
పంజగుట్ట: విద్యార్థినుల ర్యాంప్ వాక్, డీజే పాటలకు స్టెప్పులతో సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కాలేజీలో సందడి నెలకొంది.

కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు బుధవారం రాత్రి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఫేర్వెల్ పార్టీ శుభం లీవింగ్ ఎ లెగసి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

ఫ్యాషన్ షో విషేశంగా ఆకట్టుకుంది. మిస్ వివాసియస్, మిస్ రూపాంజెల్, మిస్ రైజింగ్ స్టార్, మిస్ గార్జియస్, మిస్ విల్లామేరీ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా ప్రముఖ మోడల్, నటి పాయల్ రాథోడ్ వ్యవహరించారు.

కాలేజీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఫిల్లోమినా, సెక్రటరీ చిన్నమ్మ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, ప్రిన్సిపల్ రేవతి దేవి మాధుర్ పాల్గొన్నారు









