సీఎం యోగి అనూహ్య అడుగులు! | Yogi Adityanath to Pray at Ram Lalla Shrine Today | Sakshi
Sakshi News home page

సీఎం యోగి అనూహ్య అడుగులు!

Published Wed, May 31 2017 10:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సీఎం యోగి అనూహ్య అడుగులు! - Sakshi

సీఎం యోగి అనూహ్య అడుగులు!

  • నేడు అయోథ్యలో పర్యటన.. రామమందిరం సందర్శన
  • లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ బుధవారం అయోధ్యలో పర్యటించబోతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతి మంగళవారం​ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన మరునాడే ఆయన అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేసీ హిందూత్వ అజెండాను మరింత తెరపైకి తెచ్చేందుకు, రామమందిర నిర్మాణానికి మద్దతుగా యోగి ఈ పర్యటన చేపట్టినట్టు భావిస్తున్నారు.

    రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదస్పద ప్రదేశంలో తాత్కాలికంగా నిర్మించిన రామమందిరంలో బుధవారం సీఎం యోగి పూజలు నిర్వహించబోతున్నారు. గడిచిన 15 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.

    బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై కుట్ర అభియోగాలను ఖరారు చేసిన సీబీఐ కోర్టు వారికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ఆలయాన్ని సీఎం​ యోగి సందర్శిస్తుండటంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement