ఈజిప్టులోని సినాయ్ ప్రాంతంలో ఓ ఇంటిపై రాకెట్ దాడి జరగడంతో తొమ్మిదేళ్ల బాలిక మరణించింది. వాస్తవానికి ఆ ఇంటికి సమీపం నుంచి వెళ్తున్న భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు రాకెట్ ప్రయోగించగా, అది కాస్తా ఆ ఇంటిమీద పడటంతో బాలిక మరణించింది, మరో బాలిక తీవ్రంగా గాపడింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని ఉత్తర సినాయ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.
గత వారం రోజుల్లో భద్రతాదళాల చేతుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు మరణించారు. దానికి ప్రతీకారంగా భద్రతాదళాలను హతమార్చాలని ఈ రాకెట్ దాడి చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉగ్రవాదులను హతమార్చేందుకు సైన్యం భారీస్థాయిలో దాడులు చేసింది. అంతకుముందు ఇద్దరు పోలీసులను, సైనికాధికారులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా ప్రతీకార దాడులు అక్కడ నిరంతరం కొనసాగుతున్నాయి.
రాకెట్ దాడిలో బాలిక మృతి
Published Tue, Jul 29 2014 4:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement
Advertisement