irland tour
-
కెప్టెన్గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
స్వదేశంలో జరిగే ఇంగ్లండ్,ఐర్లాండ్ సిరీస్లకు వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్లో భాగంగా ఐర్లాండ్తో వెస్టిండీస్ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి8న జమైకా వేదికగా తొలి వన్డే జరగనుంది. కాగా మొత్తం మూడు వన్డేలు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్తో 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. తొలి టీ20 బార్బడోస్ వేదికగా జరగనుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్లు బార్బడోస్లోనే జరగనున్నాయి. కాగా గత ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ పర్యటించిన వెస్టిండీస్ వైట్వాష్ గురై ఘోర పరాభావం మూట కట్టుకుంది. మూడు టీ20 సిరీస్ను 3-0తో పాక్ కైవసం చేసుకుంది. అయితే పాక్ పర్యటనకు గాయంతో దూరమైన పొలార్డ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ వన్డేలకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ , డెవాన్ థామస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్ (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), డారెన్ బ్రావో (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, షాయ్ హోప్, అకెల్ హోసేన్, జాసన్ హోల్డర్, బ్రాండ్ , కైల్ మేయర్స్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: ట్రవిస్ హెడ్కు కరోనా... మరి యాషెస్ సిరీస్? -
భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు
సాక్షి: హాలిడే ట్రిప్ కోసం విదేశానికెళ్లిన భారతీయ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రసూన్ భట్టాచార్య అనే భారతీయుడు తన కుటుంబంతో మూడ్రోజుల పాటు విహారయాత్రకు ఐర్లాండ్ వెళ్లాడు. అందులో భాగంగా బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్కు రైలులో వెళ్తున్న వీరిని, పక్కనే కూర్చున్న తోటి ప్రయాణీకుడు జాత్యహంకారంతో దాదాపు గంటపాటు దుర్భాషాలాడాడు. భాష, యాసలను చూసి అవమాన పరిచాడు. వారించాల్సిన రైలు గార్డు వీరిని పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఈ వివరాలతో ప్రసూన్ భట్టాచార్య మోదీని, ఐర్లాండ్ ప్రధానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారి స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మరియు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఆదేశ రైల్వే ప్రసూన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. -
ఐర్లాండ్తో ఆత్మీయ అనుబంధం
మండలిలో శాశ్వత స్థానానికి మద్దతివ్వండి.. ఐర్లాండ్ ప్రధానిని కోరిన మోదీ డబ్లిన్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో, అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ) సహా అంతర్జాతీయ ఎగుమతుల సంస్థల్లో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతునివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐర్లాండ్ను కోరారు. అమెరికా పర్యటనకు వెళ్లేముందు బుధవారం ఆ దేశంలో పర్యటించిన మోదీ డబ్లిన్లో ఐర్లాండ్ ప్రధాని ఎన్డాకెన్నీతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, యూరప్, ఆసియాల్లో పరిస్థితి సహా పలు అంశాలపై తాము మాట్లాడామని అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ పేర్కొన్నారు. ప్రపంచ, ప్రాంతీయ అనిశ్చితులు, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఐర్లాండ్ వీసా విధానం భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల అవసరాల పట్ల మృదువుగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఉంటాయన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, డబ్ల్యు.బి.యీట్స్ల మధ్య స్నేహం మొదలుకొని.. భారత్లో సిస్టర్ నివేదిత ఆధ్యాత్మిక సేవ వరకూ ఐరిష్ - భారత ప్రజల మధ్య బలమైన సంబంధాలు నెలకొన్నాయని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఐరిష్ ప్రజల్లో 26,000 మంది భారతీయులు భాగంగా ఉన్నారని చెప్పారు. 1985లో పేల్చివేతకు గురైన ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాధితులు ఇక్కడే శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ ప్రధానికి మోదీ కానుకలు బ్రిటిష్ పాలన నాటి ఇద్దరు ఐర్లండ్ అధికారులు థామస్ ఓల్ధామ్, జార్జ్ అబ్రహామ్ గ్రీర్సన్లకు సంబంధించి పలు చారిత్రక పత్రాల నమూనాలను నరేంద్రమోదీ బుధవారం ఐర్లాండ్ ప్రధాని ఎన్డాకెన్నీకి కానుకగా బహూకరించారు. డబ్లిన్లో జన్మించిన ఓల్ధామ్ 1850లో భారత్లో భౌగోళిక సర్వేయర్గా నియమితులయ్యారు. ఆయన విధుల్లో చేరిన రోజును భారత్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపనా దినోత్సవంగా పాటిస్తున్నారు. భారత్లో బొగ్గు, ఇతర ఖనిజ గనులపై సర్వే చేయటంతో పాటు.. ఇక్కడి శిలాజాల గురించీ ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు.ఇక గ్రీర్సన్ 1889 మొదలుకొని భారత్లో తొలి భాషా ప్రాతిపదిక సర్వే నిర్వహించారు. వీరు రూపొందించిన పత్రాలను ప్రస్తుతం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రంచేసి ఉంచారు. ఈ పత్రాల నమూనాలతో పాటు.. ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన వెండి, చలువరాయిలతో కూడిన కొవ్వొత్తి స్టాండు ను కూడా ఎన్డాకు మోదీ కానుకగా అందించారు. ఐరిష్ చిన్నారులు చెబుతున్న సంస్కృత శ్లోకాలను వింటున్న మోదీ ఇదే ఇండియాలో జరిగితే ప్రశ్నలు తలెత్తేవి డబ్లిన్లో భారతీయుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీకి ఐరిష్ చిన్నారులు సంస్కృత శ్లోకాలతో స్వాగతం చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘ఇదే ఇండియాలో జరిగితే దీనిపై ప్రశ్నలు లేవనెత్తేవారు’’ అంటూ దేశంలోని లౌకికవాదులపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. సంస్కృత శ్లోకాలలోని సందేశాన్ని చిన్నారులు అవగతం చేసుకున్న తీరు తనకు ముచ్చటగొలుపుతోందని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యున్నత దేశాల్లో భారత్ ఉందని.. ప్రపంచమంతా ఇండియా గురించే మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత అభివృద్ధి వేగాన్ని కొనసాగించగలిగితే వచ్చే 30 ఏళ్లలో దేశంలో పేదరికం ఆనవాళ్లు కూడా కనిపించవన్నారు. భారత జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనంటూ.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే నిజమైన ఆస్తులు వారేనని అభివర్ణించారు. -
ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐర్లాండ్ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మోదీ బృందం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ చేరుకుంది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు. ఐర్లాండ్లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. ఈ రోజు సాయంత్రం మోదీ అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళతారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు. -
60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్కు..
-
60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్కు..
న్యూఢిల్లీ: 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కు బయలుదేరారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు. బుధవారం సాయంత్రం అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళ్లేముందు.. ఐర్లండ్లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.