Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్ పంజాబ్కు చెందిన మినాల్ ఖాన్కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్ను క్లిక్ చేయండిభారత జవాన్కు భార్యగా పాకిస్తానీ మహిళా

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మరో హాఫ్ సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు కింగ్ కోహ్లి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులెక్కాడు.చదవండి: #Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్కు దూరం?

భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!
అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.క్వీన్స్ల్యాండ్కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్లైన్స్ చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్నగర్లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు.

మరింత అగ్గి రాజేసేలా.. పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
ఫుడ్ బిజినెస్కు ఎపుడూ మంచి డిమాండ్ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్ బిజినెస్లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్ సక్సెస్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్ విశాఖపట్నంలో ఒక ల్యాండ్మార్క్గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్ స్టాల్ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!

‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ
గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్అయితే విజయ్ మాత్రం ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ తన ఎక్స్ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎవరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
IPL 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..
రొమారియో షెపర్డ్ విధ్వంసం.. సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిప్టీ
‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సచిన్ కూతురితో హీరో డేటింగ్..!
టాప్ ట్రెండింగ్ మీమ్స్.. చూస్తే పడిపడి నవ్వాల్సిందే
ఏప్రిల్లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు
‘ఆ పెండింగ్ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తాం’
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డుపై ఆంక్షలు
జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
IPL 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..
రొమారియో షెపర్డ్ విధ్వంసం.. సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిప్టీ
‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సచిన్ కూతురితో హీరో డేటింగ్..!
టాప్ ట్రెండింగ్ మీమ్స్.. చూస్తే పడిపడి నవ్వాల్సిందే
ఏప్రిల్లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు
‘ఆ పెండింగ్ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తాం’
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డుపై ఆంక్షలు
జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
సినిమా

రెడ్ రోజ్ తో రుహానీ.. ట్రెండీవేర్ లో అనసూయ
రోజ్ ఫ్లవర్ తో గ్లామరస్ గా రుహానీ శర్మ మేకప్ లేకుండా సెల్ఫీలు పోస్ట్ చేసిన రష్మికచీర లాంటి చుడీదార్ లో యాంకర్ అనసూయకాశీ వెళ్లిపోయిన హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్గ్లామర్ తో రెచ్చిపోతున్న ఐశ్వర్యా రాజేశ్పడవలో పార్టీ చేసుకున్న హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ చేసిన బలగం బ్యూటీ కావ్య View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్నెస్కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ను సృష్టించింది.–జోథా అక్బర్లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు.

సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్పోర్ట్లో అభిమానికి నిరాశ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రంగా రానుంది.ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కారు దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!
ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గన్ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని రాసుకొచ్చింది.కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అన్నారు.(ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి)నిన్న ఎమోషనల్.. నేడు గుడ్ న్యూస్ఫోక్ సాంగ్స్కు అదిరిపోయే స్టెప్పులేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో’ విన్నర్గా నిలిచి మరింత ఫేమస్ అయింది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ నిన్న ఓ వీడియోని షేర్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ..అందులో పేర్కొంది. చాలా మంది నెటిజన్స్ జాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ..ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాననే విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official)
న్యూస్ పాడ్కాస్ట్

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్
క్రీడలు

#Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్కు దూరం?
దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్-2025 మధ్యలోనే తన స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రబాడ సౌతాఫ్రికా వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికి రబాడ తిరిగి భారత్కు మళ్లీ రాలేదు.ఈ క్రమంలో తన స్వదేశానికి వెళ్లిపోవడానికి అస్సలు కారణాన్ని రబాడ వెల్లడించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సమయంలో నిషేదిత డ్రగ్ వాడడంతో తనపై తాత్కలిక సస్పెన్షన్ వేటు పడినట్లు రబాడ తెలిపాడు. అందుకే ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగనట్లు ఈ స్పీడ్ స్టార్ స్పష్టం చేశాడు. దీంతో ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్లకు కూడా రబాడ దూరం కానున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా తరపున కూడా రబాడ అడేది సందేహంగా మారింది.నేను ఐపీఎల్లో ఆడకుండా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చానని ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటన చేసింది. అయితే నిషేధిత డ్రగ్ వాడడంతో సౌతాఫ్రికా క్రికెట్ నాపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అందుకే ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ తప్పు చేసినందుకు అందరికి క్షమాపణలు తెలుపుతున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని ఎల్లప్పుడూ నేను అరుదైన గౌరవంగా భావిస్తాను. తిరిగి నాకు ఇష్టమైన ఆట ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ కఠిన సమయంలో సపోర్ట్గా నిలిచిన నా ఏజెంట్, సౌతాఫ్రికా క్రికెట్, గుజరాత్ టైటాన్స్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఓ ప్రకటనలో రబాడ పేర్కొన్నాడు.

ఉత్కంపోరులో సీఎస్కే ఓటమి..
IPL 2025 RCB vs CSK Live Updates: ఉత్కంపోరులో సీఎస్కే ఓటమి..ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. అయితే 20 ఓవర్ వేసిన యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దయాల్ సిక్స్ ఇచ్చాడు. అంతకు తోడు ఆ బంతి నో బాల్ కావడంతో మ్యాచ్ సీఎస్కే వైపు మలుపు తిరిగింది. చివరి మూడు బంతుల్లో సీఎస్కే విజయానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ సమయంలో దయాల్ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీఎస్కే బ్యాటర్లలో యువ ఆటగాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా(77 నాటౌట్) రాణించాడు. సీఎస్కే ఓడిపోవడంతో వీరిద్దరి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. విజయానికి చేరువలో సీఎస్కే..సీఎస్కే విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(75), ధోని(11) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 94 పరుగులతో అద్బతమైన ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. లుంగీ ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు. సీఎస్కే విజయానికి 22 బంతుల్లో 42 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(59) ఉన్నాడు.దంచి కొడుతున్న సీఎస్కే బ్యాటర్లు..భారీ లక్ష్య చేధనలో సీఎస్కే అదరగొడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మాత్రే(91), జడేజా(50) పరుగులతో ఉన్నారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కుర్రాన్.. లుంగీ ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అయూష్..సీఎస్కే యువ ఓపెనర్ అయూష్ మాత్రే దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో మాత్రే.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 26 పరుగులు రాబాట్టాడు. మాత్రే 47 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. సీఎస్కే తొలి వికెట్ డౌన్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన షేక్ రషీద్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్:57/1కోహ్లి, షెఫర్డ్ మెరుపులు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.షెఫర్డ్ విధ్వంసం..19 ఓవర్ వేసిన ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆర్సీబీ బ్యాటర్ షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు రాబాట్టాడు. 19 ఓవర్లు ముగిసే ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.రెండు వికెట్లు డౌన్..ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. జితేష్ శర్మ(7) నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ కాగా.. పాటిదార్(11) పతిరాన బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(150, పాటిదార్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లి 62 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..జాకబ్ బెతల్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన బెతల్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది.జాకబ్ బెతల్ హాఫ్ సెంచరీ..ఆర్సీబీ యువ ఆటగాడు జాకబ్ బెతల్ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 28 బంతుల్లో బెతల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. క్రీజులో బెతల్(54), కోహ్లి(40) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు జాకబ్ బెతల్(28) , విరాట్ కోహ్లి(18) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఆసక్తికరపోరుకు తెరలేచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో లుంగీ ఎంగిడీ జట్టులో వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా

సచిన్ రికార్డుపై కన్నేసిన టీమిండియా ఓపెనర్..
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత జట్టు కీలక పోరు సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా శ్రీలకంతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా యువ ఓపెనర్ ప్రతీక రావల్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్లోర్లు సాధించిన భారత బ్యాటర్గా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ను అధిగమించేందుకు ప్రతీక అడుగుదూరంలో నిలిచింది. ప్రస్తుతం ప్రతీక వరుసగా ఐదు సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించి సచిన్, ద్రవిడ్తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో రావల్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును బ్రేక్ చేస్తోంది. అయితే ప్రతీక ఉన్న ఫామ్కు ఈ రికార్డు బద్దలు కావడం ఖాయమన్పిస్తోంది.నయా సంచలనం..కాగా భారత క్రికెట్లో ప్రతీక రావల్ పేరు మారుమ్రోగిపోతుంది. గతేడాది డిసెంబర్లో భారత జట్టు తరపున వన్డే అరంగేట్రం చేసిన రావల్.. వరుస హాఫ్ సెంచరీలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ప్రతీక 81.7 సగటుతో 572 పరుగుల చేసింది. అందులో ఒక సెంచరీ, ఐదు ఆర్ధశతకాలు ఉన్నాయి.ప్రతీక ఆఖరి ఐదు వన్డే స్కోర్లు ఇవే..89 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)67 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)154 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)50 నాటౌట్ -వర్సెస్ శ్రీలంక(కొలంబో)78 వర్సెస్ దక్షిణాఫ్రికా(కొలంబో)చదవండి: నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి

నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కింగ్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు.భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత గొప్ప క్రికెటర్గా కీర్తింపబడ్డాడు.వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు మైలు రాయిని అందుకున్న బ్యాటర్ కూడా కోహ్లినే కావడం విశేషం. అటు కెప్టెన్గా కూడా కోహ్లి తన మార్క్ను చూపించాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా విరాట్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్ది గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అయితే తాజాగా మూడు ఫార్మాట్లలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల జాబితాను కోహ్లి వెల్లడించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లెజండ్ జేమ్స్ ఆండర్సన్, వన్డేల్లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్, టీ20ల్లో వెస్టిండీస్ స్పిన్నర్ సనీల్ నరైన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడినట్లు కోహ్లి పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో కోహ్లిపై ఆండర్సన్కు మంచి రికార్డు ఉంది. ఏడు సార్లు కోహ్లిని ఆండర్సన్ ఔట్ చేశాడు. మరోవైపు లసిత్ మలింగా కూడా చాలా సందర్భాల్లో కోహ్లిపై పై చేయి సాధించాడు. అదేవిధంగా ఐపీఎల్లో కోహ్లిపై మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సైతం మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఇక కోహ్లి ఈ ఏడాది జూన్లో తిరిగి భారత తరపున ఆడనున్నాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్కు పయనం కానునున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025లో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి(443) ఐదో స్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్
బిజినెస్

వంట గది ఆహ్లాదం.. చిమ్నీ పాత్ర కీలకం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటిలో వంట గది ప్రత్యేకతే వేరు. కుటుంబ సభ్యుల ఆనందం, ఆరోగ్యంలో కిచెన్ కీలకమైంది. వంట ఏదైనా సరే ఘాటు వాసన, పొగ ఇళ్లంతా వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే వంట గదిలో చిమ్నీల ఏర్పాటు అనివార్యమైపోయింది. దీంతో ఇంటిలో ఘాటు వాసనలు వ్యాపించకపోవడమే కాకుండా చమురు, జిడ్డు మరకలు గోడలు మసకబారకుండా శుభ్రంగా ఉంటాయి.చిమ్నీ రకాలు బోలెడువాల్ మౌంటెడ్: స్టౌ గోడకు ఆనుకొని ఉంటే వాల్మౌంటెడ్ చిమ్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గోడలకు అమర్చడం వల్ల నేరుగా పొగ, ఘాటు వాసనలను సంగ్రహించుకోవడంలో బాగా పనిచేస్తాయి.ఇన్బిల్ట్: కిచెన్ క్యాబినెట్ లేదా గోడలో ఇన్ బిల్ట్ చిమ్నీ కలిసిపోతుంది. ఘాటైన వాసనలు పీల్చే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. టెలిస్కోపిక్: ఈ రకం పైకప్పులలో ఇమిడిపోతాయి. వంట చేసేటప్పుడు చిమ్నీని పొడిగించుకోవచ్చు కూడా. చిన్న వంటగదిలో ఉపయోగపడతాయి. కార్నర్: స్థలం తక్కువగా ఉండే వంట గదిలో ఓ మూలన వినియోగిస్తారు. డక్ట్లెస్: గొట్టాలను అమర్చడానికి వీలులేని వంట గదిల్లో వినియోగిస్తారు. ఇవి గాలిని వెలుపలికి వదలకుండా వాటిలో ఉండే ఫిల్టర్స్ పొగ, ఆవిరి, చమురును పీల్చుకొని శుద్ధి చేస్తాయి. కన్వర్టబుల్: డక్టెడ్, డక్ట్లెస్ చిమ్నీలుగా మార్చుకునే అవకాశం ఉండేవే కన్వర్టబుల్. దీన్ని వంట గదికి అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది. స్టాంటెండ్: కుక్టాప్ వద్ద వాలుగా ఉండే ఈ చిమ్నీ విలాసవంతంగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ ద్వారా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు కనిపించకుండా సీలింగ్ మౌంటెడ్లో అమరుస్తారు. ఐలాండ్: స్టౌ వేదిక ద్వీపంలా, కిటికీల చెంత స్టౌలు ఉంటే ఐలాండ్ లేదా సీలింగ్ మౌంటెడ్ చిమ్నీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి గోడల నుంచి దూరంగా ఉండటం వల్ల మరింతగా వాసనలు, పొగను సంగ్రహిస్తాయి.

'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్ను కూడా రాబర్ట్ పోస్ట్కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025

సుందరం.. పూజా మందిరం
సాక్షి, సిటీబ్యూరో: కట్టిన ఇల్లు కొంటున్నా.. దగ్గరుండి కట్టించుకుంటున్నా.. ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి విస్తీర్ణం మేరకు ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం మార్కెట్లో కోరుకున్న డిజైన్లు, విభిన్న ఆకృతుల్లో లభించే పూజా మందిరాలను కొనుగోలు చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు.పూజా గది ఏర్పాటు చేసుకునే సౌలభ్యం లేని వారు పూజా మందిరాలపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు చెక్కతో గోడకు ఒకచోట దేవుడి ఫొటోలు పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ సొంతిల్లు కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రస్తుతం.. చిన్నదైనా సరే పూజా మందిరం ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివారి కోసం దాదాపు నగరంలోని అన్ని ఫర్నీచర్ షోరూంలలో పూజా మందిరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకటి, రెండు డిజైన్లు మాత్రమే ఉండగా.. వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కానీ, ప్రస్తుతం కావాల్సిన డిజైన్లో నచ్చిన ఆకారంతో పూజా మందిరాలు రెడీగా ఉన్నాయి. నచ్చిన విధంగా కావాలంటే ఆర్డర్పై తయారు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..ధరల్లో వ్యత్యాసం..పూజా మందిరాల్లో సైజు, డిజైన్, ఆకృతిని బట్టి ధరలు ఉంటాయి. సహజంగా వెడల్పు, ఎత్తును బట్టి పూజా మందిరాలు తయారు చేస్తున్నారు. స్థలానికి అనుగుణంగా ఆర్డర్పై తయారు చేయించుకోవచ్చు. అయితే వీటి తయారీలో ఉపయోగించే చెక్కను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి. టేక్వుడ్, సీసం వుడ్ ఇలా కావాల్సిన అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకునే అవకాశం ఉంది. సాధారణ చెక్కతో చిన్న సైజువి ఒక మోస్తారు సైజు వరకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు లభ్యమవుతున్నాయి. సహజంగా మందిరాలను ఓం, స్వస్తిక్ బొమ్మలతో తయారు చేయించుకుంటున్నారు.

ప్రపంచంలో పే..ద్ద బ్యాంకులు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలం బ్యాంకులే. ఆర్థికపరమైన పరిణామాలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. అప్పు కావాలన్నా.. సంపాదించిన సొమ్ము దాచుకోవాలన్నా అన్నింటికీ బ్యాంకులే ఆధారం. ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించే సంస్థలతో ప్రపంచ బ్యాంకింగ్ పరిశ్రమ ఆధిపత్య ఉనికిని కొనసాగిస్తోంది. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 నాటికి ఈ రంగం నికర వడ్డీ ఆదాయం 8.94 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ ఛేజ్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. మొత్తం ఆస్తుల పరంగా ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు. ఈ ర్యాంకింగ్స్ లో అమెరికన్ బ్యాంకులు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, చైనా బ్యాంకులు టాప్ టెన్ లో నాలుగింటిని ఆక్రమించాయి. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) ఆసియాలోనే అతిపెద్దదిగా అవతరించింది.టాప్ 10లో భారతీయ బ్యాంకుమార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10 బ్యాంకులలో ఓ భారతీయ బ్యాంకు కూడా చోటు దక్కించుకుంది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం తరువాత భారత్కు చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా, ప్రపంచవ్యాప్తంగా పదో అతిపెద్ద బ్యాంకుగా మారింది. 2025 మే 2 నాటికి ఇది 184.44 బిలియన్ డాలర్లు (రూ.1,553,706 కోట్లు) మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.టాప్ 10 అతిపెద్ద బ్యాంకులు.. వాటి మార్కెట్ క్యాప్1. జెపి మోర్గాన్ ఛేజ్ రూ.57,80,495 కోట్లు2. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) రూ.2,696,421 కోట్లు 3. బ్యాంక్ ఆఫ్ అమెరికా రూ.2,549,084 కోట్లు4. అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా రూ.2,163,540 కోట్లు5. వెల్స్ ఫార్గో రూ.1,968,702 కోట్లు6. చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ (సీసీబీ) రూ.1,824,265 కోట్లు7. బ్యాంక్ ఆఫ్ చైనా రూ.1,745,070 కోట్లు8. హెచ్.ఎస్.బి.సి. రూ.1,660,165 కోట్లు9. మోర్గాన్ స్టాన్లీ రూ.1,580,581 కోట్లు10. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,553,706 కోట్లుSource: companiesmarketcap.com
ఫ్యామిలీ

ఏసీతో పనిలేకుండానే హీట్ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు.

హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం.

వజ్రాల నెక్లెస్, బెనారస్ సిల్క్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పడూ సరికొత్త లుక్తో అందర్నీ ఆశ్యర్యపరుస్తుంటారు. మరోసారి తాజాగా అలాంటి మెస్మరైజ్ లుక్తో మెరిశారు. ఆ విశేషాలేంటో చూద్దామా..!.నీతా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారతదేశ గొప్ప హస్తకళను ప్రదర్శించే ఫ్యాషన్ ఐకాన్. ఆమె సదా విశాలమైన బంగారు అంచులతో కూడిన చీరలతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు . కేవలం ప్రతిభాపాటవాలే కాదు, అప్పడప్పుడూ మన డ్రెస్ సెన్స్ కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుందని తన స్టైలిష్ ఫ్యాషన్వేర్లతో చెబుతూనే ఉంటారామె. ఈసారి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్లో అద్బుతమైన లుక్తో ఆకర్షించారు. చీరలంటే అమితంగా ఇష్టపడే నీతాని ఈ వేడుకలో బెనారస్ సిల్క్ చీరలో తళుక్కుమన్నారు. సంక్లిష్టమైన బహుళ వర్ణ పూల ఎంబ్రాయిడరీ డిజైన్తో చీర హైలెట్గా నిలిచింది. ఆ చీర లుక్కి సరిపోయే మ్యాచింగ్ బ్లౌజ్ జత చేశారు. ఆ చీరకు తగ్గట్టు స్టేట్మెంట్ డైమండ్ స్టడ్ చెవిపోగులు, ప్రకాశవంతమైన ఎరుపు మాణిక్యాలతో పొదగబడిన డైమండ్ నెక్లెస్తో ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కాంతివంతమైన లుక్లో కనిపించారామె. అందుకు తగ్గ మేకప్, స్టైలిష్ హెయిర్ స్లైల్తో రాజరికానికి అద్దం పట్టేలా ఆమె ఆహార్యం అదిరిపోయింది. కాగా, వేవ్స్ 2025(WAVES 2025) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఈ నెల మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, క్రియేటర్లు, విధాన రూపకర్తలతో సహా 90కి పైగా దేశాల నుంచి సుమారు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’)
ఫొటోలు


చెన్నైలో గ్రాండ్గా నటి అభినయ రిసెప్షన్ వేడుక (ఫొటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)
అంతర్జాతీయం

ఖనిజ ఒప్పందం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్లోని అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన ఆయన దాన్ని చేజిక్కించుకోవడంలో అడుగు ముందుకేశారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతి ఇస్తేనే రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నెలకొల్పడానికి సహకరిస్తానంటూ మెలికపెట్టి ఉక్రెయిన్ను దారికి తెచ్చుకున్నారు. ట్రంప్ ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ట్రంప్కు అనుమతి ఇచ్చేశారు.ఈ మేరకు ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంతకాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. ఉక్రెయిన్ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కిపైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్కు సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తివివరాలను ఇరు దేశాలు ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాయి.ఈ కొత్త ఒప్పందాన్ని ‘యూఎస్–ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్’ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్–అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోయింది. అప్పట్లో వైట్హౌస్లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలు ఫలించి, ఒప్పందం కుదిరింది. అమెరికాతో ఈ ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిమీహల్ చెప్పారు. ఖనిజాల తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా లభిస్తుందన్నారు. మూర్ఖుడిగా ఉండదల్చుకోలేదు: ట్రంప్ ఉక్రెయిన్కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దానికంటే అధికంగా తిరిగి పొందబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదల్చుకోలేదని అన్నారు. ఒకచోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనని పరోక్షంగా తేల్సిచెప్పారు. మరోవైపు ఒప్పందాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది సమానమైన, గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి సైనిక సాయం పొందడానికి ఇది కీలకంగా మారుతుందని ఆకాంక్షించింది. అమెరికాతో బంధం బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని, తమ దేశంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిధి దోహదపడుతుందని వెల్లడించింది. కీలకాంశాలు.. ఉక్రెయిన్–అమెరికా ఖనిజ ఒప్పందంలో కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు 350 బిలియన్ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం.. ఆ డబ్బును ఉక్రెయిన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రష్యా పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతోంది. రష్యాకు సహకరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా సంకేతాలిచ్చింది. ఖనిజాలను తవ్వుకొనే అవకాశం అమెరికాకు ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్కే దఖలు పరిచారు. యూ రోపియన్ యూనియన్(ఈయూ)లో చేరాలన్న ఉక్రె యిన్ ఆకాంక్షను అమెరికా ఇకపై అడ్డుకోదు. ఈయూతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు. ఆ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యం?ఇతర దేశాల్లో లేని ఆరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ కేంద్రంగా మారింది. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటివి నిక్షిప్తమ య్యాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ను ప్రపంచంలోనే విలువైన ఖనిజ వనరులు కలిగిన దేశంగా నిలబెట్టింది. ఆధునిక కాలానికి అవవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వ వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటివి ఉక్రెయిన్లో పుష్కలంగా ఉన్నా యి.ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడిమియం, డిస్ప్రోసి యం, నియోబియం, టాంటాలమ్, బెరీలియం, కోబాల్ట్, మాంగనీస్, జిర్కోనియం వంటి ఖనిజా లకు లోటులేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ప్రధానంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఉక్రెయిన్లోని ఖనిజ వనరులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5 శాతానికిపైగా ఉక్రెయిన్లోనే ఉండడం గమనార్హం.

ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్కు పాక్ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు. యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇజ్రాయెల్లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025
జాతీయం

ఢిల్లీ సహా ఉత్తరాదిన భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు శుక్రవారం ఉదయం ఈదురు గాలులు, వర్షాలతో అతలాకుతలమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతోపాటు, పలు చోట్ల చెట్లు కూలడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. వర్షం సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నజఫ్గఢ్ ప్రాంతంలోని ఖర్ఖారీలో ఇంటిపై చెట్టు కూలినపడినట్లు ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.భారీ వర్షం, తీవ్ర ఈదురుగాలుల కారణంగా ఒకే గది ఉన్న చిన్న ఇంటిపై పక్కనే ఉన్న చెట్టు కూలి పడింది. ఘటనలో ఆ ఇంట్లోని ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ(28), ఆమె ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహిళ భర్త గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో చావ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పాపారావత్ గ్రామంలో గోడ కూలి ఇద్దరు బాలురు సహా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధుర రోడ్లపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. ఘజియాబాద్లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపించాయి. ఫరీదాబాద్లో వరదలో సగం వరకు మునిగిన కారును జనం బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.200 విమానాలు ఆలస్యంఈదురు గాలుల ప్రభావం ఢిల్లీలో విమానాల రాకపోకలపైనా పడింది. మూడు విమానాలను దారి మళ్లించగా 200కు పైగా ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కుండపోతతో ట్రాఫిక్ అంతరాయం, వరదలు, చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలకు సంబంధించి 100 కాల్స్ అందాయని ఫైర్ విభాగం తెలిపింది.

సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం
తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్ అంతర్జాతీయ సీపోర్ట్తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్వాటర్ సీపోర్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్) ఈ డీప్వాటర్ పోర్ట్ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్ను కట్టాడని తెలిస్తే గుజరాత్ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్ ప్రపంచ టాప్–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్ భారత్కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్ అదానీ, శశిథరూర్ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్ సీపోర్ట్ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో శశిథరూర్ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్ అంతకుముందు ‘ఎక్స్’లో పోస్ట్చేశారు.

రోడ్డుపై వైమానిక గర్జన
షాజహాన్పూర్ (యూపీ): పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు మన సైన్యం దీటుగా బదులిచి్చంది. సంప్రదాయ యుద్ధక్షేత్రాలకు భిన్నంగా నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్స్టిప్పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది. పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్్రస్టిప్పై శుక్రవారం రాత్రి ఎయిర్ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్కు అనువైన తొలి ఎక్స్ప్రెస్వే గా ఈ మార్గం నిలిచింది. తొలిసారిగా శుక్రవారమే పరీక్ష గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్్రస్టిప్ను శుక్రవారమే తొలిసారిగా పరీక్షించారు. ఎయిర్ఫోర్స్ విభాగంలోని టాప్ ఫైటర్లు దీన్ని వినియోగించాయి. గంగా ఎక్స్ప్రెస్ వే ఇప్పటికే 85 శాతం నిర్మాణం పూర్తయింది. యూపీలో ఆగ్రా–లఖ్నవూ, పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేల మీదా ఎయిర్స్ట్రిప్లను నిర్మించారు.గంగా ఎక్స్ప్రెస్ వే మీద మాత్రమే ప్రస్తుతానికి రాత్రివేళ ఆపరేషన్కు అనువుగా అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను సిద్ధంచేశారు. ఈ ఎయిర్ర్స్టిప్ను సంఘవ్యతిరేక శక్తులు పాడుచేయకుండా కనిపెట్టేందుకు 250కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎయిర్్రస్టిప్ పరీక్షను స్వయంగా తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు వచ్చారు. రక్షణ శాఖ, యూపీ రాష్ట్ర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.రోజంతా చక్కర్లు రాత్రిపూట ల్యాండింగ్, టేకాఫ్కు ముందు పగటిపూట యుద్ధ విమానాలను ఎయిర్ర్స్టిప్పై చాలాసార్లు విజయవంతంగా దింపారు. యుద్ధ సమయాల్లో వైమానిక స్థావరాలు, రన్వేలను శత్రు విమానాలు ధ్వంసం చేస్తే అత్యవసరంగా యుద్ధ విమానాలను దించడానికి, మళ్లీ సమరానికి సిద్ధమై వెనువెంటనే టేకాఫ్ తీసుకోవడానికి వీలుగా ఎక్స్ప్రెస్ వేలపై ఇలా ఎయిర్్రస్టిప్లను నిర్మిస్తున్నారు. యుద్ధ సమయాల్లో సైనికులు, ఆయుధాలు, సైనిక ఉపకరణాలను మోసుకెళ్లే భారీ సరకు రవాణా విమానాలు సైతం దిగేలా వాటిని అత్యంత పటిష్టంగా నిర్మించారు.ఈ ఎయిర్్రస్టిప్ను అత్యంత అరుదుగా మాత్రమే వాడే అవకాశం ఉందని తెలిసి కూడా మన్నిక, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్నూ పరీక్షించారు.

పాక్పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్్కఫోర్స్కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్ను 2018 జూన్లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్ఏటీఎఫ్పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

వైన్ షాపు పర్మిట్రూమ్లో గొడవ.. యువకుడి మృతి
మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్ గౌడ్ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్ 5న తన స్నేహితులు అభినవ్ గౌడ్ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్పల్లిలోని దారువాలా వైన్ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. కావటి కేశవ్ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్ కూడా తన స్నేహితులతో పర్మిట్రూమ్లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్ గౌడ్ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్ ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్గౌడ్కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్ను శుక్రవారం అరెస్టు చేశారు.

నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు.

భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది. సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు. శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వంట బాగా లేదని భార్య హత్య దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్లోని అయ్యప్పనగర్లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్తో కలిసి అయ్యప్పనగర్లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు.
వీడియోలు


సీఎంవా లేక ఈవెంట్ మేనేజర్ వా .. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్


CHO: మా ఆవేదన ఒక్కటే... కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా


Narayana: అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు


కొలంబో విమానాశ్రయంలో పహల్గామ్ ఉగ్రదాడి అనుమానితుల అరెస్టు


బుగ్గమఠం భూముల సర్వే పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు


Rajendranagar: బిర్యానీ తిని భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త


అమ్మమ్మ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మధుమతి


అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబర్ మోసగాడి అరెస్ట్


Ding Dong 2.0: డింగ్ డాంగ్ 2.0 కామిక్ షో


గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలకు మజ్జి శ్రీనివాసరావు కౌంటర్