జమ్మూలోని కిష్ట్వార్ పట్టణంలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శనివారం ఉదయం మరణించాడని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు.
జమ్మూలోని కిష్ట్వార్ పట్టణంలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శనివారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు. అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏవి తమ వద్ద లేదని వారు తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఇరు మతాలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులును జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో భాగంగా ఇరు మతాలకు చెందని ఆందోళనకారులు పట్టణంలో దుకాణాలు, కార్యాలయాలు, పెట్రోల్ పంపులను తగుల బెట్టారు. ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు పట్టణంలో నిరవధిక కర్ప్యూ ను విధించారు.
రెండో రోజు కూడా ఆ కర్ప్యూ కొనసాగుతుంది. ఘర్షణలో నిన్న మరణించిన మృతుడు అరవింద కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో జిల్లా ఉన్నతాధికారులను బదిలీ చేస్తు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తుర్వులు జారీ చేసింది.