60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్కు.. | PM Narendra Modi leaves for Ireland | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్కు..

Published Wed, Sep 23 2015 6:47 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ బయలుదేరేముందు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ - Sakshi

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ బయలుదేరేముందు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కు బయలుదేరారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు.  

బుధవారం సాయంత్రం అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళ్లేముందు.. ఐర్లండ్‌లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement