
తాలిబన్ సంస్కృతి వద్దు
న్యూఢిల్లీ: దేశంలో తాలిబన్ సంస్కృతికి తావు లేదని జేఎన్యూలోని ఏబీవీపీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. జేఎన్యూ సంక్షోభంపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. కన్హయ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు చూడాలని జేఎన్యూలో ఏబీవీపీ నేత ప్రదీప్ నర్వాల్ అన్నారు. ప్రదీప్తోపాటు జేఎన్యూ స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్లో ఏబీవీపీ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఇదే విభాగం కార్యదర్శి అంకిత్ హన్స్లు బుధవారం ఏబీవీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి తీరును ఏబీవీపీ సీనియర్ నేతలు తప్పుబట్టారు.