
భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగట్ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.


వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

భారత రైల్వేలో ఉద్యోగిగా తన ప్రస్థానం ముగిసిందని పేర్కొంది.

ఈ మేరకు ఎక్స్ వేదికగా తన రాజీనామా పత్రాన్ని వినేశ్ ఫొగట్ పంచుకుంది

‘‘భారత రైల్వేలో పనిచేయడం నా జీవితంలో ముఖ్యమైన, గర్వించదగిన జ్ఞాపకం’’ అని వినేశ్ ఫొగట్ పేర్కొంది.

హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం పొందింది.

ఆమె నార్తర్న్ రైల్వేస్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విధులు నిర్వర్తించింది.

ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న మరో రెజ్లర్ సోమ్వీర్ రాఠీని ప్రేమించి పెళ్లాడింది

ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల మహిళల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా స్వర్ణ పతక రేసులో పాల్గొనలేకపోయింది.

తన అనర్హత వేటు పడగా.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్కు అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది

ఈ క్రమంలో రెజ్లింగ్కు స్వస్తి పలుకుతానని ప్రకటించిన వినేశ్ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నానన్న సంకేతాలు ఇచ్చింది

కాగా వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించడం దాదాపు ఖాయమైంది

తన కజిన్ సంగీత్ ఫొగట్ భర్త, రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి వినేశ్ ఫొగట్ కాంగ్రెస్పార్టీలో చేరేందుకు సిద్ధమైంది

ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి వినేశ్ ఫొగట్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.




