ఫుట్బాల్లా ఆడేసుకుంటున్నారు: మాల్యా | Vijay Mallya: I am the football in team UPA vs team NDA, police know nothing about business | Sakshi
Sakshi News home page

సీబీఐ నాతో ఫుట్‌ బాల్‌ ఆడుకుంటోంది...

Published Fri, Feb 3 2017 10:47 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఫుట్బాల్లా ఆడేసుకుంటున్నారు: మాల్యా - Sakshi

ఫుట్బాల్లా ఆడేసుకుంటున్నారు: మాల్యా

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్మాల్యా మరోమారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ఫుట్బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండానే తాను టీమ్ యూపీఏకు, టీమ్ ఎన్డీయేకు ఓ ఫుట్బాల్లాగా మారినట్టు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్కు రప్పించాలని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేతగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద నుంచి వేలకోట్ల రుణాలు తీసుకొని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కావాలనే వక్రీకరించిన ఈ-మెయిల్స్ను మీడియాకు విడుదల చేసిందని, తనకు, యూపీఏ పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలకు పాల్పడిందని మాల్యా శుక్రవారం  ఉదయం ట్వీట్ చేశారు.
 
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సాయడ్డారని బీజేపీ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉందని తెలిసి కూడా కింగ్ఫిషర్కు రుణాలు ఇప్పించారని విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించిన పత్రాలను  బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా ముందుకు తీసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన మాల్యా తాను ఒక ఫుట్బాల్నని, న్యాయనిర్ణేత ఎవరూ లేకుండానే ఎన్డీయే, యూపీఏ టీమ్లు తనను ఆడుకుంటున్నాయని విమర్శించారు. సీబీఐ ఆరోపణలపై తాను షాక్ కి గురయ్యానని, బిజినెస్, ఎకనామిక్స్ గురించి పోలీసులకు ఏమి తెలుసని మాల్యా మండిపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement