బల్లి పడ్డ భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత | Students to get upset by having lizard food | Sakshi

బల్లి పడ్డ భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

Aug 21 2015 1:35 AM | Updated on Nov 9 2018 4:52 PM

బల్లిపడ్డ ఆహారం తినడంతో 15 మందివిద్యార్థులు గురువారంఅస్వస్థతకు గురయ్యారు.

చిత్తూరు (అర్బన్) : బల్లిపడ్డ ఆహారం తినడంతో 15 మందివిద్యార్థులు గురువారంఅస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన చిత్తూరు నగరంలోని కస్తూర్భా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నగరంలోని ఖాజీ కార్పొరేషన్ పాఠశాల నుంచి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులకు వడ్డిస్తారు. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం కూడా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆ భోజనర తిన్న కొంతసేపటికి ఐదుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి.

తరువాత మరికొంత మంది వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత భోజనంలో బల్లిపడ్డట్టు గుర్తించారు. భోజనం పెట్టే సమయంలో ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో లేరు. ఉపాధ్యాయులు ఆమెకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేంతవరకు పిల్లలకు ప్రథమ చికిత్స కూడా అందించకుండా పాఠశాలలోనే ఉంచేశారు. తరువాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థులు కోలుకున్న తరువాత పాఠశాలకు తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement