UPA government
-
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్లోని సిసాయ్, పాలాము, బిహార్లోని దర్భంగాలో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్ను రద్దుచేసింది. కోల్స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
India Mobile Congress 2023: కాంగ్రెస్.. కాలం చెల్లిన ఫోన్
న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్డేటెడ్ ఫోన్ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్లు’ యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు. ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
'ఆ క్రెడిట్ మాదే..' మహిళా రిజర్వేషన్ బిలుపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం. "It is ours, अपना है" 🔥#WomenReservationBill पर CPP अध्यक्ष श्रीमती सोनिया गांधी जी। pic.twitter.com/2LDIHhrIGN — Srinivas BV (@srinivasiyc) September 19, 2023 If the government introduces the Women's Reservation Bill tomorrow, it will be a victory for the Congress and its allies in the UPA government Remember, it was during the UPA government that the Bill was passed in the Rajya Sabha on 9-3-2010 In its 10th year, the BJP is… — P. Chidambaram (@PChidambaram_IN) September 18, 2023 ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం -
జాతి క్షేమాన్ని మించిన పదవీ కాంక్ష..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్గార్ మేళాను వర్చువల్గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు. వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది. భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. బుధవారం ఓ మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా -
చీతా ప్రాజెక్టు తమ హయాంలోనే ప్రారంభమైంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాజెక్టు తమ హయాంలోని ప్రారంభమైందని కరాఖండిగా కాంగ్రెస్ చెబుతుంది. తాము ఈ ప్రాజెక్టు చిరుత ప్రతిపాదనను 2008-09లోనే సిద్ధం చేశామని పేర్కొంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆమోదించిందని కూడా కాంగ్రెస్ పేర్కొంది. ఐతే 2013లో సుప్రీం కోర్టు ఈ ప్రాజెక్టుపై స్టే విధించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. మళ్లీ 2020లో సుప్రీం కోర్టు అనుమతితో చిరుతలు భారత్కి తిరిగి రావడానికి మార్గం సుగమమైందని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పేర్కొంది. అంతేగాదు అప్పటి అటవీ పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్ 2010లో ఏప్రిల్లో దక్షిణాఫ్రికాలో చిరుత జౌట్రిచ్ సెంటర్కు వెళ్లినట్లు కూడా తెలిపింది. నాటి ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. 'प्रोजेक्ट चीता' का प्रस्ताव 2008-09 में तैयार हुआ। मनमोहन सिंह जी की सरकार ने इसे स्वीकृति दी। अप्रैल 2010 में तत्कालीन वन एवं पर्यावरण मंत्री @Jairam_Ramesh जी अफ्रीका के चीता आउट रीच सेंटर गए। 2013 में सुप्रीम कोर्ट ने प्रोजेक्ट पर रोक लगाई, 2020 में रोक हटी। अब चीते आएंगे pic.twitter.com/W1oBZ950Pz — Congress (@INCIndia) September 16, 2022 (చదవండి: కునో పార్క్లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫొటోలు తీస్తూ..) -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
‘రఫేల్’పై ఆధారాలున్నా మౌనమెందుకు?
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వ్యవహారం సెగలు రాజేస్తూనే ఉంది. రఫేల్ ఫైటర్జెట్ల సరఫరా కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘డసాల్ట్ ఏవియేషన్’ భారత్కు చెందిన సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి 2007–12కాలంలో కమీషన్ల కింద 7.5 మిలియన్ యూరోలు(రూ.65 కోట్లు) చెల్లించినట్లు ఫ్రెంచ్ పరిశోధన పత్రిక ‘మీడియాపార్ట్’ ఆరోపించింది. కమీషన్లు చేతులు మారడానికి వీలుగా డొల్ల కంపెనీల పేరిట నకిలీ రశీదులను సృష్టించి వాడారంది. ఆ రశీదులను ప్రచురించింది. అయితే, దీనిపై భారత రక్షణ శాఖ గానీ, డసాల్ట్ ఏవియేషన్ స్పందించలేదు. యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.59వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రఫేల్ డీల్లో అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ భారత్లోని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని మీడియాపార్ట్ ప్రశ్నించింది. రఫేల్ ఒప్పందంలో విదేశీ కంపెనీలు, మోసపూరిత కాంట్రాక్టులు, నకిలీ రశీదుల ప్రమేయం కనిపిస్తోందని, 2018 అక్టోబర్ నుంచి ఆధారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినా విచారణ జరపొద్దని సీబీఐ, ఈడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని మీడియాపార్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్కో రఫేల్ ఫైటర్జెట్ను రూ.526 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లకు కొంటోందని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమీషన్లు చేతులు మారాయని బీజేపీ నేత అమిత్ మాలవియా చెప్పారు. -
తమిళులకు డీఎంకే–కాంగ్రెస్ ద్రోహం చేశాయి: నడ్డా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రాజీవ్ ఫౌండేషన్కి ‘ప్రధాని’ నిధులు
న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూపీఏ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి భారీగా నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్ ఫౌండేషన్కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యూపీఏ హయాంలో రాజీవ్ ఫౌండేషన్కు మళ్లించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్జీఎఫ్కి ఆమే చైర్ పర్సన్. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. -
పాత పద్ధతిలోనే ఎన్పీఆర్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)–2020ను పాత ఫార్మాట్లోనే నిర్వహించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నిర్వహణకు వినియోగించిన ఫార్మాట్నే ఈసారీ వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ భేటీలో నిర్ణయించింది. తాజాగా పాత ఫార్మాట్లోనే ఎన్పీఆర్ నిర్వహణపైనా తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కేరళ, పశ్చిమ బెంగా ల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్పీఆర్ పనులను పూర్తిగా నిలిపేయగా రాజస్తాన్, పంజాబ్ శాసనసభలు ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. బిహార్లో ఎన్నార్సీ జరపబోమని, ఎన్పీఆర్ను సైతం పాత ఫార్మాట్లోనే నిర్వహిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్డీఏ పాలనలో ఉన్న బిహార్ తరహాలోనే రాష్ట్రంలోనూ పాత ఫార్మాట్లో ఎన్పీఆర్ నిర్వహించేలా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఏవైనా 45 రోజులపాటు ఎన్పీఆర్ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్పీఆర్ నిర్వహణపై శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భయాందోళనలను దూరం చేసేందుకు... ఎన్పీఆర్–2020 కరదీపికలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి పౌరుడు తనతోపాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం వివరాలను కచ్చితమైన సమాచారంతో ఇవ్వాల్సి ఉంది. అయితే అత్యధికం మంది వద్ద పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఆధారాలు లేవు. అలాగే చాలా మందికి కచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. దీనికితోడు చనిపోయిన తల్లి దండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం తెలిసి ఉండే అవకాశం తక్కువే. నిరక్షరాస్యులైన పేదల వద్ద వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఎన్పీఆర్–2020 ఫార్మాట్లో అడిగే ప్రశ్నలన్నింటికీ ప్రజలు ‘స్వచ్ఛందంగా’ఆధారాలు చూపించాలని కేంద్రం పేర్కొంటోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో మత హింసకు గురై 2014 డిసెంబర్ నాటికి భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైనులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్ మూల ఆధారమని కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేర్కొంటోంది. ఎన్పీఆర్, సీఏఏ, ఎన్ఆర్సీలలో ఒకదానితో మరొకటికి సంబంధం లేదని కేంద్రం పేర్కొంటున్నా దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీలో చోటు సంపాదించని వారిలో ముస్లిమేతరులందరికీ సీఏఏ కింద పౌరసత్వం లభించనుందని, చివరికి తమ పౌరసత్వమే ప్రశ్నార్థకం కానుందని ముస్లింలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను దూరం చేసేందుకు ఎన్పీఆర్ను పాత ఫార్మాట్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పాత ఫార్మాట్ సులువు... ఎన్పీఆర్–2011 ఫార్మాట్ను వినియోగిస్తే 15 ప్రశ్నలకు సాధారణ రీతిలో సమాధానమిస్తే సరిపోనుంది. పేరు/కుటుంబ పెద్దతో సంబంధం/తండ్రి పేరు/తల్లిపేరు/జీవిత భాగస్వామి పేరు (ఒకవేళ వివాహితులైతే)/లింగం/పుట్టిన తేదీ/వివాహితులా కాదా?/పుట్టిన ప్రాంతం/జాతీయత/ప్రస్తుత చిరునామా/ప్రస్తుత చిరునామాలో ఎన్నాళ్ల నుంచి నివాసం/శాశ్వత చిరునామా/వృత్తి/విద్యార్హతల సమాచారాన్ని ఎన్యూమరేటర్లు కోరనున్నారు. ఒకవేళ ఎన్పీఆర్–2020 ఫార్మాట్ను వినియోగిస్తే ఇవే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మరింత లోతుగా, ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలతో ప్రజలు ఇవ్వాల్సి రానుంది. -
విపక్షాలది ఉద్దేశపూర్వక ప్రచారం : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: 2021లో జరగనున్న జనగణనలో అంతర్భాగంగానే ప్రస్తుత ఎన్పీఆర్ను చేపడుతున్నట్టు, ఆ మాటకొస్తే యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్పీఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్పీఆర్ అనేది ఎన్ఆర్సీకి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్షాలు, మీడియాలోని ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హైదరాబాద్లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా తెలిపారు. అయితే ఇందులో భాగంగా మూడు నాలుగు అదనపు అంశాలు జోడించి ఒక వ్యక్తి తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్, చివరి నివాస స్థలం ఎన్పీఆర్లో పొందుపరచనున్న కనీస ప్రాథమికాంశాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి అపోహలు సృష్టించి ప్రజల మనసులతో ఆటలాడుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ పథకాల అమలుకు విఘాతం కల్గించడం వీరి లక్ష్యంగా కనబడుతోందన్నారు. అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొందించలేదన్నారు. కాబట్టి అసత్యాలతో, అర్థ సత్యాలతో గగ్గోలు పెడుతూ గోబెల్స్ మాదిరి గా విపక్షాలు, ఇతరులు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఐటీఐఆర్కు పైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్కు (ఐటీఐఆర్) యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒక్క పైసా ఇవ్వలేదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తన పదవీ కాలం చివరి సమయంలో ఐటీఐఆర్ను తీసుకొచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని, కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రాన్ని దాదాపు పది సార్లునేరుగా కలిసి అడిగినా, లేఖలు రాసినా స్పందించలేదని శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు. నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని తెలిపారు. దీనిపై అప్పటి సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం ఐటీఐఆర్ మా పాలసీ కాదని, దాన్ని ముందుకు తీసుకెళ్లమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలే దన్నారు. గడిచిన ఏదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కేపీ వివేకానంద్, కాంగ్రెస్ సభ్యుడు డి.శ్రీధర్బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర ఐటీలో 17 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని, కరీంనగర్లో వచ్చే నెలలో ఐటీ టవర్ను ప్రారంభిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మురుగు శుద్ధి లేకే జ్వరాలు: అక్బరుద్దీన్ హైదరాబాద్లో కేవలం 30% మాత్రమే మురుగు శుద్ధి జరుగుతోందని, కావాల్సినన్ని సీవరేజీ ట్రీట్మెంట్ప్లాంట్లు (ఎస్టీపీ) లేకపోవడంతో మురుగు పెరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మురుగు శుద్ధి జరగక నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమలు విజృంభిస్తున్నాయన్నారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, మురుగు శుద్ధి లేకపోవడం, మూసీ నదిలో వదులుతున్న వ్యర్థాలే దీనంతటికీ కారణమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. నగరంలో 735 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు 21 ఉన్నాయని, అయితే ఇవి చాలినంతగా లేవన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే 2021 నాటికి మరో 700 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసేలా, 2036 నాటికి 3 వేల ఎంఎల్డీల మురుగు శుద్ధి జరిగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. దోమల నివారణకు 200 జెట్టీ యంత్రాలతో స్ప్రే చేయిస్తున్నామని, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మురుగు పారుదల వ్యవస్థ బలోపేతం చేసేందుకు మాస్టర్ప్లాన్ తయారు చేసే బాధ్యతను ముంబైకు చెందిన షా కన్సల్టెన్సీకి అప్పగించిందని, ఈ నివేదిక డిసెంబర్లో వస్తుందని తెలిపారు. -
సర్జికల్ దాడులు.. కాంగ్రెస్కు చుక్కెదురు
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్లో యూరి సెక్టార్లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. -
రాహుల్ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సమయంలో.. రాహుల్ గతంలో బ్రిటన్లో ఉల్రిక్ మెక్నైట్ అనే వ్యక్తి భాగస్వామిగా బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు మెక్నైట్ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. కంపెనీ మూతపడటానికి ముందు 2005 జూన్ 5 నాటికి బ్యాకాప్స్ కంపెనీలో రాహుల్కు 65 శాతం, మెక్నైట్కు 35 శాతం వాటా ఉంది. ఆ తర్వాత 2011లో కూడా ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ నుంచి (స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించి) మెక్నైట్ కాంట్రాక్టులు పొందారు. యూపీఏ హయాంలో నావల్ గ్రూప్ విదేశీ భాగస్వామిగా.. రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు ‘ఇండియా టుడే’కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం.. రాహుల్, మెక్నైట్లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు. కాగా 2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో బ్యాకాప్స్ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్ పొందుపరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది. కాగా దాదాపు ఇదేవిధమైన పేరుకలిగిన బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కూడా రాహుల్కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్గా పనిచేశారు. ఈ భారతీయ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ 2004 ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. రూ.2.5 లక్షల మూలధన పెట్టుబడి కూడా ఉందన్నారు. 2002లో మొదలైన ఈ కంపెనీ కూడా తర్వాత మూతపడింది. చివరిసారిగా 2010 జూన్లో ఈ సంస్థ రిటర్న్స్ దాఖలు చేసింది. అయితే రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామి, అతని కంపెనీలు ఫ్రెంచి కంపెనీ ఇచ్చిన ఆఫ్సెట్ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందుతూ వచ్చాయి. విశాఖ సంస్థల్లో డైరెక్టర్గా మెక్నైట్ ముంబయిలోని మాజగాంవ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) వద్ద తయారయ్యే స్కార్పీన్ జలాంతర్గాములకు అవసరమైన కీలక విడిభాగాలు సప్లై చేసేందుకు ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ 2011లో విశాఖపట్నంకు చెందిన ఫ్లాష్ ఫోర్జ్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన రూ.20 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఎండీఎల్తో నావల్ గ్రూప్ కలసి పనిచేయాల్సి ఉంది. కాగా అదే ఆర్థిక సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ యూకేకి చెందిన ఆప్టికల్ ఆర్మోవర్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. 2012 నవంబర్లో ఇద్దరు ఫ్లాష్ ఫోర్జ్ డైరెక్టర్లను ఆ సంస్థలో డైరెక్టర్లుగా చేశారు. వీరు ఆ సంస్థ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన 2012 నవంబర్ 8నే ఉల్రిక్ మెక్నైట్ను కూడా ఆ సంస్థ డైరెక్టర్గా చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో మెక్నైట్కు సంస్థ 4.9 శాతం వాటా కేటాయించినట్లు ఆప్టికల్ ఆర్మోవర్ 2014లో దాఖలు చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఫ్లాష్ ఫోర్జ్ 2013లో యూకేకి చెందిన మరో కంపెనీ కాంపోజిట్ రెసిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ ఇద్దరు డైరెక్టర్లతో పాటు మెక్నైట్ కూడా ఆ సంస్థలో డైరెక్టర్గా చేరారు. నావల్ గ్రూపు వెబ్సైట్లు పేర్కొంటున్నదాని ప్రకారం..దాని భారతీయ భాగస్వాముల్లో ఫ్లాష్ ఫోర్జ్, సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లాష్ ఫోర్జ్, మరో ఫ్రెంచి గ్రూప్ కోయార్డ్ల జాయింట్ వెంచర్) ఉన్నాయి. దీనిపై ఇండియా టుడే మెక్నైట్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. నావల్ గ్రూపుతో ఫ్లాష్ ఫోర్జ్ ఒప్పందం కుదుర్చుకోక ముందే రాహుల్ గాంధీకి చెందిన భారత, యూకే కంపెనీలు మూతపడినా.. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాలతో ఆయన మాజీ వ్యాపార భాగస్వామి.. భారత విదేశీ భాగస్వామిగా యూరప్ సంస్థల ద్వారా లబ్ధి పొందినట్లు స్పష్టమవుతోంది. రాహుల్ రక్షణ డీలర్గా బెటర్! కాంగ్రెస్ స్పందించాలన్న కేంద్రమంత్రి జైట్లీ రాహుల్æ గాంధీ సన్నిహితుడికి యూపీఏ హయాంలో రక్షణ శాఖ కాంట్రాక్టు కట్టబెట్టారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘బాకాప్స్ నుంచి రాహుల్ 2009లో బయటకు రాగా, భారత్లోని బాకాప్స్ 2010లో మూతబడింది. అయితే, మెక్నైట్, రాహుల్ సంబంధాలు కొనసాగాయి. యూపీఏ హయాంలో ఫ్రాన్సు సహకారంతో జలాంతర్గాములను నిర్మించే రక్షణ శాఖ కాంట్రాక్టు మెక్నైట్కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి అసలు కథ ఇది అని పేర్కొన్నారు. ‘ఇందులో రాహుల్ పాత్ర ఏమిటి? రక్షణ సామగ్రి డీలర్ అవుదామనుకున్నారా? కాంగ్రెస్ దీనిపై సత్వరం స్పందించాలి. రాజకీయాల్లో రావడం కంటే కూడా ఆయన రక్షణ రంగంలో డీలర్ అయితే బాగుండేది’ అని అన్నారు. -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
‘కేంద్రంలో యూపీఏ 3 ఖాయం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కేంద్రంలో యూపీఏ -3 కొలువుతీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా యూపీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడనున్నాయని జోస్యం చెప్పారు. 2009లో యూపీలో కాంగ్రెస్ 21 స్ధానాలను గెలుచుకున్న సందర్భం మరోసారి ఎదురవనుందని, అప్పటికన్నా అధికంగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. 2009లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 205 స్ధానాలను గెలుపొందగా అదే సంఖ్యలో రానున్న లోక్సభ ఎన్నికల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించగా అందులో ఎలాంటి సందేహం లేదని సల్మాన్ ఖుర్షీద్ బదులిచ్చారు. పార్టీలో నూతన నాయకత్వం రాకతో కార్యకర్తలు, శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని, లోక్సభ ఎన్నికల అనంతరం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధితిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక ఆగమనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పారు. కాగా,ఫరక్కాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ సిటింగ్ ఎంపీ ముఖేష్ రాజ్పుట్, బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్ల నుంచి ముక్కోణ పోటీ ఎదుర్కొంటున్నారు. -
అధికారం మాదే
న్యూఢిల్లీ: డొల్ల వాగ్దానాలతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న రాజకీయాల్ని దేశ ప్రజలు తిరస్కరించారని, ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభ పరిష్కారం, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేలా అందులో చర్యలు ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థిక రంగ పరిపుష్టానికి కూడా రోడ్మ్యాప్ను తయారుచేస్తామని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సోదరి ప్రియాంక గాంధీ పోటీచేయాలని పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్లపై స్పందిస్తూ..ఎన్నికల్లో బరిలోకి దిగడంపై ఆమెనే ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాహుల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రజల గొంతుక వింటాం.. బీజేపీ–ఆరెస్సెస్లు తమ అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలు చెప్పేది వింటుంది. భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగ పరివర్తన, చిన్నస్థాయి వ్యాపారాలకు దన్నుగా నిలవడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా మా మేనిఫెస్టో ఉంటుంది. పరిశ్రమలకు పన్నుల బెడదను తప్పించడంతో పాటు చిన్న, మధ్యస్థాయి వ్యాపారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితే సామాన్యుడికి మేలు జరుగుతుంది. మోదీ బూటకపు వాగ్దానాలు, బీజేపీ వైఫల్యాలు లాంటివే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలైనా, మా ప్రణాళికలు, దేశానికి సంబంధించి మా దార్శనికత గురించి పంచుకోవడానికి చాలా ఉంది. 2014లో ఓటమి అనంతరం అధికార వికేంద్రీకరణతో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దాం. మోదీ హామీ వల్లే ‘న్యాయ్’ ఆలోచన 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చేసిన వాగ్దానం వల్లే కనీస ఆదాయ హామీ పథకం ఆలోచన తనకు వచ్చిందన్నారు. దేశంలోని నిరుపేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు జమచేసే న్యాయ్ పథకం ప్రకటించగానే మోదీలో కలవరపాటు మొదలైందన్నారు. మేమొస్తే నీతి ఆయోగ్ను రద్దుచేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతిఆయోగ్తో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని, ప్రధాని మోదీకి ప్రచారం చేస్తూ సమాచారాన్ని వక్రీకరించడానికే పరిమితమైందని ఆరోపించారు. -
‘యూపీఏ హయాంలో ఆ నీళ్లు తాగగలిగావా?’
ముంబై : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా(యూపీ తూర్పు విభాగం) బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె విమర్శలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రియాంక గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర యూపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. అలానే బీజేపీపై ప్రియాంక ప్రభావం గురించి ప్రశ్నించగా.. ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచరం చేయడం వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఒక వేళ నేను గనక అలహాబాద్ - వారణాశిల మధ్య వాటర్ వే మార్గాన్ని పూర్తి చేయకపోతే.. ఈ రోజు ఆమె ఈ గంగాయాత్ర చేయగలిగేదా. ప్రియాంక గంగా జలాన్ని కూడా తాగారు. అదే ఒక వేళ యూపీఏ హాయాంలో ఆమె గంగా నదిలో పర్యటిస్తే.. ఆ నీటిని తాగగలిగే వారా? ప్రస్తుతం మా ప్రభుత్వం గంగా నదిని శుద్ది చేసే కార్యక్రమాన్ని పార్రంభించింది. 2020 నాటికి గంగా నది నూటికి నూరు శాతం స్వచ్ఛంగా మారుతుంద’ని గడ్కరీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇటీవల ప్రయాగ్రాజ్ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్ వరకు గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రియాంక ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు చేసి గంగా నదికి హారతి ఇచ్చారు. అనంతరం గంగా జలాన్ని తాగారు. -
యూపీఏతో పోలిస్తే చవకే
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్ తెలిపింది. రఫేల్ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్మెంట్లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం గెలిచింది: బీజేపీ కాగ్ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు. -
యూపీఏ కన్నా 9 శాతం చౌకకే
న్యూఢిల్లీ: ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విధంగా యూపీఏ ప్రభుత్వం డస్సాల్ట్తో కుదుర్చుకున్న ప్రాథమిక ధర, మేం అంగీకరించిన ధరను ఇంతకుముందే వెల్లడించాం. ధరల పెరుగుదల, ఇతర అంశాలను పోల్చి చూసినప్పుడు యూపీఏ హయాంలో ధర కంటే మా ప్రభుత్వం నిర్ణయించిన ధర 9% తక్కువ’ అని ఆమె చెప్పారు. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలన్న డిమాండ్ను ఆమె తోసిపుచ్చారు. 2016లో కేంద్రం, ఫ్రెంచి ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాస్తవాలను దాస్తున్నారు: ఏకే ఆంటోనీ రాఫెల్ ఒప్పందం వివరాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆరోపించారు. ‘ఈ డీల్పై వాస్తవాలను వెలికితీసేందుకు సంయుక్త పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ వేయకుండా ప్రభుత్వం ఎందుకు ముఖం చాటేస్తోంది? జాతీయ భద్రతపై రాజీ పడి ఫ్రెంచి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. తక్కువకే ఒప్పందం కుదిరింటే 126 బదులు 36 విమానాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. -
రోజూ పెట్రో వాతలే!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయనే నెపంతో కేంద్రం ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుతోంది. క్రూడాయిల్ ధరలకు తోడు రూపాయి మారక విలువ పడిపోతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదల అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్షానికోసారి పెట్రో ధరలను సమీక్షించేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజు వారి సమీక్షకు తెరతీసింది. కొన్ని సందర్భాల్లో మినహా ధరలు తగ్గిన సందర్భం లేదు. ప్రస్తుతం పెట్రోలు రూ.85లకు చేరుకుంది. ఇలాగే పెరుగుతూ పోతే మరో మూడు నెలల్లో రూ.వంద చేరకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా ముడిఇంధన ధరలు పెరుగుతున్నాయని, రూపాయి మారక విలువ పడిపోతుండటంతో ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయని ఇంధన కంపెనీలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణభూతమవుతోంది. తామెలా బతకాలని చిరుద్యోగులు, ఆటో వాలాలు, వాహనాల యజమానులు వాపోతున్నారు. పన్నుల మోత...: కొత్త విధానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నారు. మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నారు. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ.6.50 , తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 తక్కువగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్ రూపంలో 28శాతం పన్ను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెట్రో ధరలు ఇక్కడ మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపం లో దాదాపు రూ.28 వరకు చెల్లించాల్సి వస్తోంది. అందులో ఏపీ వ్యాట్ రూ.6 నుంచి 8వరకు ఉంటోంది. ఎక్సైజ్ సుంకం తగ్గినా..: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 74 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు రోజూ 20 పైసల వరకు మార్పులు, చేర్పు లు చేస్తూ వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని లీటరకు రూ.2 తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ రేటు తగ్గించాలని సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్ వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ధరలు భరించలేం తమిళనాడు, కర్ణాటకతో పోలి స్తే రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతూ పోతే భరించడం కష్టం. – కృష్ణమోహన్, ప్రభుత్వ ఉద్యోగి ధరలను నియంత్రించాలి పెట్రోల్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. రోజువారి ధరల మార్పుతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. పదిహేను రోజులకోసారి ధర నిర్ణయించాలి. – రమణ, ఉపాధ్యాయుడు, కర్నూలు -
యూపీఏలో ‘ఫోన్కో లోన్’
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్మైన్పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు. బ్యాంకులను దోచుకున్నారు.. తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్దార్ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్కాల్తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్దార్లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు. ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా.. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు. ముంగిట్లోకి బ్యాంకింగ్ న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్మెన్, గ్రామీణ్ డాక్ సేవక్లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు. ఐపీపీబీ విశేషాలు.. ► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి. ► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు. ► రుణాలు, బీమా వంటి థర్డ్పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు. ► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్ను ఉపయోగిస్తారు. ► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్లకు స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు. ► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది. ► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు. ► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఎమర్జెన్సీ’ని గుర్తు చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ గురించి మీరా మాట్లాడేది? వాహ్.. రాహుల్ జీ!. స్వతంత్ర భారతావనిలో విధించిన ఏకైకఅత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని మీకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామికవాదుల గొంతులను నొక్కింది ఎవరు? ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది ఎవరు? మీ స్కాంగ్రెస్ పార్టీ కాదా?’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్లో ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు మంగళవారం కేటీఆర్ వరుస ట్వీట్లతో బదులిచ్చారు. తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నువ్వు ఎవరికి నివాళులు అర్పించావో నీకు తెలుసా? అని రాహుల్ను ప్రశ్నించారు. ‘‘తొలి దశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 1969లో ఇందిరా గాంధీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన 369 మంది యువకులతోపాటు తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించడంతో 2009–14 మధ్యలో ఆత్మబలిదానం చేసుకున్న యువకులు వారు’’అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మరణాలకు క్షమాపణ చెప్పరా? అని రాహుల్ను నిలదీశారు. ‘‘అవినీతి గురించి మాట్లాది నువ్వా? నీతో వేదిక పంచుకున్న సగం మంది కాం గ్రెస్ నేతలు సీబీఐ, ఇతర అవినీతి కేసుల్లో బెయిల్పై బయటకు వచ్చిన వారే. ఓహ్.. నేను మర్చిపోయా.. ఇది స్కాంగ్రెస్ పార్టీ కదా. ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్..’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ నేతలు వేసిన, వేయించిన వందలాది కేసులు ఉపసంహరించేలా వారిని ఆదేశించాలని రాహుల్కు సూచించారు. లేకుంటే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే ముద్రపడుతుందన్నారు. -
విద్యుదీకరణలో యూపీఏ విఫలం
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్లే దేశంలో సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాలు ఆలస్యమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్కు దూరంగా ఉన్న 2.67 కోట్ల కుటుంబాలకు కూడా ఈ ఏడాది చివరి నాటికి ఆ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకం లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్లో ముచ్చటించారు. ఇటీవల చిట్టచివరగా విద్యుదీకరణ జరిగిన మణిపూర్లోని లీసాంగ్ గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మోదీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఇది పదోది. 2009 నాటికే దేశంలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాంబికాలకు పోయారని మోదీ ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి 2005లో ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనను చదివి వినిపించారు. ఎప్పుడో పూర్తవ్వాల్సింది.. తాము అధికారంలోకి వచ్చే సరికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 18 వేలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజలకు మంచి చేయాలనుకునే వారు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలి. నివేదికలు తయారుచేయాలి. పౌర సమాజాలతో మాట్లాడాలి. అలా చేస్తే 2010–11 నాటికే సంపూర్ణ విద్యుదీకరణ జరిగేది. కానీ అప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు లేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయి. మేము ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, తప్పు లు వెతకడానికి విపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. వాళ్లకు వెలుగుంటేనే ఉపాధి.. విద్యుత్ సౌకర్యం లేని ఇళ్ల గురించే ప్రతిపక్షాలు మాట్లాడటం తమను విమర్శించడం కాదని, వారిని వారే విమర్శించుకోవడమని మోదీ అన్నారు. ‘70 ఏళ్లు దేశాన్ని నడిపిన వారిదే ఈ వైఫల్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 4 కోట్ల కుటుంబాలకు వి ద్యుత్ సౌకర్యం లేదంటే.. దాని అర్థం గతంలో వారికి ఉన్న విద్యుత్ కనెక్షన్ను మా ప్రభుత్వం తొలగించిందని కాదు. సున్నా నుంచి మొదలుపెట్టి విద్యుదీకరణకు మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. రోజులో మొత్తం సమయా న్ని 12 గంటలకు కుదిస్తే అన్ని పనులు పూర్తవుతాయా? మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే వారికి ఉపాధి దొరుకుతోంది. పగటిపూ ట వెలుగును ఆధారంగా చేసుకునే వారి పని గంటలను నిర్ణయిస్తున్నారు’ అని అన్నారు. -
బయ్యారం ఉక్కు భిక్ష కాదు.. హక్కు
రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుప ర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పిం చడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్ హామీనిచ్చిన కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురౌతున్నం దున ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా ఉక్కు పరిశ్ర మను ఇస్తామని చట్టంలో చేర్చింది. విభజన చట్టం లోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటిం చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటినుంచి టాస్క్ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. త్వరలో బయ్యారానికి తీపి కబురు చెపుతామని కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి మీడియా ముందు ప్రకటించటం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసర మైన వనరులన్నీ సమకూర్చుతామని, ముడి ఖనిజం రవాణా కోసం జగదల్పూర్ నుంచి రైల్వే లైన్ నిర్మా ణానికి పరిశీలన కోసం 2 కోట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఇలా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వాలు 4 ఏళ్ల నాటకానికి తెర వేస్తూ తాజాగా పరిశ్రమ పెట్టే అవకాశమే లేదని స్పష్టీక రిం చారు. ఇది విభజన హామీని తుంగలో తొక్కి తెలం గాణ ప్రజలను మోసం చేయడమే. యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పొందుపర్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల నిర్మాణంపై మొదటినుండి సాకులు చెపుతూ కాలం గడుపుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడం లేదని, బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమ నిర్విఘ్నంగా నడవడానికి సరిపోదని తదితర సాకులు చెబుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమేనను కున్నా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా నుంచి నాణ్యత కలిగిన ఇనుప ఖనిజాన్ని దిగుమని చేసుకుంటామని, అందుకు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంది. అయినా, పరిశ్రమ పెట్టడానికి అభ్యంతరమేమిటి? 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిన ఉక్కు పరిశ్రమ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నదే నిజం. అప్పుడప్పుడు మాట వరసకు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి వల్లెవేయడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్, ఆయన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. పైగా సెయిల్ ముందుకు రానందున బయ్యారం స్టీల్స్ను జిందాల్కు ఇస్తామని, సిద్ధంగా ఉండమని ఆ కంపెనీ అధికారులకు మీడియా ముందే చెప్పారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరి శ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చట్ట బద్ధంగా రావల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది.బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ, దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడి ఉక్కును పాలకులు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా ఉద్య మాల ద్వారా అడ్డుకున్న చరిత్ర ఉంది. 1 లక్షా 46 వేల ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నది. తెలంగాణ ఉద్యమ శక్తులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధ హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఈ హక్కు సాకారం అయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించాలి. గౌని ఐలయ్య, కన్వీనర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి, జడ్పీటీసీ ‘ 94907 00955 -
సీఎంలిద్దరూ ‘భరత్ అనే నేను’ చూడాలి
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులపై బీజేపీ అసత్యప్రచారం చేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో స్కామ్లను కూడా కమ్యూనిస్టులకు అంటకడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయట పెడతామని, విదేశాల నుంచి డబ్బు తెస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీయిచ్చారని కానీ అధికారంలోకి వచ్చి చేసిందేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారన్నారు. యూపీఏ హయాంలో జైళ్లలో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన అనుచరులు 9 మందికి, తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారని తెలిపారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘బాబు, కేసీఆర్ భరత్ అనే నేను సినిమా చూడాలి’ ‘భరత్ అనే నేను’ సినిమాను చంద్రబాబు, కేసీఆర్ జనంలో కూర్చోని చూడాలని, ముఖ్యంగా ఏపీ సీఎం చూడాలని రామకృష్ణ సూచించారు. ‘కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. బాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న భూములు 7 ప్రైవేట్ కాలేజీలకు దోచిపెట్టారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఎన్నికలు పెట్టడంలేద’ని మండిపడ్డారు. కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. బాబు సూటు బూటు ఉంటేనే కలుస్తారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారా లేక రాచరికం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా కేంద్రానికి నిరసనగా రాత్రి 7 గంటలకు అరగంట పాటు బ్లాక్ డే పాటిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని అరగంట లైట్లు బంద్ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. అందరూ బ్లాక్ డేకు సహకరించి స్వచ్చందంగా నిరసన తెలపాలని కోరారు. -
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్లో క్రియాశీలక ఏజెంట్గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
2జీ తీర్పుపై మన్మోహన్ కామెంట్స్..!
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన 2జీ స్పెక్టం కుంభకోణంపై పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పందించారు. 2జీ స్కాం నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2జీ స్కాం యూపీఏ సర్కారును అతలాకుతలం చేసింది. ఈ స్కాంలో నిందితుడిగా ఉన్న అప్పటి టెలికం మంత్రి ఏ రాజా, యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 'తీర్పు చాలా సుస్పష్టంగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్రస్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తీర్పు స్పష్టం చేసింది' అని మన్మోహన్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులు, కామన్వెల్త్ క్రీడల వంటి విషయాల్లో జరిగిన కుంభకోణాలు యూపీఏ సర్కారును తీవ్రంగా కుదిపేశాయి. -
మెండిబకాయిలు యూపీఏ నిర్వాకమే
-
ఫుట్బాల్లా ఆడేసుకుంటున్నారు: మాల్యా
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్మాల్యా మరోమారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ఫుట్బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండానే తాను టీమ్ యూపీఏకు, టీమ్ ఎన్డీయేకు ఓ ఫుట్బాల్లాగా మారినట్టు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్కు రప్పించాలని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేతగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద నుంచి వేలకోట్ల రుణాలు తీసుకొని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కావాలనే వక్రీకరించిన ఈ-మెయిల్స్ను మీడియాకు విడుదల చేసిందని, తనకు, యూపీఏ పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలకు పాల్పడిందని మాల్యా శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సాయడ్డారని బీజేపీ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉందని తెలిసి కూడా కింగ్ఫిషర్కు రుణాలు ఇప్పించారని విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించిన పత్రాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా ముందుకు తీసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన మాల్యా తాను ఒక ఫుట్బాల్నని, న్యాయనిర్ణేత ఎవరూ లేకుండానే ఎన్డీయే, యూపీఏ టీమ్లు తనను ఆడుకుంటున్నాయని విమర్శించారు. సీబీఐ ఆరోపణలపై తాను షాక్ కి గురయ్యానని, బిజినెస్, ఎకనామిక్స్ గురించి పోలీసులకు ఏమి తెలుసని మాల్యా మండిపడ్డారు. -
అప్పుడు ఎలా చేశారు?
2012 బడ్జెట్ ఆలస్యంపై కేంద్రాన్ని కోరిన ఈసీ న్యూఢిల్లీ: 2012లో కేంద్ర బడ్జెట్ ఆలస్యంగా ప్రవేశపెట్టడానికి ఎటువంటి విధానాలు పాటించారో తెలపాలని ఎన్నికల కమిషన్ కేబినెట్ సెక్రటేరియట్ను కోరింది. దీనిపై శుక్రవారం ఉదయంలోగా వివరాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం. దీంతోపాటు బడ్జెట్ రూపకల్పనలోనూ, ప్రవేశపెట్టడంలోనూ ఉండే వివిధ దశలకు సంబంధించిన సమగ్రసమాచారాన్నికూడా అందజేయాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. 2012లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ను వాయిదా వేయాలని విపక్షాలు ఎన్నికల కమిషన్ ను కోరాయి. దీనిపై ఈసీ కేంద్రాన్ని వివరణ కోరింది. -
కాంగ్రెస్కు మాజీ సైనికాధికారి షాక్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని.. కాకపోతే అప్పట్లో తమ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ నాయకుల్లా ప్రచారం చేసుకోలేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు... మాజీ డీజీఎంఓ పెద్ద షాకిచ్చారు. గతంలో కేవలం సరిహద్దుల వెంబడి మామూలు దాడులే జరిగాయని, అసలు ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్కు, వాటికి ఏమాత్రం సంబంధం లేదని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా బాంబు పేల్చారు. ''ఇవి చాలా సున్నితమైనవి, పక్కా లక్ష్యం కేంద్రంగా చేసినవి, మన దేశ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఇంతకుముందు నియంత్రణ రేఖ వెంబడి జరిగిన దాడులకు వీటికి అన్ని రకాలుగా చాలా తేడా ఉంది'' అని భాటియా వెల్లడించారు. ఆయన 2012 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్గా వ్యవహరించారు. 2011 సెప్టెంబర్ 1, 2013 జూలై 28, 2014 జనవరి 14 తేదీలలో కూడా యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ వాదిస్తోంది. సర్వసాధారణంగా జరిగే దాడులను కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఎన్డీయే ప్రభుత్వం తెగ గుండెలు బాదేసుకుంటోందని విమర్శించింది. అయితే.. దీనిపై నడుస్తున్న రాజకీయాల జోలికి తాను పోనని, అప్పట్లో జరిగిన ఆపరేషన్స్ను, ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను ఏమాత్రం పోల్చలేమని మాత్రమే తాను చెబుతున్నానని లెఫ్టినెంట్ జనరల్ భాటియా అన్నారు. ఇంతకుముందు జరిగిన దాడులకు కూడా మంచి ముందస్తు ప్రణాళిక ఉన్నా.. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా మన జాతీయ శక్తిలోని అన్ని అంశాలూ ఒక్కటిగా కలిశాయని తెలిపారు. దౌత్య, ఆర్థిక, సమాచార యుద్ధతంత్రం.. ఇలా అన్నీ కలిశాయని చెప్పారు. ఉడిలో ఉగ్రదాడి జరిగి 19 మంది సైనికులు మరణించిన తర్వాత.. భారత దేశ సహనం చచ్చిపోయిందని, అందుకే మనం గీత దాటామని ఆయన తెలిపారు. ఒకేసారి నియంత్రణ రేఖకు అవతల పలు లక్ష్యాల మీద దాడులు జరిగాయని, బంబెర్ నుంచి పీర్ పంజల్కు రెండువైపులా కూడా మన బలగాలు మోహరించాయని, సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని లెఫ్టినెంట్ జనరల్ భాటియా వివరించారు. -
'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షా 93 వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 9 లక్షల 35వేల ఇళ్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసినట్టు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వెంకయ్య స్పష్టం చేశారు. -
దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను హత్య చేయించినా చేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు పక్కన పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్యస్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్తోనే మొదలు కాలేదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘నన్ను ఖతం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చింది’ అని మోదీ 2010లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను వివిధ కేసుల్లో కేంద్రం ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కేజ్రివాల్ అసహనం వ్యక్తంచేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాష్ర్ట ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలాగా సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లే అవకాశం లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఏనాడూ లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కీలుబొమ్మ ముఖ్యమంత్రులనే పెట్టుకొంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా కొనసాగిన రోజుల్లోనూ ఇదే కొనసాగింది. స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నీరుగార్చేందుకే ప్రయత్నించింది. ‘కోఆపరేటివ్ ఫెడరలిజమ్ (సహకార సమాఖ్యవాదం)’ తమ ప్రభుత్వ విధానాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు హర్షించారు. ఇప్పుడు వివిధ కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగమని అదే ప్రజలు భావిస్తున్నారు. మాటలు వల్లించడమే కాదు, చేతల్లో చూపించినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు. --ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
'మేం రెండేళ్లలో అవినీతిని దూరం చేశాం'
ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు. మంగళవారం అమిత్షా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్షా స్పష్టం చేశారు. -
మసూద్పై మళ్లీ రెడ్కార్నర్
పఠాన్కోట్ కేసులో ఎన్ఐఏ సాక్ష్యాల ఆధారంగా ఇంటర్పోల్ జారీ న్యూఢిల్లీ: పఠాన్కోట్లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి నిషిద్ధ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్పై ఇంటర్పోల్ మంగళవారం తాజా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈదాడికి మసూద్, రవూఫ్లు కుట్రపన్నారన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు పొందిన నేపథ్యంలో ఈ తాజా నోటీసును జారీ చేశారు. నాటి ఉగ్ర దాడిలో దాదాపు 80 గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మసూద్, రవూఫ్లపై ఇంతకుముందు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ల విషయంలో పాక్ స్పందించలేదు. దీంతో తాజా రెడ్ కార్నర్ నోటీసులను లాంఛనంగానే పరిగణిస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న అజహర్పై.. భారత పార్లమెంటుపై, జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడికుట్ర ఆరోపణల్లో గతంలో రెడ్కార్నర్ నోటీసులు ఉన్నాయి. రవూఫ్పై 1999లో విమానం హైజాక్కు సంబంధించి అదే తరహా వారెంట్ పెండింగ్లో ఉంది. ఉగ్రవాదులకు, జైషే నేతలైన జాన్, లతీఫ్లకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు, ఆ దాడి తమ పనేనంటూ రవూఫ్ పేర్కొన్న వీడియో దృశ్యాలను ఎన్ఐఏ సమర్పించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు నేతృత్వం వహించిన కాషిఫ్, షాహిద్ లతీఫ్ పైనా రెడ్ కార్నర్ నోటీసులను ఎన్ఐఏ కోరింది. 2010లోనే లతీఫ్విడుదల న్యూఢిల్లీ: పఠాన్కోట్పై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్లో ఎలా చొరబడ్డారన్న దానిపై దర్యాప్తు అధికారులు సమాచారాన్ని వెలికితీశారు. ఆదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మద్దతు అందించిన జైషే నేత షాహిద్ లతీఫ్(47)ను 2010లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం విడుదల చేసింది. పాక్కుచెందిన లతీఫ్.. 1996లో జమ్మూలో అరెస్టయ్యాడు. పాక్తో సంబంధాలను మెరుగుపరచుకునే చర్యల్లో భాగంగా లతీఫ్ను, మరో 20 మంది పాక్ ఉగ్రవాదులను ఆరేళ్ల కిందట నాటి యూపీఏ ప్రభుత్వం విడుదల చేసింది. -
వాడుకలో లేని పీఎఫ్ ఖాతాలకూ వడ్డీ
ఏప్రిల్ 1 నుంచి అమలు న్యూఢిల్లీ: వాడుకలో లేని (ఇనాపరేటివ్) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోనూ ఏప్రిల్ 1 నుంచి వడ్డీ జమచేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్ణయించింది. ఇది దాదాపు రూ. 32వేల కోట్ల మేర డి పాజిట్లున్న సుమారు 9 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలోని ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వాడుకలో లేని ఖాతాలకు వడ్డీ చెల్లింపులను నిలిపివేసిందని, తాము ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ఇకపై వాడుకలో లేని ఖాతాలంటూ ఉండబోవన్నారు. 36 నెలల పాటు చందాలు జమ కాని ఖాతాలను ఇనాపరేటివ్ ఖాతాలుగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ ఆశతో ఖాతాల నుంచి డబ్బు తీసుకోకుండా, ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండటాన్ని అరికట్టే ఉద్దేశంతో యూపీ ఏ ప్రభుత్వం ఇనాపరేటివ్ ఖాతాలపై వడ్డీ ఇవ్వరాదని నిర్ణయిం చింది. తదనుగుణంగా 2011 ఏప్రిల్ 1 నుంచి ఇటువంటి వాటికి వడ్డీ చెల్లింపులు నిల్చిపోయాయి. పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరం 8.8 శాతం వడ్డీ రేటు ఇచ్చే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు దత్తాత్రేయ తెలిపారు. -
బొగ్గు స్కాంలో తొలి తీర్పు
జేఐపీఎల్, ఆ సంస్థ ఇద్దరు డెరైక్టర్లను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ♦ నేరపూరిత ఉద్దేశంతో భారత ప్రభుత్వాన్ని మోసం చేశారని స్పష్టీకరణ ♦ ఈ నెల 31న శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు న్యూఢిల్లీ: ఒకరకంగా యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు వెలువడింది. మోసపూరితంగా, నేరపూరిత కుట్రతో, అక్రమంగా బొగ్గు క్షేత్రం కేటాయింపును పొందారని జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్) సంస్థను, ఆ సంస్థ డెరైక్టర్లు ఆర్సీ రుంగ్తా, ఆర్ఎస్ రుంగ్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుహాల్లోనే ఉన్న దోషులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు వినేందుకు జడ్జి భరత్ పరాశర్ విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. జార్ఖండ్లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను పొందేందుకు జేఐపీఎల్, ఆ సంస్థ డెరైక్టర్లు భారత ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా రుజువైందని ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన 132 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 420 సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ఫోర్జరీ ఆరోపణల సెక్షన్లను మాత్రం మినహాయించింది. ‘నిందితులు ఉద్దేశపూర్వకంగా, నేరపూరిత కుట్రతో తప్పుడు పత్రాలను.. సంస్థ అర్హతలు, సామర్ధ్యాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి స్క్రీనింగ్ కమిటీని, బొగ్గుమంత్రిత్వ శాఖను తద్వారా భారత ప్రభుత్వాన్ని మోసం చేశారు. తప్పు అని తెలిసీ, నిజాలుగా ఆ వివరాలను స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు’ అని కోర్టు తేల్చిచెప్పింది. ‘నిందితులు తమ ముందుంచిన సమాచారాన్ని వాస్తవమని నమ్మడం వల్ల జేఐపీఎల్కు బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలంటూ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు ఆధారంగా బొగ్గు శాఖ జార్ఖండ్లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను మరో మూడు సంస్థలతో పాటు జేఐపీఎల్కు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు నమ్ముతోంద’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాము సేకరించిన భూమికి సంబంధించిన వివరాలను కూడా నిందితులు సమయానుకూలంగా మార్చినట్లుగా తేలిందన్నారు. భూ సేకరణకు సంబంధించిన ఒప్పంద పత్రం కూడా నకిలీదేనని గట్టి అనుమానాలున్నాయన్నారు. పరిమితంగా లభ్యమయ్యే సహజ వనరైన బొగ్గు విలువను దృష్టిలో పెట్టుకుని.. నిందితులు తమ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన బొగ్గును ఎక్కువగా చూపారన్నారు. తమ దరఖాస్తుకు అధిక ప్రాధాన్యం లభించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. ఈ కేసులో బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులను నిందితులుగా చేర్చకపోయినంత మాత్రాన, వీరి నేర తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు. ఈ కేసు కాకుండా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు చేసిన మరో 19 కేసులు, ఈడీ పరిథిలో ఉన్న మరో రెండు కేసులు ప్రస్తుతం ప్రత్యేక కోర్టు విచారణలో ఉన్నాయి. -
మోదీని ఇబ్బంది పెట్టేందుకే!
న్యూఢిల్లీ: ఇషత్ర జహాన్ ఎన్కౌంటర్ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మాయం చేసి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించిందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. ఇషత్ లష్కరే తోయిబా ఉగ్రవాది అనివిచారణలో వెల్లడైనా.. మోదీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇషత్ర కేసుపై సావధాన తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసిందని రాజ్నాథ్ వెల్లడించారు. ఓ పక్క విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా.. చిదంబరంపై దాడిని కొనసాగించారు. ‘ఉగ్రవాదానికి రంగు, మతం, జాతి ఉండవు. కానీ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్లు ఉగ్రవాదానికి రంగు పూస్తారు.’ అని రాజ్నాథ్ తెలిపారు. ముంబై కోర్టు ముందు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, యూపీఏ సర్కారు ఆగస్టు6, 2009న గుజరాత్ హైకోర్టు ముందు దాఖలు చేసిన తొలి అఫిడవిట్ వంటి వాటిని రాజ్నాథ్ ప్రస్తావించారు. ‘హెడ్లీ వెల్లడించింది.. ఇషత్ర లష్కరే ఉగ్రవాదని తేల్చి చెప్పిన రెండో ఆధారం. మొదటిది.. యూపీఏ తొలి అఫిడవిట్లోనే స్పష్టమైంది’ అని అన్నారు. అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి.. మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై రాసిన లేఖ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. దీనిపై తమ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై సరైన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. -
టార్చర్ పెట్టి సంతకం చేయించుకున్నారు!
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ వ్యవహారంలో గత యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఇరకాటంలో పడింది. అత్యున్నతస్థాయిలో వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఇష్రత్ జహాన్ కేసు రెండో అఫిడవిట్లో మార్పులు చేసినట్టు మాజీ బ్యూరోక్రాట్ ఒకరు వెల్లడించారు. ఇష్రత్ జహన్ ఎన్కౌంటర్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇష్రత్ జహాన్, జావేద్ షైక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై, జీషాన్ జోహర్, అంజద్ అలి రాణాలు ఉగ్రవాదులేనని మొదటి అఫిడవిట్లో పేర్కొన్న యూపీఏ సర్కారు సరిగ్గా రెండు నెలల్లోనే యూ టర్న్ తీసుకొంది. ఆ నలుగురు ఉగ్రవాదులు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ రెండో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. అయితే తనను భౌతికంగా హింసించడంతోనే ఆ రెండో అఫిడవిట్ తాను సంతకం చేశానని ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్గత భద్రత విభాగం అండర్ సెక్రటరీగా పనిచేసి రిటైరైన ఆయన.. రాజకీయ ఒత్తిడుల కారణంగానే తాను రెండో అఫిడవిట్పై సంతకం చేసినట్టు చెప్పారు. ఇష్రత్ కేసులో ఆధారాలను కల్పితంగా సృష్టించారని, అంతేకాకుండా గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల పేర్లను కూడా ఈ కేసులో ఇరికించాలని సిట్ తనపై ఒత్తిడి చేసిందని ఆయన వెల్లడించారు. ఇష్రత్ జహాన్ కేసులో పత్రాల ఆధారంగా స్పష్టమైన అఫిడవిట్ రూపొదిస్తుంటే అప్పటి సీబీఐ అధికారి సతీశ్ శర్మ జోక్యం చేసుకొని తనను భౌతికంగా వేధించాడని, తన తొడలపై సిగరెట్ పీకలతో కాల్చేవాడని ఆయన వెల్లడించారు. తొలి అఫిడవిట్ ను తాను ఆమోదించలేదని చెప్తున్న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. మాజీ బ్యూరోక్రాట్ ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఇష్రత్ జహాన్ కేసు ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని టార్గెట్గా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. -
‘ఇష్రత్’రెండో అఫిడవిట్ సరైనదే
♦ తనే బాధ్యత తీసుకుంటానన్న చిదంబరం ♦ పిళ్లైకీ అందులో భాగముందని వ్యాఖ్య ♦ 2009 నాటి నివేదికను పరీక్షించనున్న హోంశాఖ న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2004నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో రెండో అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు వందశాతం వాస్తవమని కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు చేస్తున్నా.. తన మాటకు కట్టుబడి ఉన్నట్లు చిదంబరం వెల్లడించారు. ‘ఆ ఘటన నివేదిక వచ్చినపుడు (2009లో) కేంద్ర హోం మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. నాకెంత బాధ్యత ఉందో హోం శాఖ కార్యదర్శిగా ఆయన (జీకే పిళ్లై) బాధ్యత కూడా అంతే. కానీ ఆయన తన వివాదం నుంచి తప్పించుకుంటున్నారు. ఆయన వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసింది’ అని చిదంబరం అన్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి అఫిడవిట్ అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నందునే రెండో అఫిడవిట్ను కోరాల్సి వచ్చింది. నిఘా వర్గాలు సేకరించిన సమాచారంపైనే కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేసిందని.. ఇలాంటి నివేదికలను సాక్ష్యంగా పరిగణించలేమని చిదంబరం అన్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనికి కేంద్రం బాధ్యత వహించదన్నారు. ‘నా ప్రమేయం లేకుండానే తొలి అఫిడవిట్ సిద్ధమైంది. అందులో వాస్తవాలు లేవనిపించింది. హోం సెక్రటరీ, ఐబీ డెరైక్టర్, ఇతర అధికారులతో కలసి చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే రెండో అఫిడవిట్ సిద్ధమైంది’ అని చిదంబరం తెలిపారు. అయినా రెండో అఫిడవిట్లోని ఏ విషయం తప్పుగా ఉందో తనకర్థం కాలేదన్నారు. ఇది వందశాతం సరైనదే. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకుని పూర్తిగా సమీక్షించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2009లో తొలి అఫిడవిట్ దాఖలు చేసినపుడు ఇషత్త్రో సహా చనిపోయిన వారంతా లష్కరే ఉగ్రవాదులని పేర్కొనగా.. రెండు నెలల తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్లో వారు ఉగ్రవాదులనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు, అఫ్జల్ గురు ఉరితీత తమ ప్రభుత్వ హయాంలోనే జరిగినా.. అది సరైన నిర్ణయం కాదని తనకు అనిపించిందన్నారు. అఫ్జల్ది దేశవ్యతిరేకం.. రాజద్రోహం కాదని చిదంబరం పునరుద్ఘాటించారు. మరోవైపు, ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్లో యూపీఏ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్, ఇతర పత్రాలను కేంద్ర హోం శాఖ పరిశీలించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు లభించలేదని.. అవి ఎక్కడున్నాయో తెలియటం లేదని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
వన్ ర్యాంక్ వన్ పెన్షన్కు కట్టుబడి ఉన్నాం
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సందర్భంలో బీజేపీ ఇచ్చిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ హామీకి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో ఏడాదికి రూ.7,483 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకానికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వం 21 శాతం ఎక్కువ కేటాయించిందని వివరించారు. ఇదే కాకుండా రూ.10,500 కోట్ల బకాయిలను నాలుగు విడతల్లో అందజేస్తామని తెలిపారు. పాకిస్తాన్ను ఐఎఫ్ఆర్కు ఆహ్వానించామని, ఎందుకు రాలేదో తెలియదని ఆయన చెప్పారు. సర్క్రీక్ వివాదం మినహా పాకిస్తాన్తో ఎలాంటి సమస్యలు ప్రస్తుతానికి లేవన్నారు. సియాచిన్ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఇంతవరకూ అక్కడ వెయ్యిమంది సైనికుల్ని కోల్పోయామన్నారు. ఇకమీదట ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సముద్ర వివాదాల పరిష్కారానికి ఓ ఏజెన్సీ ఉండాలన్నారు. ఐఎఫ్ఆర్కు బాలీవుడ్ నటులు అక్షయ్కుమార్, కంగనా రనౌత్లను ఆహ్వానించడం నేవీ తీసుకున్న నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానంగా పారికర్ చెప్పారు. ఐఎఫ్ఆర్కు వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తూ రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. వారు కేవలం నేవీ ఆహ్వానం మేరకు అతిథులుగానే వచ్చినట్లు భావిస్తున్నానన్నారు. సముద్ర వివాదాలు సమసిపోవాలి ప్రపంచ దేశాల మధ్య సముద్ర వివాదాలు సమసిపోవాలని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆకాంక్షించారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ మారిటైమ్ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన పారికర్ దేశ, విదేశ నేవీ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. సముద్ర సరిహద్దులు మనుషులు పెట్టుకున్నవేనని, గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి, సరిహద్దులు మారుతున్నాయని అన్నారు. ఆర్థిక ముఖచిత్రం కూడా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర వనరుల్ని సమగ్రంగా వినియోగించుకోవాలని, వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పెరిగిపోతున్న సముద్ర దొంగల బెడద, ఉగ్రవాదాన్ని నౌకాదళాలు ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నౌకాదళాలన్నీ సమష్టిగా వాటిని ఎదుర్కోవాలన్నారు. ఇందులో భాగంగా నౌకాదళాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. భారత్ ఇప్పటికే అనేక దేశాలతో సమాచార మార్పిడి ప్రక్రియ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్లో మరిన్ని దేశాలతో సమాచార మార్పిడి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
మోదీకి ఆ విషయం తెలియదా?
అనంతపురం: పార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ పైనే ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లి బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. ప్రధాని మోదీకి ఈ విషయం తెలియదా? అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకు మోదీ హామీ నిలబెట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి కేంద్రం హామీ ఇచ్చి నిలబెట్టుకోలేక పోవడం ఇదే ప్రథమమని రాహుల్ దుయ్యబట్టారు. -
‘ఉపాధి హామీ’ దేశానికే గర్వకారణం
మోదీ సర్కారు ప్రశంసలు ♦ పథకానికి నేటితో పదేళ్లు పూర్తి ♦ బలోపేతం చేస్తామని ప్రకటన ♦ నేడు ఎంజీఎన్ఆర్ఈజీఏ సమ్మేళన్ న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ పేదలకు ఏటా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ చీఫ్(జాతీయ సలహా మండలి చైర్పర్సన్ హోదాలో) సోనియా గాంధీ లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును తొలుత విమర్శించిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం మాత్రం పొగడ్తలతో ముంచెత్తింది. పథకం సాధించిన దశాబ్ది ఫలితాలు దేశానికే గర్వకారణమని, సంబరాలు చేసుకోదగ్గవని ప్రశంసించింది. పథకం నిబంధనలను భవిష్యత్తులో తాము సరళీకరించడంతోపాటు దాని అమలును బలోపేతం చేస్తామని...పేదల లబ్ధికి దోహదపడే ఆస్తుల నిర్మాణం చేపట్టడంపై దృష్టిసారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించనున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ సమ్మేళన్-2016లోఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించి ఆయన పలు ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు వంద రోజుల పని దినాలకు అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. కాగా ఈ పథకం కోసం అదనంగా రూ.5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రావ్ బీరేంద్ర సింగ్.. జైట్లీకి లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 45.88 కోట్లు, మూడో క్వార్టర్లో 46.10 కోట్ల పనిదినాలు సృష్టించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. 57 శాతం మిహ ళలే పథకం కింద లబ్ధి పొందారంది. నేడు బండ్లపల్లి గ్రామానికి రాహుల్ ఉపాధి హామీ పథకం పదేళ్ల సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. ఉపాధి హామీ పథకం అమలు వివరాలు ఇప్పటి వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించిన వేతనాలు రూ. 3,13,844 కోట్లు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు17శాతం, మహిళలు 57శాతానికి పెరుగుదల. కార్మికులకు లభించిన పనిదినాలు 1980కోట్లు. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పనులు 65 శాతం. -
మోదీ సర్కారు కొత్తగా చేసిందేంటి?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రవేశపెట్టిన తయారీ విధానంను 'మేకిన్ ఇండియా'గా మార్చారని తెలిపారు. నిర్మల్ భారత్ కు స్వచ్ఛ భారత్ గా నామకరణం చేశారని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకం పేరును స్కిల్ ఇండియా మార్చారని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇతర పథకాల పేర్లు కూడా ఇలాగే మార్చేశారని చెప్పారు. మోదీ సర్కారు కొత్తగా ప్రజలకు చేసిందేముందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోని వచ్చిన 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. 26/11 దాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తైన నేపథ్యంలో తీవ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. -
అన్నదాతకు మరో వెన్నుపోటు!
స్వామినాథన్ సిఫారసుల అమలుపై కేంద్రం దొంగాట సాక్షి, హైదరాబాద్: ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి.. వీటికితోడు పాలకుల నిర్లక్ష్యం! ఆరుగాలం కష్టపడ్డా అప్పుల కుప్పలు.. వెరసి వ్యవసాయంలో సంక్షోభం.. పంటచేనులో మరణ మృదంగం! ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుస్థితిని మార్చేందుకు రైతు సమస్యలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కారాలను ప్రతిపాదించిన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదికను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ సర్కారు దాన్ని పూర్తిగా అటకెక్కించింది. స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ రైతు కమిషన్ (ఎన్సీఎఫ్) సిఫార్సులను ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించడం రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్సీఎఫ్ నివేదికను మొత్తంగా తిరస్కరించారా లేక ఒక్క కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) విధానాన్ని మాత్రమే పక్కన బెట్టారా అనేది తెలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నివేదిక అమలు కోరుతూ పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంఎస్పీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని నినదిస్తున్నాయి. రైతుకు మార్కెట్ ధర రానప్పుడు రక్షణగా ఉండాల్సిన ఎంఎస్పీ విధానం అన్నదాతల్ని మోసం చేసే లా ఉందని మండిపడుతున్నాయి. కమిషన్ ఏం చెప్పిందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంతో దిక్కుతోచక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం 2004 నవంబర్ 1న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన రైతు జాతీయ కమిషన్ (ఎన్సీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన అనేక అంశాలపై అది అధ్యయనం చేసింది. రైతు క్షోభకు కారణాలను విశ్లేషించింది. భూ సంస్కరణల ఆవశ్యకతను, బంజరు భూముల పంపిణీని నొక్కిచెప్పింది. జాతీయ భూ వినియోగ సలహా సర్వీసును ఏర్పాటు చేయాలని కోరింది. వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రత, రుణ పరపతి విధానం, బీమా సౌకర్యం, రైతు ఆత్మహత్యల నివారణ చర్యలు సూచిస్తూ సమగ్ర నివేదికను రూపొందించింది. చిన్నచిన్న కమతాలున్న వ్యవసాయదారుల్లో సమర్థతను పెంచి దిగుబడులను పెంచేందుకు సూచనలు చేసింది. వాటిల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం. వరి, గోధుమలే కాకుండా ఇతర ధాన్యాలనూ ఎంఎస్పీ పరిధిలోకి తీసుకురావాలని, పోషక విలువలున్న చిరు, తృణ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలోకి శాశ్వతంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది. పంటలకు అయ్యే సగటు ఉత్పత్తి వ్యయంతో పాటు అదనంగా కనీసం 50 శాతాన్ని కలిపి ఎంఎస్పీని నిర్ణయించాలని పేర్కొంది. ఈ కమిషన్ నివేదికను కొన్ని సవరణలతో యూపీఏ ప్రభుత్వం 2007లో ఆమోదించినా అమలు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెబుతోంది?: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున రాహుల్ శర్మ అనే అధికారి గతనెల 31న ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ఎంఎస్పీ నిర్ణయించే విషయంలో స్వామినాథన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించలేదు. వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) ఎంఎస్పీని సిఫార్సు చేస్తున్నందున స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం లేదు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఎంఎస్పీ, ఉత్పత్తి వ్యయాన్ని ఆటోమేటిక్గా అనుసంధానం చేస్తే మార్కెట్ దెబ్బతింటుంది. వ్యవసాయ రంగ దీర్ఘకాలిక సమతుల్యాభివృద్ధికి ఇది దోహదపడకపోవచ్చు’ అని కోర్టుకు నివేదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన నివేదికను తిరస్కరిస్తున్నట్టు ఇంతవరకు కేంద్రం ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాలకు మాత్రమే తెలిపింది. అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ, టీడీపీ స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తామని చెప్పాయి. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. రైతు ఆత్మహత్యలపై స్పందించినప్పుడు సైతం సుప్రీంకోర్టు.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఏసీపీ విధానమే లోపభూయిష్టం ధర నిర్ణయానికి సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే 12 అంశాలలో 8 రైతులకు వ్యతిరేకం. మూడేళ్ల కిందటి నాటి ధరలు, ఖర్చుల ఆధారంగా ఒక హెక్టారు సాగు ఖర్చును లెక్కిస్తారు. దేశవ్యాప్తంగా 9,84,485 చోట్ల దిగుబడి నమూనాలు సేకరించాల్సి ఉండగా 5,800 కేంద్రాలలో సేకరించిన దిగుబడుల ఆధారంగా 20 శాతం అధిక దిగుబడి నమోదు చేస్తున్నారు. సీఏసీపీ పెద్ద బోగస్ సంస్థ. దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. - అతుల్ కుమార్ అంజన్, స్వామినాథన్ కమిషన్ తాత్కాలిక సభ్యులు ఎంఎస్పీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉండాలి ఎంఎస్పీని నిర్ణయించే సీఏసీపీ పాత్ర అనుమానాస్పదం. రైతులపై లేని శ్రద్ధ మార్కెట్ శక్తులపై చూపుతోంది. ఉత్పత్తి ఖర్చు కంటే ఎంఎస్పీ తక్కువగా ఉంది. ఈ మాత్రానికి ఎంఎస్పీ ఎందుకు? రాష్ట్రాలే ఎంఎస్పీని నిర్ణయించుకునే అధికారం ఉండాలి. కేంద్రం వాదన, పనితీరు రైతులను దగా చేసేలా ఉంది. - డాక్టర్ డి.నరసింహారెడ్డి, చేతన ఎన్జీవో రైతును భూమి నుంచి దూరం చేసే కుట్ర స్వామినాథన్ కమిషన్ నివేదిక అటకెక్కినట్టే. వాస్తవ వ్యయం ఆధారంగా నిర్ణయించాల్సిన ఎంఎస్పీని డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయించడం రైతును దగా చేయడమే. రైతులు వ్యవసాయాన్ని వదిలేలా చేసి ఆ భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్నదే మోదీ, చంద్రబాబు ధ్యేయం. అందుకే లక్షలాది ఎకరాలతో భూ బ్యాంకులు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. - వంగల సుబ్బారావు, ఏపీ రైతు సంఘం -
ఈ శతాబ్దం భారత్దే!
ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించింది ఐరాస నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు ఇప్పటికైనా ఆ దిశగా యూఎన్ చర్యలు తీసుకోవాలి ♦ నా జీవితంలోని ప్రతీక్షణం దేశసేవకే అంకితం ♦ శాన్జోస్లోని సాప్ సెంటర్లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం శాన్జోస్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో మరోసారి రాక్స్టార్ ప్రదర్శన ఇచ్చారు. శాన్ జోస్ సాప్ సెంటర్లో సోమవారం ఉదయం(భారతీయ కాలమానం ప్రకారం) దాదాపు 18,500 మంది భారతీయ అమెరికన్లను తన ట్రేడ్మార్క్ ప్రసంగంతో ఉర్రూతలూగించారు. 21వ శతాబ్ది భారత్దేనని తేల్చి చెప్పారు. తన జీవితంలోని ప్రతీక్షణం దేశ సేవకే అంకితమని, ‘ఈ దేహం దేశానిదే’నని ఉద్వేగపూరిత వ్యాఖ్య చేశారు. నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయిందంటూ ఐక్యరాజ్యసమితిపై నిప్పులు చెరిగారు. నిర్వచించడానికే ఇంత సమయం తీసుకుంటే ఉగ్రవాద భూతాన్ని అంతం చేసేందుకు ఇంకెంత సమయం పడ్తుందని సూటిగా ప్రశ్నించారు. మోదీ ప్రసంగానికి సభికులు పలుమార్లు హర్షధ్వానాలతో స్పందించారు. యూఎస్లోని భారతీయ ఐటీ నిపుణులపై ప్రశంసలు.. భారత్ భవిష్యత్పై భరోసా.. కాంగ్రెస్పై నర్మగర్భంగా అవినీతి ఆరోపణలు.. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన తదితర ప్రభుత్వ పథకాలు.. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆహూతులను ఆకట్టుకున్నారు. గత పర్యటనలో తూర్పుతీర నగరం న్యూయార్క్లో భారతీయులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన మోదీ.. ఈ పర్యటనలో పశ్చిమతీరంలోని ప్రపంచ ఐటీ రాజధాని సిలికాన్ వ్యాలీ(కాలిఫోర్నియా) కేంద్రంగా అమెరికాలోని భారతీయుల మనసు గెల్చుకున్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 125 కోట్ల భారతీయుల పట్టుదల 21వ శతాబ్ది భారత్ది. భారతీయులది. గత 16 నెలలుగా భారత్పై ప్రపంచ దేశాల వైఖరిలో గొప్ప మార్పు వచ్చింది. ప్రపంచం ఇప్పుడు భారత్ను కొత్త దృష్టితో, కొత్త ఆకాంక్షలతో చూస్తోంది. ఈ సానుకూల మార్పునకు ప్రధాన కారణం 125 కోట్లమంది భారతీయుల కృషి, పట్టుదల, నిబద్ధత. భారత్ భవిష్యత్తుపై ఇక నాకేం ఆందోళన లేదు. భారత్ జనాభాలో 80 కోట్లమందిది 35 ఏళ్లలోపున్న ఉత్సాహపూరిత యువరక్తమే. అందుకే కచ్చితంగా చెప్పగలను భారత్కు ఇక వెనకడుగు లేదు. 15 నెలల్లోనే భారత్ నూతన శిఖరాలకు చేరుకుంది. ఆర్థిక సుస్థిరత సాధించింది. గత ఆర్నెల్లుగా దాదాపు అన్ని రేటింగ్ సంస్థలు ఒకే మాట చెబ్తున్నాయి. పెద్ద దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతేనని తేల్చిచెబ్తున్నాయి. ప్రమాదకర సవాలు.. ఉగ్రవాదం! ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాదకర సవాళ్లు రెండు. ఒకటి ఉగ్రవాదం. రెండోది వాతావరణ మార్పు. పటిష్ట కార్యాచరణ, సమైక్య నిబద్ధతతోనే వాటిని ఎదుర్కోగలం. భారత్ గత 40 ఏళ్లుగా ఉగ్రవాదంతో బాధపడ్తోంది. ఐరాస ఇప్పటివరకు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయింది. ఈ అంశాన్ని రేపు ఐరాస భేటీలో లేవనెత్తనున్నాను. 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదంపై స్పష్టమైన నిర్వచనం ఇవ్వాల్సిన బాధ్యత ఐరాసపై ఉంది. అప్పుడే ఉగ్రవాదం వైపు ఎవరు?.. మానవత్వం వైపు ఎవరు? అన్నది తేలుతుంది. వారికి తమ మార్గాన్ని ఎన్నుకునేందుకు స్పష్టత లభిస్తుంది. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో మంచి టైజం, చెడ్డ టైజం అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి మాటలతో మానవత్వాన్ని కాపాడలేం. ఉగ్రవాదం ఉగ్రవాదమే. పాశ్చాత్య దేశాలు తమ దేశంపై ఉగ్రవాద దాడులు జరిగాకే మేలుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలి. ఐరాసపై ఒత్తిడి తేవాలి. భారతదేశం గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటి మహనీయుల గడ్డ. భారత్ శాంతిని, అహింసను కోరుకునే దేశం. ఐటీలో భారతీయుల అసమాన సేవ ఐటీలో మీ సామర్థ్యం ద్వారా ప్రపంచం దృష్టిలో భారత్ను సమున్నతంగా నిలిపారు. కీబోర్డ్పై మీరు చేసిన మ్యాజిక్తో భారత్కు కొత్త గుర్తింపునిచ్చారు. మీ సామర్థ్యం, నిబద్ధత, సృజనాత్మకతతో ప్రపంచాన్ని మార్పునకు సిద్ధం చేస్తున్నారు. అమెరికన్లు కూడా భారతీయ అమెరికన్ల పట్ల గర్వంగా ఫీల్ అవుతుంటారు. అది గొప్ప విషయం. ఇందుకు మీకు సెల్యూట్ చేస్తున్నా. ఇది మేధో వలస కాదు.. మేధో సంపద. ఇది బ్రెయిన్ డిపాజిట్. ఇది అవసరమైనప్పుడు మాతృభూమికి సేవ చేస్తుంది. ఇప్పుడా సమయం వచ్చింది. భారతీయుల ఐక్యశక్తిని చూపాలి. ఈ రోజు భగత్సింగ్ జయంతి.. ఇక్కడ ఈ రోజు సెప్టెంబర్ 27 కానీ భారత్లో సెప్టెంబర్ 28. అది షహీద్ భగత్సింగ్ జయంతి. ఆ అమరవీరుడికి సెల్యూట్ చేస్తున్నా. (సభికులతో వీర్ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేయించారు) కాలిఫోర్నియాతో అనుబంధం భారత్తో కాలిఫోర్నియాకు చరిత్రాత్మక అనుబంధం ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా గదర్ పార్టీ పనిచేసింది. ఇక్కడి ప్రజలకు భారతీయులంటే ఎంతో అభిమానం. భారతీయ చేతన ఇక్కడ నాకు కనిపిస్తోంది. ప్రముఖుల హాజరు.. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నాన్సీ పెలోసి(అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్), ఎడ్ రాయిస్(అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్) తదితరులున్నారు. నిరసనలు.. కార్యక్రమం సందర్భంగా సాప్ సెంటర్ వెలుపల ప్రత్యేక ఖలిస్తాన్ మద్దతుదారులైన సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా బ్యానర్ను ప్రదర్శించారు. కాగా, గురువారం మినాలో హజ్యాత్రలో జరిగిన తొక్కిసలాటలో వెయ్యిమందికిపైగా మృతిచెందడంపై మోదీ సంతాపం తెలుపుతూ మినా అధికారులు సందేశం పంపారు. నా మిషన్ ‘జామ్’ నా మిషన్ ‘జామ్’. అంటే జనధన్ యోజన.. ఆధార్.. మొబైల్ గవర్నెన్స్. వీటివల్ల అవినీతి తగ్గుతుంది. జనధన యోజన కింద కేవలం 100 రోజుల్లో 18 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లను ప్రారంభింపజేశాం. వాటిలో రూ. 32వేల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. కాంగ్రెస్పై పరోక్ష ఆరోపణలు విదేశీ గడ్డపై కాంగ్రెస్పై, గత యూపీఏ ప్రభుత్వంపై మోదీ మళ్లీ విమర్శలు గుప్పించారు. గతంలో భారత్లో రాజకీయ నేతలు, వారి కుటుంబాలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్కడ రాజకీయ నేతలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు రావడం సాధారణమే. ప్రభుత్వంలో ఉండగా ఒకరు రూ. 50 కోట్లు, మరొకరి కుమారుడు రూ. 100 కోట్లు, ఒకరి కూతురు రూ. 500 కోట్లు, ఇంకొకరి అల్లుడు రూ. 1,000 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపణలు వచ్చాయి’ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా.. సోనియాగాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి.. పరోక్ష విమర్శలు చేశారు. అలాగే, తన ప్రభుత్వంపై, తనపై ఇంతవరకు ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదని గుర్తు చేశారు. ‘నాపై అలాంటి ఆరోపణలేమైనా వచ్చాయా?’ అంటూ మోదీ వేసిన ప్రశ్నకు సభికులు పెద్ద పెట్టున ‘లేదు’ అంటూ నినదించారు. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని దేశసేవకే వినియోగిస్తున్నానన్నారు. ‘నా 16 నెలల పాలనపై మీ నుంచి సర్టిఫికెట్ కోరుకుంటున్నా. నా హామీలను నెరవేర్చానా? లేదా? రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నానా? లేదా?’ అని సభికులను ప్రశ్నించారు. భారత్లోని వాస్తవ పరిస్థితులపై అక్కడివారి కన్నా అమెరికాలోని వారికే ఎక్కువ అవగాహన ఉందన్నారు. -
చేతిలో పనైనా చేయరేం!
యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావుడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! ‘‘స్పెషల్ కేటగిరి స్టేటస్’’ ప్రత్యేక హోదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ‘పదం’. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు ‘స్పెషల్ స్టేట స్’ అని అంటే చాలు బీజేపీ, టీడీపీ వాళ్లకి చిర్రెక్కిపోతోంది. రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్ వాళ్లకూ, సోనియా గాంధీ వెనకాల నక్కిన జగన్మోహన్రెడ్డికీ మాట్లాడే అర్హతే లేదని అధికార పక్షం వారి వాదన... నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ‘పార్టీ ఫీలింగులు’ లేనే లేవు. ఆంధ్రా సీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్ర తినిధులందరూ విభజనను వ్యతిరేకించిన వారే... కొంచెం అటూ ఇటుగా! అటూ ఇటూ అని ఎందుకన్నానంటే, కొందరు కాంగ్రెస్కు చెందిన పార్ల మెంట్ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూనే, హైకమాండ్ నిర్ణయానికి కట్టు బడి ఉంటామన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన అభిప్రాయాన్నే చెప్పలేదు! ‘సమన్యాయం’ అంటే ఆయన ఉద్దేశమేమిటో, ఇప్పటి వరకూ చెప్పనేలేదు!! ఏది ఏమైనప్పటికీ... పార్లమెంట్లో రాష్ర్ట విభజన బిల్లు ‘పాసయిపో యింది’ అన్నారు. విభజన జరిగిపోయింది. (బిల్లు నిజానికి లోక్సభలో పాస వ్వలేదు. పార్లమెంట్ వారు ప్రచురించిన 18.2.14 లోక్సభ డిబేట్స్ చదివిన వారికెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది. అది వేరే సంగతనుకోండి...) యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావిడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! పదేళ్లు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వకపోతే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అతీగతీ లేకుండా పోతుందని వాపోయారు వెంకయ్యనాయుడు. ఉత్తరా ఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకిచ్చినట్లు పన్ను రాయితీలు ఇవ్వాలనీ, ఉత్త రాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర సబ్సిడీలు ఇవ్వాలనీ, యావద్భా రత దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ను కోల్పోతున్న కార ణంగా ఆంధ్రప్రదేశ్కు నష్టపరిహారంగా ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇచ్చి తీరా లని... కోరారు వెంకయ్యనాయుడు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు గురించి, లోక్ సభలో ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న యావదాంధ్ర ప్రజానీకం 20-2-14న రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలకి అతుక్కుపోయారు. స్వతహాగా మంచి వక్త అయిన వెంకయ్యనాయుడు ఆ రోజు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడి... ‘‘మన గురించి మాట్లాడుతున్న ఏకైక మొనగా డురా...’’ అనిపించుకున్నారు. ‘‘పొద్దున్న అయిదేళ్లకి ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ పదేళ్లు అంటా వేంటి..?’’ అని చిరాకుపడ్డారు హోంమంత్రి షిండే గారు. దాంతో రెచ్చిపోయిన వెంకయ్యనాయుడు గారు ‘రెండు మూడు నెలల్లో మేం అధికారంలోకి వస్తున్నాం. మేము ఇవ్వాళ ‘డిమాండ్’ చేస్తున్నవన్నీ, రేపు మేము చేసి చూపెడతాం’’ అని తెలుగులో మనకందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పారు. 2014 జనరల్ ఎలక్షన్లలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి ప్రధాన కారణం ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’! మోదీగారు ప్రధానమంత్రి అయ్యారు. వెంకయ్యనాయుడు గారు అత్యంత కీలకమైన మంత్రి అయ్యారు. మోదీకి చాలా దగ్గరయ్యారు (మోదీ తన మంత్రివర్గ సహచరులలో ఎప్పుడైనా, ఎవరినైనా పొగిడారూ అంటే... అది ఒక్క వెంకయ్యనాయుడు గారినే). ఇక్కడ చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామ్య పార్టీ అయింది. ఇక ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ వెంటనే ప్రకటించటానికి అభ్యం తరం ఏముంటుంది?! మన్మోహన్సింగ్ ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ ఆఖరి కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానం కూడా చేసి దిగిపోయింది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలనే కొత్త సూత్రం ప్రతిపాదిస్తున్నారు కొం దరు విజ్ఞులు. ఎవరొప్పుకున్నారని రాష్ట్ర విభజన బిల్లు తెచ్చారు? ములా యంసింగ్, డీఎంకే, ఏడీఎంకే, అకాలీదళ్, బీజేడీ, జేడీయూ, సీపీఎం, తృణ మూల్... ఏ పార్టీ ఒప్పుకుంది!? కాంగ్రెస్ వారు, బీజేపీ వారు అనుకున్నారు... అయిపోయిందన్నారు. ఈ రోజు కొత్త రూల్స్ మాట్లాడితే ఎలాగ?! ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ అనేది బీజేపీ+టీడీపీల వాగ్దానం. వాగ్దాన భంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రతిపక్షాలని లెక్క పెట్టక్కర్లేదన్న ‘అహంకారం’ తలకెక్కినప్పు డు ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి... ‘మైండ్ సెట్’ అవుతుంది. ఎన్నో అటుపోట్లు, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన ‘ఓటు బ్యాంక్’ కలిగియున్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ‘చావు దెబ్బ’ తినేయటానికి కారణం ఏమిటో అన్ని పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వ్యాసకర్త: లోక్సభ మాజీ సభ్యులు, - ఉండవల్లి అరుణ్ కుమార్ మొబైల్: 9868180171 -
ఇప్పటికీ వాళ్లేనా?
నెహ్రూ కుటుంబం స్మృతిలో దశాబ్దాలుగా వివిధ రకాల పోస్టల్ స్టాంపులను ముద్రించడంపై కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా వివాదాలకు దారితీయడం గర్హనీయం. చూడబోతుంటే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది ఆ కుటుంబంలోని వారే తప్ప మరె వ్వరూ కాదన్నట్లుగా ఇన్నాళ్లూ ప్రభుత్వాలు వ్యవహరించాయి. సోనియా గాంధీ పరోక్ష నేతృత్వంలో యూపీఏ పదేళ్ల పాలనలో 400 స్కీములు, విద్యా సంస్థలు, ప్రాజెక్టులు, సంక్షేమ చర్యలకు రాజీవ్, ఇందిర, నెహ్రూల పేర్లు మాత్రమే పెడుతూ వచ్చారు. ఇంతకూ రాజీవ్ ఘనత ఏమిటి? ప్రధానమంత్రిగా ఆయన పనిచేసిన ఐదేళ్ల కాలంలోనే కాంగ్రెస్ను అటు లోక్సభలోనూ, పలు రాష్ట్రాల అసెంబ్లీలలోనూ శాశ్వత మైనారిటీలోకి దిగజార్చివేశారు. సొంతపార్టీకి ఆయన కట్ట బెట్టిన మహా గొప్ప విజయం అదేమరి. అలాంటిది.. ఆయన గతించిన తర్వాత అంత ప్రాధాన్యత నిచ్చి దేశంలో ప్రతి పథకానికీ ఆయన పేరును తగిలించడం సమంజసం మాట అటుంచి హాస్యాస్పదం. రాజీవ్ విషయం అలా ఉంచితే దేశంలో అనేకమంది కాంగ్రెసేతర, నెహ్రూ కుటుం బేతర నేతలు, జాతి నిర్మాతలు, దేశభక్తిపరులు ఉనికిలోకూడా లేకుండా అనామకులుగా ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి వారిని పార్టీలకు అతీతంగా గుర్తించి పోస్టల్ స్టాంపులు వంటి వాటి ద్వారా వారిని వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది. డాక్టర్ టి.హెచ్. చౌదరి కార్ఖానా, సికిందరాబాద్ -
ప్రతిష్టంభన వెనుక ప్రతీకారేచ్ఛ
సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మాణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. పార్లమెంటు లోపలా, బయటా సాగుతున్న పెనుగులాటలో గెలిచేది ఎవరో తెలియదు కానీ ఓడేది మాత్రం ప్రజలే. వానాకాల సమావేశాలు ప్రతీకార రాజ కీయాల వెల్లువలో కొట్టుకుపోయినట్టే లెక్క. యూపీఏ హయాంలో ప్రతిపక్ష బీజేపీ ఏ విధంగా చర్చకు అంతరాయం కలిగించిందో అదే విధంగా ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ పాలనలో సర్వోన్నత చట్టసభలో చర్చ చట్టుబండలు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నది. ‘తానాషాహీ నహీ చెలేగీ’ (నియంతృత్వం సాగదు) అంటూ పార్లమెంటు భవనం బయట కాం గ్రెస్ అధినేత సోనియాగాంధీ నినాదాలు చేయడం, ఒకవైపు రాహుల్గాంధీ, మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా చెలరేగడం వెనుక పాతకక్ష లేకపోలేదు. యూపీఏ హయాంలో బీజేపీ సృష్టించిన ప్రతిష్టంభనకు మాత్రమే ప్రతీకారం కాదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు సంభవించిన నాటకీయ పరిణామాలలో ప్రధాని పదవికీ, సోనియాగాంధీకీ మధ్య నిలిచిన నాటి ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్పైన ఇది కక్షసాధింపు. సుష్మాపైనే ఎందుకు గురి? విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగబోదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ముగ్గురిలో తక్కువ తీవ్రత ఉన్నది సుష్మాస్వరాజ్పైన వచ్చిన ఆరోపణలలోనే. ఐపీఎల్ క్రికెట్ సృష్టికర్త లలిత్మోదీకీ, వసుంధర రాజే కుమారుడికీ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మధ్య ప్రదేశ్లో వ్యాపం కుంభకోణంలో 35మందికి పైగా వ్యక్తులు మరణించినట్టు రుజువులు ఉన్నాయి. లలిత్మోదీ పోర్చుగల్ వెళ్ళడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిస్తే దాని వల్ల భారత్తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేదని పూచీ ఇవ్వడం సుష్మాస్వరాజ్ చేసిన తప్పిదం. ఈ విషయం మంత్రివర్గంలోని ఇతర బాధ్యులకు తెలియకుండా గోప్యంగా జరగడం నిశ్చయంగా అసాధార ణమే. అక్రమమే. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలలోని తీవ్రత సుష్మాపైన చేస్తున్న ఆరోపణలలో లేదు. గురి సుష్మాపైనే ఎందుకు పెట్టారు? 2004లో ఎన్నికలైన తర్వాత తన నాయకత్వంలోని కూటమికి లోక్ సభలో సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సభ్యుల మద్దతు ఉన్నదంటూ అబ్దుల్ కలాంను కలుసుకునేందుకు రాష్ట్రపతి భవన్కు వెళ్ళిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత త్యాగం సీనుకు తెరలేపారు. తాను స్వయంగా ప్రధాన మంత్రి పదవిని స్వీకరించకుండా మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ను గద్దెపైన కూర్చోబెడుతున్నట్టు ప్రకటించారు. దీనికి నేపథ్యం ఏమిటో చాలా మందికి తెలుసు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీని కనుక ప్రధానిగా నియ మిస్తే తాను శిరోముండనం చేయించుకొని, తెల్లచీర కట్టుకొని జన్పథ్లో నిరా హార దీక్ష చేస్తానంటూ సుష్మాస్వరాజ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి ఆగ్రహం సొనియాగాంధీ హృదయంలో రగులుతూనే ఉంది. ఇప్పుడు సుష్మాను బోనె క్కించే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ప్రయాణానికి అవసరమైన పత్రాలు లలిత్ మోదీకి అందేందుకు దోహదం చేయడమే కాకుండా సుష్మా భర్త, కుమార్తె క్రికెట్ మాయావికి న్యాయసలహాదారులుగా ఉండటం కాంగ్రెస్ దాడికి పదును పెట్టింది. ‘లలిత్మోదీ సుష్మా భర్తకూ, కుమార్తెకూ ఎంత చెల్లించారో వెల్లడిం చాలి’ అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాటుదేలుతున్న రాహుల్ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీఇరానీ సవాలు చేసినట్టు ఒకటిన్నర నిమి షం మాత్రమే కాకుండా గంటన్నర సేపు మాట్లాడటం సోనియాకు కానీ రాహు ల్కి కానీ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చును కానీ, కొన్ని ఘాటైన మాటల (పంచ్ లైన్ల)తో మోదీని వేధించడంలో రాహుల్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ‘ న ఖావూంగా, న ఖానేదూంగా’ (తినను, తిననివ్వను) అంటూ చేసిన వాగ్దానాన్ని పదేపదే ఉటంకించడం ద్వారా అవినీతి వ్యవస్థకు మోదీ అధ్యక్షత వహిస్తున్నారనే భావనను రాహుల్ జయప్రదంగా ప్రచారంలో పెట్టగలిగారు. మోదీకి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కార ణాలు ప్రధానంగా మూడు. ఒకటి, మోదీ అవినీతికి ఆమడ దూరం. రెండు, మోదీ సమర్థ పాలకుడు. మూడు, అభివృద్ధి సాధకుడు. రాహుల్ సుదీర్ఘ విరా మం ముగించుకొని వస్తూనే మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ కీ సర్కార్’ అంటూ దుయ్యపట్టారు. పేదలకు వ్యతిరేకిగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలు డుగా అభివర్ణించారు. ‘అటు అంబానీ, ఇటు అదానీ, మధ్య ప్రధాని’ అంటూ తెలుగులో సైతం చలోక్తులు వినిపించాయి. ఈ మచ్చ మాపుకోవడం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారు. కొర్పొరేట్ రంగ ప్రతినిధులను కలుసుకోవడానికి సైతం సంకోచిస్తున్నారు. అందుకే ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు’ అంటూ బజాజ్ ఆటో అధిపతి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ లాగా రాహుల్ బజాజ్ రాజకీయవాది కాదు. పైగా మోదీ అభిమాని. మోదీ తన ప్రత్యే కతలనూ, స్వశక్తిని విస్మరించి పేదలకు వ్యతిరేకి కాదనే పేరు తెచ్చుకునే ప్రయ త్నంలో గట్టి పనులు చేయలేకపోతున్నారని బజాజ్ ఫిర్యాదు. పారిశ్రామికవేత్తలతో, వణిక్ప్రముఖులతో సమాలోచనలు జరిపి పరిశ్రమ లనూ, వ్యాపారాన్నీ విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించాలనీ, నిరు ద్యోగాన్ని తగ్గించాలనీ మోదీ అభిమానులు కోరుకుంటున్నారు. వెనకటి నుంచి పన్ను కట్టించుకునే చట్టాన్ని (రెట్రాస్పెక్టివ్ టాక్స్ లా) ఉపసంహరించుకోవా లనీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)చట్టాన్ని తీసుకురావాలనీ అభిల షిస్తున్నారు. మోదీ మరింత సమర్థంగా, శక్తిమంతంగా పరిపాలన నిర్వహిం చాలనీ, శషభిషలు లేకుండా బాణంలాగా దూసుకుపోవాలనీ 2014లో అరు దైన అవకాశం ప్రసాదించిన దేశప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని అరుదైన విజయాలు ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు లేకపోలేదు. గత ప్రభుత్వాలు ఆరం భించిన కొన్ని విధానాలను కొనసాగించడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ బలంగా ముందుకు తీసుకొని వెడుతున్నారు. బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పం దం చరిత్రాత్మకమైనది. 1974లో ఇందిరాగాంధీ, ముజీబుర్ రెహ్మాన్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని, బీజేపీ దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ వచ్చిన నిర్ణయాన్ని మోదీ అమలులోకి తేగలిగారు. ముయ్వావర్గంతో ఇటీవల కుదుర్చుకున్న శాంతి ఒప్పందం నాగభూమిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి దోహదం చేస్తుంది. దౌత్యరంగంలో భారత్కు గుర్తింపు సాధించడంలో మోదీ కృషి కొంత వరకూ ఫలించింది. పార్లమెంటులో ప్రతిష్టంభన కారణంగానూ, తన పార్టీలోని ప్రముఖులపైన అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగానూ మోదీ మౌనం వహించడం ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడుగా, ప్రజలతో నేరుగా సంభాషించే నేర్పు కలిగిన రాజకీయవేత్తగా పేరున్న మోదీ స్వపక్షీయులపైన వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేక, ఒప్పుకో లేక మౌనాన్ని ఆశ్రయించడం బలహీనతగానే ప్రజలకు అనిపించింది. ఎన్నికల సమయంలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అనేకం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపైన చర్చ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సమస్య క్రమంగా రగులుతోంది. శనివారంనాడు తిరుపతిలో ఒక యువకుడు ఆత్మ హత్యాయత్నం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 సార్వత్రిక ఎన్నికలలో గెలిపించడానికి రెండు వాగ్దానాలు కారణం. ఒకటి, రైతుల రుణ మాఫీ. రెండు, ప్రత్యేక హోదా. రెండూ ఆచరణకు నోచుకోలేదు. ఈ వైఫల్యానికి తెలుగుదేశం ఎంత కారణమో బీజేపీ సైతం అంతే కారణం. చర్చ ఎవరికి కావాలి? పార్లమెంటులో చర్చను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక కార ణం అంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో సమాలోచనలు జరిపి ఆ పార్టీ సహకారం పొందడానికి నరేంద్రమోదీ ఎందుకు ప్రయత్నించలేదు? పార్లమెంటులో చర్చ జరగకుండా సమయం వృధా అవుతున్నా నిమ్మకు నీరె త్తినట్టు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? గులాం నబీ ఆజాద్నూ, మల్లికార్జున్ ఖార్గేనూ బీజేపీ నాయ కులు సంప్రతించారు. చర్చను అడ్డుకోవాలన్నదే తమకు అధిష్ఠానం నుంచి అం దిన ఆదేశమని వారు చెప్పడంతో బీజేపీ నాయకులు అంతటితో వదిలివేశారు. మోదీ స్వయంగా చొరవ తీసుకొని సోనియాగాంధీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరో సంవత్సరంపాటు రాజ్యసభలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగు తుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68. ఎన్డీఏకి 64 మంది ఉన్నారు(బీజేపీకి 48 మంది, మిత్రపక్షాలకు 16). 2016లో మొత్తం 76 మంది సభ్యుల పదవీ విరమణ ఉంటుంది. వారిలో 21 మంది కాంగ్రెస్కు చెందినవారు. వీరిలో అత్యధికులు రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి కాంగ్రెసేతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారు. సగం సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కవు. పదవీ విరమణ చేయనున్న 17 మంది బీజేపీ సభ్యులు, ఏడుగురు మిత్రపక్షాల సభ్యుల స్థానంలో ఆ పార్టీలకి చెందినవారే ఖాయంగా ఎన్నికై సభకు తిరిగి వస్తారు. 2016 మార్చిలో 12 మంది నామి నేటెడ్ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా అధికార కూటమి సూచించినవారినే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కనుక వారు బీజేపీకి అను కూలురే ఉంటారు. పరిస్థితులు అనుకూలించే వరకూ వేచి ఉండాలని మోదీ నిర్ణయించుకొని ఉంటారు. ప్రస్తుతానికి బిహార్ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి నిలిపింది. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే ముందు బిహార్కు ఆ వరం మోదీ ప్రసాదించేవారు. 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో పని లేదు. బిహార్ తర్వాత కేరళ, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరు గుతాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరుణ్ గగోయ్కి అస్సాంలో వ్యతిరేకత ప్రబలంగా ఉంది. 1985 నుంచి కేరళలో అధికారంలో ఉన్న కూటమిని గెలిపించే ఆనవాయితీ లేదు. అక్కడ బీజేపీ విజయం సాధించ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణించే వరకూ ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం సాధ్యం కాదని మోదీ గ్రహించి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కంటే, ప్రజాహితం కంటే ప్రతీకార రాజ కీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా మోదీ చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించడానికి బీజేపీ గత లోక్సభలో అనుసరించిన అనుచిత ధోరణే కారణం. నాడు అడ్డుకున్న జీఎస్టీ బిల్లును ఇప్పుడు సభ చేత ఆమోదింప జేయాలని ప్రయత్నించడం కపట రాజ కీయాలకు నిదర్శనం. సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మా ణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సత మతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. సామరస్య వాతావరణానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. పదవీ రాజకీయాల పతనావస్థకు మనం ప్రత్యక్ష సాక్షులం. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ - కె.రామచంద్రమూర్తి -
ఎస్బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!
ఆర్థికశాఖ పరిశీలనలో కీలక ప్రతిపాదన ముంబై: కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 2013లో ‘మహిళల కోసం’ ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) త్వరలో తెరమరుగుకానుందా? ఈ బ్యాంకును దేశీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తుది నిర్ణయం ఏదీ ఇప్పటివరకూ తీసుకోకపోయినా... విలీన ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.1,000 కోట్ల తొలి మూలధనంగా బీఎంబీ ప్రారంభమైంది. నాకు తెలియదు: ఎస్బీఐ చీఫ్ కాగా ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను క్యాబినెట్లో చర్చించివుండవచ్చని సైతం అభిప్రాయపడ్డారు. ఈ విలీనం జరిగితే ఎస్బీఐకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సైతం ఆమె వ్యాఖ్యానించారు. అతి చిన్న బ్యాంక్ అయినప్పటికీ, అది విలీనానికి ఎటువంటి అడ్డంకీ కాబోదన్నారు. బీఎంబీ గురించి... ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో దాదాపు 60 శాఖలు ఉన్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో బీఎంబీ అన్లిస్టెడ్ సంస్థ. మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటయ్యింది. 2013-14లో ఆదాయం రూ.45.29 కోట్లు. 2014 మార్చి నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.175 కోట్లు. -
36 రాఫేల్ యుద్ధ విమానాలే కొంటాం
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు ఫ్రాన్స్ నుంచి 126 రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, అది ఆర్థికంగా కూడా సాధ్యపడదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 36 రాఫేల్ జెట్లను మాత్రమే కొనుగోలు చేస్తుందని, వీటిని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ఆదివారమిక్కడ చెప్పారు. వాయు సేన అవసరాల మేరకే వీటిని కొనుగోలు చేస్తున్నామని, అంతకుమించి కొనుక్కోబోమని అన్నారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రారంభించిన టెండర్ ప్రక్రియను కూడా తప్పుపట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను, రక్షణ సేకరణ మండలిని నిర్వీర్యం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. -
రాజకీయ కారణాలతోనే..
* అఫ్జల్ గురుకు ఉరిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ * ఉరికి కొద్దిగంటల ముందే నాకు సమాచారం ఇచ్చారు న్యూఢిల్లీ: పార్లమెంట్పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ఉరి తీసిందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఉరికి కొద్ది గంటల ముందుగా మాత్రమే సమాచారం ఇచ్చారని చెప్పారు. ‘‘ఆరోజు నేను నా సోదరితో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన సమయంలో హోంమంత్రి సుశీల్కుమార్ షిండే ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం అఫ్జల్గురును ఉరి తీస్తున్నారని, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేశానని చెప్పారు. జమ్మూకశ్మీర్లో ఏవైనా ఉద్రిక్త పరిణామాలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు’’ అని ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. అఫ్జల్ ఉరి నిర్ణయాన్ని ముమ్మాటికి రాజకీయ కారణాల వల్లే తీసుకున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తమపై విమర్శలు గుప్పించే అవకాశం ఇవ్వకూడదనే యూపీఏ సర్కారు గురుతోపాటు కసబ్ను ఉరితీసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిందన్నారు. కాగా, ప్రధాని మోదీ విదేశీ గడ్డపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించడాన్ని ఒమర్ తప్పుపట్టారు. అంతా తానే చేస్తున్నాన్న భావనలో మోదీ ఉన్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో తాను ప్రధానిగా వచ్చానని, బీజేపీ ప్రతినిధిగా రాలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాహుల్లో ప్రస్తుతం అద్భుతమైన మార్పు వచ్చిందని కొనియాడారు. -
ఏడాది పాలనపై ప్రజల్లోకి..
విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని బీజేపీ నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనను, సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. దేశంలో సహాకార పూర్వక సమాఖ్య వ్యవస్థ, సమ్మిళిత అభివృద్ధి దిశగా మోదీ అడుగులు వేస్తున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని ప్రచారం చేయాలని భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి ‘జన్ కల్యాణ్ పర్వ్’ పేరిట వారం పాటు వేడుకలు నిర్వహించే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా గత ఏడాదిలో సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దేశంలో పేదరికం కొనసాగాలని కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయని.. తాము అలా జరగనివ్వబోమని, పేదరికాన్ని నిర్మూలిస్తామని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తమ అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనతో దేశం ఆర్థికంగా దూసుకుపోతుందన్నారు. మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని.. పేదల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమానికి పాటు పడదాం.. గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనతో పోలిస్తే.. తమ ఎన్డీయే పది నెలల పాలనలో ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయాలను గర్వంగా ప్రజల ముందుకు తీసుకెళదామని ఎంపీలకు సూచించారు. -
'మద్దతు ఉపసంహరించాల్సింది కాదు'
న్యూఢిల్లీ: యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్ష పార్టీలు మద్దతు ఉపసంహరించకుండా ఉండాల్సిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి అభిప్రాయడ్డారు. భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. యూపీఏతో సర్కారుతో బంధాలు తెంచుకున్న నాటి నుంచి వామపక్షాల బలం తగ్గుతూ వచ్చింది. అణు ఒప్పందంపై కాకుండా ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై మద్దతు ఉపసంహరించివుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఏచూరి అభిప్రాయపడ్డారు. అయితే అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం కరెక్టేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో లేనప్పటికీ యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య వంతులను చేయలేకపోయామని చెప్పారు. -
తప్పనిసరి పరిణామం
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని శాపాలై వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతృత్వంవహించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిందితుడిగా బోనెక్క బోతున్నారు. ఈ స్కాంను ఆదినుంచీ గమనిస్తున్నవారంతా ఇలాంటి పరిస్థితి ఏర్పడు తుందని ముందే ఊహించారు. దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రమే మరోలా భావిం చింది. ఇప్పుడు మన్మోహన్సింగ్కు సమన్లు అందిన తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటా యింపు కేసుపై ఆ సంస్థ సుదీర్ఘకాలం దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఎవరూ నేరానికి పాల్పడలేదంటూ ప్రత్యేక న్యాయస్థానానికి నిరుడు ఆగస్టులో ముగింపు నివేదికను సమర్పించింది. ప్రత్యేక న్యాయస్థానం ఆ నివేదికను తిరస్కరించి, దర్యాప్తులోని లొసుగులను ఎత్తిచూపింది. కేసులో ఉన్న కొన్ని అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదని ప్రశ్నించింది. ముఖ్యంగా మన్మోహన్సింగ్ను ప్రశ్నించవలసి ఉండగా ఆ పని చేయలేదేమని నిలదీసింది. ఆ తర్వాతే సీబీఐలో కదలిక వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని మూడేళ్ల క్రితం తొలిసారి కాగ్ వెల్లడించింది. మొత్తం 195 క్షేత్రాల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలిపింది. ఇందువల్ల ఖజానాకు లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. స్కాం జరిగిందంటున్న సమయంలో కొంతకాలం బొగ్గు శాఖను స్వయంగా మన్మోహన్సింగే పర్యవేక్షించారు. కనుక ఆ స్కాంపై మన్మోహన్ను ప్రశ్నించడం తప్పనిసరి. అయినా సీబీఐ ఏ దశలోనూ ఆయనను పిలవలేదు. మన్మోహన్సింగ్ వరకూ అవసరం లేదు... ఆ సమయంలో ప్రధాని కార్యాలయం (పీఎంఓ)లో పని చేసిన వారినే ప్రశ్నించలేదు. తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హిందాల్కో అధిపతి కుమార మంగళం బిర్లా మన్మోహన్తో సమావేశమయ్యారని, అటుతర్వాత ఆయనకు రెండు లేఖలు రాశారని వెల్లడైంది. ఇవన్నీ జరిగాక ఆ బొగ్గు క్షేత్రాలను హిందాల్కోకు కేటాయించాలని పీఎంఓనుంచి ఒత్తిళ్లు వచ్చాయని బొగ్గు శాఖ అధికారులు దర్యాప్తులో చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు తలబిరా-2 బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ చేసిన సిఫార్సును తొలుత ఒప్పుకున్న మన్మోహన్ ఆ తర్వాత హిందాల్కోవైపు మొగ్గు చూపారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో నిజానిజాలేమిటన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలే. కుమార మంగళం బిర్లా ప్రధానిని కలవడంలోగానీ, ఆయనకు లేఖలు రాయడంలో గానీ తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే, ఆ కారణాలవల్లనే ఆ సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించారా, ఇతరత్రా ఆ సంస్థకు ఎలాంటి అర్హతలూ లేవా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిజానిజాలేమిటో తెలుసుకుని సందేహాతీతంగా న్యాయస్థానానికి వివరించి ఉంటే వేరుగా ఉండేది. ఆ పనిచేయాలంటే మన్మోహన్ను పిలిచి ప్రశ్నించాలి. పీఎంఓలోని ఇతర అధికారులనుంచీ విషయాలు రాబట్టాలి. కానీ, సీబీఐ ఆ పనిచేయలేదు. సందేహాలన్నిటినీ అలాగే మిగిల్చి కేసు మూసేస్తున్నట్టు నివేదిక ఇస్తే ఏ న్యాయ స్థానమైనా ప్రశ్నించకుండా ఎందుకుంటుంది? మన్మోహన్ బోనెక్కాల్సిరావడం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు విచారకరమైన విషయమే. కానీ అందుకు బాధ్యులెవరు? ఆ స్కాంపై ఎన్నోసార్లు పార్లమెంటు స్తంభించిపోయింది. అనేకసార్లు వాయిదా పడాల్సివచ్చింది. ఏ దశలోనూ మన్మోహన్ సందేహ నివృత్తికి ప్రయత్నించలేదు. తన సచ్ఛీలతను నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. అసలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకే ఆ రోజుల్లో యూపీఏ సర్కారు ముందుకు రాలేదు. విపక్షాల ఒత్తిడి తట్టుకోలేక చివరకు దాన్ని నియమించినా ఆ సంఘం ముందుకొచ్చి మన్మోహన్ వివరణనిచ్చే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల కేటాయింపు సరైంది కాదని, వేలం విధానం ద్వారానే దాన్ని అప్పగించడం మంచిదని స్వయంగా మన్మోహనే ప్రతిపాదించారు. ఆనాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ సలహా మేరకు అలాంటి ప్రతిపాదన చేసినా... ఆయనే దాన్ని ఎందుకు పాటించలేకపోయారో, పీఎంఓనుంచి బొగ్గు శాఖపై ఎందుకు ఒత్తిళ్లు వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈ సందేహాలన్నిటికీ మన్మోహన్ మౌనమే సమాధానమైంది. విపక్ష రాష్ట్రాల సీఎంల ఒత్తిడి వల్లనే తాము వేలం విధానాన్ని ప్రారంభించలేక పోయామని ఒక దశలో మన్మోహన్ అన్నారు. కానీ అది బలహీనమైన వాదన. ఎవరో ఒత్తిడి చేశారని ఖజానాకు నష్టం కలిగించే పద్ధతిని కొనసాగిస్తారా? నిజానికి ప్రధానిగా ఆయన అన్ని శాఖల పర్యవేక్షణనూ చూస్తూ, అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేయాలి. అలాంటిది తానే స్వయంగా చూసిన శాఖలో అవకతవకలు జరుగుతుంటే ఆయన ఎందుకు మిన్నకుండిపోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సిమెంటు, ఉక్కు, విద్యుత్తువంటి ఎన్నో పరిశ్రమలకు బొగ్గు కీలకమైన ముడి సరుకు. దాని సరఫరా అంతంతమాత్రంగా ఉన్నందువల్ల విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సివస్తున్నది. ప్రధాన సరఫరాదారు కోల్ ఇండియా లిమిటెడ్ డిమాండుకు తగ్గ స్థాయిలో అందించలేక పోతున్నదన్న కారణంతో అవసరమైన పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానం ప్రారంభించారు. అయితే అందుకు వేలం పద్ధతిని ఎంచుకోకపోవడంవల్ల, పారదర్శకత పాటించనందువల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొగ్గు క్షేత్రాలను అందుకున్న సంస్థలు భారీయెత్తున లాభపడ్డాయి. మన్మోహన్ను నిందితుడిగా పరిగణిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేయడం అనేకులకు మింగుడుపడని విషయమే. కానీ స్కాం జరిగిన సమయంలో ఆయన బొగ్గు శాఖను చూడటం, ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించకపోవడం వంటి కారణాలవల్ల మన్మోహన్ ఈ పాపభారం మోయకతప్పదు. -
ఎన్నాళ్లీ వెనుకబాటు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద బీఆర్జీఎఫ్(బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్) స్కీమ్ను యూపీఎ1 ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చొరవతో ఆ స్కీమ్కి విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.25కోట్ల నిధులు విడుదల చేస్తూ వస్తోంది. వాటితో జిల్లా పరిషత్ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తోంది. ఈ నిధులొచ్చాక జిల్లాలో వేల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. మించిపోయిన సమయం 2014-15కి సంబంధించి సకాలంలో వెళ్లిన జిల్లాల ప్రతిపాదనలకు గత కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలయ్యాయి. కానీ, అవి మన జిల్లాకొచ్చే సరికి జెడ్పీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతల మెప్పు కోసం కొత్తగా ఏర్పడే జిల్లా పరిషత్ పాలకవర్గం చేత ప్రతిపాదిద్దామని వ్యూహాత్మక జాప్యం చేశారు. అనుకున్నట్టే పాలకవర్గం కొలువు తీరాక తీర్మానం చేసి పంపించారు. కానీ, ఈలోపే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. ఆలస్యంగా వచ్చాయన్న కారణంగా జిల్లా ప్రతిపాదనలను ముందే తెలిపిన ‘సాక్షి’ఇంతలోనే కేంద్రప్రభుత్వం వైఖరి కూడా మారింది. బీఆర్జీఎఫ్కు నిధులు సమకూర్చుతున్న ప్రణాళికా సంఘాన్ని ఏకంగా రద్దు చేసింది. దాని స్థానే నీతి అయోగ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పణాళిక సంఘమే లేనప్పుడు బీఆర్జీఎఫ్ కింద నిధులెలా వస్తాయన్న అనుమానం అప్పుడే మొదలయ్యింది. ఇదే విషయవై ‘సాక్షి’ దినపత్రికలో ఫిబ్రవరి 17వ తేదీన ‘‘బీఆర్జీ నిధులపై నీలినీడలు’’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. కథనం ప్రకారం వెల్లువెత్తుతున్న సందేహాలకు తగ్గట్టుగానే కేంద్రం బీఆర్జీఎఫ్పై ఆసక్తి చూపలేదు. ఏకంగా ఆ స్కీమ్ను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. దీంతో జిల్లా ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకుండా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో వెనుకబడిన విజయనగరం జిల్లా పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి యూపీఎ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు ప్రస్తుతం అధికార బీజేపీ కూడా వంతు పాడింది. దీంతో ఈ ప్యాకేజీతోనైనా జిల్లా వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు అవకాశం ఉంటుందని మేధావులు భావించారు. కొత్త రాగం.. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.500కోట్లు చొప్పున వచ్చే అవకాశం ఉందని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించారు. ఇయతే ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యేక నిధులంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఆమేరకు ఇటీవల జిల్లాకు రూ.50కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇలా ఎన్నేళ్లు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా పేర్కొనలేదు. వెనుకబడిన జిల్లాలో భాగంగా విజయనగరం జిల్లాకు సంవత్సరానికి రూ.500కోట్లుచొప్పున ఐదేళ్లు వస్తాయనుకుంటే ప్రత్యేక నిధుల పేరుతో కేవలం రూ.50కోట్లతో కేంద్రం చేతులు దులుపుకోవడాన్ని తెలుసుకుని జిల్లా ప్రజలు తట్టు కోలేకపోయారు. ఇదే తరహాలో ఐదేళ్ల పాటు ఇచ్చినా రూ.250కోట్లు దాటవు. జిల్లా అభివృద్ధికి ఎటూ సరిపోవు. ఇప్పటికే నిధుల్లేమి, లోటు బడ్జెట్ కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ నిధులతోనైనా గట్టెక్కుతామనుకుంటే కేంద్రం ప్రత్యేక నిధుల పేరుతో సరిపెట్టింది. -
నీలిట్.. అవుట్!
ఎచ్చెర్ల: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం.. ప్రభుత్వాలు మారడం సహజం. వాటితోపాటు కొన్ని విధానాలూ మారుతుంటాయి. అంతేకానీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజె క్టులు అటకెక్కుతాయా?.. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు ఆగిపోవలసిందేనా??.. గత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు పరిస్థితి ఈ సందేహాలను రేపుతోంది. ఆందోళన కలిగిస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నీలిట్ ప్రాజెక్టు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడి విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి అవుతున్నా దాని గురించి ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు మనుగడప అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వం చివరినాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు నీలిట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంస్థను మంజూరు చేసింది. రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టే దీని నిర్మాణానికి ఎచ్చెర్ల మండలం కుశాలపురం సమీపంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శంకుస్థాపన చేశారు. అదే ప్రాజెక్టుకు తిరిగి అదే ఏడాది ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చేత కోటబొమ్మాళి మండలం తర్లికొండపై మరోసారి శంకుస్థాపన చేయించారు. అయితే తర్లికొండ గ్రామీణ ప్రాంతం కావడం, జిల్లా కేంద్రం సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని భావించి శ్రీకాకుళం పాలిటెక్నిక్ సమీపంలోని స్థలాన్నే ఖరారు చేశారు. దేశంలో 24వ ప్రాజెక్టు దేశంలో ప్రస్తుతం 23 నీలిట్ సంస్థలు ఉన్నాయి. 24వ సంస్థను శ్రీకాకుళానికి కేంద్ర ఐటీ శాఖ మంజూరు చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు రంగంలో ఉఫాది కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం వంటి గ్రామీణ జిల్లాల యువతకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ సంస్థ నిర్మాణం పూర్తి అయ్యి శిక్షణలు ప్రారంభమైతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత ఆశతో ఎదురుచూస్తుండగా ఎన్నికలు జరిగి కేంద్రా, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయే తప్ప శిలాఫలకం పడిన నీలిట్ ప్రాజెక్టు గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు సైతం లభించాయని శంకుస్థాపన సమయంలో కృపారాణి ప్రకటించినా.. ఏడాది గడుస్తున్నా దీని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దాంతో ఆ ప్రాజెక్టు దాదాపు అటకెక్కినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ, జిల్లా మంత్రి చొరవ తీసుకొని జిల్లాకు మంజూరైన ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విద్యావంతులు కోరుతున్నారు. -
కాంగ్రెస్కు జయంతి షాక్
-
కాంగ్రెస్కు జయంతి షాక్
* నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు.. పార్టీకి రాజీనామా * పర్యావరణ అనుమతుల్లో రాహుల్ జోక్యం చేసుకునేవారు * కీలక ప్రాజెక్టులపై ‘సూచనలు’ పంపేవారు * పార్టీ సేవల కోసమని మంత్రి పదవికి రాజీనామా చేయించారు చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు! కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూపీఏ హయాంలో కీలకమైన ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల విషయంలో రాహుల్ జోక్యం చేసుకునేవారని గుట్టును బయటపెట్టారు. దీంతో అటు కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ పడగా.. ఇటు అధికార బీజేపీ చేతికి కొత్త అస్త్రాలు అందాయి. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సమీక్ష జరుపుతామని కేంద్రం సంకేతాలు పంపగా.. సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముంగిట జయంతి ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. రాహుల్ వల్లే తప్పుకుంటున్నా... రాహుల్గాంధీ తీరు వల్లే మనస్తాపానికి గురై పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జయంతి నటరాజన్ చెప్పారు. అనుమతులపై రాహుల్ నుంచి వచ్చిన ‘సూచనలు’ పాటించానని, అయినా పార్టీ తనను అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లుగా తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. తమిళనాడు కాంగ్రెస్ ట్రస్టీ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నా. నేను మంత్రిగా ఏ తప్పూ చేయలేదు. దీనిపై ఎలాం టి విచారణ ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినట్టు తేలితే జైలుకెళ్లడానికైనా, ఉరిశిక్షకైనా సిద్ధమే’’ అని స్పష్టంచేశారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలను కలిసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. యూపీఏ-2 లో పర్యావరణ, అటవీశాఖ మంత్రి(ఇండిపెండెంట్)గా పనిచేసిన జయంతి, 2013, డిసెంబర్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘పర్యావరణ అనుమతులపై నేను చట్టాలు, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరించా. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. వేదాంత ప్రాజెక్టు విషయంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నా. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో స్వచ్ఛంద సంస్థలు లేవనెత్తిన అభ్యం తరాలను ప్రముఖంగా పేర్కొంటూ రాహుల్ నుంచి సందేశాలు అందాయి’’ అని జయంతి నటరాజన్ వివరించారు. పార్టీ ఆదేశాల మేర కు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాహుల్ కార్యాలయం కేంద్రంగా తనను ఇబ్బంది పెట్టే చర్యలు కొనసాగాయన్నారు. కొందరు బడా పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి రాహుల్ ఫిక్కీలో తనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్నారు. తన తప్పేంటో తెలుసుకునేందుకు సోనియాను, రాహుల్ను కలిసేం దుకు అనేకసార్లు ప్రయత్నించినా వారు భేటీకి నిరాకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్తో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న తనను... పార్టీ సేవల పేరుతో మంత్రి పదవి నుంచి తొలగించారని, తర్వాత 11 నెలలపాటు పార్టీకి దూరంపెట్టడం ఆవేదనకు గురిచేసిందన్నారు. రాహుల్ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ జయంతి ఆరోపణల నేపథ్యంలో రాహుల్ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. అమె అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ ‘జయంతి ట్యాక్స్’ పేరుతో లోక్సభ ఎన్నికల ముంగిట బీజేపీ విమర్శలు గుప్పించడంతోనే రాజీనామా చేయించాల్సి వచ్చిందన్నారు. పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలను జయంతి నటరాజన్కు ముందు అదే శాఖకు మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్, ఆమె తర్వాత మంత్రి గా కొనసాగిన ఎం.వీరప్పమొయిలీ ఖండించారు. రాహుల్గానీ, సోనియాగానీ ఏనాడూ తమ విధులు, నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు కాదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘కొత్త రాజకీయ బాసులు’ చెప్పినట్టు ఆమె నడుచుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ఆమెపై చట్టపరం గా చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాలు లేనందునే చివరికి మంత్రి పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందన్నారు. దురుద్దేశంతోనే రాహుల్పై జయంతి ఆరోపణలు చేశారని, ఈ అంశాలను ఏడాది కాలంగా పార్టీ వేదికలపై ఎందుకు ప్రస్తావించలేదని అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రశ్నించారు. సోనియాకు జయంతి రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ.. పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణం-పరిశ్రమల మధ్య సమతూకం పాటించాలన్న దివంగత ఇందిర, రాజీవ్ల స్ఫూర్తికి అనుగుణంగానే నేను నా శాఖ విధులు నిర్వర్తించాను. ఎన్ఏసీ చైర్పర్సన్గా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై మీరు లేఖలు రాశారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో రాహుల్గాంధీ కార్యాలయం నుంచి ‘ప్రత్యేక వినతులు’ వచ్చేవి. వాటిని నేను గౌరవించాను. పర్యావరణ, అటవీశాఖలకు స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. 2013, డిసెంబర్ 20న ప్రధాని మన్మోహన్సింగ్ నన్ను పిలిచారు. నేను వెళ్లగానే ఆయన లేచి నిలబడ్డారు. కాస్త ఆందోళన, వ్యాకులతతో కనిపించారు. ‘జయంతి, మీ సేవలు పార్టీకి అవసరమని పార్టీ అధ్యక్షురాలు సోనియా నాతో చెప్పారు’ అని అన్నారు. నాకు అర్థం కాలేదు. ‘‘సరే సర్, అయితే నేనేమి చేయాలి’ అని అడిగా. ‘ఆమె(సోనియా) మిమ్మల్ని రాజీనామా చేయాలన్నారు’ అని ప్రధాని అన్నారు. నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యా. ‘రాజీనామా..?ఎప్పుడు సర్?’ అని అడిగా. ‘ఈరోజే’ అని ప్రధాని బదులిచ్చారు. నేను ఒక్కమాట మాట్లాడలేదు. ‘అయితే సరే’ అని నవ్వుతూ చెప్పా. మీపై పూర్తి విశ్వాసంతో రాజీనామా చేశా. ఈలోగానే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాలో నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. నేను రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్గాంధీ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఫిక్కీలో రాహుల్ ఆ మాటలు చెప్పేందుకే మీతో రాజీనామా చేయించారా అని మీడియా నన్ను అడిగింది. అనుమతుల విషయంలో నేను ఎప్పుడూ అవరోధంగా నిలవలేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల జాప్యంలో నేను బాధ్యురాలిని కాదు. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై జరుగుతున్న దాడితో తీవ్రంగా కలత చెందా. నా రాజీనామా, ఫిక్కీలో ప్రసంగంపై నేను రాహుల్కి ఒక మెసేజ్ పంపా. ఇలా చేయడానికి నేను చేసిన తప్పేమిటని అడిగా. నేనేమైనా తప్పు చేసి ఉంటే.. వివరణ అడగాల్సిందని వేడుకొన్నా. ఆయనను కలుసుకునేందుకు సమయం కావాలని అడిగా. ‘నేను కాస్త బిజీగా ఉన్నా. మళ్లీ కలుద్దాం’ అని రాహుల్ బదులిచ్చారు. ‘స్నూప్గేట్’ విషయంలో ఇప్పటి ప్రధాని మోదీపై దాడి చేయాల్సిందిగా నాకు సూచించారు. తొలుత నేను అం దుకు నిరాకరించా. నేను అప్పడు మంత్రిగా ఉన్నందున ప్రభుత్వం తరఫున దీనిపై మాట్లాడేందుకు తిరస్కరించా. ఇది ‘ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయం’ అని పార్టీ నాయకత్వం చెప్పటంతో. తప్పనిసరై దానిపై మాట్లాడాల్సి వచ్చింది. (ఈ లేఖను జయంతి నటరాజన్ 2014 నవంబర్ 5న సోనియాకు రాశారు) -
పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష: జైట్లీ
న్యూఢిల్లీ: పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం యూపీఏ పాలనపై గురి పెట్టింది! వివిధ ప్రాజెక్టులకు యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని ప్రకటించింది. నాడు పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది. ‘పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఆరోపణలు చూస్తుంటే.. యూపీఏ సర్కారు శాడిస్టు ఆర్థిక విధానాలు అవలంబించినట్లు స్పష్టమవుతోంది. చట్టాలతో నిమిత్తం లేకుండా వారి అనుంగులకే అనుమతులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు ఇచ్చిన లేదా నిరాకరించిన పర్యావరణ అనుమతులపై ప్రస్తుత పర్యావరణ శాఖ సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ శుక్రవారం విలేకరులతో అన్నారు. అనుమతుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే యూపీఏ హయాంలో వృద్ధిరేటు కుంటుపడిందన్నారు. -
పెట్రో నిరసన
పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెన్నై:యూపీఏ హయూంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయూయి. నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో చమురు ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్పై ధర నిర్ణయూనికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల పదిహేనో తేదీ, నెలాఖరులో చమురు ధరల్ని సమీక్షించి ధర నిర్ణయించే పనిలో చమురు సంస్థలు పడ్డాయి. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు నుంచి ఈనెల 14 వరకు పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే, ఈ తగ్గుదల కారణంగా తాము నష్ట పోవాల్సి వస్తున్నదని పెట్రోల్ బంక్, చిల్లర వర్తక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అధిక ధరకు తాము కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండగానే, ధరను తగ్గించడం వలన తాము నష్టాన్ని చవి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చమురు సంస్థలు పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్ల గోడును పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. దీంతో చమురు సంస్థలపై కన్నెర్ర చేస్తూ ఒక రోజు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి యజమానుల సంఘాలు నిర్ణయించాయి. 31న కొనుగోళ్ల బంద్ పెట్రోల్ బంక్, చిల్లర వర్తక డీలర్ల సంఘం అధ్యక్షుడు కేపీ మురళి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రధాని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక పలు మార్లు ధరల్ని తగ్గించారని వివరించారు. ఐదు సార్లు పెట్రోల్, నాలుగు సార్లు డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్నారు. ధరల తగ్గింపు గురించి ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చిన పక్షంలో కొనుగోళ్లు తగ్గించి స్టాక్ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 15న ధర తగ్గింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉందని, ఆ రోజున సెలవు దినం కావడంతో 16న ప్రకటించారని వివరించారు. ఈ కారణంగా తమకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ధర తగ్గడంతో నిల్వ ఉన్న స్టాక్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు యజమానులు రూ.150 కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశారని తెలిపారు. రాష్ట్రంలో ఒక రోజుకు రెండు కోట్ల 40 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేస్తున్నారని, ఒక రోజు కొనుగోళ్లను నిలిపి వేసిన పక్షంలో నష్టం చమురు సంస్థలకు, పన్ను రూపంలో కేంద్రానికి తప్పదని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లోని ట్యాంకుల్ని సకాలంలో శుభ్రం చేయకుంటే తొలి హెచ్చరికగా రూ.పది వేలు, రెండో హెచ్చరికగా రూ.20 వేలు చొప్పున జరిమానా విధించబోతున్నట్టుగా పెట్రోలియం శాఖ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2012 క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం తమ మీద చర్యలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం చర్యల్ని వ్యతిరేకిస్తూ, ధరల వ్యవహారంలో తమకు ఎదురవుతున్న నష్టం భర్తీతోపాటుగా పలు రకాల డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించామని ప్రకటించారు. ఒక్క రోజు తాము కొనుగోలు చేయని పక్షంలో రూ.50 కోట్ల మేరకు పన్ను నష్టం తప్పదని హెచ్చరించారు. తమ పిలుపునకు రాష్ట్రంలో 4590 పెట్రోల్ బంక్ యజమానులు కదిలారని, తమ డిమాండ్ల మీద కేంద్ర, చమురు సంస్థలు దృష్టి పెట్టని పక్షంలో తమ నిరసన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వీరి నిరసన పుణ్యమా అని ఫిబ్రవరి ఒకటో తేదీ పెట్రోల్, డీజిల్ కొరత రాష్ర్టంలో ఏర్పడే అవకాశాలున్నాయి. పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
కొనసాగుతున్న కష్టాలు
వేలాది మంది గ్యాస్ వినియోగదారులకు అందని సబ్సిడీ సొమ్ము బ్యాంక్లు, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న జనం ఏమీ చేయలేమని చేతులెత్తేసిన బ్యాంకర్లు, డీలర్లు నగరంలోని సూర్యారావుపేటకు చెందిన మహాలక్ష్మి డిసెంబర్లో గ్యాస్ కొనుగోలు చేశారు. సబ్సిడీ డబ్బు ఆమె బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఆమె బ్యాంక్ ఖాతాలో మాత్రం పేమెంట్ హోల్డ్ అని ఉంది. సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో సంప్రదించగా తమకు సంబంధం లేదని బదులిచ్చారు. బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లగా ఆమె కొనుగోలు చేసిన గ్యాస్కు సంబంధించి ఎటువంటి నగదు రాలేదని చెప్పారు. దీంతో తాను ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ఆర్థంకావడం లేదని మహాలక్ష్మి వాపోతున్నారు. కంకిపాడుకు చెందిన ఓ వినియోగదారునికి కూడా ఈ నెల మొదటి వారంలో కొనుగోలు చేసిన సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. బ్యాంక్ అధికారులను సంప్రదించగా ‘ఫెయిల్డ్’ అని వస్తోందని, సబ్సిడీ డబ్బు వచ్చి వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారని ఆయన తెలిపారు. తన అకౌంట్లో జమ కాకుండా డబ్బు వచ్చి వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరిగి తనకు సబ్సిడీ మొత్తం రావాలంటే ఏంచేయాలో తెలియడం లేదని లబోదిబోమంటున్నాడు. విజయవాడ : గ్యాస్ వినియోగదారులను ఆధార్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆధార్ అనుసంధానం పూర్తయినప్పటికీ వేలాది మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమకావడం లేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 11లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్యాస్కు ఆధార్తో లింకును తొలగించింది. అయితే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ మళ్లీ మూడు నెలల క్రితం గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు నేరుగా సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. ఆధార్ సీడింగ్ పూర్తయిన వారికి ప్రత్యేక సంస్థ ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమచేస్తోంది. ఆధార్ అనుసంధానం కాని వారు ఫిబ్రవరి 14 నుంచి నుంచి గ్యాస్ సిలిండర్ను రూ.778లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆధార్ సీడింగ్ పూర్తయినా తప్పని కష్టాలు బ్యాంక్ ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీలో ఆధార్ నంబరు అనుసంధానం చేయించుకున్న వేలాది మందికి సబ్సిడీ సొమ్ము అందడం లేదు. గ్యాస్ సిలిండర్కు రూ.778 చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ధర రూ.441.50 కాగా, సబ్సిడీ సొమ్ము రూ.336.50 వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఒక్కో గ్యాస్ ఏజెన్సీ, బ్యాంక్ చుట్టూ వందలాది మంది వినియోగదారులు తిరుగుతున్నారు. కొందరి ఖాతాల్లో ఫెయిల్డ్ అని, మరికొందరి ఖాతాల్లో పేమెంట్ హోల్డ్ అని మెసేజ్ నమోదవుతోంది. కొందరికి సబ్సిడీ జమ అయి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఆధార్ అనుసంధానం కోసం బ్యాంక్ ఖాతాలు తెరచి, ఆ తర్వాత మూడు నెలలు వాడకపోతే అవి రద్దయ్యాయని కొన్ని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఆధార్ నంబరును తమ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులకు ఏమి చెప్పాలో కూడా అర్థంకావడం లేదని గ్యాస్ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ వెంటనే చమురు కంపెనీల అధికారులు, గ్యాస్ డీలర్లు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఆర్డినెన్స్ పాలన!
ఎన్నిసార్లు ఎంత ఘనంగా సంకల్పం చెప్పుకున్నా మన పార్లమెంటును సజావుగా నడపడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదని మళ్లీ రుజువైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేసరికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఉంది. సమావేశాలు ముగిసే రోజున జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో సైతం ఆ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ ఎన్నికలన్నిటా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఆ రకంగా కేంద్రంలో పాలకపక్షం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు పార్లమెంటును నడపడం దానికి కష్టం కాకూడదు. లోగడ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు వాయిదాల ప్రమేయం లేకుండా ఒక్కరోజు కూడా పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోయింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండు కోసం ఒక సందర్భంలో మొత్తంగా సమావేశాలే చాపచుట్టుకుపోయాయి. ఇప్పుడు సైతం అవే దృశ్యాలు కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఎవరినో తప్పుబట్టడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి తక్షణావసరం. ఆ సంగతలా ఉంచి...నరేంద్ర మోదీ సర్కారు ఈ సమావేశాల్లో ఆమోదం పొంది ఉండాల్సిన రెండు ప్రధాన బిల్లుల స్థానంలో శుక్రవారం రెండు ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. ఒకటి బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను 26 శాతంనుంచి 49 శాతానికి పెంచడానికి వీలు కల్పించేదైతే...రెండోది రద్దయిన బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చట్టసభలు ఉన్నతమైనవనీ... వాటిని విస్మరించి ఆర్డినెన్స్ల ద్వారా పాలిద్దామని భావించడం రాజ్యాంగ విరుద్ధమనీ 1986లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాల్సింది శాసనవ్యవస్థే తప్ప కార్యనిర్వాహకవ ర్గం కాదని ఆ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చట్టసభల నిర్వహణ సాధ్యపడని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని రాజ్యాంగంలోని 123వ అధికరణం కూడా సూచిస్తున్నది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూనే... ఆర్డినెన్స్ జారీ అత్యవసరమన్న అంశంలో ఆయన ముందుగా సంతృప్తి చెందాల్సి ఉంటుందని కూడా అన్నది. వాస్తవానికి ఆర్డినెన్స్లు జారీచేయడం దొడ్డిదారి పాలనతో సమానం. బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆర్డినెన్స్ విధానాన్ని చట్టబద్ధం చేశారు. ఏ ప్రజాస్వామిక దేశంలోనూ ఇలాంటి పద్ధతి ప్రస్తుతం అమలులో లేదు. కాలం చెల్లిన చట్టాలను తొలగించడానికి నడుం బిగించిన మోదీ సర్కారు ఇలాంటి అప్రజాస్వామిక చట్టాల ఆధారంగా ఆర్డినెన్స్లను జారీచేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల పునఃవేలం అత్యవసరమైనదే. వాటి కేటాయింపులో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్నందున రెండేళ్లనుంచి అనేక పరిశ్రమలు అనిశ్చితిలో పడ్డాయి. మార్చి 31లోగా బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని, అందులో మళ్లీ ఆ క్షేత్రాలను సొంతం చేసు కున్న సంస్థలకే చోటుంటుందని, మిగిలినవాటికి అవి రద్దవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక వేలం ప్రక్రియ ప్రారంభించడం ముఖ్యమే. బీమా బిల్లుకు సంబంధించినంత వరకూ వామపక్షాలు మినహా ఇతర పార్టీలేవీ దాన్ని వ్యతిరేకిం చడంలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక అవగాహనకొచ్చాయి. అయితే, మత మార్పిళ్ల వ్యవహారంలో ప్రధాని హామీ ఇవ్వాలన్న విపక్షాల డిమాండును అంగీకరించని కారణంగా ఏర్పడ్డ పరిణామాలవల్ల ఇలా అంగీకారం కుదిరిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం పడింది. బొగ్గు క్షేత్రాల వేలం గురించి అయితే ఆర్డినెన్స్ అవసరం ఉన్నదనుకున్నా బీమా రంగంలో ఎఫ్డీఐల పెంపు విషయం దాదాపు ఆరేళ్లుగా నానుతున్న సమస్య. అది మరికొన్ని నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తగ్గబోమని ప్రపంచానికి చాటడం కోసమే బీమా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం అంటున్నది. బీమా రంగంలో ఎఫ్డీఐల పెంపు వివాదాస్పదమైన అంశం. దాన్ని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జీవిత బీమా, ఇతరత్రా బీమా రంగాల్లో ప్రస్తుతం 52 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో 5 మాత్రమే ప్రభుత్వరంగసంస్థలు. భారత్లో 36 కోట్లమంది జీవిత బీమా పాలసీదారులున్నారని ఈమధ్యే సిగ్మా నివేదిక వెల్లడించింది. బీమా రంగంలో సంస్కరణలు మొదలై దశాబ్దం దాటుతున్నా ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీదే అందులో ఆధిపత్యం. ఈ మార్కెట్లో దాని వాటా 71 శాతం. పార్లమెంటులో బీమా బిల్లును పెట్టి చర్చలు సాగనిస్తే ఈ విషయంలో ఎవరి వాదన ఏమిటో దేశ ప్రజలకు తెలుస్తుంది. ఆ నిర్ణయంలోని మంచిచెడ్డలపై కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాలను పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తీసుకురావడం ప్రజా స్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఏర్పాటు కాదని... ఒకవేళ ఆర్డినెన్స్ మురిగి పోతే తమ పెట్టుబడులు అనిశ్చితిలో పడతాయని విదేశీ సంస్థలకు తెలియదా? నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో చర్చించడం ద్వారా, అందరినీ కలుపుకొని వెళ్లడంద్వారా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సత్సంప్రదాయానికి శ్రీకారం చుడితే బాగుండేది. అలా చేయకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమని పాలకులు గ్రహించాలి. -
వివాదాలతో కాలక్షేపం!
పదేళ్ల యూపీఏ పాలన తీరుతెన్నులు చూశాక దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీకి పట్టంగట్టారు. సర్వేలన్నీ విజయం ఖాయమని చెబుతున్నా రాష్ట్రాల్లో కలిసొచ్చిన వారందరినీ కలుపుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా జనం ముందుకు వెళ్లినా సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల సంఖ్యాబలాన్ని బీజేపీ పొందగలిగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అందరిలోనూ నెలకొన్న విశ్వాసమే అందుకు కారణం. ధరలను అదుపు చేస్తామని, ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తిరిగి రప్పిస్తామని ఆ పార్టీ ఇచ్చిన హామీలు అందరినీ ఆకట్టుకున్నాయి. కుల, మత, ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా జనం ఒక్కటై బీజేపీకి ఓటేశారు. మోదీ ప్రభుత్వం ఏదో చేస్తున్నదనీ, వాటి ఫలితాలు అందబోతాయని వారందరూ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ విషయమై చర్చలు జరిగి తమ నుంచి జనం ఆశిస్తున్నదేమిటో, ఈ విషయంలో తాము ఇంకా చేయాల్సిందేమిటో బీజేపీ తెలుసుకోగలిగితే ఆ పార్టీ బలం మరింతగా ఇనుమడిస్తుంది. అలాంటిదేమీ జరగకపోగా ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, మాట్లాడుతున్న మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ‘మోదీ అంటే ఇష్టంలేనివారు పాకిస్థాన్ పొండ’ంటూ వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్సింగ్ తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యారు. అయినా ఆయన తన బాణీని మార్చుకోలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభలో అరవింద్ కేజ్రీవాల్ను బంగారు జింక రూపంలో ఉన్న రాక్షసుడంటూ అభివర్ణించారు. మరో మంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీలో పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోవాల’ంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభలూ స్తంభించాక స్వయంగా నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఆమె వ్యాఖ్యలు తప్పేనని వివరణనివ్వాల్సి వచ్చింది. ఆ గొడవ సద్దుమణగకముందే మరో ఎంపీ సాక్షి మహరాజ్ రంగంలోకొచ్చారు. ఆయన మహాత్ముడి హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించారు. అతను ‘పొరపాటున’ ఏమైనా చేసి ఉండొచ్చుగానీ దేశద్రోహి మాత్రం కాడంటూ వెనకేసుకొచ్చారు. జాతిపితగా ఈ దేశ ప్రజల మన్ననలందుకుంటున్న మహాత్ముడిని కాల్చిచంపడం ఆయన దృష్టిలో నేరం కాదు... కేవలం ‘పొరపాటు’ మాత్రమే! తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన తర్వాత వివరణ ఇచ్చి ఉండొచ్చుగానీ కెమెరాలు అబద్ధం చెప్పవు. ఆ విషయంలోనూ రాజ్యసభలో వివాదం చెలరేగాక మహాత్ముడి హంతకుడిని పొగిడే ఎలాంటి అంశాలకైనా ప్రభుత్వం వ్యతిరేకమని ప్రభుత్వం వివరణనిచ్చుకోవాల్సివచ్చింది. ఇదంతా ఇట్లా సాగుతుండగానే ఆగ్రాలో జరిగిన మత మార్పిళ్లు లోక్సభలో వివాదాన్ని రేపడం, దానిపై కూడా సర్కారు వివరణనివ్వడం తప్పలేదు. మరోపక్క అయోధ్యలో సాధ్యమైనంత త్వరగా రామమందిరం నిర్మించాలని ఈ దేశ పౌరులు కోరుకుంటున్నారని యూపీ గవర్నర్ రాంనాయక్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా కోర్టు విచారణలో ఉన్న ఈ వివాదంపై రాజ్యాంగ పదవిలో ఉన్న రాంనాయక్ ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థంకాని విషయం. అభివృద్ధి నినాదంతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఆర్థికరంగంలో అందుకు దోహదపడగల అనేక సంస్కరణలు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఆ అంశాలకు సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పింది. ఆ బిల్లులు సజావుగా ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పక్షాల మద్దతూ అవసరం. బీజేపీ ఆ దిశగా చేస్తున్న కృషి ఏమిటో తెలియదుగానీ ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు మాత్రం కావలసినన్ని వివాదాలను నెత్తికెక్కించుకుంటున్నారు. నిరంజన్ జ్యోతి విషయంలో తల బొప్పికట్టాకైనా తమ ఎంపీలను, తమకు మద్దతుగా నిలుస్తున్న సంఘ్ పరివార్ సంస్థలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో మోదీ ఎందుకున్నారో అర్థంకాదు. చెదురుమదురుగా సాగుతున్నట్టు కనబడుతున్న ఈ వ్యాఖ్యల వెనక ఒక పకడ్బందీ పథకం ఉన్నదనీ... ఈ దేశంలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న సెక్యులర్ భావజాలాన్ని దెబ్బతీయడమే దాని లక్ష్యమని కొందరు చేస్తున్న విశ్లేషణల్లో వాస్తవం ఉన్నదని ఎవరైనా అనుకుంటే అందుకు ప్రధాన బాధ్యత బీజేపీదే అవుతుంది. సుపరిపాలన అందిస్తామని, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన పార్టీ... ఆ విషయంలో తమ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమిటో ప్రజలకు చెప్పవలసిన తరుణంలో ఇలా ఇతరేతర విషయాలపై తన శక్తియుక్తులన్నీ ధారపోయడం, నిత్యం సంజాయిషీలతో కాలక్షేపం చేయడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచదని బీజేపీ నాయకగణం గుర్తించాలి. ఒకపక్క మోదీ ‘మేకిన్ ఇండియా’ అని పిలుపునిస్తారు. కానీ, దేశంలో ప్రశాంత వాతావరణం లేకుండా ‘మేకిన్ ఇండియా’ విజయవంతం కావడం సాధ్యమేనా? సార్వత్రిక ఎన్నికల ముందు ఈ తరహా వివాదాలను రేకెత్తించి ఉంటే, అభద్రతను పెంచే వ్యాఖ్యలు చేసివుంటే అంతటి ఘనవిజయం సాధ్యమయ్యేదా? అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ నరేంద్ర మోదీ పూర్తిగా తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నారు. తాను అనుకున్నవారికే కీలక పదవులిచ్చారు. వద్దనుకున్నవారిని ఎంతటి సీనియర్లయినా పక్కనబెట్టారు. రెండుచోట్లా పూర్తి పట్టు సాధించిన నాయకుడన్న అభిప్రాయం కలిగించారు. కానీ ఇలాంటి వివాదాలు ఆ అభిప్రాయాన్ని పలచనచేస్తాయి. అధికారంలోకొచ్చి ఆర్నెల్లు పూర్తవుతున్న తరుణంలో ఇప్పటికైనా పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని... అనవసర వివాదాలకూ, ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని బీజేపీ గుర్తించడం అవసరం. -
బొగ్గు ప్రైవేటీకరణకు కుట్ర
ప్రధాని మోదీపై సోనియా ధ్వజం పటాందా: బొగ్గు రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు వేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజలను బలిచేసి జార్ఖండ్లోని బొగ్గును కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు మోదీ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శనివారం జార్ఖండ్లోని పటాందాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోనియా మాట్లాడారు. గిరిజనులు, దళితుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం, భూసేకరణ, ఉపాధి హామీ చట్టాలను మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల అక్కడి గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, దీనివల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారని విమర్శించారు. ఖనిజ సంపద అపారంగా ఉన్న జార్ఖండ్ను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు లూటీ చేశాయని, అందువల్ల ప్రజలు ఈసారి కాంగ్రెస్కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కాగా, సోనియా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె 90 నిమిషాలపాటు విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమె వేరే విమానంలో పటాందాకు వెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్కిశోర్ చెప్పారు. జార్ఖండ్లో డిసెంబర్ 2న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
‘గ్యాస్’ మాటలేనా!
ఇన్ బాక్స్: గతంలో యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన గ్యాస్కు నగదు బదిలీ పథకం అప్పట్లోనే అయోమయంగా మారింది. మళ్లీ ఇప్పుడు తాజాగా గ్యాస్కు నగదు బదిలీ పథ కం అమలు చేస్తామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటిం చింది. పథకాలను ప్రవేశపెట్టిన తరు వాత దాని అతీగతీ పట్టించుకోరు. దీని వల్లే అనేకమంది సమిథలుగా మారు తున్నారు. గ్యాసును తీసుకోవడానికి పని మానేసి ఉద్యోగులు, కూలిపను లకు వెళ్లేవాళ్లు నిరీక్షిస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేసి సబ్సిడీని బ్యాంకులో వేస్తామని చెప్పి వారం రోజు లు గడువు విధిస్తూ వినియోగదారులకు మొబైల్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. సబ్సిడీలు బ్యాం కులో వేయడంకన్నా, ఇప్పుడు ఉన్న పద్ధతిని అవలం బిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సబ్సిడీలు తప్పుదారి పట్టకుండా పకడ్బందీగా గ్యాస్ను అందిం చేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జైని రాజేశ్వర్ గుప్త కాప్రా, హైదరాబాద్ -
ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
గండేపల్లి : రుణమాఫీని తప్పక చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం ప్రకటించారు. శుక్రవారం మండలంలోని మురారి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందని అయినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేయగా, రాష్ట్రంలో 13 జిల్లాలకు కలిపి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్ల రుణమాఫీకి ముందుగా 20 శాతం ఇచ్చి, మిగిలిన 80 శాతానికి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ చైతన్యరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పి.చిట్టిబాబు, ఎంపీపీ డి.సుశీల, వైస్ ఎంపీపీ పోతుల మోహనరావు, జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ బులి వీరమ్మ, కందుల కొండయ్యదొర, గోదావరి డైయిరీ చైర్మన్ కొడాలి చంటిబాబు, జ్యోతుల చంటిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ కె. రమేష్, తహశీల్దార్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 36 కొత్త పింఛన్లు అందజేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగపర్చుకోవాలి బ్యాంకు సేవలను సద్వినియోగపరచుకోవాలని గండేపల్లి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ కొక్కిరి మహాలక్ష్మి జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులకు తెలిపారు. జన్ధన్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. పింఛను లబ్ధిదారుల ఇబ్బందులు ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఉపాధికి ఎసరుతెచ్చే పథకం!
పల్లెసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసమంటూ తొమ్మిదేళ్లక్రితం అమల్లోకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఏ)అటకెక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. పనిచేసే హక్కునూ, జీవనభద్రతనూ కలగజేసే ఉద్దేశంతో 2006లో ఈ పథకానికి పురుడు పోసి, చట్టబద్ధతనుకూడా కల్పించిన యూపీఏ సర్కారే... క్రమేపీ దాని ఊపిరి తీసే ప్రయత్నం చేయగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 650 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇకపై వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు పథకరచన సిద్ధమైందన్న కథనాలు ఇటీవలికాలంలో వెలువ డుతున్నాయి. దానికితోడు వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి నిష్పత్తిని ఇప్పుడున్న 60:40నుంచి 51:49కి మార్చదల్చుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచన మంచిదికాదని...పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చేయ త్నాలు చేయడంవల్ల పల్లెసీమలు మళ్లీ ఆకలితో నకనకలాడతాయని ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో ఇప్పటికే హెచ్చరించారు. ఉపాథి హామీ పథకం సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగ లిగారు. ఉన్న ఊరునూ, అయినవారినీ విడిచిపెట్టి పొట్టచేతబట్టుకుని ఎక్కడె క్కడికో వలసపోవలసివచ్చే దిక్కుమాలిన రోజులుపోయి ఉన్నచోటనే వారికి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్లో ఆసరాగా నిలిచింది. లబ్ధిదారుల్లో సగంకంటే ఎక్కువమంది దళిత కులాలకు చెందినవారుగనుక ఆ వర్గాలకు ఎంతో ప్రయోజ నకరంగా మారింది. పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు రెట్టింపయ్యాయి. రోజుకు రూ. 120 వచ్చేచోట రూ. 250 వరకూ రావడం మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది. పథకానికయ్యే వ్యయంలో కేంద్రానిది 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతంకాగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఈ పథకం వాటా 0.3 శాతం. అయితేనేం ఇది ఏటా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా మూడు నెలలపాటు భరోసా కల్పించింది. శ్రమదోపిడీనుంచి వారిని కాపాడింది. పథకం కింద చేసే పనుల్లో వేతనాల వాటా ఖచ్చితంగా 60 శాతం ఉండాలన్న నిబంధనవల్ల శ్రామికులకుఎంతగానో మేలు కలిగింది. బెంగళూరు ఐఐఎం 2009లో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ప్రభావంపై సర్వే చేసినప్పుడు అక్కడ వలసలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల్ని చేపట్టడంలో, అవతవకలు జరిగినచోట రికవరీలు చేయడంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముందుందని సర్వే తేల్చింది. ఈ పథకంవల్లనే యూపీఏ 2009లో వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత యూపీఏ సర్కారు దీని పీకనొక్కడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఎన్నికలు లేవుగదానన్న భరోసాతో కేటాయింపులను కత్తిరించడం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులో అలవిమాలిన జాప్యమూ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పేద జనానికి ప్రభుత్వం రూ. 4,800 కోట్లు బకాయిపడిందని ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్ చెబుతున్నదంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో సులభంగానే అర్థమవుతుంది. అంతేగాదు...ఈ ఎనిమిదేళ్లలోనూ ఆ పథకానికి రూ. 33,000 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. బకాయి పడితే శ్రామికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్న చట్ట నిబంధన తర్వాత కాలంలో ఎగిరిపోయింది. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది. మరోపక్క అనేక రాష్ట్రాల్లో భారీయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు దారిమళ్లించాయి. ఈ ఎనిమిదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 2.60 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్ల రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే. పథకం అమలులో తగినంత జవాబుదారీతనం, పారదర్శకత ప్రవేశపెడితే ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా అనుత్పాదక పనులు చేపట్టిన పక్షంలో గట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరిస్తే మంచిదే. వ్యవసాయ పనులకు దాన్ని అనుసంధానించడం ఎలాగో ఆలోచించవచ్చు. సామాజిక ఆడిట్ను మరింత పకడ్బందీగా అమలుచేయొచ్చు. ఇంకేమి సంస్కరణలు చేస్తే అది మరింతగా మెరుగుపడుతుందో చర్చించవచ్చు. కానీ, ఎలుకలు జొరబడ్డాయని కొంపకు నిప్పెట్టుకున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి మూలనపడేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది. అసలు దీన్ని చట్టంగా చేయడమేమిటి, పథకంగా ఉంచితే నష్టమేమిటని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రశ్నించారు. పథకం మొదలైననాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాబల్య వర్గాలు సణుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఆలోచనలు అలాంటి వర్గాల ప్రయోజనాలను నెరవేర్చేలా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టరూపంలో ఉన్నది గనుక పార్లమెంటులో చర్చ తర్వాతే దానికి సవరణలు సాధ్యమవుతాయి. పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చడం చేయక దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడమెలాగో ప్రభుత్వం ఆలోచించాలి. -
బడి చదువుకూ ‘ఆధార్’ ని‘బంధనం’
సాక్షి, రాజమండ్రి :యూపీఏ-2 సర్కారు ఏ లక్ష్యంతో దేశప్రజలకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేసినా.. దాని పర్యవసానంగా జనం- ముఖ్యంగా బడుగు జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. వంటగ్యాస్కు ఆధార్ను లంకె పెట్టి, సబ్సిడీ ఎక్కడ గల్లంతవుతుందోనని కోట్లమంది కంటికి కునుకు కరువు చేసింది కేంద్రంలోని గత ప్రభుత్వం. అనంతరం ఆ లంకెను తెంచినా.. ఇప్పుడు మళ్లీ ముడిపెట్టనున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా..ఒక ప్పుడు ఆధార్ ప్రక్రియను విమర్శించిన టీడీపీ అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా అన్నింటికీ ఆధార్ను జోడిస్తూ పోతోంది. రేషన్కు, పింఛన్కు ఆధార్ను జోడించడంతో అవి లేని వారు, వాటిలోని వివరాలు సరిపోలని వారు సర్కారుపరంగా పొందే లబ్ధికి నీళ్లు వదులుకునే బెడదను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చదువులకు కూడా ఆధార్ను తప్పనిసరి చేసింది. దీంతో కొత్తగా చేరే వారే కాదు బడిలో చదువుతున్న పిల్లలు సైతం ఆధార్ సంఖ్యతో తమ ప్రవేశ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలని ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 20 శాతం విద్యార్థుల ఆధార్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. వీరిలో సగం మంది తల్లిదండ్రులకు ఆధార్ కార్డున్నా వారి పిల్లలకు లేదు. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఉంటేనే స్కూళ్లలో ప్రవేశం అన్నది ఒక నిబంధన కానుందని, అది లేనిదే సర్కారుపరంగా అందే రాయితీలు అందవని విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నారు. అయితే దీన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు. ఆన్లైన్లో అనుసంధానం కోసమట.. విద్యార్థి వివరాలు ఆన్లైన్లో ఉంచేందుకు ఆధార్ సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఆధార్ కార్డు జిరాక్సు కాపీని పాఠశాలలో అందించాలని నెల్లాళ్లుగా ఉపాధ్యాయులు ఆదేశించారు. ఇంకా ఇవ్వని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు లేని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. కొత్తగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నా ఆధార్ ఉండాల్సిందేనని అధికారులు ఇప్పటికే కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లేని విద్యార్థులు బడి మానేసే దుస్థితి ఎదురవుతుందని ఉపాధ్యాయ సంఘాలు నిరసిస్తున్నాయి. కార్డు లేకుంటే వివరాలు దూరం.. జిల్లాలో 90 శాతానికి పైగా ఆధార్ కార్డుల జారీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ విద్యార్థుల విషయంలో వాస్తవ పరిస్థితి అలా లేదు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేసే పాఠశాలలు 5,995 ఉన్నాయి. వీటిలో ప్రాధమిక పాఠశాలలు 3967, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 977, హైస్కూళ్లు 984, హయ్యర్ సెకండరీ స్కూళ్లు 67 ఉన్నాయి. వీటిలో 7.72 లక్షల మంది ఒకటి నుంచి పదవ తరగతి వరకూ చదువుతున్నారు. వారిలో అనేకులకు ఆధార్ కార్డులు లేవు. ఉన్నా పేర్లు తప్పుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు కార్డున్నా పిల్లలకు లేవు. జిల్లాలో ఇలాంటి కారణాలతో 20 శాతం విద్యార్థులు ఆధార్ సమర్పించలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టంపై ఆధారపడ్డ కుటుంబాల వారే. తల్లిదండ్రులు ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం రావడం, పగలు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం.. ఈ క్రమంలో పలువురు పిల్లలకు ఆధార్ నమోదు చేయించలేదు. పిల్లలకు ఆధార్ అవసరం కాదన్న కొందరు నమోదు చేయించలేదు. మరి కొందరు పిల్లల అసలు పేర్లు కాక వాడుక పేర్లు ఆధార్లో నమోదు చేయించడంతో అవి చెల్లుబాటు కావడం లేదు. ఆధార్ కార్డు లేక పోతే విద్యార్థుల వివరాలు ఆన్లైన్ డేటా బేస్లో కనిపించవు. ప్రభుత్వపరంగా స్కాలర్ షిపు్పులు తదితర రాయితీలు ఆధార్ కార్డు లేనిదే వర్తించవు. ఏ కార్యక్రమానికైనా విద్యార్థుల వివరాలు కావాలనుకున్నప్పుడు ఆధార్ కార్డులు సమర్పించని వారి పేర్లు కనిపించవు. ఇందువల్లే ఆధార్ కార్డులు తప్పనిసరి అని విద్యాశాఖ హుకుం జారీ చేస్తోంది. నమోదు బాధ్యతను సర్కారే తీసుకోవాలి.. ప్రస్తుతం రెండు మూడు రోజులు ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు పడి ఉంటే తప్ప నమోదు చేసుకోవడం వీలు కావడం లేదు. ఆధార్ లేని వారు పాఠశాల వదిలి తల్లిదండ్రులతో ఆధార్ సెంటర్లకు వెళ్లడం అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. విద్యార్థులకు ఆధార్ను తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం వాటి నమోదు బాధ్యతను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాలలకు వచ్చి లేదా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్యార్థులందరికీ కార్డులు అందించాలంటున్నాయి. -
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'
న్యూఢిల్లీ : దమ్ముంటే నల్లకుబేరుల జాబితాలోని పేర్లు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. నల్లధనం జాబితాలో పేర్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరి పేర్లు లీక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారిస్తుందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇబ్బందులు తప్పవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరు ఆ జాబితాలో ఉందంటూ జైట్లీ ఈ సందర్భంగా సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ నల్లధనం జాబితాలో పేర్లు దమ్ముంటే బహిర్గతం చేయాలని జైట్లీకి సవాల్ విసిరారు. -
వంటకు తంటా
నగదు బదిలీ.. ఈ పేరు చెబితేనే సగటు లబ్ధిదారుల్లో గుబులు పుడుతోంది. వచ్చేనెల పదో తేదీ నుంచి వంట గ్యాస్కు నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయంపై సగటు వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు కారణం కాగా.. అందరూ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏలూరు: యూపీఏ సర్కార్ హయాంలో 2012 అక్టోబర్ నుంచి జిల్లాలో నగదు బదిలీ అమలు ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆధార్ సీడింగ్ లేకపోవడంతో పేద వర్గాల వారు సైతం సబ్సిడీ లేకుండా రూ.800 నగదును చెల్లించి గ్యాస్ బండ భారాన్ని మోశారు. చివరకు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నగదు బదిలీని కేంద్రం నిలిపివేసింది. తాజాగా మళ్లీ అమలు చేయాలని నిర్ణయించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా కనెక్షన్లు జిల్లా 56 గ్యాస్ ఏజెన్సీల పరిధిల్లో 8,05,042 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 3,79,222, డబుల్ 2,78,948, దీపం కనెక్షన్లు 1,45,914 మందికి ఉన్నాయి. ఇందులో అప్పట్లో 90 శాతం ఆధార్ సీడింగ్ ఉన్నవారికే నగదు బదిలీని అమలు చేశారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్ను 96 శాతంకు పెంచామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లోపాలెన్నో! నగదు బదిలీ పథకంలో సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు సక్రమంగా జమకాకపోవడంతో తీవ్ర ఇక్కట్లపాలైన సంఘటనలతో ఈ విధానాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకుల పరంగా కూడా సబ్సిడీ సొమ్ము జమలో రూ.50ల వరకు వినియోగదారుడికి కోత పడేది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న వ్యక్తి ఖాతాకు 15 రోజుల తర్వాత కూడా సబ్సిడీ సొమ్ము జమ అయిన సందర్భాలు లేవు. గ్యాస్ సిలిండర్ ధర రూ.405 అయితే.. దీనికి అదనంగా రూ. 435 కలిపి కలిపి రూ.840 వరకు చెల్లించాల్సి వచ్చేది. చేతిలో డబ్బులు లేకపోయినా.. సిలిండరు తప్పనిసరికావడంతో ముందుగా అప్పుచేసి విడిపించుకున్నా.. సకాలంలో నగదు బదిలీ కాకపోవడంతో ప్రతినెలా ఇబ్బందులు తప్పేవి కావు. తప్పనిసరి అయితే ప్రత్యేక సెల్ అవసరం ఈ పథకం అమలు తప్పనిసరైతే లోపాలను సవరించుకునే దిశగా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలిండర్ ధర చెల్లించిన ఒకటి రోజుల్లోనే వినియోగదారుని ఖాతాకు సొమ్ము జమ అయ్యేలా చూడాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేస్తేనే పథకం సజావుగా సాగే వీలుంది. అమలుకు సిద్ధం (అభిప్రాయం) జిల్లాలో నవంబర్ 10 నుంచి వంటగ్యాస్కు నగదు బదిలీ అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై త్వరలోనే గ్యాస్ ఏజెన్సీలతో చర్చించి వారిని సమాయత్తం చేస్తాం. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేకపోయినా కొంత కాలం పాత పద్ధతిలోనే చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. వంట గ్యాస్ సబ్సిడీ ఎంతనేది త్వరలోనే నిర్ణయం అవుతుంది. -శివశంకర్రెడ్డి, డీఎస్వో -
టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమే: పురందేశ్వరి
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి చూపు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీపై పడినట్లు సమాచారం. టీడీపీలోకి వచ్చేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పటం విశేషం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టికెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి. పొత్తుల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట లోక్సభ బరిలోకి దిగి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నందమూరి, నారావారి కుటుంబంలో రాజకీయ పోరు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చిన్నమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పిల్లనిచ్చిన బావమరిది బాలయ్య కోసం...పెద్ద బావమరిది హరికృష్ణను ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. హరికృష్ణ కోరుకున్న హిందుపురం అసెంబ్లీ సీటును బాలకృష్ణకు ఇవ్వటంతో...అలకబూనిన హరి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబుకు దూరంగానే మసలుతున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయేంతవరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిప్పలు పెట్టిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. బీజేపీ తరపున చిన్నమ్మ కోస్తాలో ఎక్కడ టికెట్టు దక్కించుకున్నా విజయావకాశాలు ఉంటాయనే ఉద్ధేశంతో బాబు చక్రం తిప్పారు. చివరకు రాజంపేట మినహా మరో గత్యంతరం లేని వాతావరణం కల్పించారు. దాంతో పురందేశ్వరి అయిష్టంగానే రాజంపేట నుంచి బరిలో నిలిచారు. చివరికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో బాబు పాచిక ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు.... దగ్గుబాటి దంపతుల్ని తిరిగి టీడీపీలోకి అడుగుపెట్టినిస్తారా అనేది అనుమానమే. తండ్రి పెట్టిన పార్టీ నుంచి కొడుకునే తరిమేసిన ఆయన...కోరి కోరి ప్రత్యర్థులను పక్కకు చేర్చుకుంటారా అంటే సందేహమే. చంద్రబాబు తర్వాత పార్టీలో కీలక పాత్ర ఎవరిది అనే విషయంలో ఇప్పటికీ ఆపార్టీలో స్పష్టత అనేది లేదు. చంద్రబాబు తన వారసుడు లోకేష్ ను తెరమీదకు తీసుకు వస్తున్నా ..... చినబాబుకు అంత సీన్ ఉందా అనేది భవిష్యత్లోనే తేలుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు... నందమూరి ఫ్యామిలీతో పాటు, చిన్నమ్మ దంపతుల్ని దగ్గరకు చేర్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దగ్గుబాటి దంపతులు వదిలిన ఫీలర్లపై ''మీరొస్తానంటే....నే వద్దంటానా?'' అని బాబు స్వాగతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
గిట్టుబాటు రేటు ఉంటేనే
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ధరను నిర్ధారించడాన్ని బట్టి గ్యాస్ ప్రాజెక్టుల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుల్లో ఆర్ఐఎల్ భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ తమ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయం వెల్లడించింది. ఎన్ఈసీ-25 బ్లాక్లో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్యాస్ రేటుపై సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఒడిషా తీరంలోని ఎన్ఈసీ-25, ఇటు కృష్ణా-గోదావరి బేసిన్లోని కేజీ-డీ6 బ్లాక్లలో ఆర్ఐఎల్ కొత్తగా మరిన్ని గ్యాస్ నిక్షేపాలను కనుగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూనిట్కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ రేటును 8.4 డాలర్లకు పెంచే ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తడం, ఎన్నికలు నేపథ్యంలో వెనక్కి తగ్గింది. కొత్త ప్రభుత్వం సైతం సమగ్ర సమీక్ష జరపాలంటూ వాయిదా వేసింది. దీనిపై ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. -
తొమ్మిదో వికెట్ కూడా పడింది!!
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వరుసగా తొమ్మిదో వికెట్ పడింది. అవును.. మరో గవర్నర్ రాజీనామా చేశారు. మణిపూర్ గవర్నర్గా వ్యవహరిస్తున్న వీకే దుగ్గల్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. యూపీఏ హయాంలో ఉన్న గవర్నర్లంతా ఒకరి తర్వాత ఒకరుగా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడటంతో.. ఇప్పటికి ఎనిమిది మంది గవర్నర్లు తమ పదవుల నుంచి స్వచ్ఛందంగానో, బలవంతంగానో తప్పుకోవాల్సి వచ్చింది. యూపీఏ గవర్నర్లు రాజీనామా చేయాలన్న సంకేతాలు వెలువడగానే ముందుగా బీఎల్ జోషి, శేఖర్ దత్, అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత బీవీ వాంఛూ, ఎంకే నారాయణన్ అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించడంతో కలత చెంది పదవుల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత తనను నాగాలాండ్కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బి.పురుషోత్తమన్ తప్పుకొన్నారు. ఇలా వరుసపెట్టి రాజీనామాల పర్వం కొనసాగింది. చిట్టచివరగా రెండు రోజుల క్రితం కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు దుగ్గల్ వంతు వచ్చింది. -
పేదలకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారు?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద నగరంలోని నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం... ఢిల్లీ సర్కారును కోరింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను తెలియజేయాలంటూ కేంద్ర గృహ, పట్టణ దారిద్య్ర నిర్మూలన మంత్రిత్వ శాఖ ... ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొత్తం 67,784 ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది. ఇదిలాఉంచితే ఈ పథకం కింద ఇప్పటిదాకా నాలుగు వేలమందికే ఫ్లాట్లను కేటాయించామని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా పంపించామన్నారు. అయితే నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను నిర్ధారించుకున్న తరువాతే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కేటాయింపుల సంఖ్య ఇంత స్వల్పంగా ఉండడానికిగల కారణమేమిటని ప్రశ్నించగా గుర్తింపే ప్రధాన సమస్య అని ఆయన వివరించారు. అనేకమందిని గుర్తించామని అన్నారు. కాగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం మొత్తం 67,784 ఫ్లాట్లను నిర్మించాల్సి ఉంది. అయితే అందులో తొమ్మిది వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో కేటాయింపు కష్టమే ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నగర పరిధిలోని రోహిణి ప్రాంతంలో చేపట్టిన ఫ్లాట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో లబ్ధిదారులకు ఫ్లాట్లను సకాలంలో కేటాయించే అవకాశాలు అంతంతగానే ఉన్నాయి. దీంతో వీరంతా మరికొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానికుల అభ్యంతరాల కారణంగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనులపై విధించిన స్టేని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసినప్పటికీ స్థానికులు పనులను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 18 వేల ఫ్లాట్లను డీడీఏ నిర్మించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మాట్లాడుతూ స్థానికులు దాడులకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నవించామన్నారు. -
‘జన ధన యోజన’ నెరవేరేనా?
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఆర్థిక అవకాశాలు కల్పించకుంటే ఇంటింటికీ బ్యాంకు ఖాతాలు ఇచ్చినా నిష్ర్పయోజనమే. కాని ఈ దిశగా తామేం చేస్తామనే అంశంపై మోడీ ప్రభుత్వం సూచనప్రాయంగా కూడా తెలపడం లేదు. దేశంలో చాలా మందికి మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ, బ్యాంక్ ఖాతాలు లేకపోవడం శోచనీయమని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పేరిట ఒక కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం సైతం ఇలాంటి ప్రయత్నాలకే పూను కుని విఫలమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగ ణనలోకి తీసుకోలేదు. అమల్లో ఉన్న పథకాలు ఎందుకు విఫలం అవుతున్నాయో విశ్లేషించుకోకుండా కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా సాధించేదేమీ ఉండదు. వాస్తవానికి మన దేశ జనాభాలో 65 శాతం మందికి కనీసం ఒక్క బ్యాం కు ఖాతా కూడా లేదు. అమెరికాలోని వయోజనుల్లో 88 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉండగా, చైనాలో 63.8 శాతం, బ్రెజిల్లో 55.9 శాతం, దక్షిణాఫ్రికాలో 53.6 శాతం, రష్యాలో 48.2 శాతం మందికి అందుబాటులో ఉన్నాయి. అది మనదేశంలో మాత్రం కేవలం 35.2 శాతం మాత్రమే. అందుకనే దేశంలోని వయోజనులందరికీ బ్యాంక్ ఖాతాను కల్పించనున్నట్లు మోడీ తెలిపారు. అయితే ఉద్దేశాలు ఎంత మంచివైనా గత ప్రభుత్వ అనుభవాలను కనీసం పరిశీలించ కుండా కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు. దేశంలోని 7.5 కోట్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి 2018 ఆగస్టు నాటికి కనీసం రెండు బ్యాంక్ ఖాతాలను అందిస్తామన్నారు. ఈ పథకం కింద ఒక్కో బ్యాంక్ ఖాతాకు రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ (ఖాతాలో నగదు నిల్వకు మించి అదనంగా రూ.5 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం) కల్పిస్తారు. ప్రతి కస్టమర్కూ ఒక ‘రూ పే డెబిట్ కార్డ్’, లక్ష రూపాయల ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. పైకి ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్ వ్యవ స్థను మెరుగుపర్చకుండా ఈ పథకం ఫలితాలను సాధిం చడం కల్లే. సాంప్రదాయిక బ్యాంకింగ్ విధానం దేశప్రజలకు ఆర్థిక ఫలాలను అందజేయడంలో విఫలమైందని ఆర్బీఐ 2006లో నిర్ధారణకు వచ్చింది. దీంతో అది ‘బిజినెస్ కర స్పాండెంట్’ అనే మధ్యంతర ఉద్యోగులను నియమించుకో వడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు తెరవడం, విత్డ్రా చేసుకోవడంలో సాయపడటం, కొన్ని రకాల రుణాలకు అర్హులైన వారిని గుర్తించడం వారి విధులు. గత ఎనిమిదేళ్లలో 2.2 లక్షల మంది ‘బిజినెస్ కరస్పాండెంట్లు’, మైక్రోఫైనాన్స్ సంస్థలు, పీసీఓ ఫోన్ ఆపరేటర్లు, చిల్లర దుకాణాల యజమానులు ఈ విధానం కింద వివిధ బ్యాం కులకు ఏజెంట్లుగా వ్యవహరించారు. 2012 మార్చి నాటికి ఈ కొత్త విధానం కింద మన బ్యాంకులు 74,199 గ్రామా లను కవర్ చేశాయి. అంటే తాము విధించుకున్న లక్ష్యంలో 99.7 శాతాన్ని చేరుకున్నాయని ఒక అధ్యయనం పేర్కొంది. అయితే ఏజెంట్లు సమర్థంగా పనిచేయలేదని బ్యాంకులు, తమకు లాభసాటిగా వేతనం అందించలేదని ‘బిజినెస్ కరస్పాండెంట్’లు, పరస్పరం ఆరోపించుకోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది. మొబైల్ వ్యాన్ ఏటీఎమ్లు మొదట్లో కొన్నాళ్లు ఆర్భాటంగా నడిచినా లావాదేవీలను పెంచడంలో వాటి పాత్ర శూన్యమే. మోడీ ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు ఏజెంట్లకు రూ.5 వేలను కనీస వేతనంగా నిర్ణయించి, బ్యాంక్ కస్టమర్లు మరిన్ని లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించడానికి ‘జన ధన యోజన’ పథకాన్ని తీసుకువస్తోంది. కానీ, బ్యాంక్ ఖాతాలోంచి రూ.5 వేలను అదనంగా డ్రా చేసుకున్నంత మాత్రాన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదు. లక్ష రూపాయిల ప్రమాద బీమావల్ల ప్రయోజనం చాలా స్వల్పమే. కారణం.. ప్రమాదాలకు గురై మరణించేవారి సంఖ్య తక్కువ. 2006లో కొత్త విధానంతో బ్యాంక్ ఖాతాలు పెరిగినప్ప టికీ, వాటిలో చాలావరకు ప్రభుత్వ సబ్సిడీలను నగదు రూ పంలో అందించడం వరకే పరిమితమయ్యాయి. కొత్తగా తెరి చిన ఖాతాల్లో 80 శాతం నిష్క్రియాత్మకంగా మారాయి. కార ణం స్పష్టమే. దేశంలో జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయ రుణాలపై మొహం చాటేశాయి. లీడ్ బ్యాంకులు కూడా పంట రుణాలకు మాత్రమే ఆమోదం తెలుపుతున్నాయి. దీంతో గ్రామీణులు తమ ఆర్థిక అవస రాల కోసం సాంప్రదాయిక వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిం చాల్సి వచ్చింది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఆర్థిక అవకాశాలు కల్పించకుంటే ఇంటింటికీ బ్యాంకు ఖాతాలు ఇచ్చినా నిష్ర్పయోజనమే. కాని ఈ దిశగా తామేం చేస్తామనే అంశంపై మోడీ ప్రభుత్వం ఇంతవరకు సూచించలేదు. రైతు లకు అవసరమైన రుణసౌకర్యం అందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మార్చకుండా ఖాతాలు పెంచినా, బ్రాంచీలు ఏర్పాటు చేసినా ఫలితం సున్నే. కె. రాజశేఖరరాజు -
యూపీఏ విధానాలే ఐతే ఎన్డీయే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: యూపీఏ విధానాలు, నిర్ణయాలే అమలవుతున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, దీని కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎందుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్ ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ నేత పి.రాజేశ్వర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్నారని బీజేపీ, ఎన్డీయే నాయకులు తప్పించుకోవడం సరైందికాదన్నారు. యూపీఏ నిర్ణయాలనే ఎన్డీయే అమలు చేయాలనుకుంటే యూపీఏ-3 అని పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక పచ్చచొక్కా వేసుకున్న పిచ్చికుక్కలాగా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దళితుల సంక్షేమానికి కేసీఆర్ బృహత్తర నిర్ణయం తీసుకున్నారని, దళితులకు గతంలో ఎవరూ చేయని మేలును చేస్తున్నారని చెప్పారు. దళితులకు టీడీపీ ఏం చేస్తున్నది?: ఎమ్మెల్యే గువ్వల దళితుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏమీ చేయడం లేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. దళితులకు తెలంగాణ ప్రభుత్వమే అండగా ఉన్నదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం భూపంపిణీ చేస్తున్నదని బాలరాజు చెప్పారు. ఏపీలో టీడీపీ ఏం చేస్తున్నదో చెప్పాలన్నారు -
ఆకలిరాజ్యంతో అగ్రదేశాల ఆట
బాలీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవడానికి 60 కోట్ల మంది రైతుల బతుకు తెరువును నాశనం చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం ఎలా నిర్ణయానికి రాగలి గిందో అర్థం కాదు. దేశంలోని కోట్లాది పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం ద్వారా, ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పనకు సహకరించి భారత్ ఏం సాధించాలని భావిస్తోంది? ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పన కంటే, దేశంలో అరవై కోట్ల మంది రైతుల బతుకు తెరువుకు భద్రత కల్పించడమే ప్రధానం. ఈ విషయంలో ఎన్డీయే వైఖరి పూర్తిగా సరైనది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) బాలీలో డిసెం బర్, 2013లో నిర్వహించిన మంత్రుల స్థాయి సమావేశంలో చేసుకున్న ఒప్పందం మీద భారత్ సంతకం చేసింది. అక్కడ సంతకం చేయడమంటే, నిస్సందేహంగా భారత్లోని 60 కోట్ల మంది రైతుల భవిష్యత్తుకు సంబంధిం చిన ప్రయోజనాలతో రాజీపడడమే. ఇటీవలి జెనీవా సదస్సులో సంతకం చేయకుండా ప్రధాని మోడీ ఆ తప్పును సరిదిద్దే పని చేపట్టారు. బాలీ సదస్సు సమయంలో వాణిజ్య వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆనంద్శర్మ మోడీ చేసిన ప్రకటన ‘తప్పు, అసత్యం’ అంటూ వాదించవచ్చు. అయినప్పటికీ ఆయన పేద రైతాంగం ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్న మాట సత్య దూరం కాదు. రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు నాలుగేళ్ల పాటు తాత్కాలిక రక్షణ కల్పించడానికి ఆనంద్ శర్మ ఆమోదించారు. దీని వెనుక పెద్ద కారణమేమీ లేదు. కర్షకుల జీవికను ధ్వంసం చేయడమే ఉద్దేశంగా ఉన్నప్పటికీ, బాలీ డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశం విజయం సాధించిందని నమ్మించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. బాలీ మంత్రుల స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవడానికి 60 కోట్ల మంది రైతుల బతుకు తెరువును నాశనం చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం ఎలా నిర్ణయానికి రాగలిగిందో అర్థం కాదు. దేశంలోని కోట్లాది పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం ద్వారా, ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పనకు సహకరించి భారత్ ఏం సాధించాలని భావిస్తోంది? అమెరికా సంస్థల అభ్యంతరం మద్దతు ధర పథకాలకీ, ఆహార సహాయ నిధులకీ ముడి పెట్టడాన్ని వ్యతి రేకిస్తూ అమెరికాకు చెందిన అనేక వ్యవసాయ సంస్థలు లేఖలు రాశాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి మైఖేల్ ఫ్రోమన్కీ, ఆ దేశ వ్యవసాయ మంత్రి థామస్ విల్సాక్కీ ఆ లేఖలు అందిన సంగతి ఆనంద్శర్మకీ తెలుసు. చట్టబ ద్ధంగా దేశంలో ఇచ్చే ఆహార సహాయ పథకాల గురించి తప్పు పట్టవలసిన దేమీ లేదని వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసే 30 అమెరికా సంస్థలు భావించాయి. అయితే మద్దతు ధర పథకాల గురించి మాత్రం ఆందోళన వ్య క్తం చేశాయి. అవి పేదలకు ఆహారం అందించడం కంటే, వ్యవసాయ ఆదా యాన్నీ, ఉత్పత్తినీ పెంచడానికే ఉపకరిస్తాయని ఆ సంస్థల అభిప్రాయం. ఫెడరల్ మద్దతు దండిగా ఉన్న ఈ ఎగుమతి సంస్థలే రైతులకు, తాత్కాలిక ప్రాతిపదికనే అయినా కూడా, సడలింపు ఇవ్వడం గురించి ఏటా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇలాంటి మినహాయింపులు, సడలింపులు మరిన్ని రాయితీలు ఇవ్వడానికి దోహదం చేస్తాయి. దీని ఫలితం ఏమిటంటే, అమెరికా వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే భారత రైతాంగానికి మద్ద తు ధర ఇవ్వడం గురించి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో బాలీ సమావేశం విఫలమైందన్నది సుస్పష్టం. ఆ సమావేశంలో భారత్ ఒక కఠిన విధానాన్ని అనుసరించి ఉంటే ప్రస్తుత సంక్షోభం ఉత్పన్నమయ్యేది కాదు. శాశ్వత ప్రాతిపదికన ఆహార నిల్వల ఏర్పాటుకు, రైతులకు తగినంత ఆదాయం సమకూర్చేందుకు సంబంధించిన హామీకీ ముడి పెట్టేవరకు వాణిజ్య సౌకర్యాల ఒప్పందం ప్రొటోకాల్లో సవరణలకు ఆమోదించరాదని (జూలై 31లోగా) నిర్ణయించుకోవడం ద్వారా భారత్ తన వైఖరిలో పెద్ద మార్పునే ప్రదర్శించింది. డబ్ల్యూటీఓ ఉరుగ్వే సమావేశాల నుంచి ఈ వైఖరిని భారత్ తీసుకున్నది. దేశ ఆహార భద్రత పరిరక్షణకే కాదు, 60 కోట్ల రైతుల జీవనోపాధి రక్షణకు కూడా భారత్ అనుసరిస్తున్న ఇలాంటి వాణిజ్య దౌత్యం ఉపకరిస్తుంది. అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెరీ తన భారత పర్యటన చివరి నిమిషంలో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ లెక్క చేయనట్టు కనిపించిన మోడీ వైఖరి ఆశలు నింపుతోంది. చర్చలలో పాల్గొంటున్న భారతీయ బృందం సభ్యుల తరఫున ప్రధాని చెక్కుచెదరకుండా నిలబడడం ఇదే ప్రథ మం. గత సమావేశాలలో భారతదేశం నుంచి వెళ్లిన వాణిజ్య మంత్రి గళం గట్టిగా వినిపించడం, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపించడం; చివరికి ఒప్పందం మీద ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేసి రావడం మనకు అనుభవమే. గత ఇరవై సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. బాలీ సమావేశంలో ఆనంద్శర్మ ‘శాంతి నిబంధన’ మీద సంతకం చేయడానికి నిరాకరించి ఉంటే మన వాణిజ్య ప్రమాణాలలో మెరుగైన మార్పులు రావడానికి వీలు కలిగేది. ఆ నిబంధనే వ్యవసాయ రాయితీల నిబంధనలను ఉల్లంఘించినందుకు వివాదాల ఫ్యానెల్ ముందు భారత్ను నిలబెడుతుంది. భారత్కు ఒక శాశ్వత పరిష్కారం అవసరం. అదే దేశంలోని లక్షలాది మంది క్షుద్బాధను తీర్చేందుకు మార్గం సుగమం చేస్తుంది. వాణిజ్యపరమైన చర్చలను భగ్నం చేసినందుకు అమెరికా ఏనాడూ చింతించలేదు. ఎప్పుడూ తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ 30 సందర్భాలలో ఎలాంటి నిర్ణయాలు చేయకుండా స్తంభింపచేసిన ఉదాహరణలు ఉన్నాయి. పత్తికి రాయితీ ఇవ్వడం గురించి ఇటీవల కాలమంతా అమెరికా వ్యతిరేకిస్తూనే రావడం ఇందుకు ఒక ఉదాహరణ. షరతులకు లోబడి ఉండడమే మంచిదంటూ దేశంలో వినిపిస్తున్న గొణుగుడు, కఠిన విధానం అనుసరిస్తే భారత్ ఏకాకిగా మిగిలిపోతుందన్న భయాలను ఇంకాస్త పెంచుతున్నాయి. భారత్ ఈ విషయంలో గోరంతలను కొండంతలను చేస్తోందని కొందరు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. 60 కోట్ల రైతుల పొట్ట కొట్టడం వారికి గోరంతలా కనిపిస్తోంది. ఆ ఆర్థికవేత్తలలో చాలామంది ఇంకో అడుగు ముందుకు వేసి భారత రైతాంగానికి ప్రపంచంలోనే ఎక్కువ చెల్లిస్తున్నారని తప్పుడు లెక్కలు ఇచ్చే వరకు వెళ్లారు. అమెరికాలో మాదిరిగా కాకుండా, భారత్లో సేద్యం ఆర్థికంగా లాభసాటి కాదు. గడచిన 15 సంవత్సరాలలో మొత్తం మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. కనీస మద్దతు ధరకు బద్ధవ్యతిరేకం డబ్ల్యూటీఓ కోరుకుంటున్నదేమిటంటే, రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధర వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలి. లేదా ఆ మద్దతు ధరను వ్యవసా యోత్పత్తి మొత్తంలో పది శాతం దగ్గర నిలిపివేయాలి. 1986-88 నాటి డబ్ల్యూటీఓ ధర విధానం అంచనా ప్రకారం ఇప్పుడు ధాన్యం సేకరణ ధరగా చెల్లిస్తున్న మొత్తం క్వింటాల్ ఒక్కింటికి రూ. 1,360. దీనినే క్వింటాల్కు రూ. 600కు తగ్గించవలసిన అవసరం ఉందని డబ్ల్యూటీఓ భావిస్తోంది. కానీ దీని మీద భారత్ వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంది. కాలం చెల్లిన ధరల నిర్ణయ విధానం కాకుండా, 2010-12 సంవత్సరాల ఆధారంగా, వాస్తవికంగా దాని మీద పునరాలోచన చేయాలని భారత్ ఆకాం క్షిస్తున్నది. అయితే అమెరికాకు, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్లకు ఇది అంగీకారయోగ్యంగా లేదు. డబ్ల్యూ టీఓ నిబంధనలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను దాదాపు యాభై శాతం తగ్గించినా, లేదా ధాన్యం సేకరణ ధర విధానాన్ని పూర్తిగా ఎత్తేయ డానికి అంగీకరించినా అది రైతులను వీధుల పాలు చేయడమే అవుతుంది. నిజానికి డబ్ల్యూటీఓ నిబంధనల విషయంలో భారత్ తలుపులు మూసేసు కున్నా, తదుపరి చర్చల కోసం ఓ కిటికీ మాత్రం తెరిచే ఉంచింది. సెప్టెం బర్లో మళ్లీ డబ్ల్యూటీఓ సమావేశమైనప్పుడు భారత్ వాణిజ్య దౌత్యానికి అసలు పరీక్ష మొదలవుతుంది. పేద ప్రజల ఆకలి తీర్చడంలో దేశానికి ఉన్న సార్వభౌమాధికారం దగ్గర దేశం రాజీ పడకూడదు. ఆహారం విషయంలో స్వావలంబనను కొనసాగించడానికి ఏర్పరుచుకున్న విధానం లొసుగులతో ఉంచడం భారత్ అభిమతం కాకూడదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు) దేవీందర్ శర్మ -
మళ్లీ.. ఆధార్ అనుసంధానం
నల్లగొండ :ఆధార్ కార్డుల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్కు ఆధార్ లింకు పెట్టి సబ్సిడీని బ్యాంకులలో జమ చేసిన విషయం విదితమే. వంటగ్యాస్తోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆధార్ కార్డులతో లింకు చేయాలనే ఆలోచనతో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అదే విధంగా ఎన్నికలు సమీపించడంతో ఆధార్ కార్డుల ఆనుసంధానం, సబ్సిడీ బ్యాంకు అకౌంట్లో జమచేసే విధానానికి స్వస్తి చెప్పారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్ కార్డులను సంక్షేమ పథకాలకు లింకు పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అందుకు గాను ఆధార్ కార్డుల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. రేషన్కార్డులకు, వంట గ్యాస్కు ఆధార్ కార్డుల అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. రేషన్ కార్డులలో బోగస్కార్డులను ఏరివేయడానికి ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తున్నారు. రేషన్ డీలర్లకు ఆధార్ కార్డులను సేకరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 34.88 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 29 లక్షల మంది ఆధార్ కార్డులు పొందారు. కాగా మిగతా వారి కోసం జిల్లాలోని 24 మీ సేవా కేంద్రాలలో ఆధార్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డులు, వంట గ్యాస్కు అనుసంధానం.. రేషన్కార్డులకు, వంట గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డులలో 33.84 లక్షల యూనిట్లు ఉండగా ఇప్పటి వరకు 25.19 లక్షల యూనిట్లు ఆధార్ కార్డులకు అనుసంధానం చేశారు. అదే విధంగా 6,25,342 వంట గ్యాస్ వినియోగదారులకు గాను 3,79,552 వినియోగదారులకు ఆధార్కార్డులు అనుంసంధానం చేయగా 2,32,579 మంది వినియోగదారులకు బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం చేశారు. ఆధార్ కార్డులతో వంట గ్యాస్, రేషన్ కార్డుల అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా కార్యాలయం లేక ఇక్కట్లు జిల్లాలో ఎంతమంది ఆధార్ కార్టులు పొందారు... ఇంకా ఎంత మంది ఆధార్ కార్డులు తీసుకోవాల్సి ఉంది.. తప్పులు దొర్లిన వారు దరఖాస్తులు పెట్టుకునేందుకు జిల్లా కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆధార్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకొని ఫొటోలు సైతం దిగినా కార్డులు రానివారు సైతం ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా కార్డులు పొందడానికి రాకపోవడంతోపాటు తిరిగి కార్డులు దిగడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. అలాంటి ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థంకాని పరిస్థితి. జిల్లా స్థాయిలో కార్యాలయం ఉంటే ఆధార్ కష్టాలు తొలిగే అవకాశాలు ఉన్నాయి. 24 కేంద్రాల ఏర్పాటు.. ఆధార్ కార్డులకు దరఖాస్తులు చేసుకోని వారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల మంది ఉన్నారు. కానీ జిల్లాలో కేవలం 24 మీ సేవా కేంద్రాలలో మాత్రమే ఆధార్ కార్డులు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఆలేరు, హాలియా, బొమ్మల రామారం, అర్వపల్లి, కోదాడ, ఎం. తుర్కపల్లి, మేళ్ల చెర్వు, నడిగూడెం, మునగాల, నారాయణపురం, నేరేడుచర్ల, నూతనకల్, పెద్దవూర, పెన్పాహడ్, తిరుమలగిరి, తుంగతుర్తి, వలిగొండ, కట్టంగూర్తో పాటు నల్లగొండ మున్సిపాలిటీలో రెండు, సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు, మిర్యాలగూడలో ఒకటి, భువనగిరిలో ఒక కేంద్రంలో ఆధార్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్నాయి. మండలానికో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్ని జన్మలు కావాలి?
సోనియాగాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన నట్వర్సింగ్ ఆమె వ్యక్తిత్వం గురించి, యూపీఏ హయాంలో ఆమె చేసిన అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న సమాధానం చెబితే చాలు. ఒక్క వాక్యంలో చెప్పగలిగేదానికి పెద్ద పుస్తకం రాయడం అవసరమా? సోనియాగాంధీ తన జ్ఞాపకాలను గ్రంథస్తం చేయాల్సి ఉండటానికి ప్రశస్తమైన కారణాలెన్నో ఉన్నాయి. కున్వర్ నట్వర్సింగ్ రాసిన ‘ఒక్క జన్మ చాలదు’ ఆత్మకథ మాత్రమే అందుకు కారణంగా సరిపోదు. నేడు సోనియా పాలిటి శాపంగా మారిన నట్వర్సింగ్ ఒకప్పుడు ఆమెకు ‘సన్నిహిత మిత్రుడు.’ సోనియా గాంధీ వ్యక్తిత్వం గురించి, యూపీఏ అధికారంలో ఉన్న 2004-2014 దశాబ్దంలో ఆమె అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి ఆయన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఆయన వెల్లడించిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు విశ్వసనీయమైనవిగా అనిపిస్తున్నాయి. కాబట్టే మీడియాలోనూ, ప్రజల్లోనూ అవి కొంత కాక పుట్టించ గలుగుతున్నాయి. అందువల్ల ఆ ప్రశ్నలకు ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత కాదు, ఇప్పుడే సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న పదంతో సమాధానం చెబితే సరిపోతుంది. సోనియా దాచుకోవాల్సిందేమీ లేకపోతే... ఆమె, ఆమె కూతురు ప్రియాంకాగాంధీ మే నెలలో నట్వర్సింగ్ను కలసి ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను తొలగించాలని ఎందుకు ప్రాధేయపడాల్సి వచ్చినట్టు? తన ఒకప్పటి సహచరుడు, సలహాదారు, మిత్రుడు కట్టుకథలను కల్పించారనుకుంటే అందుకు అత్యంత సమర్థవంతమైన తరుణోపాయం ఆమెకుంది. ఆ రచయితపైనా, ప్రచురణకర్తలపైనా పరువు నష్టం దావా వేయవచ్చు. గెలిస్తే భారీగా పరిహారాన్ని కోరవచ్చు. ఆమె తరఫున కోర్టుకు హాజరుకావడానికి పార్టీ పరివారంలో కావాల్సినంత మంది లాయర్లున్నారు. గంటలోగానే కోర్టు నోటీసు పంపవచ్చు. కాంగ్రెస్ ప్రతిస్పందన ఇంతవరకు జనాంతికంగా గుంజాటనపడటానికి లేదా బహిరంగంగా రంకెలేయడానికి మధ్య తారట్లాడుతోంది. టీవీ ముందుకు వచ్చే నిస్సహాయులైన కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు తీవ్ర స్థాయి స్వరాలతో విషయాన్ని దారి మళ్లించే క్రీడకు పాల్పడుతున్నారు. ఢిల్లీ గురించి అడుగుతుంటే ముంబైపై తీవ్ర దాడికి దిగుతారు. విస్తృతంగా ప్రచారం సాగినట్టుగా 2004లో సోనియాగాంధీ తమ అంతరాత్మ ప్రబోధం మేరకే ప్రధాన మంత్రి పదవి వద్దనుకున్నారా? లేక ఆమె కుమారునిలోని భయాల వల్ల కాదన్నారా? అని అడిగి చూడండి. సూటిగా సమాధానం చెప్పక పోగా రచయితపై అంతులేని దూషణలకు దిగుతారు. ఏది ఏమైనా, పులోచ్ ఛటర్జీ అనే ఉన్నత ప్రభుత్వోద్యోగి అధికారిక ఫైళ్లను సోనియాకు చూపిన వైనం ముందు అది వెలవెలబోతుంది. భయపడటం చట్టవిరుద్ధం కాదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం చట్టవిరుద్ధం. సోనియాగాంధీకి ఏ ఫైళ్లను చూపిన సంగతి తనకు తెలియదని మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా చెప్పొచ్చు. కానీ ఆయన అలా అంటారా? అనరా? అనకపోతే ఆయన కూడా దోషే అవుతారు. సోనియా తనను బలిపశువును చేయాలని అనుకోవడం వల్లనే సద్దాం హుస్సేన్ ‘చమురుకు బదులు ఆహారం’ కార్యక్రమంలో ‘‘కాంట్రాక్టేతర లబ్ధిదారుల’’లో ఒకరిగా చేర్చి 2005లో తనను ఉన్నత పదవి నుంచి, తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారని నట్వర్సింగ్ ఆరోపించారు. ఆయన అన్నదానిలోని బహువచనం ‘లబ్ధిదారులు’ను గమనించాలి. వారిలో ‘‘ఏఐసీసీ’’ ఉంది. సోనియా, నట్వర్సింగ్పై చేసినంత తీవ్ర దాడిని ఏఐ సీసీలో మరెవరిపైనా, ఎన్నడూ చేయలేదనడం నిస్సందేహం. ఏఐసీసీలో ఇద మిద్దంగా ఎవరు ఆ పాత్రను నిర్వహించారో కనిపెట్టే ప్రయత్నాన్ని సోనియా గానీ లేదా కాంగ్రెస్ గానీ చేసింది లేదు. తర్వాతి కాలంలో టెలికాం లేదా బొగ్గు అవినీతి కుంభకోణాలు బద్దలైనప్పుడు గానీ లేదా ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా గంతులేస్తూ సంపన్నుడైపోయినప్పుడు గానీ ఆమె అలాంటి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. నట్వర్సింగ్ తన గౌరవానికి విలువనిచ్చే మనిషి. దౌత్య రంగలో ఆయన విశిష్టమైన పదవులను నిర్వహించినవారు. మంచి విషయ పరిజ్ఞానం గల వారు. సోనియా, కుటుంబంలోని మూడు తరాలకు ఆయన సన్నిహితుడు. మే సమావేశంలో సోనియా ఆయన తాను పిల్లలతో సైతం పంచుకోలేని విషయాలను పంచుకోగలిగిన ఆంతరంగికుడని కుమార్తె ప్రియాంకాగాంధీకి చెప్పారు. సోనియా, కాంగ్రెస్లు ఆయనను దుష్టునిగానో లేదా కపటిగానో చిత్రించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మౌలికమైన ప్రశ్న మాత్రం మాయమై పోదు. ఆయన రాసిన పుస్తకం ఒట్టి చెత్త కుప్పే అయితే, ఆయన ఇంటికి పోయి ప్రాధేయపడటం కోసం ఆమె అంతటి అపారమైన మానసిక ప్రయాస పడి ఉండేవారేనా? తన నైతికతను ముక్కలు చెక్కలు చేసి, నిర్దాక్షిణ్యమైన రాజకీయ యంత్రంలో వేసి తోలు వలిచేయడంతో 2005లో నట్వర్సింగ్ కుంగిపోయా రనేది స్పష్టమే. అలాంటి గాయాల గుర్తులను తాత్వికత దాచలేదు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందే తన పుస్తకాన్ని ప్రచురించడాన్ని అనుమతించ లేదు. తద్వారా ఆయన సోనియాగాంధీకి, కాంగ్రెస్కు గొప్ప మేలు చేశారు. లేకపోతే మరింత ఎక్కువ నష్టం వాటిల్లేది. సోనియాగాంధీ కేవలం కాస్త గడువును సంపాదించుకోవడం కోసం మాత్రమే గాక, నిజంగానే ఆమె వైపు నుంచి తన కథనాన్ని వినిపించదలు చుకుంటే ఓ కరపత్రాన్ని గాక పుస్తకాన్నే తన పేరిట వెలువరిస్తారని ఊహించవచ్చు. ఒకప్పటి చక్రవర్తులు తమ అధికారిక కథన రచనకు అత్యుత్తములైన మేధావులను నియమించేవారు. మొఘల్ చక్రవర్తుల తర్వాత భారత్ను పరిపాలించిన బ్రిటిష్ రాజ్లోని దొరలు, దొరసానులు, దండిగా జ్ఞాపకాలను రచించిన వారు. అది, పదవీ విరమణకు చిట్టచివరి వీడుకోలుకు మధ్యన తప్పక చేయాల్సిన కర్మకాండ. 1947 తర్వాతి వారి వారసులు ‘ఇంగ్లిష్ ఇండియన్లు’ సైతం ఈ రచనా రంగంలో ఏమంత వెనుకబడింది లేదు. అదో గొప్ప వారసత్వం. అధికారాన్ని రుచి చూసినవారికి తమ చారిత్రక ప్రాధాన్యాన్ని కొలిచేది జ్ఞాపకం కొలబద్ధతోనే అని తెలుసు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో యాల్టా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సందర్భంగా రోజంతా సాగిన క్లిష్టమైన సంప్రదింపుల తదుపరి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ లు విశ్రాంతిగా గడుపుతుండగా... చరిత్ర తమను గురించి ఎలా అంచనా వేస్తుందోనని రూజ్వెల్డ్ విస్తుపోయారు. రూజ్వెల్డ్ నిరాశావాది, స్టాలిన్ అంతుబట్టనివాడు, చర్చిల్ ఉల్లాసవంతుడు. తనను లిఖించి తన పట్ల చర్చిల్ దయతో ప్రవర్తించాడని చరిత్ర తేల్చి చెప్పింది. దానికి తథాస్తు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
ఆల్టైం కనిష్టానికి డీజిల్ నష్టాలు
లీటరుపై రూ. 1.33కి తగ్గుదల ఇలాగే ఉంటే మరో 3 నెలల్లో డీకంట్రోల్! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు డీజిల్ విక్రయాలపై వస్తున్న నష్టాలు ఆల్టైం కనిష్ట స్థాయికి తగ్గాయి. లీటరుకు రూ. 1.33 స్థాయికి దిగి వచ్చాయి. దీంతో, ఇదే పరిస్థితి కొనసాగితే డీజిల్ రేట్లపై నియంత్రణను మరో మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు బలపడ్డాయి. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం గత నెలలో డీజిల్ రిటైల్ విక్రయాలపై లీటరుకు రూ. 2.49 మేర ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ. 1.33కి తగ్గాయి. అటు అంతర్జాతీయంగా చమురు రేట్లు క్షీణించడం, ఇటు కొత్త ప్రభుత్వం కూడా ప్రతి నెలా రేట్లను పెంచడం కొనసాగించడం ఇందుకు తోడ్పడ్డాయి. తాజాగా గురువారం కూడా డీజిల్ రేటు అర్ధరూపాయి మేర పెరిగిన సంగతి తెలిసిందే. డీజిల్ డీకంట్రోల్పై గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 2013 జనవరి నుంచి రేట్లు 18 సార్లు పెరిగాయి. మొత్తం మీద రేటు లీటరుకు రూ. 11.24 మేర పెరిగింది. నెలవారీ పెరుగుదల కారణంగా గతేడాది మేలో లీటరు డీజిల్పై నష్టాలు రూ.3 స్థాయికి తగ్గినప్పటికీ.. రూపాయి క్షీణత కారణంగా సెప్టెంబరు నాటికల్లా ఇవి రూ. 14.50 స్థాయికి పెరిగిపోయాయని అధికారులు వివరించారు. అప్పట్నుంచి రూపాయి బలపడుతుండటంతో పాటు రేట్ల పెంపూ కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో రూపాయి బలపడుతూ పోవడం వల్ల మార్చి నుంచి డీజిల్ విక్రయాలపై నష్టాలు వేగంగా తగ్గసాగాయి. మార్చ్లో రూ. 8.37గా ఉన్న నష్టాలు మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ. 4.41కి తగ్గాయి. జూన్ ద్వితీయార్థంలో రూ. 1.62కి క్షీణించినా.. జూలై ప్రథమార్ధంలో మళ్లీ రూ. 3.40కి పెరిగాయి. మళ్లీ గత నెల ద్వితీయార్థంలో రూ. 2.49 స్థాయికి తగ్గాయి. -
యూపీఏ బాటలోనే ఎన్డీయే
* కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ * మైనార్టీ వర్గాలపై పెరిగిన దాడులు * వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయం * త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ * వరంగల్లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు సాక్షి ప్రతినిధి, వరంగల్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ దారిలోనే పయనిస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. బీజేపీ పాలన.. పదేళ్ల యూపీయే ప్రభుత్వాన్ని తలపిస్తోందని చెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు వరంగల్లో బుధవారం ప్రారంభమయ్యూయి. ఆగస్టు 2 వరకు ఈ మహాసభలు జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ సర్కార్ ఉందని, వారి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. రైల్వే, సాధారణ బడ్జెట్లలో ధనికులకు, కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేశారని విమర్శించారు. రైల్వే రవాణా, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ ధరలు పెరిగాయని విమర్శించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఆత్మగా పనిచేస్తోందని, దీని పట్టు నుంచి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు విజృంభించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని మార్పులు చేస్తామంటూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టి, దోపిడీ శక్తులను నిరోధించేందుకు వామపక్షాలే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించి బలమైన ఉద్యమానికి ఈ మహాసభలు నాంది పలకాలని ఆకాంక్షించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సమయంలో పక్కదారి పట్టించేందుకు రెచ్చగొట్టే కుట్రలకు అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చంద్రబాబు లాంటివారు ఈ విషయంలో ముందుంటారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సభకు ముందు వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పీఎంఓ ఒత్తిడితోనే సీజేఐల ‘రాజీ’
రవి శంకర్ ప్రసాద్ వివరణ పార్లమెంటులో రెండోరోజూ దుమారం మాజీ సీజేఐల రాజీ ఆరోపణలపై విరుచుకుపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ/చెన్నై: అవినీతి ఆరోపణలున్న ఆ మద్రాస్ హైకోర్టు జడ్జిని కొనసాగించడంపై కొలీజియం మొదట్లో తటపటాయించిందని, అయితే, యూపీఏ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి కొనసాగింపునకు సిఫారసు చేసిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం లోక్సభలో వెల్లడించారు. ‘‘2003లో ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. తరువాత యూపీఏ హయాంలో ఆ న్యాయమూర్తిని ఎందుకు కొనసాగించకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి సందేశం వచ్చింది. అప్పటికీ ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు సిఫారసు చేయకూడదని కొలీజియం గట్టిగానే ఉంది. అనంతరం న్యాయశాఖ నుంచి రెండు లేఖలు రావడంతో కొనసాగింపునకు అనుకూలంగా కొలీజియ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చింది.’’ అని ప్రసాద్ చెప్పారు. కానీ, ఆరోపణలున్న ఆ జడ్జి మరణించారని, ఆ కొలీజియంలోని న్యాయమూర్తులు రిటైరయ్యారని రవిశంకర్ అన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. పార్లమెంటులో రెండోరోజూ దుమారం జస్టిస్ కట్జూ చేసిన ఆరోపణలపై వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. అవినీతి జడ్జిని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన డీఎంకేకు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరో పేరు బయటపెట్టాలంటూ అన్నాడీఎంకే సభ్యులు లోక్సభ వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఇదే అంశంపై అన్నాడీఎంకే, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదంతో రాజ్యసభ కూడా కాసేపు వాయిదా పడింది. ఈ వ్యవహారంలో నిజమేంటో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎవరి ఒత్తిడితోనో.. కరుణానిధి: రాజకీయంగా దుమా రం రేపుతున్న న్యాయమూర్తి కొనసాగింపు అంశంపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పెదవి విప్పారు. పదేళ్ల కిందటి అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేంటో తెలపాలని జస్టిస్ కట్జూని ప్రశ్నించారు. ఏదో పరోక్ష ఒత్తిడి కారణంగానే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో భాగంగా ఉంటూ అదే వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కట్జూపై మండిపడ్డారు. -
మళ్లీ నగదు బదిలీ?
ఆధార్ లింకుతో అమలు చేసే ఆలోచనలో కేంద్రం న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత నగదు బదిలీ తలనొప్పి మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వంటగ్యాసు సిలిండర్లపై సబ్సిడీని ఆధార్ నంబర్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు జమచేసే ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించడం... పథకాల్లో లోటుపాట్లతో అధికారం నుంచి దిగిపోయే ముందు పక్కనపెట్టడం తెలిసిందే. అయితే, నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టేందుకు మళ్లీ నగదు బదిలీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ మొదలు పెట్టవచ్చని, పథకం పనితీరును అంచనావేసే పని మొదలైనట్లు అధికారులు తెరలిపారు. 300 జిల్లాల్లో పథకం ప్రభావాన్ని అంచనా వేసి ఆగస్టు 15లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీంతోమ జిల్లాల్లో పర్యటించి ఓ నివేదికను రూపొందించే పనిలో ప్రణాళికా సంఘం, భారత విశిష్ట గుర్తింపు సంఖ్య సంస్థ అధికారులు ఉన్నారని తెలిపాయి. -
కునికిపాటే మేలుకొలుపు
యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొడుతున్నదన్న కాంగ్రెస్ మొట్టమొదటి విమర్శనాస్త్రం నమస్కారబాణంలాంటిది. అదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుందా? అత్యంత ఆసక్తికరమైన ‘నిదురిస్తున్న నేత’ ఉదంతానికి సంబంధించి నా సానుభూతంతా రాహుల్ గాంధీపైనే. అలసట కలిగించే ఢిల్లీ వేసవి వేడి గాలులకు భారత ప్రజాస్వామ్య దేవాలయాంతర్భాగంలోని మహత్తరమైన లోక్సభ దర్బారులో నిద్ర అంటువ్యాధిలా ప్రబలిపోతుంది. కొందరి ఉపన్యాసాలు సైతం దాన్ని అడ్డగించలేవు. రాహుల్ కంటే మెరుగైన పార్లమెంటేరియన్లు సైతం.... మధ్యాహ్న భోజనానంతర సమయంలో కడుపులోని మృష్టాన్నం మస్తు, మనస్సులోని మగత కలిసి విషంలాంటి నిద్ర మత్తు ఆవహించేట్టు చేస్తుంటే ఆవలింతలను ఆపుకోవడం కోసం తంటాలు పడాల్సివస్తుండేది. సుదూర గతంలోనైతే ఆ సుఖవంతుల సమాజం దాని అత్యుత్తమ సాంప్రదాయాలననుసరించి ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన రహస్యంగా భావించి దాచి ఉంచడం రివాజుగా ఉండేది. పార్లమెంటు సభ్యులకు మరింత దృశ్యమాన ఖ్యాతిని ఆర్జించిపెట్టాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభలోని ప్రసంగాలను అప్పటికప్పుడే రికార్డు చేసి టీవీలో ప్రసారం చేయడాన్ని అనుమతించారు. బుల్లి తెర వేలుపులుగా వెలిగిపోయేందుకు లభించిన ఆ అవకాశాన్ని ఎంపీలు స్వాగతించారు. కెమెరాలకు హృదయం ఉండదు, వాటికి పనిచెప్పే కెమెరామన్లు స్వభావరీత్యానే కొంటె కోణంగులనే విషయాన్ని వాళ్లు పూర్తిగా గ్రహించలేకపోయారు. ఈ కోణంగులు సరిగ్గా తమకు కావాల్సిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఎంతటివారినైనా ఇట్టే పట్టేస్తారు. సభ ధరల పెరుగుదల సమస్యపై చర్చ సాగిస్తుండగా బొజ్జ నిండా పాలు తాగి బజ్జున్న పాపాయిలా రాహుల్ గాఢనిద్రలోకి జారిపోయి వారికి దొరికిపోయాడు. అలాంటి విపరీత దృశ్యాలను కత్తిరించేయడం కోసం రాహుల్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో నమ్మకస్తులైన నౌకర్లను నియమించుకోవడం మరచినట్టుంది. ఆ శాఖ అధికారులు ఎవరూ చెప్పాల్సిన పని లేకుండానే అలాంటి సందర్భాల్లో స్క్రీన్ను ఖాళీగా ఉంచేసేంతటి ప్రభుభక్తి పరాయణత దేశ రాజధానిలోని అధికార యంత్రాంగపు సంస్కృతి. అయితే అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులనాటి సంగతి. రాహుల్ పవళింపు సేవను చూపిన అదే శాఖ అధికారులు రాహుల్ గనుక మెడను తలపై నిటారుగా నిలిపి అత్యంత సావధానంగా తమ పార్టీ ఎన్డీఏకు వ్యతిరేక ఎదురుదాడికి నాయకత్వం వహిస్తూ ఉండటాన్ని చూపడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. ఓటమికి అర్థాన్ని రాహుల్ పూర్తిగా గ్రహించారో లేదో నాకు తెలీదు. కానీ విషాదకరమైన ఆయన పార్లమెంటు కునుకు మాత్రం... శ్లేషాత్మకంగా చెప్పాలంటే మేలు కొలుపు హెచ్చరిక. ఆ మరుసటి రోజు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడానికి లేచినప్పుడు పార్లమెంటులో కనిపించిన దృశ్యం మనసుకు హత్తుకుంది. బిడ్డల పట్ల అత్యంత శ్రద్ధ చూపే తల్లిలాగా సోనియాగాంధీ ఇక ఎలాంటి అవకాశాలకు తావివ్వదలుచుకోలేదు. కునికిపాట్లకు దాదాపుగా అవకాశమే లేని ముందు బెంచీల్లో కొడుకును ఆమె తన పక్కనే కూచోబెట్టుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సుదీర్ఘ సమాధానం ఇస్తుండగా రాహుల్ మొబైల్ఫోన్ను తుడుచుకుంటూ లే దా మెరుగులు దిద్దుకుంటూ గడిపేశారు. ఈసారి మాత్రం నోట్స్ రాసుకోడం కోసం పెన్నూ, ప్యాడ్లతో సాయుధుడై వచ్చారు, జైట్లీ అనర్గళోపన్యాసం సమయంలో రాహుల్ వాస్తవంగా ఏమి నోట్ చేసుకున్నారనేది తెలుసుకోవడం ఆసక్తికరమే. కానీ ప్రాచీన పత్ర భాండాగారంలో భద్రపరచడానికి ఆ డాక్యుమెంటు లభిస్తుందని అనుకోను. ఏదేమైనా, బడ్జెట్పై కాంగ్రెస్ ప్రతిస్పందనలు ఆ డాక్యుమెంటుకు ఏ మేరకైనా ప్రతిఫలనాలైతే... ఆ పేజీల్లో ఉన్నది పిచ్చిగీతలే అయి ఉండాలి. ప్రజాస్వామ్యం పక్షపాతంతో కూడిన వ్యవహారం. ఆ మేరకు ఎన్డీయే తొలి బడ్జెట్పై కాంగ్రెస్ వ్యతిరేకత ఊహించదగినది, అర్థంచేసుకోదగినది కూడా. కానీ కాంగ్రెస్ మరింత మెరుగైన దాడి వ్యూహాన్నయినా కనీసం చేపట్టాల్సింది. కానీ ప్రతిస్పందన సోమరిగానూ, అసంకల్పితమైనదిగా ఉండి ప్రతికూల ఫలితాలను కలిగించేదిగా సాగింది. యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొట్టడం మాత్రమే చేస్తోందనే దాని మొట్ట మొదటి తూటా నమస్కార బాణంలాంటిది. అది చెప్పేదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్సింగ్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని కాంగ్రెస్ ఇప్పుడు తీసుకుందా? దూకడానికి ముందు చూడాలి, మాట్లాడటానికి ముందు ఆలోచించాలి. ఆ పార్టీ ప్రచార యంత్రాంగం బడ్జెట్ పేదలకు వ్యతిరేకమైనదనే వాదనను ముందుగానే తయారు చేసి ఉంచడమే ఇలా కాంగ్రెస్ తూటా తుస్సుమనిపోవడానికి కారణమై ఉండాలి. ఇది దిగ్భ్రాంతికరమైన తప్పుడు అంచనా. ఎందుకంటే పేదలలోకెల్లా అతి పేదల అవసరాలను తీర్చలేకపోతే అది ప్రభుత్వమే కాదని ప్రధాని మోడీ నిలకడగా పదే పదే చెబుతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలతో పేదలపట్ల సానుకూలమైన మొగ్గును చూపిన అత్యుత్తమమైన రాష్ట్రాలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రభుత్వాలే తప్ప మహారాష్ట్ర, కర్ణాటక వంటి కాంగ్రెస్ రాష్ట్రాలు కావు. బడ్జెట్ ఆ విషయంలో బీజేపీ రాష్ట్రాలపై జరుగుతున్న దుష్ర్పచారం గుట్టు బట్టబయలు చేసింది. బడ్జెట్లో భారీ దూరచ్చదృష్టి పథకాలు లోపించాయనేది రెండో ఆరోపణ. ఇది కూడా కొంత అర్థరహితమైనదే. మోడీ బడ్జెట్లోని ఈ అంశాలను చూడండి: 2022 నాటికి ప్రతి భారతీయునికి సరైన గృహ వసతిని కల్పించడానికి, ప్రతి ఇంటికీ విద్యుత్తును అందించడానికి అది వాగ్దానం చేసింది. వంద కొత్త శివారు నగరాల నిర్మాణానికి ప్రారంభ మూలధన నిధులను కేటాయించింది. హౌసింగ్, రక్షణ రంగాలలో భారీ విదేశీ పెట్టుడులకు దారులు తెరిచింది, రోడ్లు, నదుల అనుసంధానాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల పద్దుకు చేర్చి ఆ శాఖ వ్యయాలను విస్తరింపజేసింది, 8 లేదా 9 శాతం వృద్ధిని తిరిగి సాధిస్తామని వాగ్దానం చేసింది. 2019 నాటికి అతి పురాతనమైన గంగా నదిని శుద్ధి చేసే కార్యక్రమంతో పరిశుభ్ర భారత్ సృష్టికి నాంది పలికారు. 2019 మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవ వత్సరం. కాంగ్రెస్ ప్రభుత్వాలు బరి తెగించి నిర్లక్ష్యంగా చేసిన వ్యయాలతో ఖాళీయైన ఖజానాను లెక్కలోకి తీసుకోక తప్పని తొలి బడ్జెట్కు ఇదంతా తక్కువా? రాజధాని ఢిల్లీలోని పెద్దల ఆలోచన విలక్షణమైనది. ప్రధానంగా అది విద్యుత్ కోతలను ఉత్పాతంగా భావిస్తుంటుంది. కరెంటన్నదే ఎరుగని గుడిసెలోని వారి ఆలోచనకు అది భిన్నమైనది. లూట్యన్ల కాలపు మహా ప్రాసాదాల ఢిల్లీ గురించి పగటి కలలు కనే వారి ఆలోచన నిలవడానికి నీడ లేక మరణిస్తున్నవారి ఆలోచన కంటే భిన్నమైనది. తాగు యోగ్యమైన నీరు దొరక్క గొంతెండిపోతూ ఉండటం లేదా బతికి బట్టకట్టడానికి సరిపడా మెతుకుల కోసం బానిస చాకిరీ చేయటం గాక... పగటి నిద్రకు అవకాశమున్న వారి ఆలోచనలు భిన్నమైనవి.బడ్జెట్లో ఢిల్లీ కంటే భిన్నంగా ఆలోచించే వారికి వాగ్దానం ఉంది. ఆ విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ దృక్పథమూ ఉంది. ఇక అతి కష్టమైన భాగం ఒక్కటే.... ఈ ప్రభుత్వం దేశం కలలను నెరవేర్చాల్సి ఉండటమే. (వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు) ఎంజే అక్బర్ -
సదా నిరాశే..
సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : యూపీఏ సర్కారు తరహాలోనే భారీగా పన్నుల భారం మోపిన మోడీ ప్రభుత్వం.. దానికి తగిన విధంగా విజయవాడ డివిజన్పై వరాల జల్లులు కురిపించలేకపోయిందని రైల్వే ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్, ఇక్కడి నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రైళ్లు, నగరంలో శాటిలైట్ స్టేషన్, జనసాధారణ్ రైళ్లు నడపడం, రైళ్ల వేగం పెంచడం వంటి హామీలన్నీ ఈ ప్రాంతవాసులకు కలగానే మిగిలిపోయాయి. విజయవాడ-న్యూఢిల్లీ ఏసీ రైలు విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఏసీ రైలు వేశారు. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీనివల్ల ఒరిగిందేమీ లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. జనసాధారణ్, ఎక్స్ప్రెస్, పాసింజర్, డెమో రైళ్ల కొత్తదనమేమీ లేదు రైల్వే బడ్జెట్లో కొత్తదనం లేదు. బడ్జెట్కు ముందే చార్జీల మోత మోగించారు కాబట్టి, ప్రస్తుతం చార్జీల ఊసే ఎత్తలేదు. విజయవాడ డివిజన్కు ఒక్క రైలు మినహా ఏం మంజూరు చేయలేదు. మోడీ ప్రభుత్వం రైల్వే మోడరనైజేషన్ వైపు అడుగులు వేస్తోందని ఈ బడ్జెట్ను చూస్తే అర్థమవుతోంది. ప్రరుువేటీకరణ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు. - స్వామిచరణ్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సీనియర్ సభ్యుడు కలలు కల్లలే అయ్యూరుు.. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే బడ్జెట్ను రూపొందించలేదని స్పష్టమైంది. జిల్లావాసుల చిరకాల వాంఛ మచిలీపట్నం- రేపల్లె లైను నిర్మాణ విషయం ప్రస్తావించకపోవడం బాధాకరం. నర్సాపురం-మచిలీపట్నం రైలు ఏర్పాటుచేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నా ఫలితం లేదు. ఇది జిల్లా ప్రజలకు నిరాశాజనకంగానే ఉంది. - బి.ధన్వంతరి ఆచార్య, హిందూ కళాశాలల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చేదు మాత్ర.. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే.. రైల్వే చార్జీలు పెంచడం దారుణం. రైల్వేమంత్రి సొంత రాష్ట్రమైన కర్ణాటకు భారీ ప్రయోజనాలు చేకూర్చే విధంగానే బడ్జెట్ ఉంది. మచిలీపట్నం-విజయవాడ డబ్లింగ్ లైన్ల విషయంపై కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు. మొత్తానికి రైల్వే బడ్జెట్ మొత్తం చేదుమాత్రలా ఉంది. - దోసపాటి జగన్మోహనరావు, వైద్యుడు నీటిమూటలే.. విజయవాడ-భీమవరం ఎలక్ట్రికల్ డబుల్ లైన్ ప్రతిపాదన గత ప్రభుత్వంలోనే మంజూరైనప్పటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటారుుంచలేదు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కేవలం రెండే రెండు కొత్త రైళ్లు వేసి చేతులు దులిపేసుకున్నారు. - ఏవీఆర్ రాజు, అడ్వకేట్ -
పార్లమెంటులో ‘ధరల’ రగడ
* లోక్సభలో ఓటింగ్తో కూడిన చర్చకు పట్టుబట్టిన విపక్షాలు * కుదరదన్న స్పీకర్; వెల్లో నిరసనలో రాహుల్ * పలుమార్లు వాయిదా పడిన లోక్సభ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార, విపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. ధరల పెరుగుదల ప్రధానాస్త్రంగా విపక్షం.. అది యూపీఏ పాలనాఫలితమేనంటూ అధికార పక్షం.. ఉభయసభల్లోనూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. లోక్సభలో: సోమవారం సభ ప్రారంభం కాగానే లోక్సభ సభ్యుడు హర్భజన్ లాఖా మృతికి సంతాపం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటనలో.. చెన్నైలో, ఢిల్లీలో భవనం కూలిన ఘటనల్లో.. మృతిచెందిన వారికి సభ సంతాపం తెలిపింది. పీఎస్ఎల్వీ-సీ23 ప్రయోగంలో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లో విజేతగా నిలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్, బిలియర్డ్స్, స్నూకర్స్లో అంతర్జాతీయ విజయాలు సాధించిన పంకజ్అద్వానీ, ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన జితూరాయ్లను స్పీకర్ అభినందించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగా.. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, వామపక్షాల సభ్యులు ఆహార ధరల పెరుగుదల, రైలు చార్జీల పెంపు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వాయిదా తీర్మానం కింద చర్చకు పట్టుపడుతూ వెల్లోకి దూసుకెళ్లారు. ధరల పెరుగుదల అంశంపై తాము కూడా ఆందోళన చెందుతున్నామని.. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏ నిబంధన కింద ఈ చర్చ జరగాలనేది స్పీకర్ నిర్ణయించాలని చెప్పారు. దాంతో ఓటింగ్తో కూడిన వాయిదా తీర్మానాల కింద చర్చ చేపట్టాలంటూ ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. ఓటింగ్కు అవకాశం లేని 193 నిబంధన కింద చర్చ చేపట్టేందుకు ఇచ్చిన నోటీసులను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కానీ.. విపక్షాలు వాయిదా తీర్మానం కిందే చర్చను చేపట్టాలని పట్టుపట్టాయి. స్పీకర్ అంగీకరించకపోవటంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండు పర్యాయాలు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ ఉపనాయకుడు అమరీందర్సింగ్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల చాలా ముఖ్యమైన అంశం కాబట్టి దీనిపై ఓటింగ్ నిర్వహించాలని పట్టుపట్టారు. ఇదే అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించారని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్యసింథియా పేర్కొనగా.. ఆ సభలోని అంశాలను లోక్సభలో చర్చించరాదని స్పీకర్ వారించారు. ఈ సందర్భంగా గందరగోళం తలెత్తింది. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో స్పీకర్ పది నిమిషాల్లోనే సభను మంగళవారానికి వాయిదావేశారు. వెల్ వద్ద రాహుల్ లోక్సభలో సోమవారం నాడు అరుదైన దృశ్యం కనిపించింది. సమావేశాల్లో సాధారణంగా వెనుక బెంచీల్లో కూర్చునే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ..ధరల పెరుగుదలపై విపక్షాల సభ్యులు చర్చకు పట్టుపడుతూ ఆందోళనకు దిగగా.. రాహుల్ కూడా పార్టీ సహచరులతో కలిసి వెల్ పక్కన నిల్చుని నిరసన తెలిపారు. అక్కడ ఎన్సీపీ సభ్యురాలు సుప్రియాసూలే, తృణమూల్ నేత సౌగతారాయ్లతో రాహుల్ మాట్లాడటం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కూడా వెల్లోకి దూసుకెళ్లి పోలవరం ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎల్కె అద్వానీ, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్లు సమావేశం చివరివరకూ సభలోనే ఉన్నారు. రాజ్యసభలోనూ: ధరల పెరుగుదల అంశం పెద్దల సభనూ కుదిపేసింది. విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చించాలని పట్టుబడ్డారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ధరలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడంతో చైర్మన్ అన్సారీ చర్చకు అవకాశం కల్పించారు. చర్చను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ ప్రారంభించారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన విధానాలు ద్రవ్యోల్బణానికి ఊతమిచ్చేవిగానే ఉన్నాయని విమర్శించారు. రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ధరలను ఇష్టానుసారం పెంచేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కలగజేసుకుని.. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని ఎదురుదాడికి దిగారు. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి.. బీజేపీ నేతలు యూపీఏ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నారా? అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. బీజేపీకి వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. ‘మంచి రోజులు రాలేదు. ఖరీదైన రోజులొచ్చాయ’న్నారు. -
జాలర్లకు షాక్
సాక్షి, చెన్నై : రామేశ్వరానికి కూత వేటు దూరంలో ఉన్న కచ్చదీవులు ఒకప్పుడు తమిళనాడు పరిధిలో ఉండేవి. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేసింది. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న తమిళనాడులోని సముద్ర తీర జాలర్లకు కన్నీళ్లు మిగిలాయి. ఆ దీవుల్లో తమిళ జాలర్లు చేపల్ని వేటాడేందుకు శ్రీలంక నావికాదళం అడ్డుతగులుతోంది. దాడులు, కాల్పులతో పాటు బందీలుగా పట్టుకెళుతూ భయాందోళన సృష్టిస్తోంది. స్వాధీనమే లక్ష్యం: మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జయలలిత కచ్చదీవులను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత యూపీఏ సర్కారుపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అసెంబ్లీలో సైతం తీర్మానం చేశారు. భౌగోళికంగా, సంస్కృతి, సంప్రదాయం, నాగరికత ప్రకారం కచ్చదీవులు భారత్లోనే ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గత ప్రభుత్వానికి వివరించే యత్నం చేశారు. భారత పార్లమెంట్ ఆమోదం లేకుండా కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేయడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పినా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో ప్రజలు యూపీఏకు చరమ గీతంపాడి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ చేతికి అధికారం అప్పగించారు. దీంతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశ తమిళ జాలర్లలో నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కచ్చదీవుల విషయంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని తమిళులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కచ్చదీవుల వ్యవహారం లో తమదీ యూపీఏ బాటేనని స్పష్టం చేస్తూ మోడీ సర్కారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కేంద్రం పిటిషన్: తమిళ జాలర్లపై వరుస దాడులు, కచ్చదీవులపై తమిళుల హక్కుల పరిరక్షణ నినాదంతో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన పీటర్ రాయల్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏడాదిన్నర కాలంగా విచారణ జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రాన్ని వివరణ కోరుతూ కోర్టు నోటీసులు ఇచ్చింది. కచ్చదీవుల వ్యవహారం, జాలర్ల భద్రత విషయంగా స్పష్టమైన వివరాలతో రిట్ పిటిషన్ దాఖలు చేయూలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే విధానం కూడా మారలేదు. కేంద్ర ప్రభుత్వం తరపున బుధవారం మద్రాసు హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ జాలర్లకు పెద్ద షాక్ తగిలేలా చేసింది. 1974లో కచ్చదీవులు, 1976లో మన్నార్ వలిగుడా, వంగల వలిగుడాల విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఆ పిటిషన్లో కేంద్రం వివరించింది. వీసాలేకుండా, శ్రీలంక అనుమతి లేకుండా కచ్చదీవుల్లోకి తమిళ జాలర్లు వెళ్లవచ్చని, అక్కడ చేపల్ని వేటాడేందుకు అవకాశం లేదని ప్రకటించింది. కచ్చదీవుల్లోని ఆంథోనియార్ ఆలయ ఉత్సవాల్ని ఘనంగా శ్రీలంక, తమిళ జాలర్లు జరుపుకునేందుకు వీలుందని పేర్కొంది. చేపల వేట విషయంలో తమిళ జాలర్లకు ఎలాంటి హక్కులు లేవని, అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటేందుకు వీలులేదని వెల్లడించడం రాష్ర్ట ప్రభుత్వాన్ని విస్మయంలో పడేసింది. జాలర్లలో ఆగ్ర హ జ్వాలను రగిల్చింది. ఆగ్రహం: ఈ పిటిషన్ తమిళ జాలర్లు, తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనన్న డిమాండ్ మరోమారు తెరమీదకు వచ్చింది. తమిళుల భూభాగాన్ని ధారాత్తం చేసింది కాకుండా, చేపల వేట విషయంలో తమకు ఎలాంటి హక్కులు లేవంటూ కేంద్రం ప్రకటించడాన్ని జాలర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగపట్నం, రామేశ్వరం, పుదుకోట్టై జాలర్ల సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్రం తీరును ఎండగట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో కేంద్రం తీరును తప్పుబడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళుల హక్కుల్ని కాలరాయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. కచ్చదీవులకు సంబంధించిన పూర్తి వివరాల్ని, తాము చేసిన తీర్మానాల్ని ఆ లేఖలో వివరించారు. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. యూపీఏ పేర్కొన్న అంశాల్నే మళ్లీ కోర్టులో సమర్పించారని, సవరణలతో కూడిన మరో రిట్ పిటిషన్ దాఖలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమిళ జాలర్లకు ఇక కడలిలో భద్రత కరువైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. -
భూసేకరణ చట్టాన్ని మార్చాలి
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం సరిగా లేదని పలు రాష్ట్రాలు విమర్శించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల రెవెన్యూ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూసేకరణ చట్టంలోని నిబంధనలు చిన్న ప్రాజెక్టులకు కూడా అవాంతరాలు కల్పించేలా ఉన్నాయని బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని హర్యానా, కర్ణాటక, కేరళ మంత్రులతోపాటు, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను కేంద్రం సవరించే అవకాశముందని తెలుస్తోంది. భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. రైతులకు నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో రాజీపడబోమని పేర్కొన్నారు. -
వివాదాల వర్సిటీ!
సంపాదకీయం: మనకు ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు లేవనీ, మన చదువులు సమాజం గురించి ఆలోచించగల మేథస్సులను రూపొందించడం మాట అటుంచి...కనీసం పొట్టనింపడానికి పనికొచ్చే జ్ఞానాన్ని కూడా అందించలేకపోతున్నాయని అందరూ వాపోతుంటే హస్తినలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వేదికగా నాలుగైదు రోజులనుంచి పెద్ద ప్రహసనం సాగుతున్నది. ఒకరేమో విశ్వవిద్యాలయానికి ఉండగల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న హీరోగా కనబడుతుంటే మరొకరు ఆ స్వయంప్రతిపత్తిని కబళించబోతున్న దుష్టపాత్రలా దర్శనమిస్తున్నారు. విషాదమేమంటే...కనిపిస్తున్న ఈ రెండు పాత్రలూ నిజమైనవి కాదు. ఆ పాత్రల మధ్య సాగుతున్న పోరాటమూ వాళ్లు చెబుతున్న విలువలకు సంబంధించినది కాదు. దేశంలో మనకున్న అతి కొద్ది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి. ఆ యూనివర్సిటీ ఏడాదిక్రితం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న వివాదానికి కేంద్ర బిందువు. ఆ కోర్సుపై అప్పట్లోనే నిరసనలు వెల్లువెత్తాయి. దాన్ని ప్రవేశపెట్ట వద్దంటూ ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు మాత్రమే కాదు...విద్యా రంగ నిపుణులు సైతం ఇది సరైన నిర్ణయం కాదని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్ల కోర్సులో చివరి సంవత్సరం ఉపాధితో ముడిపడి ఉండే ఐటీ, డాటా అనాలిసిస్ వంటి 12 రకాల కోర్సుల్లో దేనిలోనైనా ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుకల్పిస్తారు. అమెరికావంటి దేశాల్లో అమల్లో ఉంటున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో దేశమంతటా పెట్టాలన్నది అప్పటి యూపీఏ సర్కారు ఆలోచన. జాతీయస్థాయిలో అమలవుతున్న 10+2+3 విద్యావిధానానికి భిన్నంగా ఢిల్లీ వర్సిటీలో దీన్ని ఎలా ప్రారంభిస్తారన్నది విద్యార్థి సంఘాల, విద్యావేత్తల అభిప్రాయం. కేవలం అమెరికా యూనివర్సిటీల వ్యాపారానికి పనికొచ్చేవిధంగా దీన్ని రుద్దుతున్నారని, పేద విద్యార్థులకు దీనివల్ల అదనపు భారం తప్ప ప్రయోజనం ఉండదని వారి వాదన. ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలిలోగానీ, పిల్లలకు చదువు చెబుతున్న అధ్యాపకులతో గానీ చర్చించ కుండా వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ యూనివర్సిటీ పరిధిలో ఉండే దాదాపు 70 కళాశాలల్లో ఆ కోర్సును ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆశీస్సులతో, ఆయన సలహాతో ఇదంతా జరిగిపోయిందని అందరికీ తెలుసు. ఆయన ఆశీస్సులు ఉండబట్టే విద్యార్థిలోకంనుంచి వెల్లువెత్తిన నిరసనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్పుడు పట్టించుకోలేదు. పైగా విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఎలాంటి కోర్సులను ఉంచాలో తొలగించాలో దాని ఇష్టమని, అందులో తాము జోక్యం చేసుకోబోమని అన్నది. ఢిల్లీ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థ స్వతంత్రతకు ఆటంకం కల్పించే పాపానికి తాము ఒడిగట్టబోమని గంభీరమైన పలుకులు పలికింది. యూజీసీ పాలకమండలి సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తబోయిన యోగేంద్ర యాదవ్, ఎంఎం అన్సారీ వంటివారిని బేఖాతరు చేసింది. సరే... ఆ కోర్సు మొదలై ఏడాది దాటిపోయింది. ఈ విద్యా సంవత్సరం కూడా అడ్మిషన్లు మొదలుకావలసి ఉన్న తరుణంలో హఠాత్తుగా యూజీసీకి జ్ఞానోదయమైంది. ఆ కోర్సును రద్దుచేసి అంతకు ముందున్న మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలని ఢిల్లీ యూనివర్సిటీకి హుకుం జారీచేసింది. పర్యవసానంగా రెండురోజుల క్రితం ప్రారంభించాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయింది. 2 లక్షల 70వేలమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఆ కోర్సుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వీధికెక్కారు. తాము యూజీసీ హుకుంనే అంగీకరిస్తున్నట్టు 57 కళాశాలలు ప్రకటించాయి. అంతక్రితం స్వయంప్రతిపత్తిలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన యూజీసీకి ఇప్పుడేమైంది? నిరుడు యోగేంద్రయాదవ్, అన్సారీ వంటివారు చెప్పిన అభ్యంతరాలనే ఇప్పుడు తానూ వల్లిస్తున్నది ఎందుకని? కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మారి ఎన్డీయే సర్కారు వచ్చేసరికి కొత్త వైఖరి ఎందుకు తీసుకున్నది? తనకంటూ సొంత వ్యక్తిత్వమూ, అభిప్రాయాలూ ఉండవా? విద్యారంగ నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఉన్నత శ్రేణి నిపుణులనూ, మేథావులనూ తయారుచేయాల్సిన విశ్వవిద్యాలయాలపై అజ్మాయిషీ చేసే యూజీసీ ఇంతటి బలహీన స్థితిలో మనుగడ సాగిస్తున్నదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎంతో చరిత్రగల ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమస్యతో ఇప్పుడు నవ్వులపాలవుతున్నది. పాలకమండలిని సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న దినేష్సింగ్కు యూజీసీ తాజా హుకుంలో అప్రజాస్వామికత కనిపిస్తున్నది. యూజీసీకేమో వర్సిటీ నిర్ణయంలో ఇంతకుమునుపు గమనించని లొసుగులు కనబడుతున్నాయి. ఒకపక్క నాలుగేళ్ల కోర్సులో చేరిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగటిల్లుతుంటే...మొత్తం అడ్మిషన్ల వ్యవహారం తాజా వివాదంతో ఎటుపోతుందోనని కొత్త విద్యార్థులు ఆందోళనపడుతుంటే వైస్ చాన్సలర్ రాజీనామా చేశారన్న వదంతులు వ్యాపించాయి. ఆయన తనంత తాను బయటికొచ్చి యూజీసీ నిరంకుశత్వానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెబితే అందరూ ఆ నిర్ణయాన్ని హర్షించేవారు. ఎందుకంటే... నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకించినవారు సైతం యూజీసీ ఇలా ప్రభుత్వాలకు తోకగా మారి అభిప్రాయాలు మార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ప్రమాదకర పర్యవసానాలకు దారితీసినా తీయొచ్చని భయపడుతున్నారు. విజ్ఞానకేంద్రాలుగా ప్రకాశించవలసిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు ఇలా రాజకీయ వివాదంలో కూరుకుపోవడం విచారకరమైన పరిణామం. -
గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య
రాష్ట్రాల గవర్నర్ల నియామకం రాజకీయపరమైనదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్ఫష్టం చేశారు. రాజకీయ వ్యవస్థ మారినప్పుడు గవర్నర్లు మారుతుంటారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయిన ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన వివరించారు. రైల్వే ఛార్జీల పెంపు, సోషల్ మీడియాలో హిందీ భాష వాడాలని యూపీఏ సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. మా వల్లే ధరలు పెరిగాయంటూ యూపీఏ ప్రభుత్వం హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. -
యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ
ఒంగోలు కలెక్టరేట్ : యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ సర్కార్ పయనిస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని చెప్పిన వారం రోజులకే దేశ ప్రజలపై రైల్వే చార్జీల రూపంలో అదనపు భారం మోపారని ధ్వజమెత్తారు. సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం స్థానిక కాపు కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పూనాటి ఆంజనేయులు నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ ధరలు పెంచారంటూ కాంగ్రెస్ను విమర్శించిన బీజేపీ.. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రైల్వే చార్జీలు భారీగా పెంచి కాంగ్రెసుకు తమకు తేడా లేదని నిరూపించిందన్నారు. తాము అధికారంలోకి రావడం ద్వారా దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని దేశ ప్రజలను నమ్మించిన బీజేపీ ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. వందశాతం ఎఫ్డీఐలను రైల్వే రంగంలోకి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోదన్నారు.రానున్న రోజుల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలపై మరిన్ని భారాలు మోపేందుకు కసరత్తు చేస్తోందన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు, హిందూత్వ పరిరక్షణ ధ్యేయంగా నరేంద్రమోడీ పాలన సాగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని రాఘవులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముప్పరాజు కోటయ్య, ఎన్.ప్రభుదాస్, జీవీ కొండారెడ్డి, ఎస్డీ హనీఫ్లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం తీర్మానించింది. ఉపాధి హామీతో పాటు ఇతర పథకాలను ఎలాంటి సవరణలు చేయకుండా అమలు చేయాలని ప్లీనరీ కోరింది. బె ల్టుషాపుల ఎత్తివేత కలే రాష్ట్రంలో బెల్టుషాపుల తొలగింపు కలేనని బీవీ రాఘవులు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు తొలగిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదని విమర్శించారు. పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా బెల్ట్ షాపులను తొలగించవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయమై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని రాఘవులు సూచించారు. ఇప్పటికే విజయవాడ - గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు రావడంతో రియల్ ఎస్టేట్పై ఆధారపడినవారు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంకు ఎదురైన ఓటమిపై జిల్లాల వారీగా విశ్లేషించుకోనున్నట్లు వెల్లడించారు. జూలై 19, 20, ఆగస్టు 8, 10తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో పార్టీ పనితీరు గురించి సమీక్ష జరుగుతుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు. -
వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి: వెంకయ్య
సాక్షి, బెంగళూరు: రాజకీయ నియామకాల్లో భాగంగా గవర్నర్లు అయిన వారందరూ వ్యవస్థ ప్రయోజనాలరీత్యా పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హితవు పలికారు. అది వారికే హుందాగా ఉంటుందని సూచించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మెట్రో రైలు పనులను సమీక్షించాక విలేకరులతో మాట్లాడుతూ ‘గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాకు మా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందనడం సత్యదూరం. అలా రాజీనామా చేయని వారిపై వివిధ కేసులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేయించనున్నామని వెలువడుతున్న వార్తల్లో కూడా నిజం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది’ అని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి: ప్రకాశ్ జవదేకర్ కొచ్చి: రాష్ట్రాల గవర్నర్ల మార్పు విషయంలో తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే అదే సమయంలో గవర్నర్లు, ఇతర రాజకీయ కారణాలతో నియమితులైన వారు వారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. -
ఎదురు తిరిగిన గవర్నర్లకు పొగ!
పలు కేసుల్లో సీబీఐ విచారణకు అనుమతించాలని యోచన న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు పదవి నుంచి వైదొలగేందుకు ససేమిరా అంటుండటంతో కేంద్రం వారిని సాగనంపేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. రాజకీయ పలుకుబడిగల లేదా పదవీకాలం తొలినాళ్లలో ఉన్న గవర్నర్ల తొలగింపే మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల కొందరు గవర్నర్లను రాజకీయ ప్రాధాన్యతగల రాష్ట్రాలు లేక పెద్ద రాష్ట్రాల నుంచి అప్రాధాన్య రాష్ట్రాలకు బదిలీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల వారంతట వారే తప్పుకునేలా చేయొచ్చని కేంద్రం భావిస్తోందని వివరించాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, గోవా గవర్నర్ వాంచూలను సాక్షులుగా సీబీఐ ప్రశ్నించేందుకు అనుమతించాలన్న ఆలోచనను అమలుచేయడం గురించి కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ గవర్నర్గా ఉన్న షీలాదీక్షిత్ను సైతం 2010 నాటి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అవకతవకలపై ప్రశ్నించేలా ఇదే రకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. కాగా, గవర్నర్ల మార్పుపై కేంద్రం తీరును తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తలను నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ ఖండించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ రాజీనామా: ఛత్తీస్గఢ్ గవర్నర్ శేఖర్ దత్ తన పదవికి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాల్సిందిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శేఖర్ దత్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. -
రాజీనామాకు గవర్నర్లు ససేమిరా
* తగిన సంస్థ కోరితేనే ఆలోచిస్తానన్న మహారాష్ట్ర గవర్నర్ * కేంద్రంపై కర్ణాటక, నాగాలాండ్ గవర్నర్ల మండిపాటు న్యూఢిల్లీ/ముంబై: రాజీనామా చేయాలని కేంద్రం తమపై తెస్తున్న ఒత్తిడిని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ సహా పలువురు గవర్నర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరిని పదవులను నుంచి తప్పుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరడం తెలిసిందే. అయితే కేంద్రం ఒత్తిడి పెంచుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తగిన నిర్ణయాత్మక సంస్థ కోరితేనే రాజీనామా అంశాన్ని పరిశీలిస్తానని శంకరనారాయణన్ బుధవారం ఓ టీవీ చానల్తో అన్నారు. అనిల్ గోస్వామి గత వారం తనతో రెండు సార్లు మాట్లాడారని, తాను జవాబు చెప్పలేదని వెల్లడించారు. ‘గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి. ఆయన రాష్ట్రపతి ప్రతినిధి.. పదవి నుంచి తప్పుకోవాలని బాధ్యతాయుత వ్యక్తులెవరూ నన్ను రాతపూర్వకంగా అడగలేదు’ అని చెప్పారు. రాజీనామా చేస్తారని భావిస్తున్న నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ కేంద్రం యత్నాన్ని రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తనకిష్టమైన వారే గవర్నర్లుగా ఉండాలని కోరుకుంటోందా అని ప్రశ్నించారు. తన రాజీనామా అంశాన్ని కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తోసిపుచ్చారు. ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు రాజీనామా చేయరు. తమ స్థానంలో కొత్తవారు వచ్చేంతవరకు పదవుల్లో కొనసాగుతారు. ఈ విషయంలో బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు?’ అని మండిపడ్డారు. భరద్వాజ్ బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుసుకుని రాజీనామాలోని సమస్యల గురించి మాట్లాడారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. కాగా, తాను రాజీనామా చేయలేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ స్పష్టం చేశారు. -
మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
{పకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు 2,135 ఎకరాల భూసేకరణ కోసం కసరత్తు పోర్టుకు కేంద్రం సానుకూలత ఒంగోలు: రామాయపట్నం పోర్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రాగా, వాటిని రద్దుచేసి దీనికి బదులుగా దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి గత యూపీఏ ప్రభుత్వం 2013 మే 9న ప్రతిపాదనలు మార్చింది. అయితే అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ పోర్టు నిర్మాణానికి పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోర్టు నిర్మాణం వల్ల అక్కడి విదేశీ పక్షుల విడిది, పులికాట్ సరస్సు కలుషితమవుతాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. 40 వేల మంది జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దుగ్గరాజుపట్నం పోర్టును భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా వ్యతిరేకిస్తోంది. దీంతో రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధన సమితి కూడా ఏర్పడింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన కేంద్ర బృందం రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా నుంచి పొగాకు, గ్రానైట్, ఉప్పు, పత్తి, జీడిపప్పు లాంటి వస్తువులు జిల్లా నుంచి ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. పోర్టు నిర్మించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశీలనా బృందం నెల రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. పోర్టు నిర్మాణానికి గతంలో 5 వేల ఎకరాలు కావాల్సి ఉంటుందన్న ప్రతిపాదనను మారుస్తూ, 2,135 ఎకరాల స్థలంలోనే పోర్టు నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇందులో 1,200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంది. దీనికిగాను గత ప్రభుత్వం రూ.420 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది కాలనీలను తొలగించాలి. ఇందులో నివసిస్తున్న 2,200 మందికి ప్రత్యామ్నాయం చూపించాలి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవుతుందని అంచనా. రోజూ 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆరు బెర్తులతో నిర్మాణం చేపట్టి, ఫిషింగ్ హార్బర్ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా, దుగ్గరాజుపట్నం పోర్టు అవసరం అక్కడ ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టడం వల్ల సరుకుల రవాణా కూడా సులభతరమవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై రామాయపట్నం పోర్టు సాధన సమితి సభ్యులు త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలవనున్నారు. కాకతీయుల కాలంలోనే పోర్టు ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలంలోనే పోర్టు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. చిన గంజాం సమీపంలోని మోటుపల్లి వద్ద ఆనాటి ఓడరేవు శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అప్పట్లో మోసలపురంగా పిలిచే ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపుగా ఉండటంతో ఓడలు ఆగడానికి వీలుగా ఉందని ఈ ప్రాంతాన్ని ఓడరేవుగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈ ప్రాంతంలో పర్యటించినట్లు మెకంజీ తన పరిశోధనా గ్రంథంలో ఉటంకించారు. ఆయనతో పాటు పలువురు గ్రీకు నావికులు కూడా ఈ ఓడరేవు గురించి పేర్కొన్నారు. ఇక్కడ ఓడరేవుకు గుర్తుగా మూడు ఆలయాలను కూడా నిర్మించారట. ప్రస్తుతం వీరభద్రస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేపట్టేందుకుగాను స్థల సేకరణ చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భావించారు. అయితే ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు కనుమరుగైంది. రామాయపట్నంలో కానీ, మోటుపల్లిలో కానీ ఓడరేవు నిర్మాణం చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
సమష్టిగా పనిచేయండి: మోడీ
కేబినెట్ భేటీలో సహచరులకు ఉద్బోధ సుపరిపాలనకు కృషి చేయండి 45 మంది మంత్రులతో ప్రధాని మోడీ సుదీర్ఘ భేటీ న్యూఢిల్లీ: దేశాభివృద్ధి కోసం మంత్రులందరూ ఐకమత్యంగా సమష్టిగా పనిచేయాలని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులకు ఉద్భోదించారు. ప్రధాని సోమవారం తన మంత్రివర్గంలోని 45 మంది మంత్రులతో అధికారిక నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పథకాల అమలులో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులను కలుపుకుని పనిచేయాలని.. సుపరిపాలన అందించేందుకు, చేపట్టిన పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేసేందుకు.. ఆ పనుల ప్రయోజనాలు ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. ప్రభుత్వ పదవుల్లో మంచి వాళ్లను నియమించాలని.. తమ తమ బంధువులను కాదని మోడీ తన మంత్రివర్గ సహచరులతో పేర్కొన్నట్లు తెలిసింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ఆర్థికవ్యవస్థకు ఉత్తేజాన్నివ్వటం ఎలా? మరిన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించటం ఎలా? మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం ఎలా? అనే అంశాలపై మోడీ తన ఆలోచనలను మంత్రివర్గ సహచరులకు వివరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రధానంగా.. మోడీ నిర్దేశించిన వంద రోజుల అజెండాపై చర్చ కేంద్రీకృతమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా పాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సూచనలు అందించాలని మోడీ కోరినట్లు తెలిసింది. అలాగే.. ఇంతకుముందలి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల ప్రగతి నివేదికలను రూపొందించాలని కూడా మంత్రులకు ప్రధాని నిర్దేశించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. మంత్రులందరినీ, ఆయా శాఖల కార్యదర్శులను తాను ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తుంటానని మోడీ చెప్పినట్లు తెలిపాయి. ప్రధాని మంగళవారం నాడు ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు. -
‘370’ వివాదం!
సంపాదకీయం: దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకమైనదని అందరూ భావిస్తున్న కాశ్మీర్ విషయంలో మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజే వ్యాఖ్యానించి ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్ పెద్ద తేనెతుట్టెను కదిపారు. జమ్మూ-కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దుచేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన ప్రకటన సారాంశం. ఆ అధికరణపై బీజేపీకున్న అభిప్రాయమేమిటో ఎవరికీ తెలియనిది కాదు. ఆ అభిప్రాయాన్ని కాంగ్రెస్వంటి పార్టీలు మాత్రమే కాదు...ఆ పార్టీతో ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన పార్టీలు సైతం గతంలో వ్యతిరేకించాయి. మరికొన్ని అంశాలతోపాటు 370 జోలికెళ్లబోమని హామీ ఇచ్చాకే ఆ పార్టీలు ఎన్డీఏలో చేరడానికి అంగీకరించాయి. అంతమాత్రంచేత బీజేపీ ఆ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. అయితే, 370 గురించి గతంలో బీజేపీ మాట్లాడినదానికీ, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదలచేసిన మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచిన అంశాలకూ మధ్య వ్యత్యాసముంది. తమకు సొంతంగా మెజారిటీ వస్తే ఆ అధికరణను రద్దు చేస్తామని గతంలో చెప్పిన బీజేపీ...అందుకోసం సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని ఈసారి చెప్పింది. 370వ అధికరణ ఏ చారిత్రక సందర్భంలో రాజ్యాంగంలో వచ్చి చేరింది, దాన్ని రద్దు చేస్తే కలిగే పరిణామాలేమిటన్న అంశాలను పక్కనబెడితే... వివాదాస్పదం అనుకున్న ఏ అంశంపైన అయినా అందరితో చర్చించాలనుకోవడం, వారిని ఒప్పించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలనుకోవడం హర్షించదగిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడింది కూడా దానికి భిన్నమైనది కాదు. అయితే, ఇలాంటి చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన చెబుతున్నారు. సరిగ్గా నెలక్రితం కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. నరేంద్ర మోడీ తన వద్దకు ఇద్దరు దూతలను పంపారని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహకరించమని కోరారని ఆయన చెప్పారు. ఈ విషయంలో మోడీతో నేరుగా మాట్లాడే ఏర్పాటుచేస్తామని ఆ దూతలు చెప్పినట్టు వెల్లడించారు. హురియత్ నేతలను కూడా ఆ దూతలు కలిశారని, తాను మాత్రమే మోడీతో చర్చించేందుకు నిరాకరించానని కూడా గిలానీ చెప్పారు. ఇందులో నిజం లేదని హురియత్ నేతలనగా, తాము ఎవరినీ దూతలుగా పంపలేదని బీజేపీ తోసిపుచ్చింది. ఆ వచ్చినవారి పేర్లు బయటపెట్టాలని కూడా సవాల్ చేసింది. మరి ఇప్పుడు మంత్రిగారు చెబుతున్నదేమిటి? సంబంధిత పక్షాలతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయనంటున్నారు. ఆ ‘సంబంధిత పక్షాలు’ ఎవరో వెల్లడిస్తే విషయం మరింత స్పష్టంగా ఉండేది. జమ్మూ-కాశ్మీర్లో పాలకపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్, విపక్షమైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)వంటివి తమతో ఎవరూ చర్చించలేదంటున్నాయి. తాను మాట్లాడలేదని గిలానీ అంటే...తమనూ ఎవరూ కలవలేదని హురియత్ నేతలు చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంప్రదిస్తున్న నేతలెవరు? జితేంద్రసింగ్ వివరణ ఇస్తే తప్ప ఈ సంగతి తె లిసే అవకాశం లేదు. రాజ్యాంగ సభ చర్చించి చేర్చిన 370వ అధికరణ వెనక పెద్ద చరిత్రే ఉన్నది. జమ్మూ-కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ 1947లో ఆ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ అధికరణ వచ్చిచేరింది. దీనికింద విదేశీ వ్యవహారాలు, ఆర్ధికం, కమ్యూనికేషన్లు, రక్షణ వంటివి మినహా మిగిలిన అంశాల్లో జమ్మూ- కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప కేంద్రం చేసే చట్టాలేవీ ఆ రాష్ట్రానికి వర్తించవు. అందువల్ల జమ్మూ-కాశ్మీర్కు పౌరసత్వం, ఆస్తిహక్కు వంటి అంశాల్లో సొంత చట్టాలున్నాయి. పర్యవసానంగా బయటివారు అక్కడ ఆస్తులు సమకూర్చుకోవడం సాధ్యంకాదు. రాజ్యాంగ సభ అవసరంలేదని భావిస్తే తప్ప 370ను రద్దుచేయడం సాధ్యంకాదని అదే అధికరణలోని మూడో క్లాజు చెబుతోంది. అసలు రాజ్యాంగ సభే 1957లో రద్దయింది గనుక అలాంటిదే మరో సభ ఏర్పడి దీన్ని కాదంటే తప్ప రద్దుచేయడం అసాధ్యమని కొందరి వాదన. అయితే, ఇందుకు భిన్నంగా...రాజ్యాంగంలో ఏమి ఉన్నా వాటిని రద్దుచేసే/సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని 368వ అధికరణ చెబుతున్నది. ఇందులో చివరకు చెల్లుబాటయ్యేది ఏమిటన్న సంగతి అలా ఉంచితే రాజ్యాంగాన్ని సవరించడానికి సభలో మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం. లోక్సభలోగానీ, రాజ్యసభలోగానీ ప్రస్తుతానికైతే అలాంటి మెజారిటీ ఎన్డీఏకు లేదు. కనుక 370 అధికరణ రద్దు ఇప్పటికిప్పుడైతే అసాధ్యం. పైగా ఈ అధికరణ గురించి ఆలోచించాల్సినంత అత్యవసర పరిస్థితులేవీ కాశ్మీర్లో ప్రస్తుతానికి లేవు. మరి కేంద్రమంత్రి అంత ఆదరాబాదరాగా, బాధ్యతలు చేపట్టిన వెంటనే దాన్ని గురించి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఒకపక్క యూపీఏ హయాంలో హరించిన రాష్ట్రాల హక్కులను పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా బీజేపీ చెప్పింది. ఇప్పుడు కాశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక హక్కుల్లో కొన్నింటిపై బీజేపీకి అభ్యంతరం ఉండొచ్చుగానీ వాటిల్లో చాలాభాగం ఇతర రాష్ట్రాలకు వర్తింపజేయవలసినవి ఉన్నాయని గుర్తించాలి. ఒక్క యూపీఏ పాలనలో మాత్రమేకాదు... ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి ‘ఉమ్మడి జాబితా’ క్రమేపీ చిక్కిపోతూ వస్తున్నది. కేంద్రం ఏదో సాకుతో ప్రతి రంగంలోనికీ చొరబడి రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది. దీన్ని సరిచేయవలసిన ప్రస్తుత తరుణంలో అందులో భాగంగా 370 అధికరణ గురించి కూడా చర్చిస్తే అందరూ స్వాగతిస్తారు. కేంద్రమంత్రి ఈ సంగతిని గుర్తించాలి. -
వ్యాపారుల సంబరం
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత్లోని రిటైల్ రంగంలోకి 51 శాతం ఎఫ్డీఐని గత యూపీఏ ప్రభుత్వం అనుమతించింది. ఎఫ్డీఐ వల్ల లెక్కలేనన్ని విదేశీ స్టోర్లు దేశంలో వెలుస్తాయి. రిటైల్ వ్యాపార రంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో విస్తరిస్తాయి. దీని వల్ల భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు వ్యాపారులు, రైతులు దారుణంగా నష్టపోతారు. మెగామార్ట్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ షాపులను తెరిచేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. చిల్లర వర్తకంలో విదేశీయులు ప్రవేశిస్తే తమ గతేంటని రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టారు. అన్ని వ్యాపార సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం వ్యాపార సంఘాల గోడును పట్టించుకోకుండా బ్రిటన్కు చెందిన టెస్కో కంపెనీకి చేసిన ఎఫ్డీఐ ప్రతిపాదనను ఆమోదించింది. చెన్నై అన్నానగర్లో మెగామార్ట్ స్థాపనకు రంగం సిద్ధమైంది. అంతలోనే ఎన్నికలు రావడం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ పతనం, మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఎఫ్డీఐలను అనుమతించబోమని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఎఫ్డీఐలను అనుమతిస్తే దేశంలోని చిల్లర వర్తకులు, చిన్నకారు రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల హామీకి అనుగుణంగా చేసిన ప్రకటన రాష్ట్రంలోని వ్యాపారుల్లో ఆనందాన్ని నింపింది. మల్టీబ్రాండ్ రిటైల్ రంగం మినహా ఉద్యోగాల కల్పన, ఆస్తుల సృష్టి, మౌలిక సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీ సమకూర్చుకునే రంగాల్లో ఎఫ్డీఐలను అనుమతిస్తామని మంత్రి పేర్కొనడం పట్ల తమిళనాడు వాణిజ్య, వ్యాపార సంఘం హర్షం వెలిబుచ్చింది. చెన్నై టీనగర్లోని కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ రాజా, ప్రధాన కార్యదర్శి మోహన్, ముగప్పేర్ వ్యాపార సంఘం అధ్యక్షులు సెల్లదురై మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్డీఐ నిర్ణయాన్ని నిరసిస్తూ గతంలో అనేక ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాల్సిందిగా తాము కేంద్రాన్ని కోరామని చెప్పారు. అయితే తమ ఆవేదనను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో ఘోర పరాజయం ద్వారా వ్యాపారులు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ తన తొలి అధికార ప్రకటనే ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా చేయడం కోట్లాదిమంది వ్యాపారస్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమలో కలిగిందని చెప్పారు. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
మోడీ భావోద్వేగ ఝరి!
సంపాదకీయం: కొందరి గురించి కొన్ని అభిప్రాయాలు బలంగా స్థిరపడిపోతాయి. అవి అంత సులభంగా మారవు. కానీ, మంగళవారం పార్లమెంటు సెం ట్రల్ హాల్లో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించినవారిలో చాలామంది ఒక కొత్త మోడీని... ఇన్నాళ్లూ తెలియని మోడీని చూసిన అనుభూతి చెందారు. ఆయనలో భావోద్వేగాలతో నిండిన మరో పార్శ్వం ఉన్న దని గమనించారు. ప్రసంగం వరకూ అక్కర్లేదు.... పార్లమెంటు భవ నం మెట్లెక్కే ముందు నుదురు తాకించి ఆయన అభివాదం చేసిన తీరే అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అంతేకాదు... తన వంటి సామాన్యుడు ప్రధాని కావడానికి వీలుకల్పించిన రాజ్యాంగ నిర్మాత లనూ, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలో వ్యవస్థలు వేళ్లూనుకో వడానికి దోహదం చేసిన పెద్దలనూ తన ప్రసంగంలో ఆయన స్మరిం చుకున్నారు. బొటాబొటీ సంఖ్యాబలంతో... మిత్రపక్షాల దయాదాక్షి ణ్యాలతో మనుగడ సాగించే పరిస్థితిని అధిగమించి సొంతంగానే ప్రభు త్వం నడపగల సత్తాను పొందిన తరుణంలో బీజేపీపైనా, మోడీపైనా అనేకులకు అనేక అనుమానాలున్నాయి. ఇలాంటి స్థితి ఆ పార్టీ ‘సొంత ఎజెండా’ అమలుకు దోహదం చేస్తుందేమోనన్న భయాలున్నాయి. అయితే, అవన్నీ నిరాధారమైనవని... తాము బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేస్తామని తెలియపరచడానికి తన మాటల ద్వారా, చేతలద్వారా మోడీ ప్రయత్నించారు. రాగలరోజుల్లో ఇవన్నీ ఆచరణాత్మకంగా కూడా కనిపిస్తాయన్న భరోసా కల్పించడానికి చూశా రు. ఒక పెద్ద యుద్ధాన్ని ఒంటిచేత్తో జయించి వచ్చిన ధీరుడిలా కాక వినమ్రంగా, సామాన్యంగా కనిపించడానికి ఆయన ప్రయత్నించారు. ఇన్నాళ్లూ అందరికీ కనబడిన నరేంద్ర మోడీ వేరు. 2002నాటి గుజరాత్ నరమేథంపై వచ్చిన విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉన్నా... ఎవరైనా ఒక మాటంటే పది మాటలతో జవాబు చెప్పే దూకుడు ప్రదర్శించినా, పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించినా ఆయన వ్యవహారశైలి వేరుగా ఉండేది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలన్నీ గమనించినవారికి అందులో ప్రత్యర్థులపట్ల నిర్దాక్షిణ్యత, కాఠిన్యమూ కనిపించాయి. ఆయనను హేళన చేయాలని, చిన్నబుచ్చాలని చూసినప్పుడల్లా...అలాంటి ప్రయత్నం చేసినవారిని తన మాటలతో మరుగుజ్జులుగా మార్చారు. చేతల విషయానికొచ్చినా అంతే. ఆయన గుజరాత్ను మరోసారి గెలుచుకొచ్చి ఢిల్లీ పీఠంపై మక్కువ ప్రదర్శించినప్పుడు పార్టీనుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే. అయినా పట్టు వీడలేదు. ఇక నిరుడు జూన్లో ఆయనను పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ప్రకటించినప్పుడు మొదలుకొని వారణాసిలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వరకూ మోడీకి పార్టీలో ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. ఒకపక్క వెలుపలి ప్రత్యర్థులతో పోరాడుతూనే పార్టీలో అంతర్గతంగా తనను వ్యతి రేకిస్తున్నవారిని దారికి తెచ్చుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్వంటివారితో ఘర్షణకు దిగకుండానే తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పరివార్ పెద్దల ఆశీస్సులు దండిగా ఉండబట్టే ఇదంతా సాధ్యమైందని చెప్పడం సులభమే. కానీ, రంగంలో ఉండి పోరాడవలసిన వ్యక్తిలో సమర్ధత కొరవడితే ఎవరైనా చేయగలిగిందేమీ ఉండదు. ఇందుకు కొంతకాలం క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నితిన్ గడ్కారీయే ఉదాహరణ. పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యాక ఆయన చేసిన ప్రసంగం విలక్షణమైనది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నేతలు చేసే ప్రసంగాలన్నీ ఒకేలా ఉంటాయి. ఆశలు రేకెత్తించడం, దేశం ముం దున్న సవాళ్లపై గంభీరమైన మాటలు చెప్పడం సర్వసాధారణం. కానీ మోడీ చేసింది వేరు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కదలాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో తాను నిర్దాక్షిణ్యంగా తెగనాడిన యూపీఏ ప్రభుత్వంతోసహా గతంలో పని చేసిన వివిధ ప్రభుత్వాల పాత్రను ప్రస్తావించి వాటివల్లనే దేశ ప్రగతి సాధ్యపడిందని ప్రస్తుతించారు. వారు అనుసరించిన మంచి పనులన్ని టినీ స్వీకరిస్తానని చెప్పారు. నరేంద్ర మోడీ నుంచి ఇలాంటి ప్రసం గాన్ని ఆయన ప్రత్యర్థులు సరే... అనుకూలురు సైతం ఊహించివుం డరు. మెజారిటీ ఒక్కటే సర్వస్వమని, అన్నిటినీ అదే నిర్ణయిస్తుందని భావించడం రాజకీయంగా తెలివిమాలినతనం అనిపించుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణధాతువు సంఖ్యాబలంలో కాదు...అందరినీ కలుపుకొని వెళ్లడంలో ఉంటుంది. 1984 ఎన్నికల్లో 415 స్థానాలను చేజి క్కించుకున్న రాజీవ్గాంధీ ఈ మౌలిక సూత్రాన్ని మరవబట్టే మూడేళ్లు తిరక్కుండా చిక్కుల్లోపడ్డారు. దీన్నుంచి ఏ గుణపాఠమూ గ్రహించలేని యూపీఏ సర్కారు వరసగా రెండోసారి అధికారం సంక్రమించాక కళ్లు నెత్తికెక్కి బొక్కబోర్లాపడింది. ఈసారి ఎన్నికల్లో కనీసం లోక్సభలో 10శాతం స్థానాలు కూడా సంపాదించుకోలేక ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. నరేంద్ర మోడీ ఈ ధర్మసూక్ష్మాన్ని చాలా చక్కగా గ్రహించారని ఆయన ప్రసంగం చెబుతోంది. అందరి సహకారమూ ఉంటేనే దేశ సమస్యల పరిష్కారం... ముఖ్యంగా తనపై నమ్మకం పెట్టు కుని ఉన్న కోట్లాదిమంది యువత ఆశలు నెరవేర్చడం సులభమ వుతుందని, దేశం మళ్లీ ప్రగతిబాట పట్టడం సాధ్యమవుతుందని మోడీ గ్రహించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆయన ప్రధాని పీఠం అధిష్టించబోతున్నారు. తాను చెప్పిన మాటలకు అనుగుణమైన చేతలను చూపగలిగితే దేశ చరిత్రలో నరేంద్రమోడీ విలక్షణ ప్రధానిగా నిలుస్తారనడంలో సందేహంలేదు. -
మోడీ విజయ సూత్రాలు
‘ఏకపార్టీ ప్రభుత్వాలకు ఇక కాలం చెల్లింది.. సంకీర్ణ రాజకీయాల శకమిది’ అన్న నమ్మకాన్ని బద్ధలు కొట్టి.. కాంగ్రెస్ తరువాత సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. మోడీ ప్రభంజనం ధాటికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షం కకావికలయింది. మోడీ విజయానికి కారణాలేంటి.. విశ్లేషణ..! * ఆర్థికరంగంపై దృష్టి: యూపీఏ పాలనలో ఆర్థికరంగం కుదేలయింది. 2013లో జీడీపీ 5% కన్నా తక్కువకు దిగజారింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరింది. మోడీ తన ప్రచారంలో దీనిపై దృష్టి పెట్టారు. గుజరాత్ అభివృద్ధి మోడల్ను చూపుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ఆర్థికరంగ పునరుజ్జీవనానికి పరిపాలనాదక్షుడు అవసరమని, మోడీలో ఆ దక్షత ఉందని నమ్మి కార్పొరేట్ రంగమంతా బీజేపీకి దన్నుగా నిలిచింది. * అవినీతిపై పోరు: పదేళ్ల యూపీఏ పాలనలో చోటు చేసుకున్న కుంభకోణాలను సమర్ధవంతంగా ప్రచారంలో ఉపయోగించుకున్నారు. వారి పాలనలో వనరుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించారు. అవినీతిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించిన మోడీ.. తన ప్రచారంలో అవినీతిపై పోరును ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో, వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ధనానికి చౌకీదారుగా వ్యవహరిస్తానన్నారు. * యువత: ఈ సారి యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 81 కోట్ల మంది ఓటర్లలో దాదాపు సగంమంది 35ఏళ్ల లోపువారే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ వారిని ఆకర్షించారు. అదీకాక, పదేళ్ల యూపీఏ పాలనపై వారంతా విసిగి వేసారి ఉన్నారు. * సాంకేతిక పరిజ్ఞానం: ప్రచారంలో ఇంటర్నెట్ను, 3డీ టెక్నాలజీ సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని మోడీ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ట్విటర్, ఫేస్బుక్ సహా సామాజిక వెబ్సైట్లలోనూ ప్రచారం చేశారు. అందుకు ప్రత్యేకంగా ఒక సాంకేతిక నిపుణుల బృందాన్నే నియమించారు. సెల్ఫీలు, ట్వీట్లతో నెటిజన్లను ఆకర్షించారు. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ప్రచార పద్ధతులనే వినియోగించింది. * మౌలిక వసతుల కల్పన: దేశంలో మౌలిక వసతుల లేమిని గుర్తించిన మోడీ.. ఆ దిశగానూ ప్రచారం చేశారు. రహదారులు, విద్యుత్,ఇతర మౌలిక వసతులు సమర్ధంగా కల్పించలేకపోవడం వల్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు మన దేశానికి రావడం లేదని, దానికి కారణం యూపీఏ పాలనేనని ప్రజల్లో ప్రచారం చేశారు. గుజరాత్లో తన నేతృత్వంలో కల్పించిన మౌలిక వసతులను వీలైన ప్రతీ సందర్భంలోనూ గుర్తుచేశారు. -
యూపీఏ నిర్ణయాలపై ఎన్డీఏ సమీక్ష: వెంకయ్య
హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎన్డీఏ ప్రభుత్వం సమీక్షిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత యూపీఏ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. వీటిని కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. -
కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది. భెల్లో 4.66 శాతం వాటా విక్రయంపై... విద్యుత్ పరికరాల సంస్థ భెల్లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఎన్నికలు ముగియగానే.. డీజిల్ ధర పెంపు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశ అలా ముగిసిందో.. లేదో, కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను అమాంతం పెంచేసింది. ప్రతిసారీ లీటరుకు 50 పైసల వంతునే పెంచుతుండగా, ఈసారి మాత్రం ఒకేసారి రూ. 1.09 చొప్పున పెంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచే పెరిగిన డీజిల్ ధరలు అమలులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి వ్యాట్, అమ్మకం పన్నులు ఇవన్నీ అదనం కాబట్టి రాష్ట్రాల్లోను, నగరాల్లోను కూడా ఈ ధరలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ పెంపు లీటర్కు రూ. 1.22 కాబోతోంది. ముంబైలో ఇన్నాళ్లూ లీటర్ డీజిల్ రూ. 63.86 మాత్రమే ఉండగా, ఇప్పుడది రూ. 65.21 అయ్యింది. ఎన్నికలకు ముందు ఏప్రిల్ 1, మే 1 తేదీల్లో ప్రతినెలా పెంచాల్సిన ధరలు పెంచలేదు. అసలే యూపీఏ పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉండటంతో.. డీజిల్ ధర పెంచితే మరింత ఇబ్బంది అవుతుందని ఆగిపోయారు. ఇప్పుడెటూ ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి ఇక నష్టం లేదని ఇప్పుడు పెంచేశారు. 2013 జనవరి నుంచి 14 విడతల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 8.33 పెరిగింది. అయితే పెట్రోలు ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. -
‘మోడీ నిఘా’పై కమిషన్!
' 16వ తేదీ కంటే ముందే జడ్జిని నియమిస్తామన్న కేంద్రం ' మళ్లీ తెరపైకి ‘మహిళపై అక్రమ నిఘా’ ' ఇది యూపీఏ దురహంకారానికి నిదర్శనమని బీజేపీ మండిపాటు ' తాము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని స్పష్టీకరణ సిమ్లా/న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు.. ‘స్నూప్గేట్’ ఉదంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. మహిళపై అక్రమ నిఘాకు సంబంధించిన ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్ను నియమిస్తామని ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టిందంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ లోక్సభకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే ఈనెల 16వ తేదీలోపే ఈ స్నూప్గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే శుక్రవారం ప్రకటించారు. ‘‘గుజరాత్లో ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టిన వ్యవహారంలో విచారణ కమిషన్ నియమించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే.. మే 16వ తేదీకి ముందుగానే ఈ కమిషన్కు జడ్జిని నియమిస్తాం’’ అని సిమ్లాలో విలేకరులకు తెలిపారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఇది కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అని విలేకరులు అడగ్గా.. రాదని జవాబిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి చాలా ముందుగానే ఈ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని షిండే వివరించారు. ‘ఓ మహిళపై గుజరాత్ సీఎం అక్రమంగా నిఘా పెట్టిన విధా నం చూసి చాలా ఆందోళనకు గురయ్యాను. ఒకవేళ ఆయన ప్రధాని అయితే ఈ దేశ మహిళల పరిస్థితి ఏమవుతుందో అని గాభరాపడ్డాను’ అని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందిం చిన బీజేపీ.. త్వరలో అధికారం కోల్పోనున్న యూపీఏ దురంహకారానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టింది. బీజేపీ నేతలకు ఆందోళన ఎందుకు: సిబల్ స్నూప్గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ వేస్తామని ప్రకటిస్తే, బీజేపీ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మోడీ ప్రమేయంపై తమ వద్ద తగిన ఆధారాలున్నాయని, ఒకసారి కమిషన్ ఏర్పాటైతే ఆయన్ను రక్షించడం ఎవరి వల్లా కాదనే విషయం తెలియడంతోనే బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మే 16కు ముందుగానే జడ్జిని నియమిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, జడ్జిని నియమించడం కోడ్ను ఉల్లంఘించడమే అన్న విపక్షాల వాదనను ఆయన కొట్టిపారేశారు. లోక్సభ ఎన్నికల కంటే చాలా ముందుగానే దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందున, ఇక్కడ కోడ్ ఉల్లంఘన ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్నూప్గేట్పై గుజరాత్ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఏమి చేస్తోందని సిబల్ ప్రశ్నించారు. అది అహంకారమే: బీజేపీ స్నూప్గేట్ ఉదంతంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న యూపీఏ నిర్ణయం.. దాని అహంకారానికి నిదర్శనమని బీజేపీ దుయ్యబట్టింది. ‘‘పది రోజుల తర్వాత గౌరవనీయులైన ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోనుంది. అందుకే వారి అహంకారం ఇలా ఎంక్వైరీ కమిషన్ల రూపంలో కనిపిస్తోంది. గతంలో చాలామంది న్యాయమూర్తులు ఇందులో భాగస్వామి కావడానికి నిరాకరించారు. కాంగ్రెస్ దురుద్దేశాల ముందు న్యాయవ్యవస్థ పవిత్రత, గౌరవం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదని భావిస్తున్నాను’’ అని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. దర్యాప్తునకు తాము భయపడబోమని, అయితే కమిషన్కు జడ్జిని నియమించే అంశంలో అధికార పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. స్నూప్గేట్పై యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వం సమీక్షిస్తుందని బీజేపీ సీని యర్ నేత అరుణ్జైట్లీ తెలిపారు. యూపీఏ సర్కారు చివరి నిమిషంలో తీసుకున్న ఆమోదయోగ్యం కాని లేదా దురుద్దేశపూరిత నిర్ణయాలను తనకు ఉన్న అధికారాల మేరకు సమీక్షించే హక్కు కొత్త ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ కమిషన్కు జడ్జిని నియమిస్తూ కేంద్రం ప్రకటన చేస్తే, ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేస్తామని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు. -
యూపీఏ చెదరదు
ఓడినా కలిసే ఉంటుంది:పవార్ ముంబై: లోక్సభ ఎన్నికల అనంతరం యూపీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఓటమి ఎదురైనా కూటమి మాత్రం చెక్కుచెదరబోదని, ఎదురుదెబ్బ తర్వాత కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా యూపీఏ 100 శాతం కలిసి ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అరుున పవార్ మంగళవారం పీటీఐతో అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంలో విఫలమైన పక్షంలో కాంగ్రెస్ ప్రియూం క వాద్రా వంటి కొత్త నేత కోసం అన్వేషణ కొనసాగిస్తుందని కూడా తాను భావించడం లేదని చెప్పారు. ‘కాంగ్రెస్ ఓ విచిత్రమైన పార్టీ. ఎదురు దెబ్బలు తింటుంది. అంతలోనే తిరిగి పుంజుకుంటుంది. అలాంటి పరిస్థితే (కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంటే) వస్తే అతని (రాహుల్) నేతృత్వంలో ఓ మంచి నేతల బృందం పని చేస్తుంది..’ అని అన్నారు. -
అది పూర్తిగా అనైతికం
న్యూఢిల్లీ: లోక్పాల్ నియామక ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. అవినీతి నిరోధక విభాగమైన లోక్పాల్ నియామక ప్రక్రియ పూర్తిగా రాజకీయ అక్రమమని, ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమని బీజేపీ నేత అరుణ్జైట్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియ చట్టపరంగా సందేహించాల్సిందేనన్నారు. అక్రమంగా తీసుకునే ఇటువంటి తొందరపాటు చర్యల వల్ల లోక్పాల్ ఏర్పడకముందే దాని విశ్వసనీయతకు విఘాతం కలుగుతుందన్నారు. యూపీఏ చర్యను తప్పుబడుతూ ఈ మేరకు జైట్లీ తన బ్లాగ్లో అభిప్రాయాలు వెల్లడించారు. ఈ నెల 27 లేదా 28న ప్రధాని లోక్పాల్ నియామక కమిటీని సమావేశపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సగం పూర్తయ్యాయి. మరో 26 రోజుల్లో ఫలితాలు రావడంతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారం నుంచి దిగిపోయే ముందు, హడావిడిగా యూపీఏ లోక్పాల్ నియామక ప్రక్రియ చేపట్టం సరైనదేనా? అని జైట్లీ ప్రశ్నించారు. ఇలాంటి అనైతిక చర్య లోక్పాల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దీన్ని చేపట్టడంపై ప్రధాని ఆత్మపరిశీలించుకోవాలని ఆయన సూచించారు. -
యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి ధీమాగా చెప్పారు. ఎన్నికల తరువాత తాను తిరిగి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి వస్తానన్నారు. గురువారం ఇందిరాభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి వీస్తోందన్నది మీడియా సృష్టేనని, ఎక్కడా ఆ ప్రభావం లేదన్నారు. సీమాంధ్రలో కేవలం చంద్రబాబు మాత్రమే మోడీ గాలి అంటూ భ్రమల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల తరువాత పరిస్థితులను అనుసరించి ఎవరెటు వెళ్తారో దాన్ని బట్టి మూడో ఫ్రంట్ ఉనికిలోకి వస్తుందన్నారు. దేశంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కు వస్తాయని, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. -
భివండీ నుదుట తెలుగు ‘రాత’
భివండీ, న్యూస్లైన్: భివండీ పట్టణంలో నివాసముంటున్న వివిధ భాషల ఓటర్లలో తెలుగు ప్రజలే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల దృష్టి తెలుగు వారి ఓటర్లపైనే ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుగువారిని ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. భివండీ లోక్సభ నియోజకవర్గంలో కుణబి సమాజ ఓటర్లు 3,15,315 మంది, ఆగ్రి, కోళి కులాల ఓట్లు 2,24,376, ఆదివాసుల ఓట్లు 2,41,302, ముస్లిం వర్గాల ఓట్లు 2,41,302, ఉత్తర భారతీయుల ఓట్లు 94,000, దక్షిణ భారతీయుల ఓట్లు 72,000, మరాఠా సమాజం ఓట్లు 1,69,416, ఇతరుల ఓట్లు 37,000 మొత్తం 13,94,711 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ కులాలకు సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంవల్ల అందులో కొంత శాతం ఓట్లు వారికే పోలయ్యి మిగతావి చీలిపోయే అవకాశముంది. కాని తెలుగు సమాజం నుంచి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల వీరంతా ఎవరికి ఓటువేసినా బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులందరూ వీరిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారి ఓట్లు కీలకం..... భివండీ తూర్పు, భివండీ పశ్చిమప్రాంతాల్లో సుమారు 70 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు అత్యంత కీలకం కావడంతో ప్రధా న పార్టీలైన బీజేపీ, ఎమ్మెన్నెస్ అభ్యర్థులు తెలుగు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ‘ప్రయత్నాలు’ చేస్తున్నారు. ‘ఆదర్శ’ వ్యక్తి రావాలి భివండీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసే నాయకుడు కావాలి, అదేవిధంగా భివండీ నుంచి ముంబై వరకు లోకల్ రైలు, రోడ్డు రవాణా సదుపాయలకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమల అభివృద్ధి కోసం కృషిచేసే వ్యక్తి కావాలి. ఎన్డీయేతోనే అభివృద్ధి 1999లో వాజ్పాయ్ ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమ ఆధునికీకరణకు రూ.25 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. యూపీఏ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. - సిరిపురం తిరుపతి (పద్మనగర్) ధరలు తగ్గించాలి ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెంవేసే నాయకుడు కావాలి. ముఖ్యంగా భివండీలో విద్యుత్ వినియోగదారులను దోచుకుంటున్న టోరంట్ కంపెనీని తరిమికొట్టే సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలి. - పాము మనోహర్-డాక్టర్ (మానససరోవర్) పరిశ్రమలను అభివృద్ధి చేయాలి భివండీ అభివృద్ది చెందాలంటే రవాణా సదుపాయాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీలు, వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఉన్నత విద్యకు పోరాడే నాయకుడు కావాలి. - కొండాబత్తుల మహేశ్- న్యాయవాది (మార్కండేయ నగర్) తెలుగోళ్ల బాగు చూడాలి పట్టణంలో మరమగ్గాల పరిశ్రమలో అత్యధికంగా తెలుగు ప్రజలే పనిచేస్తున్నారు. వారి ప్రయోజనాలు, ఇళ్లు, ఇతర పథకాల కోసం పోరాడే వాడు కావాలి, మరమగ్గాల ఆధునీకరణ, ప్రత్యేక సంక్షేమ పథకాలు, మహిళలకు విద్య, వైద్య, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు కల్పించే నాయకుడు కావాలి. - భిమనాధిని శివప్రసాద్ (పద్మనగర్) -
ఓటమికి బలిపశువు సిద్ధం
విశ్లేషణ 2009 వరకు యూపీఏ ప్రభుత్వం పనితీరు బావుందని అంతా అంగీకరిస్తారు. మన్మోహన్ సంక్షేమ వ్యయాలను నియంత్రించారు. డీఎంకేలాంటి ప్రాంతీయ పార్టీల ఆదేశాలకు విదేశాంగ విధానం లోబడకుండా ఉండేట్టు చూశారు. అ తర్వాతే కాంగ్రెస్కు కళ్లు నెత్తికెక్కాయి. ఆర్థిక వ్యవస్థ నెత్తురోడడం మొదలైంది. పది మంది సభ్యులు అనుభవం లేకున్నా మన్మోహన్ మంత్రివర్గ నిర్ణయా లను తోసి రాజన్నారు. అసాధ్యమైన డిమాండ్లను ముందుంచి, చట్టాలను చేయించారు, నిధులను మంజూరు చేయించారు. చాలా మంది మంత్రులు ఎన్ఏసీ సభ్యులను చాటుమాటుగా దుమ్మెత్తిపోశారు. కానీ సోనియా ముందు నోరు విప్పే ధైర్యం చేయలేదు. ఎన్ఏసీ సూచనలపై ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది ద్రవ్యోల్బణాన్ని సృష్టించింది. సోనియా తప్పులకు మన్మోహన్ బాధ్యులు! ఎన్ఏసీ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న మతకల్లోలాల వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. దానికి వివిధ సెక్షన్ల నుంచి విశాలమైన వ్యతిరేకత వచ్చింది. అలాంటి చట్టం అవసరమైతే ఆ పనిని న్యాయ నిపుణుల, సీనియర్ నేతల సలహాలతో చేయాల్సింది. అందుకు బదులుగా ఎన్ఏసీలోని ఔత్సాహిక ఎన్జీవోలు దాన్ని రూపొందించాయి. ఈఒక్క చర్యే మెజారిటీలో ఆందోళనను రేకెత్తించాయి. ఓటు బ్యాంకు రాజకీయాలుగా దాన్ని వారు పరిగణించారు. ఈ మతపరమైన కేంద్రీకరణకు మన్మోహన్ను ఏవిధంగానూ తప్పు పట్టడానికి వీల్లేదు. మన ఆర్థిక సమస్యలన్నింటికీ బహిర్గత అంశాలే కారణమని కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చెప్పింది. కానీ మన బడ్జెట్ వైకల్యపూరితంగా తయారైంది. 30 శాతం వార్షిక కోశ (ఆర్థిక) లోటుకు, ద్రవ్యోల్బణానికి దారి తీసింది. విపరీత ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనే రెండు అంశాలపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోనియా బలవంతం మీదనే మన్మోహన్ సంక్షేమ వ్యయాలకు భారీ నిధులను కుమ్మరించి భారీ బడ్జెట్ లోట్లను అనుమతిం చారు. ఆ సంక్షేమ పథకాలే నిరర్ధకంగానూ, విషతుల్యంగానూ పరిణమించి అధిక ధరలకు, నిరుద్యోగానికి కారణమయ్యాయి. గత మూడేళ్లుగా అన్నాహజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటా లను పెద్ద ఎత్తున నిర్వహించారు. వాటితో ఎలా వ్యవహరించాలో తెలియని సోనియా వారిని తిట్టిపోసి, వేధించమని మంత్రులను ఉసిగొల్పారు. వాళ్లింకా బలవంతులయ్యారు. చివరికి అవినీతిగ్రస్త ముద్రాంకితగా యూపీఏ ప్రభుత్వం నిలిచింది. విషాదమేమంటే చివరికి ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి ఒక సమస్యగా ముందుకు వచ్చింది. అందుకు కూడా మన్మోహన్ను ఎలా తప్పు పడతారు? 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడినప్పటి నుంచి ములాయంసింగ్తో మన్మోహన్కు మంచి సంబంధాలుండేవి. సోనియా.. ములాయం, అమర్సింగ్లను ఎప్పుడూ అవమానిస్తూ వచ్చారు. అత్యంత శక్తివంతురాలు, పెళుసు స్వభావి మమతా బెనర్జీతో సర్దుబాటు చేసుకుపోవడానికి మన్మోహన్ సిద్ధంగా ఉండేవారు. సోనియా చేజేతులారా ఇద్దరు రాజకీయమిత్రులను దూరంగా తరిమిపా రేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను తుడిచి పెట్టేసింది. దాదాపు రెండేళ్లపాటూ అది కేంద్ర ప్రభుత్వాన్ని చికాకుపెట్టింది. వివాదాస్పదమైన ఏపీ రాష్ట్ర విభజన నిర్ణయం పూర్తిగా సోనియాదే. విభజనతో తెలంగాణలో కాంగ్రెస్కు కనీసం 16 మంది ఎంపీలు లభిస్తారని ఆమె అంచనా వేశారు. రాష్ట్ర విభజన ఎత్తుగడ పారి వుంటే ఆ ఘనత ఆమెకు దక్కేదే. కానీ అది విఫలం కావడంతో ఆమె మౌనంగా ఉన్నారు. మంచి పాలనను అందించడానికి బదులుగా ఆమె అడ్డదారిని ఆశ్రయించారు. అందుకు తప్పు పట్టాల్సింది ఆమెను మాత్రమే. అవాస్తవిక అంచనాలతోనే తిప్పలు భారత ప్రజల సంగతి తనకు బాగా తెలుసని సోనియా నమ్మారు. నిత్యమూ నరేంద్రమోడీని తిట్టిపోస్తే చాలు ఆయన అంతు చూసేయొచ్చని ఆమె అనుకున్నారు. విరుద్ధ ఫలితం కలిగింది. ఆమె ఎంతగా తిట్టిపోస్తే మోడీ అంత బలవంతునిగా ముందుకొచ్చారు. దేశంలో చాలా మంది మోడీలా ఆలోచిస్తున్నారని, సోనియా మాటలు వినడానికి వారు సిద్ధంగా లేరని ఆమె గ్రహించలేదు. సోనియా ఆయనపై సీబీఐని ప్రయోగించాలని చూశారు. అది ఆమెకే బెడిసికొట్టింది. సోనియాయే స్వయంగా తనను ఓడించనున్న శత్రువును సృష్టించారు. భజనపరులు సోనియా అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్గాంధీలకు చెరుపు చేశారని ఆమెకు తెలుసు. కానీ కుమారుడ్ని ప్రధానిని చేయాలన్న కలలకు ఆమె బానిసయ్యారు. సోనియా, రాహుల్ తమ తప్పిదాలకు ఇతరులను తప్పు పడుతున్నారు. రేపటి ఓటమికి బలిపశువుగా మన్మోహన్ను సిద్ధం చేశారు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
టీఆర్ఎస్కు 20సీట్లకు మించవ్: కాకా
మంచిర్యాల, న్యూస్లైన్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 20కి మించి సీట్లు రావని కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పడం, దళితుడిని తెలంగాణకు తొలి సీఎంను చేస్తానని చెప్పి.. ఇప్పుడు సీఎం సీటు కోసం ఆరాటపడడంతో కేసీఆర్పై విశ్వసనీయత తగ్గిం దన్నారు. ఫలితంగా టీఆర్ఎస్కు సీట్లు తగ్గుతున్నాయని చెప్పారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, మోడీ ప్రభంజనం ఎక్కడా లేదన్నారు. -
యూపీఏ రిమోట్ కంట్రోల్: మోడీ
చిక్కబళాపూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూపీఏ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నడుస్తోందని అని విమర్శించారు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. కర్ణాటకలోని చిక్కబళాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టదని, మరి కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమవుతుందని మోడీ జోస్యం చెప్పారు. 'భారత్లో ఎలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు? బలహీన ప్రభుత్వమా? రిమోట్ కంట్రోల్తో పాలన సాగించే వారా? దేశ భవిష్యత్ను, వాగ్ధానాలను, దేశాన్ని విభజించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా' అంటూ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. కేంద్రంలో సుస్థిర, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీకే సాధ్యమని అన్నారు. -
ఆర్టీఐ పేదల కడుపు నింపిందా?
కాంగ్రెస్పై నరేంద్ర మోడీ ధ్వజం దీంతో ఎవరు బాగుపడ్డారో రాహుల్ గాంధీకే తెలియాలి అవినీతి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది బెంగళూరు/కాసరగోడ్ (కేరళ): కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి స్కామ్లలో కూరుకుపోయిందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతి, దోపిడీలు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం ఆ పార్టీ నేతల జేబులు నింపుకోడానికే పనికొచ్చిందని మండిపడ్డారు. మోడీ మంగళవారం కర్ణాటకలోని బాగలకోటే, కొప్పళ, మైసూరు, బెంగళూరుల్లో, కేర ళలోని కాసరగోడ్లో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) తెచ్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గొప్పగా చెబుతున్నారు. ఆ చట్టం నిరుపేదల కడుపు నింపిందా? యువతకు ఉపాధి కల్పించిందా? రైతులకు మేలు చేసిందా? విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చిందా? దాంతో ఎవరు బాగుపడ్డారో ఆయనకే తెలియాలి. జనం బొగ్గు లూటీ గురించి మాట్లాడితే ఆయన(రాహుల్) ఆర్టీఐని వాడుకోమంటారు. బొగ్గును ఎవరు కాజేశారో షహజాదా(రాహుల్) చెప్పాలి?’ అని అన్నారు. దేశంలో ఐటీ విప్లవం రాజీవ్ హయాంలో మొదలు కాలేదని, వాజ్పేయి హయాంలోనే ఆ విప్లవం వచ్చిందని అన్నారు. ఐటీ హబ్ అయిన బెంగళూరు యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ.. ‘బెంగళూరు యువతకు ఒక మాట చెబుతున్నా. మీ కలలను నా కలలుగా చేసుకుంటా. మీ ఆశయమే నా లక్ష్యం’ అని అన్నారు. బెంగళూరు దక్షిణ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఆధార్ ప్రాజెక్టు మాజీ అధిపతి నందన్ నీలేకనికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిందని, ఇంతకూ ఏ నేరం చేశారో ఆయన చెప్పాలని అన్నారు. తరాలు మారినా, నాయకులు మారినా కాంగ్రెస్ బుద్ధులు మారలేదని, ఆ పార్టీని శిక్షించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణలో సీట్ల కోసమే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిందని మోడీ విమర్శించారు. ‘ఎన్డీఏ హయాంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒప్పించి మూడు రాష్ట్రాలను విభజించాం. తెలంగాణవాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నా, సీమాంధ్రుల మనోభావాలను కూడా కాంగ్రెస్ గౌరవించి ఉండాల్సింది’ అని అన్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కుమ్మక్కు.. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక యూడీఎఫ్, సీపీఎం సారథ్యంలోని విపక్ష ఎల్డీఎఫ్లు ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని, ఒక దాని తప్పులపై ఒక టి మౌనం వహిస్తూ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని మోడీ విమర్శించారు. ‘ఎల్డీఎఫ్ ఎర్రజెండాలు పట్టుకుంటుంది. కాంగ్రెస్ బయటికి ఆకుపచ్చగా లోపల ఎర్రగా ఉండే పుచ్చకాయ’ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులకు స్వర్గధామమైన కేరళను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని విమర్శించారు. రక్షణ మంత్రి ఆంటోనీ హయాంలో దేశరక్షణ సామర్థ్యం దెబ్బతిందని, దీనికి ఆయన బదులివ్వాలని అన్నారు. ఆరు నూరైనా మోడీని మార్చం: రాజ్నాథ్ పుణే: రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు గుప్పించినా, ఎన్ని సూచనలు చేసినా బీజేపీ ప్రతిపాదిత ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విషయంలో నిర్ణయం మార్చుకునేది లేదని, రాజీపడే ప్రసక్తి కూడా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పుణేలో చెప్పారు. ఎన్నికల అనంతరం ఢిల్లీ గద్దెపై ఎన్డీయే కొలువుదీరితే పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి డిప్యూటి ప్రధాని పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాగా మోడీ ముస్లింలకు వ్యతిరేకి కాదని, మైనారిటీలకు రక్షకుడని బీజేపీ నేత రామ్ జెఠ్మలానీ కొనియాడారు. -
ఏ రాష్ట్రం... ఎవరి పక్షం?
‘‘కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత తక్కువగా సీట్లకు పరిమితమవుతుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన ఎన్డీఏకు ఈసారి కాస్త సానుకూల పరిస్థితి ఉంది.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది...’’ - వివిధ మీడియా సంస్థలు, రాజకీయ పండితులు, ఎన్నికల విశ్లేషకుల అంచనాలివీ. దశాబ్దంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై జనం అసంతృప్తితో పాటు ఆగ్రహంతో ఉన్నారు. యూపీఏ-2 హయాంలో వెల్లువెత్తిన కుంభకోణాలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస పరాజయాలు యూపీఏ ఓటమి ఖాయమనే అభిప్రాయానికి బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నిర్ణయాధికారం లేని ప్రధానిగా మన్మోహన్సింగ్ వ్యవహార శైలి కాంగ్రెస్కు శాపాలుగా మారాయంటున్నారు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతంలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు భారీ సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ఎన్డీఏకు వచ్చే సీట్లు నామ మాత్రమేనని, కాంగ్రెస్కు వచ్చే సీట్లలో మూడొంతులు దక్షిణాదిలోనే రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్ఎస్ వంటి ప్రాంతీయపార్టీలు దక్షిణాదిలో కూడా కాంగ్రెస్ బలం పెరగకుండా అడ్డుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేటి నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రధాన రాష్ట్రాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల విజయావకాశాలపై విహంగ వీక్షణం... ఊహకందని ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ సీట్లతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యుూపీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రెండేళ్లుగా అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ అసమర్థ పాలన, శాంతి, భద్రతల పరిరక్షణలో వైఫల్యం బీజేపీ వుళ్లీ పుంజుకోవడానికి ఉపకరించేలా కనిపిస్తున్నారుు. ముజఫర్నగర్ వుత ఘర్షణల దరిమిలా వుుస్లింలు ఎస్పీకి దూరవుయ్యూరు. మోడీ రాకతో మతపరంగా జరుగుతున్న సమీకరణలు బీజేపీకి లాభించేలా ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో 20 వరకూ సీట్లు సంపాదించిన కాంగ్రెస్ కేంద్రంలో యుూపీఏ పాలన ఫలితంగా మూడు, నాలుగు సీట్లకే పరిమితవుయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరకంగా పడే ముస్లింల ఓట్లు ఈసారి చీలిపోకుండా వారంతా కాంగ్రెస్కే ఓటెయ్యలన్న ఢిల్లీ జవూ మసీద్ షాహీ ఇమాం బుఖారీ ఇచ్చిన పిలుపు హస్తం పార్టీకి పెద్దగా మేలుచేయుకపోగా, బీజేపీ వైపు హిందూ ఓటర్లు మొగ్గేలా చేయవచ్చని కొందరి అంచనా. రాష్ట్రంలో బీఎస్పీకి ఈ పరిస్థితులు అనకూలించేలా లేవు. బీజేపీకి చాన్నాళ్ల తర్వాత ఇక్కడ 40 నుంచి 53 సీట్లు రావచ్చనీ, ఎస్పీ, బీఎస్పీలకు కలిపి 30 సీట్లు కూడా రావని కొన్ని సర్వేలు చెబుతున్నా.. బహుముఖ పోటీలుండే యుూపీలో ఈ సర్వేల ప్రకారం వాస్తవంగా ఫలితాలు ఎప్పుడూ రాలేదు. ఈసారీ ఇదే నిజమవుతుందని అంటున్నారు. వారణాసిలో మోడీ పోటీ, ఎస్పీ పాలనపై అసంతృప్తి, కాంగ్రెస్ డీలా పడడం బీజేపీకి అనుకూలించే అంశాలు. గుజరాత్: కోలుకోని కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి లోక్సభకు పోటీచేస్తున్న గుజరాత్లోని మొత్తం 26 స్థానాల్లో ఇక్కడి పాలకపక్షమైన బీజేపీ కిందటిసారి 15 సీట్లు గెల్చుకుంది. గుజరాత్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించడం, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెరిగింది. ప్రధాని అభ్యర్థి ఎంపికలో పార్టీ నాయకత్వపై దాదాపు తిరుగుబాటుకు సిద్ధమైన సీనియర్ నేత ఎల్కే అద్వానీ మళ్లీ గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ 20 నుంచి 23 సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి ఫిరాయించడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గె లిచే సీట్ల సంఖ్య ఐదుకు మించితే గొప్పే. ఆమ్ఆద్మీపార్టీ కూడా బరిలోకి దిగినా ఈ పార్టీకి ఐదారు శాతానికి మించి ఓట్లు పడకపోచ్చు. బీహార్: పొత్తు తెగినా.. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు బీహార్ వుుఖ్యవుంత్రి, జేడీయుూ నేత నితీశ్ కువూర్. వుుస్లింల బద్ధ శత్రువుగా వుుద్రపడిన మోడీని బీహార్లో ఎన్నికల ప్రచారానికి రాకుండా చేసి, రెండు వరుస విజయూలతో ఎనిమిదన్నరేళ్లుగా అధికారంలో ఉన్న నితీశ్ గొప్ప సాహసమే చేశారు. ఆర్జేడీ పాలనతో పోల్చితే వుంచి పాలన అందిస్తూ ఆర్థికాభివృద్ధిలో కొత్త రికార్డు నెలకొల్పారు నితీశ్. అరుుతే, బీజేపీతో పొత్తు తెంచుకున్నాక బలపడిన మోడీ ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయూరు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి రామ్విలాస్ పాశ్వాన్ నాయుకత్వంలోని ఎల్జేపీ బయుటపడి బీజేపీతో చేతులు కలపడం కాషాయు పార్టీ వురింత బలపడటానికి దారితీసింది. వుూడో కూటమిలోని సీపీఐతో వూత్రమే జేడీయుూకి పొత్తు ఉంది. ఆర్జేడీ నేత లాలూప్రసాద్ తన కుటుంబ సభ్యులకు టికెట్లు కేటారుుంచడంతో ఆయున పార్టీ నుంచి రామ్కృపాల్ యూదవ్ వంటి కీలక నేతలు, జేడీయుూ నాయుకులు కొందరు బీజేపీలో చేరడంతో ఎన్డీఏ విజయూవకాశాలు పెరిగారుు. రాష్ర్టంలో 11 శాతం జనాభా ఉన్న యూదవుల్లో వుూడోవంతు జనం, ఇతర బీసీ కులాలు కూడా బీజేపీ వైపు మొగ్గుతున్నాయుని వార్తలొస్తున్నారుు. అందుకే, వివిధ సర్వేలు మొత్తం 40 సీట్లలో వుూడొంతులు బీజేపీ-ఎల్జేపీ కూటమి ఖాతాలోనే పడతాయని జోస్యం చెబుతున్నారుు. కాని, యుూపీ వూదిరిగానే బహువుుఖ పోటీలున్న బీహార్లో సర్వేల అంచనాలు నిజమైన సందర్భాలు తక్కువ. అరుునా, బీజేపీ కూటమికే అత్యధిక స్థానాలు రావచ్చుగాని, జేడీయుూకు ఇవి అంచనా వేసున్నట్టుగా వురీ అన్ని తక్కువ సీట్లు రావు. రాజస్థాన్ : బీజేపీకి నల్లేరుపై నడకే డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థారుు విజయుం సాధించిన బీజేపీ, ఈ లోక్సభ ఎన్నికల్లో అంతేస్థారుులో ఘనవిజయుం సాధించి కొత్త రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన వసుంధర సర్కారుపై జనంలో అసంతృప్తి మొదలవడానికి కారణాలు లేవు. కొత్తగా గద్దెనెక్కిన ఏ ప్రభుత్వానికైనా ఏడాది లోపు జరిగే ఎన్నికల్లో విజయుమే దక్కుతుందనేది చరిత్ర చెబుతోంది. దీనికి తోడు మోడీ రాకతో సీనియుర్ నేత జశ్వంత్ సింగ్ తిరుగుబాటు చేసినా, బీజేపీ స్కోరు మొత్తం 25 సీట్లకుగాను 20 దాటితే ఈ పార్టీ అత్యధికంగా లబ్ధిపొందిన రాష్ట్రంగా నమోదవుతుంది. కేంద్రవుంత్రి సచిన్పైలట్ పీసీసీ పగ్గాలు చేపట్టడం కాంగ్రెస్కు సానుకూల పరిణావుమే. అరుుతే, ఫిరారుుంపులు, వుుఠా తగాదాలతో పార్టీ యుత్రాంగా బలహీనంగా ఉంది. మధ్యపద్రేశ్: కాంగ్రెస్కు వురో ఊబి గుజరాత్ తర్వాత బీజేపీ బలంగా వేళ్లూనుకున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. వుుఖ్యవుంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నాలుగు మాసాల కిందటే వుూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కిందటిసారి కంటే ఎక్కువ స్థానాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పదేళ్లు సీఎం కుర్చీలో కూర్చున్న దిగ్విజయ్సింగ్ కాంగ్రెస్ ఆఖరి సీఎంగా రికార్డు స్థాపించడంతోపాటు గ్రూపు కీచులాటలతో ఆత్మవినాశనం చేసుకునే వారసత్వాన్ని వదిలిపోయూరు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవసరం లేకుండా ఆయున కొన్ని నెలల కిందట రాజ్యసభకు పోవడం కాంగ్రెస్ దుస్థితికి అద్దంపడుతోంది. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన కేంద్రవుంత్రి జ్యోతిరాదిత్య సింధియూగాని, కొత్త పీసీసీ నేత అరుణ్ యూదవ్గాని పార్టీకి పట్టువుని పది సీట్లు గెలిపించే స్థితిలో లేరు. 2009లో 16 సీట్లలో విజయుం సాధించిన బీజేపీ బలం ఈసారి 24 వరకూ పెరగవచ్చని అంచనా. మొత్తం 29 సీట్లకుగాను 12 గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు నాలుగైదు సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఛత్తీస్గఢ్ పోటాపోటీ 2009 ఎన్నికల్లో మొత్తం 11కుగాను పది లోక్సభ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి విజయూవకాశాలు అదే స్థారుులో లేవనే చెప్పాలి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా నిండకున్నా బీజేపీ స్కోరు ఆరేడు సీట్లకు మించకపోవచ్చని తాజా సర్వేలు చెబుతున్నారుు. వుుఖ్యవుంత్రి రవుణ్సింగ్ అధికారం చేపట్టి పదేళ్లు దాటింది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పది సీట్లు వూత్రమే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల వుుందు దాదాపు కాంగ్రెస్ అగ్రనేతలందరూ వూవోరుుస్టుల దాడిలో వురణించడంతో కొన్ని ప్రాంతాల్లో జనం సానుభూతి కాంగ్రెస్కు కొంత అనుకూలించింది. అరుుతే, మోడీ ప్రభంజనం అనేది నిజంగా పనిచేస్తేనే వుళ్లీ పది సీట్లు బీజేపీలో ఖాతాలో పడతారుు. చేజారనున్న హర్యానా పది లోక్సభ సీట్ల కోసం హర్యానాలో నాలుగు పార్టీలు పోటీపడుతున్నారుు. ప్రస్తుత పాలకపక్షమైన కాంగ్రెస్ తొమ్మిదేళ్లుగా భూపీందర్సింగ్ హుడా నాయుకత్వంలో అధికారంలో ఉంది. అవినీతి, భూ కుంభకోణాలు, సోనియూ అల్లుడు రాబర్ట్ వాద్రాకు భూ కేటారుుంపులు రద్దుచేసిన ఐఏఎస్ అధికారి ఖేమ్కా వంటి అధికారులను వేధించడం-ఇవన్నీ కాంగ్రెస్ను జనానికి దూరం చేశాయి. మాజీ సీఎం భజన్లాల్ కుటుంబానికి చెందిన హర్యానా జనహిత్ కాంగ్రెస్(హెచ్జేసీ) ఈసారి బీజేపీతో పొత్తుపెట్టుకుని రెండు సీట్లలో పోటీ చేస్తోంది. 8 స్థానాల్లో పోటీపడుతున్న బీజేపీ తొలిసారి నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అరుుతే ఆప్ అధినేత కే జ్రీవాల్, మరో ముఖ్యనేత యోగేంద్ర యూదవ్ల సొంత రాష్ట్రం కావడంతో బహుముఖపోటీ తప్పడం లేదు. ఒడిశాలో ‘శంఖం’ సత్తా ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) గాలి వీస్తోంది. బీజేడీ నెయ్యాన్ని వదులుకున్నందుకు రాష్ట్రంలో బీజేపీ కోలుకోలేనంతగా నష్టపోయింది. 2009 ఎన్నికల్లో ఒక్క లోక్సభ స్థానాన్నయినా దక్కించుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఈసారి ‘నమో’జపం మార్మోగుతున్నా, ఒడిశాలో బీజేపీకి ఒక్క సీటైనా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తం 21 లోక్సభ స్థానాల్లో.. బీజేడీకి 17-18 స్థానాలు లభిస్తాయని అంచనా. మిగిలినవి కాంగ్రెస్ ఖాతాలో చేరతాయని సర్వేల్లో తేలింది. ఉత్కంఠ రేపుతున్న పంజాబ్ 13 సీట్లే ఉన్న పంజాబ్లో ఈసారి రెండు ప్రధాన రాజకీయ కూటముల మధ్య పోటీ హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది. అకాలీ వృద్ధనేత ప్రకాశ్సింగ్ బాదల్ నాయకత్వంలోని అకాలీ-బీజేపీ సంకీర్ణ సర్కారు 2007 నుంచి అధికారంలో కొనసాగడం విశేషం. రెండేళ్ల క్రితం జనం నుంచి వ్యతిరేకత పెద్దగా లేకుండా మళ్లీ అధికారం చేపట్టింది. దాదాపు ఏడేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ వైఫల్యాలు లేవు. పరిపాలన ఫర్వాలేదనే అభిప్రాయం జనంలో ఉంది. ఈ కారణంగా రెండు ప్రధాన పక్షాల్లో ఏది అత్యధిక సీట్లు గెలుచుకుంటుందో చెప్పటం కష్టం. కాంగ్రెస్కు ఏడు సీట్లు రావచ్చని కొందరు అంచనా వేస్తుండగా, అకాలీ-బీజేపీ కూటమికే అత్యధిక స్థానాలు దక్కుతాయని కొన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. సిక్కుల ప్రధాన కేంద్రం అమృత్సర్ నుంచి బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ, వూజీ కాంగ్రెస్ సీఎం అమరీందర్సింగ్ మధ్య జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోటీకి అమరీందర్ తొలుత వెనుకాడారంటేనే కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్: కమలానికే అనుకూలం ఐదు లోక్సభ స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్లో పరిస్థితి బీజేపీకే అనుకూలంగా ఉంది. గత ఏడాది వరదల సమయంలో జరిగిన జననష్టం, కాంగ్రెస్ సర్కారు వైఫల్యం, పార్టీలో ముఠా తగాదాల కారణంగా సీఎం మార్పు, మోడీ గాలి- ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా వూరేలా ఉన్నారుు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాక, బీఎస్పీ, ఇండిపెండెంట్ల సాయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విజయావకాశాలు చాలా తక్కువ. వూజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎంపీ సత్పాల్ మహరాజ్ బీజేపీలో చేరడమే దీనికి ఉదాహరణ. తమిళనాడు: అమ్మ హవా మూడేళ్ల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు జనాదరణ అదే స్థాయిలో కొనసాగుతోంది. రెండు ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకేలు ఏ జాతీయ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేస్తున్న ఎన్నికలివి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయడం, పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏకు విజయావకాశాలు లేవనే ప్రచారం, 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలు తమిళులే కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూడబోతోందని అంచనా వేస్తున్నారు. మొదట సీపీఎం, సీపీఐతో పొత్తుకు అవగాహన కుదుర్చుకున్న జయలలిత తర్వాత సీట్ల సంఖ్య విషయంలో తలెత్తిన విభేదాల వల్ల పొత్తు రద్దుచేసుకున్నారు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకే, సీనీహీరో విజయకాంత్ పార్టీ డీఎండీకే, పీఎంకే వంటి మూడు నాలుగు స్థానిక పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టుకుని పోటీకి దిగింది. డీఎంకే కూడా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టి ప్రయత్నమే చేస్తోంది. 39 సీట్లున్న తమిళనాడులో అన్నాడీఎంకేకు పాతిక వరకూ సీట్లొస్తాయని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పెరుగుతున్న ‘దీదీ’ బలం 2009 లోక్సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్... రాష్ట్రంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల పాలన తర్వాత అధికారం కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ మూడేళ్ల పాలన తర్వాత కూడా సీపీఎం ఏమాత్రం పుంజుకోలేకపోగా అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రజాదరణను సైతం కోల్పోయిందనివ ఇప్పటి వరకూ జరిగిన సర్వేలు, వివిధ సంస్థలు, రాజకీయ పండితుల అంచనాల్లో తేలింది. సీపీఎం కార్యకర్తలు, నేతలపై దాడులు, మమత నియంతృత్వ ధోరణి, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు-ఇవేవీ తృణమూల్ పురోగమనాన్ని ఆపలేకపోతున్నాయాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో తృణమూల్ కైవసం చేసుకున్న సీట్లు 19 కాగా, ఈసారి మరో పది సీట్లు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ బలం పెద్దగా తగ్గకపోవచ్చు. అయితే, వామపక్షాలకు దక్కే సీట్ల సంఖ్య మాత్రం మరింత దిగజారిపోచ్చని భావిస్తున్నారు. కిందటిసారి డార్జిలింగ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ ఆహ్లూవాలియా ఇదే స్థానం నుంచి స్థానిక గూర్ఖాలాండ్ పార్టీ మద్దతుతో పోటీచేస్తున్నారు. ఈ సీటు నిలబె ట్టుకోవడం బీజేపీకి అంత తేలిక కాదు. మహారాష్ర్ట: కాంగ్రెస్ కూటమికి కష్టకాలం యూపీ తర్వాత అత్యధిక లోక్సభ సీట్లున్న(48) మహారాష్ట్ర.. కాంగ్రెస్కు బలమైన పునాదులున్న ఏకైక రాష్ట్రమని చెప్పవచ్చు. అవినీతి కుంభకోణాలు, రైతుల ఆత్మహత్యలు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో కీచులాటలు ఈ ఎన్నికల్లో పాలకపక్షం విజయావకాశాలను దెబ్బదీసే అంశాలు. శివసేన చీలికవర్గమైన ఎంఎన్ఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులున్న సీట్లలో అభ్యర్థులను నిలపకపోవడం, మోడీ గాలి, బీజేపీ-శివసేన కూటమికి కలిసొచ్చే అంశాలు. ఆదర్శ్ కుంభకోణం ఫలితంగా సీఎం పదవి కోల్పోయిన అశోక్ చవాన్ వంటి నేతలకు కాంగ్రెస్ టికెట్లివ్వడం కూడా ఈ పార్టీకి నష్టదాయకమే. కాంగ్రెస్ సీఎం పృథ్వి రాజ్ చవాన్పై అవినీతి ఆరోపణలు లేకున్నా సర్కారుపై జనంలో అసంతృప్తి ఉంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఇప్పటి వరకూ ప్రకటించిన అన్ని ఎన్నికల సర్వేల ఫలితాలు కూడా బీజేపీ కూటమికి పాతిక సీట్లొస్తాయని వెల్లడించాయి. అసోం: గొగోయ్ ఆధిపత్యమే.. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నాయకత్వంలో దాదాపు 13 ఏళ్లక్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి అసోంలో తన ఆధిపత్యం ప్రదర్శించబోతోంది. కిందటేడాది బోడోలు నివసించే ప్రాంతాల్లో ముస్లింలకు వారికి మధ్య ఘర్షణలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రాంతీయ, జాతి విభేదాలు, ఉద్యమాలు ఇంకా చల్లారలేదు. అయినా, ఉన్నంతలో మెరుగైన పాలన అందిస్నున్నారనే పేరు గొగోయ్కి ఉంది. ముస్లింలు దాదాపు 40 శాతం ఉన్న ఈ రాష్ట్రంలో 2009ల్లో కాంగ్రెస్కు ఏడు, బీజేపీకి నాలుగు సీట్లు లభించాయి. అసోం గణపరిషత్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఏయూడీఎఫ్, బోడోల పార్టీ బీపీపీఎఫ్లు చెరో సీటు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే అధిక సీట్లు దక్కవచ్చంటున్నారు. కర్ణాటక: కాంగ్రెస్కే మొగ్గు? 11 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకుంది. ఏడాది లోపు జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీయే అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం సహజ పరిణామం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలనపై కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి ఉన్న సూచనలేవీ కనిపించడం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మళ్లీ వెనక్కిరావడం, బీఎస్ఆర్ కాంగ్రెస్ నేత బీఎస్ శ్రీరాములు బళ్లారిలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం కాషాయ పార్టీకి అనుకూలించే విషయాలు. ఐదేళ్ల పాలనలో ప్రజల ఆగ్రహానికి గురైన బీజేపీ ఈ ఎన్నికల్లో పెద్దగా కోలుకునే అవకాశాలు లేవు. మోడీ ప్రచారం, కేంద్రంలో ఎన్డీఏకు అవకాశాలు కనిపించడం వల్ల బీజేపీకి లభించే లోక్సభ సీట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండకపోవచ్చు. ఒక సర్వేలో మాత్రం బీజేపీకి 16 సీట్లు వస్తాయని అంచనావేసినా, అత్యధిక సర్వేలు కాంగ్రెస్కే మొగ్గు ఉన్నట్టు చెబుతున్నాయి. 2009లో బీజేపీకి 18 సీట్లు రాగా, కాంగ్రెస్ ఆరు సీట్లతో సరిపెట్టుకుంది. మొత్తం 28 సీట్లున్న ఈ రాష్ట్రంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీ-ఎస్ ఒకటి రెండు సీట్లకే పరిమితం కావచ్చు. జార్ఖండ్: పాలకపక్షానికి ఎదురు గాలి రాజకీయు అస్థిరతకు వూరుపేరైన జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. బీజేపీతో ఓసారి, కాంగ్రెస్తో వురోసారి చేతులు కలిపే జేఎంఎం పాలన పాలక కూటమికి ఈ ఎన్నికల్లో సీట్లు గెలిపించేలా లేదు. ఇతర హిందీ ప్రాతాల వూదిరిగానే బీజేపీకి అనుకూల వాతావరణం ఇక్కడ కూడా కనిపిస్తోంది. మొత్తం 14 సీట్లకుగాను బీజేపీ పది వరకూ గెలుచుకోవచ్చు. సీనియుర్ బీజేపీ నేత, కేంద్ర వూజీ వుంత్రి యుశ్వంత్ సిన్హా ఈసారి పోటీలో లేరు. హజారీబాగ్ స్థానంలో తన కొడుకు జయుంత్ను బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. కేరళ: హోరాహోరీ ప్రతి ఐదేళ్లకూ పాలక కూటమిని మార్చే అలవాటున్న రాష్ర్టం కేరళ. అలాగే, వరుసగా ఏ రెండు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్లలో ఏ ఒక్కటీ అత్యధిక సీట్లు గెలిచిన సందర్భాలు లేవు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పాలనపై భిన్నాభిప్రాయాలున్నాయి. సీపీఎంలో అంతర్గత కీచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న టీపీ చంద్రశేఖరన్ హత్యలో పార్టీ నేతల ప్రమేయంపై వచ్చిన అభియోగాలు సీపీఎం ప్రతిష్టను దెబ్బదీశాయి. ఒకట్రెండు సర్వేలు సీపీఎం కూటమికి అనుకూల ఫలితాలుంటాయని జోస్యం చెప్పినా, పాలకపక్షమై యూడీఎఫ్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ: త్రిముఖ పోటీ దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీల వుధ్యే మొత్తం 7 లోక్సభ సీట్లు అటూ ఇటూ మారుతుండేవి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాకతో తొలిసారి ఢిల్లీలో ముక్కోణపు పోటీలు జరుగుతున్నాయి. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ లేకున్నా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మైనారిటీ సర్కారు 49 రోజులు నడిచింది. కానీ, ఆప్కు అప్పటి జనాదరణ ఇప్పుడు లేదని అంటున్నారు. అదే నిజమైతే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కే అవకాశాలున్నాయి. కేంద్రమంత్రి కపిల్ సిబల్ సైతం చాందినీచౌక్లో తీవ్రపోటీ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచే ఒకటి రెండు సీట్లు కూడా ఆప్ పోటీ వల్లే సాధ్యమవుతాయని చెప్పవచ్చు. ఆప్కు ఒకటి రెండు సీట్లు మించి గెలిచే అవకాశాలు లేవు. -
యూపీఏ పాలనలో దేశం నాశనం
యూపీఏ వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్ ప్రధాని సహా సోనియూ, రాహుల్ దోషులే రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు సీబీఐని ప్రయోగించారు సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శించింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో పాటు బాధ్యతారహితంగా అధికారాన్ని ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలు సైతం సమస్యలకు కారకులయ్యూరని ఆరోపించింది. యూపీఏ పాలనలో అవినీతి, కుంభకోణాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని పేర్కొంది. పదేళ్లలో 21 భారీ కుంభకోణాలు జరిగాయని, అవినీతికి అంతేలేకుండా పోయిందని తెలిపింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కార్యాలయం (పీఎంఓ) సోనియా, రాహుల్ చేతిలో రిమోట్ కంట్రోల్గా మారిందని విమర్శించింది. మన్మోహన్ ప్రధానిలా కాకుండా ఓ బోర్డుకు సీఈవో మాదిరి వ్యవహరించార ంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనపై రూపొందించిన 58 పేజీల అభియోగపత్రాన్ని బీజేపీ అధికార ప్రతినిధులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జె.పి.నడ్డా శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను చార్జిషీట్ ఎండగట్టింది. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ నాశనమైందన్నారు. స్వతంత్ర భారత దేశంలో అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా యూపీఏ హయూం గుర్తుండిపోతుంది. భారత్ వంటి గొప్ప దేశానికి యూపీఏ ప్రభుత్వం.. సమస్యలు, అభద్రత, నిరాశా నిస్పృహలతో కూడిన భారతదేశాన్ని వారసత్వంగా ఇస్తోంది. ప్రభుత్వ తప్పుడు విధానాలు దేశ ప్రాథమిక పునాదినే కుదిపివేశారుు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి కీలక విభాగాన్నీ ప్రభుత్వం నాశనం చేసింది. 2జీ, కోల్గేట్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, కేజీ బేసిన్ చమురు, రాబర్ట్ వాద్రా భూ కొనుగోళ్లు, ఎయిరిండియూ, ఓటుకు నోటు, అగస్టా తదితర 21 కుంభకోణాలు యూపీఏ హయూంలో చోటు చేసుకున్నారుు. అవినీతిని, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, రాజకీయంగా ప్రత్యర్థులను అణచివేయడానికి కాంగ్రెస్ సీబీఐని దుర్వినియోగం చేసింది. అంతరంగిక భద్రతలో వైఫల్యం వల్ల పాకిస్థాన్, చైనా నుంచి చొరబాట్లు అధికమయ్యారుు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని యూపీఏ పూర్తిగా విస్మరించింది. 2003-04లో వృద్ధి రేటు 8.5 శాతం ఉండగా, 2013-14 డిసెంబరు నాటికి 4.6 శాతానికి పడిపోరుుంది. అవినీతి, కుంభకోణాలకు, ధరల నియంత్రణలో వైఫల్యానికి, నిరుద్యోగ సమస్య పెరగడానికి, ఆర్ధిక వ్యవస్థ నాశనమవడానికి, దేశం లోపల.. బయట ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రధాని, సోనియూ, రాహుల్ సమాధానం చెప్పాలి. యూపీఏ హయూం దేశానికి విపత్తులా పరిణమించింది. -
మంచి ప్రతిపక్షాన్ని ఎన్నుకుందాం!
గెస్ట్కాలమ్: (మహేశ్ పేరి) ఒక్కసారి చుట్టూ చూడండి.. అవే ముఖాలు.. ఆ రాజకీయ నాయకులే.. ఆ అధికార దళారులే.. ఆ లాబీయిస్టులే.. ఆ ప్రలోభాలే. కాకపోతే వారి పాత్రలు మారిపోతాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు. మరో వర్గం ఉంటుంది. సొంతంగానో, ఆహ్వానం మీదనో గెలిచే అవకాశమున్న పార్టీలోకి వెళ్లే గెలుపు గుర్రాల వర్గం అది. ఓడిపోబోతున్న ప్రభుత్వ విధానాలను కొనసాగించేందుకు వారు అధికారం చేపట్టబోయే పార్టీలోకి వెళ్తారు. విపక్షం ఎక్కడ? యూపీఏ ప్రభుత్వం ఒక వినాశనమన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే.. తప్పుల్ని ఎత్తిచూపి ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన మరో వ్యవస్థకు ఏమైంది? ఆ వినాశనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం దానికి లేదా? ఒక్కమాటలో అడగాలంటే.. గత పదేళ్లుగా ప్రతిపక్షం ఏం చేస్తోంది? ప్రతిపక్షంగా బీజేపీ సరిగ్గా వ్యవహరించిందా? లేదా.. ప్రతిపక్షం లేదనుకోవాలా? గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలను పరిశీలించండి. 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్, అక్రమ మైనింగ్, బీసీసీఐ.. ఇలా ఏ కుంభకోణాన్నైనా చూడండి. ప్రతిపక్షం లేదనే అనిపిస్తుంది. నిశితంగా చూస్తే ప్రభుత్వం, ప్రతిపక్షం.. రెండూ కుమ్మక్కైన తీరు కూడా తెలుస్తుంది. ఆ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలని అర్థమవుతుంది. ఆ కుంభకోణాల్లో రెండు వైపులా లబ్ధిదారులన్న విషయం స్పష్టమవుతుంది. ప్రచారార్భాటానికి పైపై డాంబికాలు తప్పిస్తే.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టే నిజమైన ప్రయత్నం మాత్రం ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా చేయదు. చేయబోదు. ఉమ్మడి వైఫల్యం ప్రభుత్వ, ప్రతిపక్షాలు రెండూ కలసికట్టుగా, వ్యూహాత్మకంగా విఫలం కావడమే భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం. ఎవరైనా ఎక్కడైనా గొంతెత్తితే.. డబ్బుతో వారి నోరు మూయిస్తారు. అధికారంలోకి రాగానే స్విస్ బ్యాంకుల్లోని నల్లడబ్బుని భారత్కు తెప్పిస్తామని, భోఫోర్స్ డబ్బు కక్కిస్తామని బీజేపీ మాటలు చెబుతోంది. మరి గతంలో ఆరేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్ అంతే.. మాటలకు, చేతలకు పొంతన ఉండదు. దాదాపు గత పాతికేళ్ల ఆర్థిక సరళీకరణల నేపథ్యంలోని ప్రభుత్వాలను పరిశీలిస్తే.. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం.. అధికారంలో ఉన్నా వారి లక్ష్యం ఒక్కటే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 100 కోట్ల ప్రజలను దోచి.. 20 కోట్ల మందికి ప్రయోజనం కలిగించడమే ఆ లక్ష్యం. మార్పు కోసం.. మనకు పాలకులు చాలా మంది ఉంటారు. మోడీ, ఆయన బృందం ఎన్ని మాటలు చెప్పినా.. యూపీఏ ఓడిపోయి సోనియాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఆమె రూలర్గానే ఉంటారు. కాంగ్రెస్ ఓడిపోయినా రాహుల్గాంధీ షెహజాదా(యువరాజు)గానే ఉంటారు. రాబర్ట్ వాద్రా వ్యాపారాలు కొనసాగుతూనే ఉంటాయి. నల్లడబ్బు స్విస్బ్యాంకుల్లోనే ఉంటుంది. స్టాక్మార్కెట్ల జోరు సాగుతూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. డబ్బున్నవారంతా హ్యాపీగానే ఉంటారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఒక నిజమైన ప్రతిపక్షాన్ని పార్లమెంటులో కూచోబెడదాం. మన ప్రయోజనాలను కాపాడే ప్రతిపక్షాన్ని.. మనల్ని రక్షించే ప్రతిపక్షాన్ని.. మన అభిప్రాయాలను ప్రతిబింబించే ప్రతిపక్షాన్ని.. మన డబ్బును కాపాడే ప్రతిపక్షాన్ని ఈసారి లోక్సభకు పంపిద్దాం. మంచి ప్రతిపక్షాన్ని ఎన్నుకుందాం. రచయిత, రాజకీయ విశ్లేషకులు, కెరీర్స 360 సంస్థ చైర్మన్ ఊడ్చేస్తా... ఓసారి ఉన్నట్టుండి చీపురుకట్ట పట్టుకొని రోడ్లపై ప్రత్యక్షమవుతుంది.. రోడ్లన్నింటినీ శుభ్రంగా ఊడ్చేస్తుంది.. మరోసారి సాదాసీదాగా చుడీదార్ ధరించి.. బైక్పై వచ్చేస్తుంది..! ఆమెవరో కాదు.. గోవా లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ తరఫున పోటీ పడుతున్న స్వాతి కేర్కర్(39)! మధ్యతరగతి నేపథ్యం ఉన్న స్వాతి సామాజిక కార్యకర్త. గోవాలో బహుళజాతి ప్రాజెక్టులకు, సెజ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీధర్ కేల్కర్ కూతురుగానే కాకుండా ఉద్యమకారిణిగా దక్షిణ గోవాలో చాలామందికి చిరపరచితురాలు. నిరుద్యోగి అయిన స్వాతికి ఎన్నికల నామినేషన్ సందర్భంగా డిపాజిట్ కట్టడానికి అవసరమైన రూ. 25వేలు కూడా లేవట. అప్పటికప్పుడు విరాళాలు సేకరించి డిపాజిట్ మొత్తం కట్టారట! స్వాతి కేర్కర్ ప్రచారం కూడా హంగూఆర్భాటాలు లేకుండా సాగుతోంది. పార్టీ కార్యకర్తల బైక్ వెనక కూచుని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. -
స్కామ్ల నుంచి బయటపడేందుకే..
కాంగ్రెస్తో డీఎంకే పొత్తుపై నిప్పులు చెరిగిన జయలలిత పొలాచ్చి: తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తే.. కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతిచ్చేం దుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ప్రకటించిన డీఎంకే అధినేత కరుణానిధిపై తమిళనాడు సీఎం, ఏఐఏ డీఎంకే చీఫ్ జయలలిత నిప్పు లు చెరిగారు. 2జీ సహా ఇతర స్కాంల్లోని కేసుల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకే కరుణానిధి తిరిగి హస్తం బాటపట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పిం చారు. 2జీలో నిందితులుగా ఉన్న కరుణ కుమార్తె కని మొళి, పార్టీ నేత ఏ రాజాలను రక్షించుకునేందుకే ఆయన కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమయ్యారని మంగళవారం ఇక్కడ నిర్వహించిన ప్రచార సభలో అన్నారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో డీఎంకే ఎన్నడూ తమిళుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. 2జీ కుంభకోణంలో కుమార్తె కనిమొళి జైలు పాలవడంతో దిగ్భ్రాంతికి గురైన కరుణానిధి యూపీఏకి మద్దతు ఉపసంహరించారని, కానీ తమిళుల సమస్యల కోసమే తాను యూపీఏ నుంచి బయటకు వచ్చానంటూ ప్రకటించి తమిళులను మోసం చేసింది నిజంకాదా? కరుణానిధి భార్య, కుమార్తెలు డెరైక్టర్లుగా ఉన్న ఓ టీవీ చానల్లో పెట్టుబడులు రూ.214 కోట్లు సరైనవే అయితే, ఎందుకు అంత హడావుడిగా వెనక్కి చెల్లించారు. శ్రీలంకకు వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి తీర్మానంలో భారత్ ఓటు వేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన కరుణ తిరిగి కాంగ్రెస్తో పొత్తుకోసం ఎందుకు తహతహ లాడుతున్నారు? -
ఎలక్షన్ వాచ్
ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలుతుంది ఔరంగాబాద్/గొడ్డా: గత 2004, 2009 ఎన్నికల్లో మాదిరిగానే ఎన్డీఏ గ్యాస్ బెలూన్ మరోసారి పేలిపోతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. బీహార్లోని ఔరంగాబాద్లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. 2004లో ‘భారత్ వెలుగుతోంది’ అంటూ వారు ఊదరగొట్టినా వారి గ్యాస్ బెలూన్ పగిలిపోయిందని, 2009లోనూ అదే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారు అదే గ్యాస్ బెలూన్ను ప్రదర్శిస్తున్నారని, అది కూడా పేలిపోతుందన్నారు. మూడింట ఒకవంతు నల్లధనమే! న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖర్చవుతుందని భావిస్తున్న మొత్తం రూ.30 వేల కోట్లలో సుమారు మూడింట ఒకవంతు వరకు నల్లధనమేనని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. నల్లధనంతో కలిపి ఈ ఎన్నికల్లో పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ ఇంత పెద్దమొత్తంలో వ్యయం చేయడం ఇదే మొదటిసారి. రూ.30 వేల కోట్లు ఇంతవరకు దేశంలో జరిగిన ఏ ఎన్నిక సందర్భంగానూ ఖర్చు కాలేదు. 2014 లోక్సభ ఎన్నికలకు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు రూ.8,000 కోట్లు-రూ.10,000 కోట్ల మధ్య ఖర్చుపెడతాయని అంచనా కాగా, ఆయూ పార్టీల అభ్యర్థులు వ్యక్తిగత స్థారుులో 10వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉందని సీఎంఎస్ అనే పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఈసీ సహా ప్రభుత్వ సంస్థలు రూ.7,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ఆ అధ్యయనం తెలిపింది. వికలాంగ ఓటర్లకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు! న్యూఢిల్లీ: వికలాంగులైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఢిల్లీ ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు.. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రానున్నారుు. ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం మేరకు ఈ ‘ఢిల్లీ మోడల్’ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ దృష్టిని ఆకర్షించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ తరహా ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విధానంలో.. వికలాంగ ఓటర్లు పోలింగ్ రోజున తమకు కావలసిన ఏర్పాట్లను ఆయూ రాష్ట్రాల ఎన్నికల సంఘాల వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వీరికోసం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓ చక్రాల కుర్చీ అందుబాటులో ఉంచు తారు. ర్యాంపులు, రెరుులింగ్ల వంటి సౌకర్యాలుంటారుు. ‘మే ఐ హెల్ప్ యూ’ అనే ట్యాగ్ వేసుకున్న వలంటీర్లు వారికి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారు. రైతు కోసం అన్నా ‘స్వాతంత్య్ర సంగ్రామం’ భువనేశ్వర్, న్యూస్లైన్: దేశానికి అన్నం పెట్టే రైతన్నలను పార్లమెంట్కు పంపాలనే లక్ష్యంతో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ‘రెండో స్వాతంత్య్ర సంగ్రామం’ ప్రారంభించారు. పార్టీ ఆధారిత రాజకీయాలతో విసిగిపోయానని చెప్పిన ఆయన.. 2024 నాటికి 100 నుంచి 125 మంది రైతన్నలను పార్లమెంట్లో చూడాలని కోరుకుంటున్నానన్నారు. నవనిర్మాణ్ కృషక్ సమాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్లమెంట్, అసెంబ్లీల్లో పార్టీలు పెత్తనం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకోవలసిన స్థానంలో పార్టీలకు గుర్తింపు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల కమిషన్ దారి తప్పిస్తోంది’’ అని అన్నా అన్నారు. రాజ్యాంగంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉంది తప్ప పార్టీల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. అందుకే ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మార్పు తీసుకురావాలని, దానికి యువత సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
ఎర్రకోటకు దారిది!
‘ప్రధాని’ని నిర్ణయించేది యూపీనే... ఎన్నికల బరిలో హేమాహేమీలు ఎలక్షన్ సెల్: భారతదేశ రాజకీయాలకు గుండెకాయ ఉత్తరప్రదేశ్. ఢిల్లీ పీఠం దక్కాలంటే ముందు ఈ రాష్ర్టంపై పట్టు సాధించాల్సిందే! 80 లోక్సభ స్థానాలున్న యూపీలో అత్యధిక స్థానాలు సాధించగలిగితే కేంద్రంలో అధికార పీఠం చేరువవుతుంది. కాంగ్రెస్ అనధికార ప్రధాని అభ్యర్థి రాహుల్గాంధీ(అమేథీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ (వారణాసి) ఇక్కడ్నుంచే బరిలో దిగడంతో యూపీ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీరితోపాటు సోనియాగాంధీ(రాయ్ బరేలీ), కేజ్రీవాల్ (వారణాసి), బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్(లక్నో) వంటి ఉద్దండులు కూడా ఈ రాష్ర్టం నుంచే పోటీలో ఉన్నారు. రాష్ర్టంలో బీజేపీ జోరుమీద ఉండగా.. ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఎన్నికల గోదాలోకి దూకింది. బీజేపీ రాష్ర్టంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే! మోడీ మ్యాజిక్తో ఈసారి 1998 నాటి కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. 1998 నాటికి ఉత్తరాఖండ్ ఏర్పడలేదు కనుక అప్పుడు యూపీలోని మొత్తం లోక్సభ స్థానాలు 85. వాటిలో బీజేపీ 58 స్థానాల్లో గెలుపొందింది. అయితే, అంతర్గత కలహాలే బీజేపీకి అవరోధంగా నిలుస్తున్నాయి. ‘మా శత్రువు బయటెక్కడో లేడు.. మాలోనే ఉన్నాడ’ంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు ఇటీవల వాపోయారు. టికెట్ల కేటాయింపు సందర్భంగా నేతల మధ్య విభేదాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. జాతీయ స్థాయి సీనియర్ నేతలు కొందరు మోడీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం పార్టీని దెబ్బతీస్తుందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. సంప్రదాయంగా బీజేపీకి మద్దతిస్తూ వచ్చిన బ్రాహ్మణులు.. ఈ ఎన్నికల్లో తమ వర్గం వారికి తక్కువ సంఖ్యలో టికెట్లు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. రాజ్నాథ్సింగ్ వల్ల రాజ్పుత్లకు అత్యధిక ప్రాతినిధ్యం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీకి తక్కువ సీట్లు వస్తే, ప్రధానిగా అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందన్న దూరాలోచనలో రాజ్నాథ్సింగ్ ఉన్నారని, అందువల్లే పార్టీ తరఫున ముస్లింలకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడ్డారని వారు వాదిస్తున్నారు. తూర్పు యూపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా బ్రాహ్మణులున్నారు. 2004తో పోలిస్తే 2009 లోక్సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతంలో మార్పు ఇదీ.. యూపీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలోని ఎస్పీ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, ముజఫర్నగర్ అల్లర్లు.. బీజేపీకి సానుకూలాంశాలు. వీటన్నింటికన్నా మోడీ ప్రభావం, మోడీ అభివృద్ధి ఎజెండా, ఆయనకు గల హిందూ మత రక్షకుడన్న ఇమేజ్.. ఇవే యూపీలో బీజేపీకి ఓట్లను రాల్చే మంత్రాలు. ఎస్పీ.. బీఎస్పీ ఈ పోల్ రేస్లో 2వ స్థానం కోసం పోటీపడుతున్న పార్టీలు ఎస్పీ, బీఎస్పీ. ఈ రెండింటిలోనూ రాష్ర్టంలో పాలకపక్షం ఎస్పీ కన్నా బీఎస్పీ ముందంజలో ఉంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సమాజ్వాదీ పార్టీ.. పాలనా వైఫల్యంతో ప్రజా మద్దతు భారీగా కోల్పోయింది. అఖిలేశ్ యాదవ్ పాలనలో అధికార కేంద్రాల సంఖ్య పెరిగింది. ములాయంసింగ్ యాదవ్, శివ్పాల్ యాదవ్, రామ్గోపాల్ యాదవ్, ఆజంఖాన్ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. ముజఫర్నగర్ అల్లర్లతో ముస్లింలు కూడా ఎస్పీకి దూరమయ్యారు. మొత్తానికి యాదవ్ల ఓటుబ్యాంకుపైనే ఎస్పీ ఆశలు పెట్టుకుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోని బీఎస్పీ.. ఈ ఎన్నికల కోసం పకడ్బందీగానే సిద్ధమవుతోంది. దళిత, ముస్లిం ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముజఫర్నగర్ అల్లర్ల నేపథ్యంలో యూపీ ముస్లింలు.. బీజేపీని ఎదుర్కోగల సరైన ప్రత్యర్థి బీఎస్పీనేనని నమ్ముతున్నారని మాయావతి విశ్వసిస్తున్నారు. యాదవ్, ముస్లిం, దళిత వర్గాల్లో.. ఏ రెండు వర్గాలు ఎస్పీ, బీఎస్పీల్లో ఏ పార్టీకి మద్దతిస్తాయో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినేది కాంగ్రెస్ పార్టీనే అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. యూపీఏ హయాంలోని కుంభకోణాలు కాంగ్రెస్పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కాంగ్రెస్ కన్నా దానితో పొత్తు పెట్టుకున్న అజిత్సింగ్ పార్టీ ఆరెల్డీకే ఎక్కువ స్థానాలొచ్చే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీలు పోటీలో ఉన్న అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా స్థానాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్గాంధీపై అభిమానం ఉన్నా, అది ఓట్లుగా రూపాంతరం చెందడం ప్రశ్నార్థకమే అని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈ సారి పట్టుమని పది సీట్లయినా గెలుచుకోలేదని పరిశీలకుల అంచనా. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న పార్టీ అధిష్టానం సినీ గ్లామర్, క్రీడలను నమ్ముకుంటోంది. అందుకే నగ్మా, రాజ్బబ్బర్, రవికిషన్ లాంటి సినీ తారలను, మహ్మద్ కైఫ్లాంటి క్రికెటర్లను ఎన్నికల బరిలోకి దింపింది. కాంగ్రెస్తో పోలిస్తే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ప్రజాభిమానం పొందడంలో ముందంజలో ఉంది. బీజేపీకి తరలిపోతున్న తమ జాట్ ఓటుబ్యాంకును ఆరెల్డీ అధినేత అజిత్ సింగ్... జాట్లకు రిజర్వేషన్లు అంటూ తిరిగి తనవైపు తిప్పుకున్నారు. పశ్చిమ యూపీలో పట్టున్న నేత రాకేశ్ తికాయత్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఆరెల్డీ ప్రాబల్యం పెరిగింది. 8 స్థానాల్లో ఆరెల్డీ పోటీలో ఉంది. మొత్తంమీద ఈ పోల్ రేస్లో కాంగ్రెస్ చివరిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ -
కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు నోటిఫై
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ఫిబ్రవరి 28న తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ సర్కారు గురువారం నోటిఫై చేసింది. డీఏ పెంపు వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. పెంపు వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.11,074 కోట్ల భారం పడనుంది. -
‘ఆహార భద్రత’ ఘనత మాదే
భివండీ, న్యూస్లైన్: ఇతర దే శాలపై ఆధారపకుండా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఉద్ఘాటించారు. భివండీ లోక్సభ నియోజకవర్గంలోని అంజూర్ఫాటా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చవాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రత పథ కం వల్ల రూ.2 లక్షల 40 వేల కోట్ల విలువచేసే ధాన్యాన్ని మనమే ఎగుమతి చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేద కుటుంబాలు బాగుపడుతున్నాయన్నారు. ‘మహిళలు, దళితులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కొందరు గిట్టనివారు మా పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నారు’అని తెలిపారు. బాలికలకు వసతి గృహాలు, సాంకేతిక, ఇతర కళాశాలు నిర్మించడంవల్ల విద్యార్థినుల సంఖ్య బాగాపెరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీల నేత త్వంలోని తమ పాటుపడుతోందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం అందరితో మమేకమై అభివృద్ధి బాటలో దూసుకెళుతుందని చవాన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఫిరాయింపుల బెడద పెరిగిపోవడంతో కార్యకర్తలు ఆందోళనలో పడిపోయారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలి? ఎవరికి అండగా నిలబడాలి? తదితర విషయాలను తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేయడానికే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి గణేశ్ నాయిక్ ప్రసంగిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. అక్కడి నుంచి వేలాదిసంఖ్యలో పశువులు గడ్డి కోసం ఈ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి గుజరాత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనే విషయాన్ని తేలికగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి చవాన్ నిర్ధేశించిన సమయానికంటే సుమారు మూడు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడంతో కార్యకర్తలు కొంత అసహనానికి గురయ్యారు. సురేష్ టావ్రేకి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్చేస్తూ చవాన్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విశ్వనాథ్ పాటిల్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి చవాన్ అభ్యర్థిని మారుస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు మాజీ ఎమ్మెల్యే యోగేష్ పాటిల్, ఎమ్మెల్యేలు ఆనంద్బాయి ఠాకూర్, ఇర్ఫాన్ బురే, మహాదేవ్ చౌగులే, సహాయ మంత్రి సతేజ్ పాటిల్, కాంగ్రెస్ ప్రతినిధి మహాదేవ్ శేలార్, వేలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు. -
మోడీకి వారణాసి వరం!
సంపాదకీయం: ఏ ఎన్నికలైనా అంతులేని ఉత్కంఠను కలిగిస్తాయి. గెలిచేదెవరో, ఓడేదెవరో అందరికీ తెలిసినా చివరి నిమిషంలో ఏమైనా కావొచ్చన్న అంచనాలుంటాయి. కానీ, ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల తీరే వేరు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే విజేతని, నరేంద్ర మోడీయే కాబోయే ప్రధాని అని సర్వేలన్నీ పదే పదే ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇందుకు మోడీకున్న జనాకర్షణ కారణమా...కుంభకోణాల్లో నిలువునా కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వ నిర్వాకం కారణమా అనే విచికిత్స పెద్దగా ప్రాముఖ్యమున్న అంశం కాదు. మోడీపై ఉన్న మోజును యూపీఏ అవినీతి పాలన మరిన్ని రెట్లు పెంచిందంటేనే సబబు. ఇంతగా విజయోత్సాహంలో ఉన్న పార్టీకి అభ్యర్థుల ఎంపిక పెద్దగా కష్టం కాకూడదు. అందునా నరేంద్ర మోడీ స్థానాన్ని ఎంపిక చేయడంలో ఇబ్బందులు అసలే ఎదురుకాకూడదు. అయినప్పటికీ ఆ విషయంలో బీజేపీ కాస్త తడబాటుకు లోనయింది. వారణాసిని వదిలిపెట్టడానికి అక్కడి సిటింగ్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి ససేమిరా అనడంతో ఆ విషయమై నెలరోజులనుంచి సందిగ్ధత నెలకొంది. ఆరెస్సెస్ జోక్యంతో ఈ వివాదం సుఖాంతమైంది. ప్రధాని అభ్యర్థిగా ఎంపికవడానికి ముందు కూడా నరేంద్ర మోడీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఢిల్లీ పీఠంపై మక్కువ ఉన్నదని ఆయన తనంత తానుగా ఒకటికి పదిసార్లు చెప్పాక కూడా పార్టీ సీనియర్లలో చలనం రాలేదు. వారంతా ఎల్.కె. అద్వానీవైపే మొగ్గుచూపారు. ఆ సంగతిని ఒకరిద్దరు బాహాటంగానే చెప్పారు. అటుతర్వాత ఆరెస్సెస్ జోక్యం చేసుకుని అందరినీ ఒప్పించే పనిలోబడింది. చివరకు అద్వానీ మినహా అందరూ దారికొచ్చారు. ఆయన మాత్రం ఒంటరిగా మిగిలి, అలకబూని పదవులన్నిటికీ రాజీనామా ఇచ్చి ఇంటిదగ్గరే ఉండిపోయారు. అయితే, నరేంద్ర మోడీ వల్లనే బీజేపీకి ప్రజానీకంలో ఇంత మద్దతు లభిస్తున్నదని అద్వానీ సైతం చివరకు అంగీకరించాల్సివచ్చింది. ఇలా ఒక్కో అవరోధాన్నే అధిగమిస్తూ వస్తున్న మోడీ....చివరకు ఎంచుకున్న నియోజకవర్గాన్ని పొందడంలోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సివచ్చిందంటే వింతగానే ఉంటుంది. కానీ, వారణాసి స్థానం అలాంటిది. అక్కడ జోషి ఏనాటినుంచో పాతుకుపోయి ఉన్నారు. అడుగుతున్నది పార్టీ ప్రధాని అభ్యర్థి గనుక ఇదేమంత పెద్ద కారణం కాదు. మరొకరైతే వెనువెంటనే ఖాళీ చేయాల్సివచ్చేది. జోషి గనుకనే ఇంత ఆలస్యమైంది. గుజరాత్లో 2002లో జరిగిన మారణకాండ, అనంతరం అక్కడ ఎడతెగకుండా సాగుతున్న విచారణలు, దర్యాప్తులు, కేసులువంటి పరిణామాలవల్ల మాత్రమే కాదు...అభివృద్ధి నమూనాగా కూడా ఆ రాష్ట్రంపేరు, నరేంద్ర మోడీ పేరు ఎప్పుడూ మార్మోగుతూనే ఉన్నాయి. అందువల్లే కావొచ్చు...చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మోడీ ప్రధాని అభ్యర్థి కాగలిగారు. ఈ ఎన్నికల్లో గుజరాత్లోని ఏ స్థానంనుంచి పోటీచేసినా ఆయన సులభంగానే గెలుస్తారు. అయినా సరే ఆయనను ఉత్తరప్రదేశ్నుంచీ...అందునా వారణాసినుంచి పోటీచేయించడం వెనక బీజేపీకి ప్రత్యేక వ్యూహం ఉన్నది. దేశ రాజకీయాలను మలుపుతిప్పి, బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన రామజన్మభూమి ఉద్యమానికైనా, సామాజిక సమీకరణాలను దేశ అజెండాలోకి తెచ్చిన రాజకీయాలకైనా ఉత్తరప్రదేశ్ పురుటిగడ్డ. 80 లోక్సభ స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ను విస్మరించడం ఏ పార్టీకైనా అసాధ్యం. అధికారానికి రాదల్చుకున్న ఏ పార్టీ అయినా ప్రధాని అభ్యర్థిని అక్కడినుంచి నిలిపితే దాని ప్రభావం బీహార్తోసహా హిందీ రాష్ట్రాలన్నిటా ఉంటుంది. దేశ ప్రధానులుగా పనిచేసినవారిలో అత్యధికులు అక్కడివారే కావడం యాదృచ్ఛికంకాదు. అంతేకాదు...వారణాసిలో మోడీని నిలపడంవల్ల మొత్తం పూర్వాంచల్ ప్రాంతంలో పార్టీ విజయావకాశాలను దృఢపరుచుకునే అవకాశం ఉంటుంది. హిందీ రాష్ట్రాల ప్రజల్లో మోడీ వెలుపలివారన్న అభిప్రాయం బీజేపీ తాజా నిర్ణయంతో మటుమాయమవుతుంది. రెండేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న సంగతి నిజమే అయినా...రాష్ట్రంలో కాషాయ ప్రభంజనం వీస్తున్నదని రాజకీయ నిపుణులు జోస్యం చెబుతున్నా పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత పనికిరాదని బీజేపీ భావించింది. సర్వేలంటున్నట్టు ఎన్డీఏకు 220కి మించిన స్థానాలు రావాలంటే ఈ వ్యూహ మే సరైందని అంచనావేసింది. వారణాసినుంచి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారుచేసిన వెంటనే మోడీ ఇచ్చిన ట్వీట్ ఆయన ఎదుర్కొన్న ఉత్కంఠను పట్టిచూపింది. ‘గంగామాత, కాశీ విశ్వనాథుల ఆశీర్వాదాలతో పటిష్టమైన విజయాన్ని సొంతంచేసుకుందా’మని ఆ ట్వీట్ద్వారా పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు. చివరికంతా సవ్యంగానే ముగిసినా...వారణాసినుంచి మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేయడంలో జరిగిన ఆలస్యం, ఉత్కంఠ ఆయనకు భవిష్యత్తులో పార్టీలోని సీనియర్లనుంచి ఎదురుకాగల అవరోధాలను తెలుపుతున్నాయి. వాజపేయివలే, అద్వానీవలే ఆయన పార్టీలో ఇంతవరకూ తిరుగులేని నాయకుడు కాదు. జనాన్ని సమ్మోహనపరచగల వక్తగా, దృఢమైన అభిప్రాయాలున్న వ్యక్తిగా మోడీకి పేరుంది. దాంతోపాటు గుజరాత్ సీఎంగా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని, సహచర మంత్రుల అభిప్రాయాలకు విలువనివ్వలేదని విమర్శలున్నాయి. ప్రధాని పదవిలో ఉండేవారికి అలాంటి ధోరణులు సరిపడవు. అందరినీ కలుపుకొని వెళ్లగలిగే స్వభావం దానికి అత్యవసరం. పైగా, పార్టీలో సీనియర్లనుంచి ఎదురవుతున్న సవాళ్లను గమనిస్తే ఆయన భవిష్యత్తులో సైతం జాగ్రత్తగా అడుగులేయాల్సి ఉంటుందని స్పష్టమవుతుంది. -
పేదరికం నుంచి గట్టెక్కించాం: రాహుల్ గాంధీ
15 కోట్ల మందికి విముక్తి యూపీఏ పాలనపై రాహుల్ టోంక్ (రాజస్థాన్): గత పదేళ్ల యూపీఏ పాలనలో సుమారు 15 కోట్ల మంది జీవితాల నుంచి పేదరికాన్ని పారదోలామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అదే సమయంలో తమ పాలనలో దారిద్య్రరేఖకు ఎగువన, మధ్యతరగతికి దిగువన 70 కోట్ల జనాభాతో కొత్త వర్గాన్ని సృష్టించామన్నారు. ఇందులో సెక్యూరిటీ గార్డులు, ట్యాక్సీ డ్రైవర్ల వంటి వారు ఉన్నారన్నారు. వారిని మధ్యతరగతికి చేర్చేందుకు తమ పార్టీ రాజకీయాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఉన్న దేవ్లీ ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ప్రజలను సాధికారులను చేసేందుకు, పేదరికం నుంచి ప్రజలను బయటకు తెచ్చేందుకు, వారికి విద్య, ఉపాధి, గౌరవం, హక్కులు కల్పించేందుకు మేం రాజకీయాలు చేస్తాం. కాంగ్రెస్ ఎప్పటికీ పేదలను మరచిపోదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్లలో జరిగిన అవినీతిని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక రాజస్థాన్లో తొలిసారి పర్యటిస్తున్న రాహుల్ ఈ సభలో కేవలం ఆరు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. -
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !
ఇటు యూపీఏ, అటు ఎన్డీయే... లేదంటే థర్డ్ ఫ్రంట్ జత కట్టేందుకు లాభనష్టాలు బేరీజు వేస్తున్న పార్టీలు కాంగ్రెస్తో జతకట్టిన ఎన్సీ, ఎన్సీపీ బీజేపీతో సేన, అకాళీదళ్, ఎల్జేపీ పొత్తు సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం ప్రాంతీయ పార్టీల సమాహారంగా మారనుంది. ఈ సమర భేరిలో ఏ పార్టీ ఏ పక్షాన చేరుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్తో, కొన్ని బీజేపీతో, మరికొన్ని మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)గా జతకట్టాయి. మరో పది, పదిహేను రోజులకల్లా పార్టీలన్నీ గీతకు కుడి వైపో, ఎడమ వైపో చేరనున్నాయి. కొన్ని ఒంటరిగా పోటీకి దిగినా ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముందంజలో ఉందని వెల్లడించగా.. వాటిని నమ్మొద్దని, 2004, 2009 ఎన్నికల వేళ కూడా ఇదే రీతిలో సర్వేలు వెలువడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది. 2004లో 145 సీట్లు, 2009లో 206 సీట్లు సాధించిన కాంగ్రెస్... యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించి పదేళ్లు పాలించింది. బీజేపీకి 2004లో 138, 2009లో 116 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు కూడా సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందువల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ప్రాంతీయ పార్టీలను, చిన్న జాతీయపార్టీలను ఆకర్షించే పనిలో పడ్డాయి. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడితే ప్రభుత్వ ఏర్పాటు సులువవుతుందని భావిస్తున్నాయి. కనీసం 160 నుంచి 180 సీట్లు సొంతంగా సాధిస్తే ఆ దిశగా అడుగులేయవచ్చని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలు సహా చిన్నచిన్న జాతీయపార్టీలు కూడా తాము ప్రాతినిథ్యం వహించే ప్రాంతాలకు గరిష్ట ప్రయోజనం సాధించుకునేందుకు గాను ఎన్నికల అనంతరమే తాము ఏ కూటమిలో చేరాలన్న నిర్ణయం తీసుకోవాలని వ్యూహరచన చేస్తున్నాయి. ఎవరు ఎటు వైపు? ఈసారి ఎన్నికల బరిలోకి దిగినవాటిలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఏడీఎంకే, జేడీయూ, బీజేడీ, ఆర్జేడీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎండీఎంకే, పీఎంకే, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏజీపీ, జేఎంఎం, శిరోమణి అకాళీదళ్, లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీతో పొత్తులు కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీతో శివసేన, శిరోమణి అకాళీదళ్, ఎల్జేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరే అవకాశం ఉన్న పార్టీల్లో ఆర్ఎల్డీ, జేఎంఎం, ముస్లింలీగ్, కేరళ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఎన్డీఏలో పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు చేరే అవకాశం ఉంది. అయితే ఇవి ఎన్నికలకు ముందే పొత్తులు కుదర్చుకునే పనిలో పడ్డాయి. మరోవైపు జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మూడో కూటమికి వామపక్షాలు గురువారం రాంరాం చెప్పేశాయి. దీంతో అన్నాడీఎంకే ఎన్డీయేతో జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీతో సత్సంబంధాలే జయలలితను ఎన్డీయే వైపు మళ్లిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ సైతం మూడో కూటమి విఫలమైతే ఎన్డీయే పక్షానే చేరనున్నారు. ఇక మరో కీలకపార్టీ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మూడో కూటమి విఫలమైతే యూపీఏ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల అనంతరం ఎన్డీయే వైపు మొగ్గే చూపవచ్చు. మూడో ఫ్రంట్ ముచ్చట... నాలుగు వామపక్ష పార్టీలు, ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), జేవీఎం తదితర పార్టీలు మూడో కూటమిగా జతకట్టాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలన్నీ థర్డ్ ఫ్రంట్గా బరిలో నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పలు పార్టీలు ప్రయత్నిస్తున్నా అదొక తీరని కలగానే ఉంది. ఇటీవలే 11 పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్ సమావేశం జరిగింది. అయితే ఎన్నికల నాటికి దీని స్వరూపం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందా? అన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు పొత్తులు పెట్టుకోని పలు పార్టీలు... ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అటు వెళ్లేందుకే ఆసక్తి చూపించే అవకాశం ఉంది. -
యూపీఏకు సింధు రక్షక్ చిక్కులు
-
కాంగ్రెస్ గోతులను పూడుస్తాం
ఢిల్లీ వర్తక సమ్మేళనంలో మోడీ వ్యవస్థ మొత్తాన్నీ ప్రక్షాళన చేయాలి.. దేశ వ్యవహారాలన్నీ ఢిల్లీ కేంద్రంగా సాగడం సరికాదు అధికారంలోకి వచ్చాక పాలనలో రాష్ట్రాలకూ భాగస్వామ్యం కల్పిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రస్తుతమున్న వ్యవస్థ మొత్తాన్నీ ప్రక్షాళన చేస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన గోతులను అధికారంలోకి వచ్చాక పూడుస్తామని భరోసా ఇచ్చారు. వ్యవహారాలన్నీ ఢిల్లీ కేంద్రంగానే సాగడం సరికాదని, దేశ పరిపాలనలో రాష్ట్రాలనూ భాగస్వామి చేయాలన్నారు. అందరినీ దొంగల్లా చూసేలా ఉన్న అనవసరపు చట్టాలన్నింటినీ రద్దు చేస్తామని... దేనికైనా నమ్మకమే ముఖ్యమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సవాళ్ల నుంచి వ్యాపార వర్గాలు పారిపోవద్దని.. వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలూ అందజేస్తామన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సదస్సులో మోడీ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే... దేశం ప్రస్తుతం ఆర్థికలోటుతోనే కాదు.. పాలనా లోపం, నమ్మకం లోపం, రక్షణ, నైతిక లోపాలతో సతమతమవుతోంది. ఢిల్లీలోని యూపీఏ ప్రభుత్వం కంటే.. ఒక మున్సిపాలిటీ చైర్మన్ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. పనితీరు మెరుగుపర్చడం, లీకేజీలు అరికట్టడం, పారదర్శకత, సాంకేతికంగా అప్గ్రేడ్ చేయడం ద్వా రా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోకి వస్తాయి. రాష్ట్రాలు బలహీనంగా మారాయనే వాదనతో మేం ఏకీభవించబోం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వేరని భావించడం తప్పు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశ పరిస్థితి చూస్తుండగానే మారిపోతుంది. కానీ, యూపీఏ ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కోతలు పెడుతోంది. ప్రధాని, కేంద్ర కేబినెట్ను మాత్రమే సంపూర్ణ జట్టుగా భావించవద్దు. ప్రధాని, రాష్ట్రాల సీఎంలే వాస్తవంలో దేశాన్ని నడిపించే నిజమైన జట్లు. యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలకు నష్టం చేసింది. మేం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థల ప్రతిష్టకు భంగం కలగనీయబోం. వాటి గౌరవాన్ని కాపాడుతాం. పట్టణీకరణ అవసరమే... దేశంలో పట్టణీకరణను సంకటంగా కాకుండా అవసరంగా భావించాలి. గ్రామీణ ప్రాంతాల ఆత్మ గ్రామం అయితే, సదుపాయాలు పట్టణాలవి. అయితే, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యచరణ ఉండాలి. యూపీఏ వ్యవసాయరంగాన్ని విస్మరించింది. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. దేశం నుంచి ముడి పదార్థాల ఎగుమతులకు స్వస్తి పలకాలి. పత్తి ఉత్పత్తి అయిన చోటే దారం, బట్టలు, రెడీమేడ్ వస్త్రాలు చేస్తే ఉపాధి దొరుకుతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తాం.. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు చైనాలో 50 వేలు ఉంటే..భారత్లో 500 కేంద్రాలను ప్రారంభిస్తామని నాలుగేళ్ల కింద ప్రధాని చెప్పారు. అదీ చైనాకు మనకు మధ్య ఉన్న అంతరం. ఒక వ్యాపారి విదేశాలకు వెళ్తే రూపాయిని డాలర్ల లోకి మార్చి తెస్తాడు. కానీ ఒక టీచరు వెళ్తే ఒక తరాన్ని మారుస్తాడు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యాపారుల ఇబ్బందులను తొలగించడానికి విధి విధానాల్లో మార్పులతో కొత్త చట్టాలను తెస్తాం. సంక్షిప్తంగా... మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు, బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు కరుణా శుక్లా (63) గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో అధికార జేడీయూ ఐదుగురు ఎంపీలను గురువారం పార్టీ నుంచి బహిష్కరించింది. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్కుమార్ను విమర్శించిన ఎంపీ శివానంద్ తివారీతోసహా వీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జేడీయూ పేర్కొంది. అయితే వేటుపడినవారిలో ఇద్దరు బీజేపీలో, మరో ఇద్దరు ఆర్జేడీలో చేరనున్నారని సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ప్రోరోగ్ (నిలిపివేయడం) చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇటీవలి సమావేశాల్లో ఆమోదం పొందని కొన్ని కీలక బిల్లులపై కేంద్రం ఆర్డినెన్స్లు జారీచేసేందుకు వీలు ఏర్పడింది. సీఐఎస్ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ రాజీవ్(60)ను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కమిషనర్గా రాష్ట్రపతి గురువారం నియమించారు. ఈ పదవిలో రాజీవ్ నాలుగేళ్లు కొనసాగుతారు. -
రానున్నది కాషాయ విప్లవం
దేశాన్ని కాంగ్రెస్ చీకట్లోకి నెట్టింది: నరేంద్ర మోడీ నీముచ్ (మధ్యప్రదేశ్): ‘అప్పట్లో దేశంలో హరిత విప్లవం వచ్చింది. ఇప్పుడిక కాషాయ విప్లవానికి సమయం ఆసన్నమైంది’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు తనకు స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. దేశంలోకెల్లా అతి పెద్దదైన 130 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని బుధవారం ఇక్కడికి సమీపంలోని భగవాన్పురలో ఆయన దేశానికి అంకితం చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. యూపీఏ సర్కారు విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేయడం ద్వారా దేశాన్ని చీకటి యుగాల్లోకి నెట్టేసిందంటూ మండిపడ్డారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లు యూపీఏ నిర్వాకం వల్ల మూతబడ్డాయన్నారు. బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నా కేంద్రం కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ అథఃపాతాళానికి దిగజారిందని, రూపాయి విలువ పతనమైందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో 2015 కల్లా 25,000 మెగావాట్ల అదనపు విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఎకనామిక్ హబ్గా ఈశాన్యం: ఈశాన్య భారతాన్ని ఎకనామిక్ హబ్గా మార్చడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా మోడీ తన మేధో బృందానికి సూచించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈశాన్య ప్రాంతాభివృద్ధి శాఖను పునరుద్ధరించే ఆలోచన ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అపార నీటి నిల్వలను సరిగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాల్లో వరద ముప్పును నివారించడంతో పాటు దేశ కరెంటు కష్టాలనూ శాశ్వతంగా పరిష్కరించవచ్చన్నారు. -
యూపీఏకి సైనిక కుట్ర భయం!
డెబ్బయ్ దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ‘భారత సైన్యమంటే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించే బాధ్యతాయుతమైన దళం. ఎట్టి పరిస్థితులలోనూ తిరుగుబాటుకు ప్రయత్నించదు....’ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. రక్షణమంత్రి చేసిన ఈ ప్రకటన హఠాత్పరిణామం మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం, సైనిక దళాల నాటి ప్రధానాధికారి వీకే సింగ్ వాస్తవాలను దాచి పెట్టారంటూ బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలతో ఇది అర్థమవుతుంది. కానీ రెండేళ్ల నాటి ఈ అత్యంత వివాదాస్పద ఘటనను ‘ముగిసిన అధ్యాయంగా’ అభివర్ణించి రక్షణమంత్రి ఇప్పుడు కూడా దేశ ప్రజల దృష్టిని మళ్లించాలని అనుకోవడమే వింత. అప్పుడు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని రక్షణమంత్రి, నాటి సైనిక దళాల ప్రధానాధికారి కూడా తోసిపుచ్చినా, ఇప్పుడు అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయి. దీనితో మొదట వచ్చే ప్రశ్న- పౌర ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్య అపనమ్మకం పెరుగుతున్నదా? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో పౌర ప్రభుత్వం నిలకడగా కొనసాగడం భారతీయ సమాజం పరిణతికి నిదర్శనం. మన ఇరుగు పొరుగు దేశాలు ఇందుకు నోచుకోలేక పోవడం, దానితో ఎదురైన దుష్పరిణామాలు ప్రపంచానికి ఎరుకే. అయినా, మన దేశంలో కొన్నిసార్లు పౌర ప్రభుత్వాధినేతలు సైన్యాన్ని శంకించారని చెప్పడానికి దాఖలాలు లేకపోలేదు. ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలోనూ అలాంటిదేదో జరగబోతున్నదన్న అనుమానాలు కలిగాయి. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్కూ, ఆర్మీ చీఫ్ కేఎస్ తిమ్మయ్యకూ మధ్య విభేదాలు ఇందుకు కారణం. పైగా భారత్లో సైనిక తిరుగుబాటుకు సీఐఏ తన వంతు ప్రయత్నం చేస్తున్నదని 1960 దశకంలో చైనా కూడా అనుమానించింది. తరువాత, 70 దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయని అంతా భావిస్తున్నపుడు, ఇష్టంగానో అనిష్టంగానో ఇలాంటి ప్రత్యామ్నాయం గురించిన దృశ్యాలు సమాజం ముందు కదులుతాయి. 2012 జనవరి మధ్యలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రెండు సైనిక యూనిట్ల కదలికలు యూపీఏ ప్రభుత్వంలో ‘అత్యున్నత’ స్థాయిలోని వారిని కలవరానికి గురి చేశాయి. ఈ కదలికల గురించే ఆ సంవత్సరం ఏప్రిల్లో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించగా రక్షణమంత్రి ఆంటోనీ, ‘ఇది శుద్ధ అబద్ధం’ అని కొట్టిపారేశారు. నాటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఇది అనారోగ్యకర బుర్రల్లో నుంచి వచ్చిన వార్తాకథనమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఏకే చౌధురి ఈ ఫిబ్రవరి 21న చేసిన ప్రకటన అసలు సంగతి బయట పెట్టింది. రెండేళ్లుగా ఆంటోనీ, వీకే సింగ్ అబద్ధం చెబుతున్న సంగతి వెల్లడయింది. చౌధురి చెప్పిన వివరాల ప్రకారం, జనవరి పదహారో తేదీన నాటి రక్షణ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ శర్మ తనను (చౌధురిని) పిలిచి ఆ దళాలను వెంటనే వెనక్కి వెళ్లమని ఆదేశించవలసిందిగా కోరారని ఆయన చెప్పారు. రాత్రి పదకొండుగంటల వేళ ఈ చర్చ జరిగింది. తాను ఇప్పుడే ప్రభుత్వ అత్యున్నత అధికార పీఠంపై ఉన్న వారి దగ్గర నుంచి వచ్చానని, వారు దళాల కదలికతో కలవరపడుతున్నారని శశికాంత్ తనకు చెప్పారని చౌధురి పేర్కొన్నారు. చౌధురి 2012లో సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్గా (డీజీఎంఓ) పనిచేశారు. దళాల కదలిక, తన జనన సంవత్సర సర్టిఫికెట్ గురించి వీకే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకే రోజు జరగడంతో ఈ అనుమానాలు కలిగాయని చౌధురి అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద రక్షణ కార్యదర్శి నివేదిక కోరడం, తాను ఇవ్వడం కూడా జరిగిందని చౌధురి వెల్లడించారు. చౌధురి ప్రకటన చేసిన మరునాడే వైమానిక దళాల రిటైర్డ్ చీఫ్ ఎన్ఏకే బ్రౌనే వెల్లడించిన అంశాలు కూడా 2012 నాటి ఘటన నిజమని స్పష్టం చేస్తున్నాయి. రెండు సైనిక యూనిట్లు కదలిక సమయంలోనే ఆగ్రా నుంచి పారా కమాండోస్ కూడా ఢిల్లీ దిశగా కదలిన సంగతిని బ్రౌనే వెల్లడించారు. నిజానికి పారా కమాండోలు 2012 ఫిబ్రవరిలో ఢిల్లీకి తర్ఫీదు కోసం వెళ్లవలసి ఉంది. ఈ దళం ఏ మిత్రదేశమైనా సంకటంలో పడినపుడు అత్యవసరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. సి-130 విమానాలతో ఈ కమాండోలకు ఇవ్వదలిచిన శిక్షణకు ఇంకా నెల సమయం ఉండగా ముందే ఎందుకు ఢిల్లీ వైపు కదిలాయన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. కాబట్టే, దేశ భద్రత, సాయుధ దళాల విశ్వసనీయత, ప్రభుత్వ మర్యాద వంటి అంశాలు ముడిపడి ఉన్న ఈ వివాదం గురించిన వాస్తవాలను తక్షణం వెల్లడించాలని రాజకీయ పక్షాలు కోరడం సబబే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
పింఛను పేరిట యూపీఏ వంచన
ఓఆర్ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ. 500 కోట్లు కేటాయించారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు. లోక్సభ గడువు పూర్తయిపోయింది. పార్లమెంటులో యూపీయే ప్రవేశపెట్టిన చాలా బిల్లుల సంగతి చూస్తే, ‘తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి!’ అన్న తీరులోనే ఉన్నాయి. తన్నుకు చావవలసి వస్తే మాత్రం ఆ బాధ్యత ఎన్డీఏదే. యూపీఏకు వచ్చే ఎన్నికలలో అవకాశాలు తక్కువని, ఎన్డీఏ ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బిల్లుల మీద బిల్లులు ప్రవేశపెట్టి, ఆ కీర్తిని యూపీఏ ఖాతాలో వేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రమించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సహా, చాలా బిల్లుల మీద ఇలాంటి హడావుడి ముద్ర సుస్పష్టం. అలాంటి బిల్లుల జాబితాలో చేరేదే భద్రతా దళాల కోసం ఉద్దేశించిన ‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’. ‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’(ఓఆర్ఓపీ) పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. ఇది త్రివిధ దళాల మాజీ ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సంబంధించినది. ఒకే శ్రేణితో, సేవల కాల పరిమితి ఒకటే అయిన సైనికులు ఉద్యోగ విరమణ చేసిన ట్టయితే వారికి ఒకే రకం పింఛను వర్తింపచేయడం ఈ బిల్లు ఉద్దేశం. ఇంకా సున్నితంగా చెప్పాలంటే, నిర్దిష్ట సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకీ, అదే శ్రేణికి చెంది, మరొక సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఒకే విధమైన పింఛను వర్తింపచేయడం దీని ఉద్దేశం. అంటే 1993లో ఉద్యోగ విరమణ చేసిన ఒక సిపాయికి, వేరే సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన మరో సిపాయీకి కూడా ఒకే స్థాయి పింఛను లభిస్తుంది. భారత మాజీ సైనికోద్యోగుల ఆందోళన సంఘం అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కడ్యాన్ మాటల్లో చెప్పాలంటే, ‘ఇంతవరకు ఎన్ని వేతన సంఘాలు వచ్చినా, ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెంచడమే తప్ప, మాజీ సైనికుల పింఛను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.’ దీనితో ఎప్పటి నుంచో వారి పింఛను గొర్రె తోక బెత్తెడు రీతిలో ఉండిపోయింది. నిజానికి చాలినంత పింఛను పొందడానికి నిర్దేశించినంత కాలం సైనిక దళాలలో ఉండే ఉద్యోగులు తక్కువే. 1983లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు పింఛను అనేది, ‘నష్ట పరిహారం కాదు, ఉద్యోగంలో ఉండగా చేసిన సేవకు ఇచ్చే పారితోషికం’. ఆ మేరకు ఓఆర్ఓపీ పథకాన్ని ప్రవేశపెట్టడం సబబే. దీని ప్రకారం పాత పింఛనుదారులకు కూడా పెరిగిన కొత్త పింఛనును వర్తింపచేస్తారు. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. 2014-15 బడ్జెట్లో రూ. 2,24,000 కోట్లు రక్షణ కేటాయింపులు చేశారు. ఇది 2013-14 బడ్జెట్లో రక్షణ అంచనాల కంటె పది శాతం ఎక్కువ. ఆ బడ్జెట్లో చేసిన కేటాయింపు రూ. 2,01,672 కోట్లు. గత బడ్జెట్లో రక్షణ రంగ పింఛన్లకు రూ. 45.000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో అది రూ. 50,000 కోట్లకు పెంచవలసి ఉంది. ఓఆర్ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ.500 కోట్లు కేటాయించారు. మరిన్ని నిధులు అవసరమైతే, అవి రక్షణ మంత్రిత్వ శాఖకు జరిగిన కేటాయింపుల నుంచి సేకరించుకోవాలని కూడా ఆర్థికమంత్రి చెప్పేశారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు. ఓఆర్ఓపీ అమలుకు బీజేపీ సహా అన్ని కాంగ్రెసేతర పక్షాలు సుముఖంగానే ఉన్నాయి. ఈ విధానం కోసం ఐదేళ్లుగా మాజీ సైనికోద్యోగులు పట్టుబడుతున్నారు. యూపీఏ-2 పదవీకాలం మరో పదిహేనురోజులలో ముగుస్తుందనగా ఆదరాబాదరా ఈ పథకం అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేవ లం కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ సైనికోద్యోగులతో భేటీ కావడంతో ఇది సాధ్యమైంది. అంతకంటె ముందు మాజీ సైనిక దళాల ప్రధాన అధిపతి జనరల్ వీకే సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కలిసి గడచిన సెప్టెంబర్ నాటి రేవారి (హర్యానా) సభలో పాల్గొన్నారు. అప్పుడే ఓఆర్ఓపీ అమలులో జరుగుతున్న జాప్యానికి వారు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టే రాజకీయ కారణాలే బిల్లును పార్లమెంటుకు వెళ్లేలా చేశాయి. అయితే ఈ పథకానికి రూ. 1,730 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లు అవసరమని నిపుణుల అంచనా. కానీ కొద్ది మొత్తం పడేసి మేం ఉద్ధరించామన్న తీరులో కాంగ్రెస్ వ్యవహరించడం మాజీ సైనికులకు సంతోషానికి బదులు ఆగ్రహం తెప్పిస్తున్నది. 25 లక్షల మాజీ సైనికోద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల ఓట్ల కోసమే రాహుల్ ఆదరాబాదరా బిల్లుకు బూజు దులిపించారన్న ఆరోపణ వినిపిస్తున్నది ఇందుకే. -గోపరాజు -
బిల్లు తెచ్చిన తంటాభవితపై బెంగ
ఎన్నికలపై అయోమయం తెలంగాణ బిల్లు ఆమోద ఫలితం కాంగ్రెస్లో రాజీనామాల పర్వం టీడీపీ శ్రేణుల్లో అయోమయం వైఎస్సార్సీపీకి ‘సమైక్య’ బలం కేంద్రంలోని యూపీఏ సర్కార్ అనుకున్నంత పనిచేసింది.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చింది.. ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లడం ఎలా? రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా? అనే సంశయం కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే మిషతో మరో ఆరు నెలలపాటు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ తెరపైకి తెచ్చింది. అదే జరిగితే షెడ్యుల్ ప్రకారం లోక్సభ ఎన్నికలను నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉందని జిల్లాలోని అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజాభిమానం తమకు అండగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారులు సిద్ధం! ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ప్రజలను వెంటాడుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు ఇతర ముఖ్య అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ పలు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సూచనలు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తుది జాబితా ఖరారు, ఎన్నికల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ‘రిక్త హస్త’మేనా..! తొలి నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అత్యుత్సాహం చూపడంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నేతలు కలవరపడుతున్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాదిగా వేసిన ఎత్తులు అనుకూలించలేదు. లోక్సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితి అనుకూలించకపోవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి ఎంతవరకు మాటపై నిలబడతారో వేచి చూడాల్సిందే. జిల్లాలో ఏకైక మంత్రి కొలుసు పార్థసారధి తాను సమైక్యవాదినేని చెబుతూనే పదవిని పట్టుకుని వేలాడుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన సీఎం కిరణ్తో కలిసి తన పదవికి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, డీవై దాసు తమ రాజకీయ భవితపై మేధోమథనం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు సైతం ఇదే పార్టీలో ఉంటే తమ రాజకీయ భవితవ్యం ఇక ముగిసిపోయినట్టేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో దాదాపు నూకలు చెల్లిపోయినట్టేనని, ఇటువంటి తరుణంలో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందేనని ఆ పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. పారని ఎత్తులు.. పొడవని పొత్తులు రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల్లోను వేగం పుంజుకుంటుందనుకున్న సైకిల్ రెండు చక్రాలకు గాలిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కూడా ఇప్పుడు ఎన్నికల భయం వెంటాడుతోంది. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో మరోమాట చెబుతూ వచ్చిన చంద్రబాబు ఎత్తులు ఈసారి ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మోడీ ఇమేజ్ను చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందుదామనుకున్న టీడీపీకి పొత్తుల పొద్దు బెడిసికొట్టేలా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్న తరుణంలో విభజనకు కాంగ్రెస్తో కుమ్మక్కైన బీజేపీతో చెలిమి మరింత ముంచుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు లోక్సభలో గుండెపోటుకు గురికావడం, ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన వాణి జిల్లాలో వినిపించడానికి మరికొద్ది రోజులు పడుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును ఇప్పటికే వర్గవిభేదాలు చుట్టుముట్టాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తన పదవికి రాజీనామా ప్రకటించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) తమ రాజకీయ భవిష్యత్పై మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టు పెంచిన వైఎస్సార్సీపీ తొలి నుంచి తమ నినాదం సమైక్యమేనని తేటతెల్లం చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లాలో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు గురించి ఆలోచించకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య చాంపియన్గా నిలిచారు. జగన్మోహన్రెడ్డి పిలుపుతో ఎప్పటికప్పుడు సమైక్య ఉద్యమాన్ని నడపడంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండేందుకు గతంలోనే టీడీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి పేర్ని నాని, జోగి రమేష్లు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని నియోజకవర్గాల్లోను సత్తా చాటుతామని వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి. -
ఇక రాష్ట్ర వ్యవహరాలపై దృష్టి సారించనున్న కేంద్రం!
పార్లమెంట్ ఉభయ సభలలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందటంతో ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహరాలపై దృష్టి సారించనుంది. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటు లోక్సభ, అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ తరుణంలో సీఎంగా కొత్త వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగించాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అని కేంద్రం తర్జనభర్జన పడుతోంది. అంతేకాకుండా నిన్నే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందటంతో ఆంధ్రప్రదేశ్ వ్యవహరాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్కు సమయం చిక్కింది. దాంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రాజీనామా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ నరిసింహన్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపారు. ఆ నివేదిక అందినట్లు ఇప్పటికే కేంద్ర మంత్రి కమల్నాథ్ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఎన్నికల ముందే అవశేష ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చిరంజీవిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే తెలంగాణ సీఎం పదవికి గీతరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తన లాబీయింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం. -
‘యావజ్జీవ’ వివాదం!
సంపాదకీయం: అన్నీ అయినట్టుగానే తమిళనాడులో రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల అంశం కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసులోని ఏడుగురు దోషులూ గత 23 ఏళ్లనుంచి జైళ్లలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా ఏమీ తేల్చిచెప్పనందున మానవతా దృక్పథంతో ఆ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నడో 2000 సంవత్సరంలో తమిళనాడు గవర్నర్ తమ క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చిన తర్వాత ఈ ముగ్గురూ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఆ పిటిషన్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతికి చేరడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఆ పిటిషన్లను పరిశీలించి తిరస్కరించడానికి రాష్ట్రపతికి మరో ఆరేళ్లుపట్టింది. ఇంత అహేతుకమైన జాప్యం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏరకంగా చూసినా సబబే. కానీ, ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయాలు పెను వేగంతో కదిలాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆ ఏడుగురు దోషుల్నీ విడుదలచేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కూడా. ఈ చర్య ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై ఆధిక్యత సంపాదించే ప్రయత్నం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అనుకున్నట్టే కరుణానిధి ఈ చర్యను అభినందించడంతోపాటు...2011లో వీరి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కేంద్రాన్ని కోరినప్పుడు జయలలిత తప్పుబట్టిన సంగతిని గుర్తుచేశారు. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నందున తమిళ జాతీయవాద పరిరక్షకులుగా కనబడేందుకు అన్నా డీఎంకే, డీఎంకేలు తహతహలాడటంలో వింతేమీ లేదు. కానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ వివాదంలో తలదూర్చి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరమైనవి. ఎల్టీటీఈ పొట్టన బెట్టుకున్న రాజీవ్గాంధీ కుమారుడు గనుక జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యతిరేకత వ్యక్తంచేయడం తప్పేమీ కాదు. అయితే, ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడుంటుందని రాహుల్ ప్రశ్నించారు. అలా అనేముందు ఇందులో తమ బాధ్యత ఎంతో రాహుల్ ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. రాజీవ్గాంధీ దోషులు ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేసిన నాలుగేళ్లకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. కానీ, ఆ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి దానికి ఏడేళ్లుపట్టింది. రాహుల్ అన్నట్టు ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...’ ఎలా అని యూపీఏ సర్కారు భావిస్తే ఏదో ఒక నిర్ణయాన్ని వేగిరం తీసుకొని ఉండేది. వారి పిటిషన్లను తిరస్కరించి ఉరిశిక్షలను అమలుచేయడమో లేక ఉరిశిక్షలపై రాహుల్గాంధీకున్న అభిప్రాయాన్ని గౌరవించి ఆ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మర్చడమో చేసేది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేకానేక కీలక సమస్యలపై నిర్ణయాలను నాన్చి... కేవలం తనకు ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చగలవాటినే పరిగణనలోకి తీసుకోవడం అలవాటైన యూపీఏ సర్కారు ఎందుకనో రాజీవ్గాంధీ హత్య కేసు విషయంలో కూడా సాచివేత ధోరణినే అవలంబించింది. అందువల్ల ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోవడం’ అనేది తప్పయితే, ఆ తప్పు చేసింది యూపీఏ ప్రభుత్వమేనన్న సంగతి మరవరాదు. ఇప్పుడు ఆ దోషులను వదలాలని నిర్ణయించడం మాత్రమే తప్పని రాహుల్ చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజీవ్ కేసు దోషుల్లో మురుగన్, శంతన్, పెరారివళన్, నళినిలకు 1999లో ఉరిశిక్ష విధించినప్పుడు బెంచ్లోని జస్టిస్ కేటీ థామస్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. మురుగన్, నళినిలు దంపతులు గనుక వారిని ఉరితీస్తే వారిద్దరి కుమార్తె అనాథ అవుతుందని చెబుతూ నళిని ఈ కుట్రలో తెలియకుండానే భాగస్వామి అయిందని అభిప్రాయ పడ్డారు. ఆమెకు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పునిచ్చారు. అనం తరకాలంలో సోనియాగాంధీ జోక్యంతో నళినికి విధించిన మరణశిక్ష 2007లో యావజ్జీవ శిక్షగా మారింది. ఉరిశిక్ష పడిన ముగ్గురూ దాని సం గతి తేలకుండానే 23ఏళ్లనుంచి జైల్లో ఉన్నారు గనుక...యావజ్జీవ శిక్ష పడివుంటే రెమిషన్లన్నీ కలిసొచ్చి వీరంతా ఎప్పుడో విడుదలయ్యేవారు గనుక వారి విడుదల సబబేనని జస్టిస్ థామస్ నిరుడు వ్యాఖ్యానించారు. ఆ రకంగా చూస్తే జయలలిత సర్కారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో తొందరపాటు ఉండొచ్చు... రాజకీయ ప్రయోజ నాలుంటే ఉండొచ్చుగానీ అది పూర్తిగా అహేతుకమని చెప్పలేం. అయితే, యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు అనుసరించాల్సిన నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉల్లంఘించిందన్నది వాస్తవం. నేర విచారణ స్మృతి ప్రకారం ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు అనంతరం మాత్రమే రాష్ట్ర కే బినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా తమిళనాడు ప్రభుత్వం దాన్ని పాటించలేదు. కనుకనే ఏడుగురి విడుదలకూ సుప్రీంకోర్టు గురువారం బ్రేక్ వేసింది. ఇదంతా సరేగానీ...1984లో ఇందిరాగాంధీని కొందరు దుండగులు పొట్టనబెట్టుకున్న తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతలో మరణించినవారికి కూడా ఇంతవరకూ న్యాయం జరగలేదు. బాధిత కుటుంబాలు దోషులుగా ఆరోపిస్తున్నవారంతా అధికారం అండతో స్వేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నారు. సామాన్యులు దాన్ని కూడా ప్రశ్నిస్తారని, ఇన్ని దశాబ్దాలు గడిచినా న్యాయం జరగలేదని భావిస్తారని రాహుల్ గ్రహించాలి. -
కేంద్రం మైనారిటీ మంత్రం
ఆ వర్గాల కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం విద్య, ఉద్యోగాల్లో వివక్ష ఎదుర్కోకుండా ఏర్పాటు న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మైనారిటీలను ఆకర్షించేందుకు యూపీఏ సర్కారు ప్రయత్నిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో మైనారిటీలు వివక్ష ఎదుర్కోకుండా సమాన అవకాశాల కమిషన్(ఈవోసీ)ను ఏర్పాటు చేసేందుకు గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో మైనారిటీ వర్గాలు.. ముఖ్యంగా ముస్లింలు వివక్షతను ఎదుర్కోకుండా ఈ కమిషన్ చూస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఈ కమిషన్ పరిశీలిస్తుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి రెహ్మాన్ఖాన్ కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు. ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేనందున వీటిని మినహాయించినట్టు చెప్పారు. జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల మేరకు దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు మేలు జరుగుతుందని, మత ప్రాతిపదికన ఏ మైనారిటీ కూడా వివక్షతకు గురికాకూడదనే లక్ష్యంతోనే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సచార్ కమిటీ పరిశీలన సమయంలో దేశ జనాభాలో 18.5 శాతం మంది ముస్లింలు ఉంటే.. అధికార యంత్రాంగంలో వీరి సంఖ్య 2.5 శాతం మాత్రమే అని తేలింది. కాగా, మైనారిటీల సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి 15 సూత్రాల ప్రణాళికను కూడా విస్తృత పరచాలని కేబినెట్ నిర్ణయించింది. వివిధ శాఖల 10 పథకాలను కూడా దీని పరిధిలోకి తేనున్నారు. కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలివీ.. - బొగ్గు రంగానికి సంబంధించి అధికారిక ఉత్తర్వుల ద్వారా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ముడి బొగ్గు, శుద్ధి చేసిన బొగ్గు, శుద్ధి చేసే క్రమంలో వెలువడే బొగ్గు ఉప ఉత్పత్తుల ధరల నిర్ణయానికి సంబంధించిన నియమాలు, పద్ధతులను బొగ్గు నియంత్రణ సంస్థ నిర్ణయిస్తుంది. బొగ్గు నాణ్యత, గ్రేడింగ్కు సంబంధించిన పరీక్ష పద్ధతులను కూడా ఇదే నిర్ణయిస్తుంది. బొగ్గు నమూనాలు, గనుల ఆమోదం, మూసివేత తదితరాలను ఇది పర్యవేక్షిస్తుంది. - మరో రెండు బొగ్గు గనులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకూ రద్దు చేసిన గనుల సంఖ్య 28కి చేరింది. - పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించడం, కొత్తగా అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం. ఇందుకోసం 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 13 వేల కోట్లు కేటాయింపు. - 7,200 కి..మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ప్రదేశ్లలో ఈ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారులు 80 వేల కిలోమీటర్లు ఉన్నాయి. - ఒడియాకు ప్రాచీన భాష హోదా కల్పించాలని నిర్ణయించింది. హిందీ, సంస్కృతం, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల సరసన ఒడియా కూడా చేరనుంది. -
ఆ చిచ్చు కాంగ్రెస్దే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ దావణగెరె, న్యూస్లైన్ : కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర, తెలంగాణ విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టిందని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. దీంతో దక్షిణ భారతదేశానికి వస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్కు వెళ్లే దమ్ము లేకుండా పోయిందని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా మోడీ మంగళవారం మంగళూరు, దావణగెరెల్లో పాల్గొన్న బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ‘భారత్ను గెలిపించండి’ పేరిట ఈ సభలు ఏర్పాటయ్యాయి. మంగళూరులోని సెంట్రల్ మైదాన్లో జరిగిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అభివృద్ధి అజెండాను ఆవిష్కరించారు. ‘మోడీ...మోడీ...మోడీ లావో...దేశ్ బచావో’ అని కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. తుళు భాషలో ప్రసంగాన్ని ప్రారంభించగానే మైదానం ఈలలు, కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. గతంలో తాను ఇదే మైదానంలో ప్రసంగించినప్పుడు పెద్ద సంఖ్యలో జనం లేరని, ఈరోజు అంతా నిండిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి మైదానం వద్దకు వస్తున్నప్పుడు తాను రోడ్డుకు ఇరువైపులా మానవ గోడలను చూశానని అన్నారు. తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఇది నిదర్శనమని అన్నారు. అనంతరం కాంగ్రెస్పై ధ్వజమెత్తుతూ, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ అదే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆ పార్టీ పాలనలో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని, యువత నిరుద్యోగులుగా మారారని దుయ్యబట్టారు. దావణగెరె సభలో మోడీ మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విభజన చిచ్చు పెట్టిందని, దీంతో అక్కడి ప్రజలు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ విభజనపై ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ వారికి ప్రజల కష్టసుఖాలతో పని లేదని, ఇలాంటి కాంగ్రెస్కు చిన్నపాటి శిక్ష సరిపోదని, దేశం నుంచే ఆ పార్టీని తరిమి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్లో నకిలీ గాంధీలు అధికమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్.యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, కేఎస్.ఈశ్వరప్ప, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్, బీజేపీ రాష్ట్రధ్యక్షులు ప్రహ్లాద్జోషి తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న జనం
విశాఖ రూరల్, న్యూస్లైన్ : తెలంగాణ బిల్లును లోక్సభలో యూపీఏ ప్రభుత్వం ఆమోదించడంతో విశాఖ జిల్లా భగ్గుమంది. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజానీకం రగిలిపోయింది. యూపీఏ చర్యలను నిరసిస్తూ ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ పక్షాలు చేపట్టిన కార్యక్రమాలతో జిల్లా హోరెత్తిపోయింది. ప్రతి చోటా సోనియా దిష్టిబొమ్మల దహనాలు.. కాంగ్రెస్, బీజేపీ జెండాలు, హోర్డింగ్ల దహనాలు.. రాస్తారోకోలు.. ధర్నాలతో ప్రశాంత విశాఖ మంగళవారం సాయంత్రం నుంచి అగ్నిగుండంగా మారింది. లోక్సభలో మధ్యాహ్నం 3.30కు తెలంగాణ బిల్లును ఆమోదించినట్టు వార్తలు వచ్చిన వెంటనే అన్ని పక్షాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టాయి. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ సోనియా గాంధీ, షిండే, ఇతర కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర విభజనకు ఆమోదం లబించడంతో మనస్తాపానికి గురైన ఒక న్యాయవాది ఆ మంటల్లో దూకడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న మిగిలిన న్యాయవాదులు ఆయనను అడ్డుకొని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. దీంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న నరేంద్రమోడీ హోర్డింగ్ను న్యాయవాదులు చింపి దగ్ధం చేశారు. సిరిపురంలో జంక్షన్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడున్న రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కటౌట్లను చింపివేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు లగుడు గోవింద్ ఆధ్వర్యంలో విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏయూ లైబ్రరీ వద్ద భారీగా విద్యార్థులు రాస్తారోకో చేశారు. మద్దిలపాలెం జంక్షన్లో ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు రాస్తారోకో నిర్వహించి 5 నిమిషాల పాటు ట్రాఫిక్ను అడ్డుకున్నారు. మద్దిలపాలెం జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని మంగళవారం మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడడంతో వైఎస్సార్ సీపీ నాయకులు విగ్రహాన్ని బలవంతంగా ఆవిష్కరించారు. అనంతరం అక్కడే కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ మల్కాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. శ్రీహరిపురంలో తెలుగుదేశం నాయకులు రాస్తారోకో చేశారు. అనకాపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో అతని అనుచరులు కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు. అనకాపల్లిలో నెహ్రౌచౌక్ వద్ద తెలుగుదేశం నాయకులు కేంద్రం దిష్టిబొమ్మను తగలబెట్టారు. నెహ్రౌచౌక్ దగ్గర వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. వడ్డాదిలో జేఏసీ నాయకులు సోనియాగాంధీ, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్పార్టీకి వ్యతిరేకంగా వీధుల్లో ర్యాలీ చేశారు. నాలుగురోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. -
పొలాలకు పోషక ఎరువులు!
* పెరిగిన సాగు రుణాల పరిమితి * వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం * రికార్డు స్థాయిలో పంటల దిగుబడి న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది తిండి గింజలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించామన్నారు. - వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. - వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. - పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. - ఈసారి చక్కెర, పత్తి, తృణ ధాన్యాలు, నూనె గింజలు రికార్డు స్థాయిలో దిగుబడి నమోదయ్యే అవకాశం. - 2012-13లో రూ.2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి. మంచి పరిణామం: ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, వ్యవసాయంపై దేశంలోని యువత పెద్దగా ఉత్సాహం చూపని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సరైన చర్య. -
రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
-
రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
హైదరాబాద్ : దేశ రాజధానిలో సమైక్యవాణిని గొంతెత్తి చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తినకు దండు కడుతున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీ రెండు ప్రత్యేక రైళ్లను వేశారు. శనివారం ఉదయం10 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరగా, సాయంత్రం 4:30 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనుంది. రేణిగుంట నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు గుత్తి మధ్యాహ్నం 3:30 గంటలకు కర్నూలు సా. 5:20 గంటలకు కాచిగూడ రా. 9:30 గంటలకు ఖాజీపేట అర్థరాత్రి 12గం.లకు రామగుండం తెల్లవారు జామున 2:15గంటలకు రాజమండ్రి నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు రాజమండ్రిలో సా.4:30 గంటలకు బయల్దేరనున్న రైలు ఏలూరులో సా. 6:30 గంటలకు విజయవాడలో రా. 7:40 గంటలకు ఖమ్మంలో రాత్రి. 8:15 గంటలకు మంచిర్యాలలో తెల్లవారుజామున 2:00 గంటలకు -
మొయిలీ, అంబానీల కుమ్మక్కు..
ఎఫ్ఐఆర్లో ఏసీబీ అభియోగం ఎన్టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల పెంపు అక్రమం రిలయన్స్కు లబ్ధి చేకూర్చేందుకే యూపీఏ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: వరుస కుంభకోణాలతో అపవాదు మూటగట్టుకున్న యూపీఏ ప్రభుత్వానికి మరో మచ్చ ఇది. ఎన్టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల విషయంలో యూపీఏ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుకూలంగా వ్యవహరించిందని అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 2014 ఎన్నికల్లో అయ్యే వ్యయానికి అవసరమైన నిధులను రిలయన్స్ నుంచి పొందే ఆలోచనతోనే ఇలా చేసిందని పేర్కొంది. ఇదే ఆలోచనతో బీజేపీ కూడా నోరు మెదపలేదని అభిప్రాయపడింది. ఈ గ్యాస్ ధరల విషయంలో పెట్రోలియం మంత్రి ఎం.వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధినే ముఖేశ్ అంబానీ, మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇలా మొదలైంది: ఢిల్లీ కేబినెట్ మాజీ కార్యదర్శి టి.ఎస్.ఆర్. సుబ్రమణియన్, మాజీ కార్యదర్శి ఇ.శర్మ, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హెచ్. తహిలియానీ, అడ్వొకేట్ కామినీ జైశ్వా ల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఎం కేజ్రీవాల్ ఈ కేసు లో ఏసీబీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుత డాలర్ విలువను బట్టి చూస్తే గ్యాస్ ధరల పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ. 54,500 కోట్ల భారం పడుతుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘కేజీ డీ6 బ్లాక్లో కనుగొన్న సహజ వాయువుపై భారత ప్రభుత్వానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), నికో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2000 సంవత్సరం ఏప్రిల్ 12న ఒప్పందం కుదిరింది. 2004లో ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటులకు ఒక్కో ఎంఎంబీటీయూ(మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్ 2.34 డాలర్ల చొప్పున, ఇలా 17 ఏళ్లపాటు సరఫరా చేసేందుకు రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కొంత కాలం తర్వాత ఆర్ఐఎల్ మాట మార్చింది. ఒప్పందంలో పేర్కొన్న ధరకు గ్యాస్ సరఫరా చేయడానికి నిరాకరించింది. రిలయన్స్ ఒత్తిడితో 2007లో యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను ఏకంగా ఎంఎంబీటీయూ-4.2 డాలర్లకు పెంచింది. ఇది పూర్తిగా అవినీతి, అక్రమాలతో కూడుకున్న చర్య’ అని ఫిర్యాదులో ఆరోపించారు. ఇది చాలదన్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాన్ని 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయించడం యూపీఏ చేసిన అతిపెద్ద అవినీతికి నిదర్శనమన్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలను పెంచాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. -
విస్తృత ఏకాభిప్రాయ సాధనకు సమయం మించిపోలేదు: అరుణ్ జైట్లీ
తెలంగాణ బిల్లుపై బీజేపీ నేత అరుణ్ జైట్లీ సూచన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్ర మధ్య సంయమనం తీసుకురావడానికి ఇంకా సమయం మించిపోలేదని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ (బీజేపీ) అన్నారు. ఇరు ప్రాంతాల వారు మాట్లాడుకోడానికి పార్లమెంటు లోపల లేదా బయట చర్చలకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. నష్టపోతున్న సీమాంధ్రులకు న్యాయం చేస్తూ వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో సంయమనం అవసరం’ పేరిట జైట్లీ తన బ్లాగ్లో శుక్రవారం వ్యాసం రాశారు. ‘నా తర్వాత ప్రళయం’ తీరులో.. యూపీఏ తర్వాత వివాదాలను వదలి వెళ్లాలని కోరుకుంటోందన్నారు. యూపీఏ పాలన ఆరంభంలో రాజ్యాంగ సంస్థల పతనం, ఆర్ధిక వ్యవస్థ మందగమనం, అవినీతి, నిర్ణయాలు తీసుకోవడంలో విశ్వసనీయస్థాయి తగ్గిందని విమర్శించారు. ‘తెలంగాణ ఏర్పాటు విషయంలో వివాదాస్పద బిల్లుపై యూపీఏ ఇప్పుడు పూర్తిస్థాయిలో సంక్షోభంలో కూరుకుపోయింది. సొంత పార్టీలో పుట్టిన శక్తులను నియంత్రించలేని స్థితిలో ఉంది. అలజడులు, గొడవలు లేని పార్లమెంటు నడవడం చాలా అరుదుగా ఉంది. విపక్ష పార్టీలకన్నా యూపీఏ సభ్యులే సభలను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖ అచేతనంగా ఉన్నాయి. చేతిలో ఉన్న అంశాలను పరిష్కరించడంలో ఎలాంటి ఆసక్తి కనబర్చడంలేదు’ అని జైట్లీ మండిపడ్డారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఎన్డీఏ ఏర్పాటు చేసే సమయంలో సుహృద్భావ వాతావరణం కల్పించామన్నారు. గురువారం పార్లమెంటులో జరిగిన పరిణామాలతో సిగ్గుపడే స్థితికి యూపీఏదే బాధ్యత అన్నారు. ‘సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నవారిలో ఎక్కువ మంది సభ్యులు యూపీఏ వారే. తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలను దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇరు ప్రాంతాల మధ్య సంయమనం కోసం వేదిక ఏర్పాటు చేయలేదు. ఇరు ప్రాంతాల ఆకాంక్షలపై చర్చించడంలో పార్లమెంటు విఫలమైంది. ఈ మొత్తం ప్రక్రియతో దేశ ప్రజాస్వామ్యానికి అవమానమైంది. పార్లమెంటులో జరిగేవాటితో రాజనీతిజ్ఞుల ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు. -
నిరసనాగ్రహం
వైఎస్సార్సీపీ బంద్ విజయవంతం మార్మోగిన సమైక్య నినాదం జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు సాక్షి, మచిలీపట్నం : కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు ఏకపక్షంగా చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనాగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరక ు ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ ఎన్జీవోలు, అక్కడక్కడ టీడీపీ నేతలు కూడా ఆందోళనలు నిర్వహించారు. బస్సుల నిలిపివేత... ఒంటికాలిపై నిరసన జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద భాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేసి బస్సులను నిలిపివేశారు. అనంతరం మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక బంద్ చేపట్టారు. అవనిగడ్డలో సింహాద్రి రమేష్, యాసం చిట్టిబాబు తదితరులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మోపిదేవిలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. ఏపీఎన్జీవో నాయకులు బంద్, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయరహదారిపై ధర్నా... కైకలూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు షాపులు మూయించి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడలో నిర్వహించిన బంద్లో వైఎస్సార్సీపీ నాయకులు మరీదు కృష్ణమూర్తి, మండలి హనుమంతరావు, లోయ రాజేష్ పాల్గొన్నారు. పెడన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పెడనలో పోస్టాఫీసు, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. యూపీఏ దిష్టిబొమ్మ దహనం... నూజివీడులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పట్టణంలో బైక్లతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడు బస్టాండ్ సెంటర్ నుంచి చిన గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేసి యూపీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మేకా ప్రతాప్ సంఘీభావం తెలిపారు. తిరువూరులో బంద్ సందర్భంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైలవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో పాదయాత్ర చేశారు. నూజివీడు రోడ్డులో మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి బోసుబొమ్మ సెంటర్లో విద్యార్థులతో కలిసి జోగి రమేష్ మానవహారం నిర్వహించారు. నందిగామలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. పామర్రులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. షాపులు మూయించివేసి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఎంపీ కోసం ప్రత్యేక పూజలు.. మచిలీపట్నం ఎంపీ కొనకొళ్ల నారాయణరావు లోక్సభలో గుండెపోటుకు గురైన నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో బంద్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని ముంబైకి తరలించడంతో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. -
దుర్దినం: స్పీకర్కు జగన్ లేఖ
లోక్సభలో గురువారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని, ప్రజాస్వామ్యానికి ఇదొక దుర్దినమని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ స్పీకర్తో భేటీ సందర్భంగా జగన్ ఒక లేఖ ఇచ్చారు. ‘బిల్లును ప్రవేశపెట్టిన తీరు పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. సభ ఎజెండాలో తెలంగాణ అంశం లేదు. బిజినెస్ లిస్ట్లో లేదు. ఇలా ముందుగా తెలుపకుండా బిల్లు ప్రవేశపెట్టడమైందని చెప్పడం పార్లమెంట్ సంప్రదాయం కాదు. పార్లమెంట్ సంప్రదాయాల పరిరక్షకులుగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తిగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లుగా మీరు అంగీకరించొద్దు. ఇది సాంకేతికంగా బిల్లు పెట్టినట్టు కానేకాదు. సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా బిల్లు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. పైగా బిల్లును ప్రవేశపెట్టకుండానే ‘ప్రవేశపెట్టాం’ అని చెప్పుకుంటున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. బిల్లుకు అవుననో, కాదనో చేతులెత్తకుండానే బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం సమంజసం కాదని వివరించారు. ఈ వాదనను పట్టించుకోని స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టినట్లేనని చెప్పడంతో జగన్ అక్కడినుంచి వాకౌట్ చేశారు. సస్పెండయిన ఎంపీలు లేఖలిస్తే తీసుకోబోమంటూ జగన్ ఇచ్చిన లేఖను కూడా స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. దీంతో అదే లేఖను స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా జగన్ మరోమారు పంపారు. తొలి ఎంపీ జగనే తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టామని యూపీఏ సర్కారు చెప్పుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. బిల్లును ప్రవేశపెట్టడంపై గురువారం సభలో అందరికంటే ముందుగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ ఆయనే.