లింపులు చేస్తున్నారు. ఆ మూడు మార్కెట్లపై ప్రధాన దృష్టి ఉబెర్.. భారత్, బ్రెజిల్, మెక్సికో మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. తద్వారా కంపెనీ వృద్ధిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జూలైలో భారత్లో 115 శాతం వృద్ధిని సాధించినట్లు ఉబెర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ బిజినెస్) డేవిడ్ రిచ్టర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమ ప్లాట్ఫామ్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి మరిన్ని సొల్యూషన్స్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే కంపెనీ ఈ దిశగా పలు చర్యలు తీసుకుందని, ప్లాట్ఫామ్కు యూపీఐ సేవల అనుసంధానం ఇందులో భాగమేనని తెలిపారు. తమకు అమెరికా వెలుపల భారత్ అతిపెద్ద మార్కెట్ అని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... అందుబాటులో ఉండే, అభివృద్ధికి సహకరించే టెక్నాలజీలను కలిగి ఉండటమే డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
వాట్సాప్లోకి త్వరలో ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
మెసేజింగ్ లో ఇప్పటికే వాట్సాప్ తనదైన ముద్ర వేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ఫీచర్ తో వినియోగదారులను అలరించేందుకు వచ్చేస్తోంది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోతుండటంతో యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేలా తమ యూజర్లకు అవకాశం కల్పించాలని సిద్ధమవుతోంది. ఇప్పటికే వాట్సాప్ దేశీయ బ్యాంకులు, ఇతర ఇన్ స్టిట్యూషన్లతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది. యూపీఐ ద్వారా తమ మొబైల్ ప్లాట్ ఫామ్ పైననే రెండు బ్యాంకుల మధ్య ఇన్ స్టాంట్ ఫండ్ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. ఈ సేవల ప్రారంభంలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా వాట్సాప్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ, ఇతర కొన్ని బ్యాంకులతో చర్చిస్తోందని, బ్యాంకులు, ఎన్పీసీఐతో తమ సిస్టమ్ ఎలా ఇంటిగ్రేట్ అవాలో నిర్ణయిస్తుందని ఓ సీనియర్ ఎస్బీఐ అధికారి చెప్పారు. యూపీఐను ఎన్పీసీఐ రన్ చేస్తోంది. ఈ యూపీఐ ఆధారంగా పనిచేసే 'పీర్-టు-పీర్(పర్సన్ నుంచి పర్సన్)' పేమెంట్ సేవలను వాట్సాప్ లో యూజర్లు వినియోగించుకోవచ్చు. నోట్ల రద్దు అనంతరం దేశాన్ని క్యాష్ లెస్ సొసైటీగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాష్ లెస్ సొసైటీలో తాము భాగస్వామ్యం కావాలని సోషల్ మీడియా దిగ్గజాలు నిర్ణయించాయి. ఈ మేరకు హైక్ మొన్ననే పేమెంట్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ కంటే ముందస్తుగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టి, పేమెంట్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తొలి మెసేజింగ్ యాప్ గా పేరు తెచ్చుకుంది. అయితే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ ను అమలు చేయాలంటే కొన్ని సెక్యురిటీ ప్రొటోకాల్స్ అవసరం పడతాయని, ఒకవేళ దీనికి ఆధార్ వాడాలనుకుంటే, అప్పుడు తాము బయోమెట్రిక్ అథన్టికేషన్ ఎనేబుల్ చేస్తామని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్ కు భారత్ లో 20 కోట్ల మంది యూజర్లున్నారు. వారిని మరింత పెంచుకునేందుకు వాట్సాప్ కృషిచేస్తోంది.