మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే! | Survey predicts BJP win in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీనే!

Published Thu, Nov 21 2013 3:17 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్‌లో మెజారిటీకి అవసరమైన సీట్లను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుందని బుధవారం ఒక సర్వే వెల్లడించింది.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో మెజారిటీకి అవసరమైన సీట్లను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుందని బుధవారం ఒక సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్- దైనిక్ భాస్కర్- నీల్సన్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ 41 శాతం ఓట్లతో 155 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. 33 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లలో గెలుపు సాధిస్తుందని తెలిపింది. బహుజన్ సమాజ్ పార్టీకి 6 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎంపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం చౌహాన్ పనితీరును ‘చాలా బావుంది’ అని పేర్కొనగా,  80 శాతం బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement