
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) జాతీయ అండర్–19 బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారం రెండో రోజు హోరాహోరీగా సాగాయి

మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కాలేజీ మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి

రెండో రోజుల పాటు జరిగిన లీగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సీఐఎస్ఈ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హిమాచల్ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పశ్చిమబెంగాల్ జట్లు ముందంజలో కొనసాగుతున్నాయి

ఈ నెల పదో తేదీ వరకు జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి
















