
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను అమెరికాలోని క్రికెట్ అభిమానులు సత్కరించారు.

అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించేందుకు నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్సీఎల్) ఏర్పాటుకు సచిన్ తనవంతు కృషి చేశాడు.

దీంతో డాలాస్లోని కౌబాయ్స్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) మ్యాచ్ సందర్భంగా ఎన్సీఎల్ సంబంధించిన టీమ్ యజమాని జెర్రీ జోన్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ‘10 జెర్సీ’ని సచిన్కు అందజేసి సన్మానించారు.

కొత్తగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు నిర్వహించబోయే ఎన్సీఎల్కు సచిన్ సహ యజమానిగా ఉన్నాడు.

‘క్రికెట్ నాకెంతో ఇచ్చింది. ఓ క్రికెటర్గా డాలస్కు విచ్చేసిన నాపై యువ అథ్లెట్ల అభిమానం, కురిపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’ అని సచిన్ అన్నాడు.

అంకితభావం, నిబద్ధత, తపనతో పాటు మనపై మనకున్న విశ్వాసం మనల్ని లక్ష్యంవైపు నడిపిస్తాయన్నాడు.

అది క్రికెట్లో అయినా... జీవితంలో అయినా మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని చెప్పాడు.

ఆదివారం టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలోనూ సచిన్తో వందల మంది అథ్లెట్లు కలిశారు.

మరోవైపు.. భారత జట్టులో అవకాశాలు దక్కక అమెరికాకు ఆడుతున్న అండర్-19 వరల్డ్కప్ కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ కూడా సచిన్ను కలిశాడు

‘దేవుడు ఇప్పుడు డాలస్లో ఉన్నాడు.. మిమ్మల్ని కలవడం సంతోషకరం సర్’ అంటూ సచిన్తో దిగిన ఫొటోను ఉన్ముక్త్ పంచుకున్నాడు.


