ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇక అది అవసరం లేదు! | online money transfer Rules changed | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇక అది అవసరం లేదు!

Jan 29 2024 9:35 PM | Updated on Jan 29 2024 9:36 PM

online money transfer Rules changed - Sakshi

IMPS Rules change: ఒక బ్యాంక్‌ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది.

2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్‌ ఛానెల్‌లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్‌ మనీ ఐడెంటిఫైయర్‌- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్‌ చేయాలని రిమిటర్‌ బ్యాంకులకు సూచించింది.

ఐఎంపీఎస్‌ అంటే..
ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్‌ఎంఎస్‌, ఐబీఆర్‌ఎస్‌ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి.

ఈ ఐఎంపీఎస్‌ ప్రస్తుతానికి P2A (అకౌంట్‌ + ఐఎఫ్‌ఎస్‌సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్‌ఫర్‌ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్‌తో ఎక్కువ అకౌంట్‌లను లింక్‌ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్‌కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement