Rahul Gandhi
-
రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఆగ్రహం
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
ఢిల్లీ టూర్ లో రాహుల్ తో సీఎం రేవంత్ భేటీ
-
ప్రసంగాలు కాదు, యువతకు ప్రోత్సాహం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ)పై కేవలం మాటలు చెబితే సరిపోదని, నిర్మాణాత్మక కార్యాచరణ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మన పోటీదార్లు ఏఐలో నూతన సాంకేతిక విధానాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్తో ప్రసంగాలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని ఆక్షేపించారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కావాల్సిందల్లా ప్రోత్సాహమేనని సూచించారు. బలమైన ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాలన్నారు. ఉత్త మాటలు పక్కనపెట్టి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, తద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యుద్ధరీతుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేలా డ్రాగన్ దేశం చైనా అత్యాధునిక డ్రోన్ల ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదిగేలా ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీపై 9 నిమిషాల నిడివి గల వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయగల ప్రతిభ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇండియాకు ఉన్నాయని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను మాట్లాడిన వీడియోను సైతం రాహుల్ గాంధీ షేర్ చేశారు. యుద్ధ రంగంలో డ్రోన్ల ప్రాధాన్యతను ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. -
కమిటీ లేదా కమిషన్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రెండో విడత కులగణన పూర్తయిన వెంటనే, దానిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే దిశగా అధ్యయనం చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాందీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జరిపిన భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం కమిషన్ లేదా ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు చేయాలని.. అది ఇచ్చే నివేదిక మేరకు చట్టం తేవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. విద్య, వైద్య, ఉపాధి రంగాలతోపాటు వివిధ పదవుల నియామకాలు, నిధులు, కేటాయింపులు సహా విధానపరమైన నిర్ణయాలన్నీ కులగణన ఆధారంగా ఉండేలా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. శనివారం మధ్యాహ్నం రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించారు. దేశానికి రాష్ట్రమే రోడ్మ్యాప్ కావాలి రాష్ట్రంలో కులగణన నిర్వహించిన తీరు, అసెంబ్లీ ఆమోదం, చట్టబద్ధత కల్పించే దిశగా ప్రణాళికలు, బహిరంగ సభ తదితర అంశాలను రాహుల్కు రేవంత్ వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని, బీసీల జనాభా గతం కన్నా 6% మేర పెరిగిందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని.. త్వరగా ఆమోదించేలా బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దీని పై రాహుల్గాంధీ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే దిక్సూచిలా ఉండాలని, సామాజిక న్యాయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శి కావాలని సూచించారని తెలిసింది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని సమాచారం. పార్టీ,ప్రభుత్వ పదవులతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సామాజిక న్యాయ అంశానికి ప్రాధాన్యతనిచ్చి బలహీన వర్గాలకు రాజకీయ న్యాయం చేయాలని రాహుల్ సూచించారని తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై చట్టం.. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో బిల్లుపెట్టి, చట్టం చేస్తామని, ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాం«దీతో రేవంత్ పేర్కొన్నారని తెలిసింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేస్తామని వివరించారని సమాచారం. ఇక కులగణన డిమాండ్తో దేశవ్యాప్త ఉద్యమం చేయాలని, ఇందుకోసం ఇండియా కూటమి పక్షాలను కలుపుకొని పోవాలని ఈ భేటీలో నిర్ణయించారని తెలిసింది. ఇండియా కూటమి ఎంపీల ఆధ్వర్యంలో పార్లమెంటులో ఆందోళన చేపట్టాలని తీర్మానించారని సమాచారం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సభ నిర్వహించే అంశంలో కూటమి పార్టీల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసే బాధ్యతలను రేవంత్కు రాహుల్ గాంధీ అప్పగించారని తెలిసింది. ప్రతిపక్షాలు కాచుకుని ఉన్నాయి.. ఇటీవలి ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ, సీఎల్పీ సమావేశంలో వెలువడిన అభిప్రాయాలు, ప్రతిపక్షాల విమర్శలు వంటి అంశాలపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్నాయని, చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాహుల్ సూచించారని సమాచారం. ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందరితో సమన్వయం మొదలు ప్రభుత్వ పథకాల అమలు, కీలక నియామకాల వరకు అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని రేవంత్ పేర్కొన్నట్టు సమాచారం. -
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడర్ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ పారిపోయారు’
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అదే వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని’ కవిత వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన ఇబ్బందులు.. రాహుల్ పర్యటన రద్దురాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
తెలంగాణకు రాహుల్ గాంధీ
-
సడన్ టూర్.. నేడు వరంగల్కు రాహుల్ గాంధీ
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. -
‘మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy)పై మరోసారి ధ్వజమెతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీ పోయి కాంగ్రెస్కు గుండుసున్న తీసుకొచ్చిండని విమర్శించారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని రేవంత్ ప్రారంభించి.. ఢిల్లీలో ముగించాడని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ దాన్ని కొనసాగిస్తారని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.‘రాహుల్ గాంధీ (Rahul Gandhi)దేశంలో బీజేపీని గెలిపించి వస్తున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్గాంధీనే. కాంగ్రెస్ను ఓటేస్తే రైతుబంధుకు చరమగీతం అని కేసీఆర్ ముందే చెప్పారు. ఆయన హెచ్చరించినట్లే జరగింది. తెలంగాణ ప్రజల తిడుతున్నతిట్టు రేవంత్ వింటే తట్టుకోలేడు. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకివ్వడానికి వణికిపోతున్నాడు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్ బాల్ ఆడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. -
రాహుల్ కంగ్రాట్స్.. బీజేపీని గెలిపించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. మరోసారి బీజేపీని గెలిపించారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. వెల్డన్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!Well done 👏 https://t.co/79Xbdm7ktw— KTR (@KTRBRS) February 8, 2025ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. మూడోసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా ప్రభావం చూపించకలేకపోయింది. ఈ ఎన్నికల్లో గుండు సున్నా చుట్టేసింది. గత రెండు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
ఎన్నికల ప్రక్రియపై రాహుల్ సంచలన ఆరోపణలు..వెంటనే స్పందించిన ‘ఈసీ’
న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే స్పందించింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రశ్నలను,సూచనలను తాము గౌరవిస్తున్నామని త్వరలో ఈ విషయంపై స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివరాలన్నీ రాతపూర్వకంగా వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా, ఈసీ ప్రకటనకు ముందు రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జనాభా కంటే ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో పలు చోట్ల ఓట్లు నమోదయ్యాయన్నారు. గతేడాది మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికలకు, నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా 35 లక్షల మంది ఓటర్లుగా చేరడమేంటని రాహుల్ ప్రశ్నించారు.ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని,కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో పోలింగ్ బూత్కు మార్చారని ఆరోపించారు.మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరామని, దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇంతేగాక ఎంతమంది ఓటర్లను తొలగించారో,ఒక బూత్నుంచి మరొక బూత్కు ఓటర్లను ఎందుకు బదిలీ చేశారో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలున్నందునే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ ముందుకు రాలేని రాహుల్ అన్నారు. -
రాహుల్ గాంధీపై ప్రివిలేజ్మోషన్
న్యూఢిల్లీ:ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.వాస్తవాలను వక్రీకరించిన భారత్ పరువు పోయేలా మాట్లాడినందుకుగాను రాహుల్గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రక్రియ ప్రారంభించాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు దూబే స్పీకర్కు ఒక లేఖ రాశారు.మేక్ ఇన్ ఇండియా ఫెయిలనందుకే చైనా భారత్ను ఆక్రమించిందని రాహుల్ అవాస్తవాలు మాట్లాడారని స్పీకర్కు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు.పార్లమెంట్ వేదికగా దేశం పరువు తీసేలా రాహుల్ మాట్లాడరని ఆరోపించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని దూబే గుర్తు చేశారు.కాగా, లోక్సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్గాంధీ మాట్లాడారు. చైనా భారత్లో కొంత భాగాన్ని ఆక్రమించిందన్నారు. ఇంతేగాక విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనపైనా రాహుల్ విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపైనా రాహుల్ మాట్లాడారు. రాహుల్ ప్రసంగంలోని ఈ అంశాలన్నీ వివాదాస్పదమయ్యాయి. -
కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్వహించిన కులగణనలో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయని.. జనాభాలో 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశమంతటా ఇదే తరహా ధోరణి ఉందని, కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వ హించిన కులగణన అంశాన్ని ప్రస్తావించారు.‘‘తెలంగాణలో మేం కుల గణన నిర్వహించాం. అందులో విస్మయపరిచే అంశాలు గుర్తించాం. తెలంగాణలో సుమారు 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. దేశం మొత్తంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నేను నమ్ముతున్నా. దేశంలో ఓబీసీల జనాభా 50శాతానికిపైగా ఉంది. ఇంకా గమనిస్తే అది 55% వరకు ఉండొచ్చు. 16% దళితులు, 9% ఆదివాసీలు, 15% మైనార్టీలు ఉన్నారు..’’అని రాహుల్ పేర్కొన్నారు. అందరికీ భాగస్వామ్యం అందాలి.. దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అందులో అందరికీ భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘దళితులు, ఆదివాసీ, ఓబీసీ, మైనార్టీటలు ఈ దేశానికి ఆస్తుల వంటివారు. కానీ దేశంలోని ఎలాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలను పరిశీలించినా.. అవి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీటల యాజమాన్యంలో లేవు. పెద్దపెద్ద మీడియా సంస్థలు ప్రధాని మోదీకి మద్దతిస్తాయి. ప్రతిరోజూ నవ్వు ముఖాన్ని ప్రదర్శిస్తాయి. అలాంటి మీడియా ఎన్నడూ ఈ వర్గాల వారిని పట్టించుకోవడం లేదు. కేంద్రం ఎలాంటి కొత్త అభివృద్ధి నమూనాను ఆవిష్కరించాలని భావించినా.. అది కేవలం కులగణనను ఈ సభలో టేబుల్పై ఉంచితేనే సాధ్యమవుతుంది. ఒక్కసారి కులగణన చేస్తేనే దేశంలోని 90శాతం జనాభా సంపద, శక్తి ఉందో తెలుస్తుంది’’అని చెప్పారు. బీజేపీ ఎంపీలకు అధికారం లేదన్న రాహుల్.. మండిపడ్డ బీజేపీ.. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో లోక్సభలో అధికార పార్టీ సీట్లను చూపిస్తూ.. ‘‘బీజేపీలో ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. జనాభాలో వారు 50 శాతంగా ఉన్నా వారికి కచి్చతంగా అధికారం మాత్రం లేదు. మీరు అధికారపక్షంలో కూర్చున్నా.. నోరు మెదపలేరు. అదే దేశంలో వా స్తవం’’అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఇతర ఎంపీలు లేచి.. ప్రధాని మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారని.. మీకు కళ్లు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని, వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించాలని కోరారు. ‘‘కులగణనకు ఏఐని వర్తింపజేసినప్పుడు ఆ శక్తిని ఊహించండి. కులగణన నుంచి మనకు లభించే డేటాను ఏఐతో విశ్లేíÙంచినప్పుడు.. ఏఐ తో మనం ఏం చేయగలమో, ఈ దేశంలో సామాజిక విప్లవంతో ఏం చేస్తామో ఊహించండి’’అని రాహుల్ పేర్కొన్నారు.ఆ హల్వా ఎవరికి తినిపించారో! ఇటీవలి బడ్జెట్ సెషన్ సందర్భంగా హల్వా తయారీకి సంబంధించిన ఫొటో అంశాన్ని రాహుల్ గుర్తు చేశారు. ‘‘గత సెషన్లో హల్వా తయారు చేసే ఫొటో గుర్తుండే ఉంటుంది. ఈసారి ఆ ఫొటోనే బయటికి రాలేదు. హల్వా తినిపించారు. కానీ ఎవరికి తినిపించారో చూపించలేదు’’అని రాహుల్ ఎద్దేవా చేశారు. -
మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను కలిపారు
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే రాష్ట్రంలో జూన్లో లోక్సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు. -
రాహుల్గాంధీకి జైశంకర్ కౌంటర్
న్యూఢిల్లీ:తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాను అమెరికా వెళ్లడంపై రాహుల్ సోమవారం(ఫిబ్రవరి3) లోక్సభలో చేసిన వ్యాఖ్యల పట్ల జైశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.రాహుల్ గాంధీ చెప్పేదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.తన అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని సెక్రటరీ,ఎన్ఎస్ఏను కలిసేందుకు అక్కడి వెళ్లానని జైశంకర్ తెలిపారు.ప్రధాని మోదీకి ఆహ్వానం కోసం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు’అని జైశంకర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు. -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం
-
యూపీఏపైనా రాహుల్ విమర్శలు.. లోక్సభలో ఆసక్తికర పరిణామం
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్సభలో రాహుల్గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను ముందుగా అమెరికా పంపారని రాహుల్గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.యూపీఏనూ విమర్శించిన రాహుల్గాంధీ..యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్గాంధీ లోక్సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. -
కేజ్రీ యమునా జలం తాగాలి: రాహుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. -
బుల్లి కారులో వచ్చి శీష్మహల్ స్థాయికి ఎదిగారు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు. అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు. -
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
ఓవైపు గాంధీ పరివార్.. మరోవైపు గాడ్సే పరివార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి గాంధీ పరివారం.. మరోటి గాడ్సే పరివారం. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్గాంధీ పోరాడుతున్నారు. గాడ్సే పరివారం నుంచి మోదీ ఉన్నారు. మనమంతా గాంధీ పరివారంగా రాహుల్గాందీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ నేతృత్వంలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..’ అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఓ యుద్ధమని అభివర్ణించారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారు. గజనీ మహ్మద్ నాడు భారత్ను దోచుకునేందుకు యత్నించినట్టు నేడు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. మోదీ యత్నాలు ముందే గుర్తించిన రాహుల్గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. నాడు బ్రిటిషర్ల నుంచి దేశాన్ని మహాత్మాగాంధీ రక్షించినట్టు నేడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన నిలబడ్డారు. ఈ యుద్ధంలో అందరూ రాహుల్గాంధీతో కలిసి నడవాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేతాజీపై రాహుల్ గాంధీ పోస్ట్.. ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్కతాలోని భవానిపూర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పీఎస్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్ రోడ్లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్ఎం హెచ్చరించింది. నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. -
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్గాంధీపై బీహార్లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్కు వెళ్లి రాహుల్గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
పరువు నష్టం కేసులో రాహుల్కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్పాత్పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్పాత్లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్పాత్లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
న్యాయం, సమానత్వం కోసం.. రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత (Rahul Gandhi)రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం , (white T-shirt)‘వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. వారు అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురి కావాల్సి వస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇటువంటి పరిస్థితుల్లో, వారికి న్యాయం, హక్కులు దక్కేందుకు గట్టిగా నినదించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇందుకు వైట్ టీ–షర్ట్ ఉద్యమం చేపట్టామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కావాలనుకునే వారు https://whitetshirt.in/home/hin అనే లింకును తెరవాలని, లేదా 9999812024 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన కోరారు. -
కూలదోయబోయి కూలబడ్డారు
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ
-
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
ఈ నెల 27న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించనున్న జైబాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభకు వీరు హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న వీలుకాకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఖర్గే, రాహుల్లు వస్తారని అన్నారు.శనివారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టి మాట్లాడుతూ, ఈనెలాఖరుకల్లా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తి చేస్తారని, ఈ మేరకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి టీపీసీసీకి ముగ్గురు లేదా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, ఎంతమందికి ఆ పదవి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తామని, సమర్థులైన నాయకుల కోసం చూస్తున్నామని చెప్పారు.పార్టీ కార్యవర్గం నియామకంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడారన్నది పరిశీలించాల్సి ఉందని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి త్వరలోనే చేరికలుంటాయని, ఎమ్మెల్యేలు కూడా చేరతారని మహేశ్గౌడ్ వెల్లడించారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటామన్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో
కాంగ్రెస్ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడిగా మారింది. ఏ ప్రదేశానికి వెళ్లినా, ఏ మీటింగ్కు హాజరైనా జనంతో మమేకం కావడం రాహుల్ గాంధీకి బాగా అలవాటు. అలా ఇటీవల కాఫీ చైన్ను సందర్శించిన సందర్భంగా, స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేశారు. కెవెంటర్స్ స్టోర్ను సందర్శించి అక్కడ కోల్డ్ కాఫీ తయారు చేసిన అనుభవాన్ని సోషల్ స్వయంగా రాహుల్ గాంధీ మీడియాలో పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక పాపులర్ కాఫీ షాప్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు, సిబ్బందితో సంభాషించారు. కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం మీ లెగసీ బ్రాండ్ను ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అని అడిగినపుడు కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తన కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారని తెలిపారు. అక్కడున్న అభిమానులతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. (లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!)కెవెంటర్స్ సిబ్బంది కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలనుకుంటున్నారా అని అడిగి మరీ కోల్డ్ కాఫీ తయారీ గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే “లేదు,లేదు.. నేను తయారు చేస్తాను’’ అంటూ తానే చేస్తానని రాహుల్ ముందుకు రావడం విశేషం. స్టోర్ సిబ్బంది సూచనలతో దాన్ని తయారుచేసి కస్టమర్కు అందించడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాదు కెవెంటర్స్ నిజాయితీగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారు. తరతరాలుగా మన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నఇలాంటివారికి మద్దతివ్వాలని పేర్కొన్నారు రాహుల్. ఇదీ చదవండి: బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా ,అగస్త్య దాల్మియాతో వారి వ్యాపారం ,విస్తరణ ప్రణాళికల గురించి కూడా మాట్లాడారు. ఇపుడు తమ దృష్టిని టైర్ 2, టైర్ 3 ,టైర్ 4 నగరాలపై కేంద్రీకరిస్తున్నామని తెలిపారు.How do you shake up a legacy brand for a new generation and a new market?The young founders of Keventers shared some valuable insights with me recently.Play-fair businesses like Keventers have driven our economic growth for generations. We must do more to support them. pic.twitter.com/LSdiP8A9bQ— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2025కాగా కెవెంటర్స్ సంస్థ ఇటీవలే వందేళ్లు పూర్తిచేసుకుంది. ఇటీవల కంపెనీ వాఫ్ఫల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇవి భారతదేశం అంతటా 170 కి పైగా ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. రూ. 99 ప్రారంభ ధరకు, కెవెంటర్స్ వాఫ్ఫల్స్ ఆరు ప్లేవర్లలో లభిస్తాయి. క్లాసిక్ హనీ బటర్, లోటస్ బిస్కాఫ్, కిట్ కాట్ క్రంచ్, నుటెల్లా, ట్రిపుల్ చాక్లెట్ . వైట్ చాక్లెట్. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
మన్మోహన్సింగ్ను ఎన్డీఏ అవమానించింది: రాహుల్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని(BJP-Led NDA) ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ లో రాహుల్ విమర్శలు గుప్పించారు.‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. సిక్కు కమ్యూనిటీకి తొలి ప్రధాని కూడా. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అటువంటి ఆయన్ను అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్( Nigam Bodh Ghat)లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్సింగ్కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. भारत माता के महान सपूत और सिख समुदाय के पहले प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार आज निगमबोध घाट पर करवाकर वर्तमान सरकार द्वारा उनका सरासर अपमान किया गया है।एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024 -
ప్రముఖులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫొటోలు)
-
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.మల్లికార్జున్ ఖర్గేఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్గా చేసుకున్నారు. ‘భారత్లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.లాలూ ప్రసాద్రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్లైన్స్లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.రాహుల్ గాంధీరాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్లో రాహుల్ మాట్లాడుతూ భారత్లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.గిరిరాజ్ సింగ్కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.ఇల్తిజా ముఫ్తీఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.సామ్ పిట్రోడాలోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.భాయ్ జగ్తాప్కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ గతంలో ఎన్నికల కమిషన్ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం -
పార్లమెంట్ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్పుత్ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్పుత్లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
KSR Live Show: రాహుల్ గాంధీపై కేసు తప్పదా?.. బీజేపీ నేత కిశోర్ కామెంట్స్
-
రాహుల్గాంధీపై హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ:లోక్సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్గాంధీపై కేసు పెట్టింది.‘మా పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.BJP files police complaint against Rahul Gandhi for assault, incitementRead @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024 ‘రాహుల్ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.అమిత్ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై నాగాలాండ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా
Parliament Session Live Updates..👉పార్లమెంట్ వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. Rajya Sabha adjourned till 2 pm today amid uproar in the House over Union HM Amit Shah's statement in the House on Babsaheb Ambedkar. pic.twitter.com/j4ol3Ix4Ui— ANI (@ANI) December 19, 2024తోపులాట ఇలా జరిగింది.. 👉ఇండియా బ్లాక్, బీజేపీ నేతలు ఒకరిపైపు ఒకరు దూసుకెళ్లారు. నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో గుంపు ఏర్పడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతోనే ఆయన కింద పడిపోయినట్టు తెలుస్తోంది. #WATCH | MPs of INDIA bloc and BJP came to face at the Parliament premises earlier today while carrying out their respective protests over Dr BR Ambedkar.INDIA MPs are demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar… pic.twitter.com/IhryQTbKoQ— ANI (@ANI) December 19, 2024 పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయంపార్లమెంట్ బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడిపోయారు. దీంతో, ఆయనకు కంటి వద్ద గాయమై స్వలంగా రక్తం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ సారంగి మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్ నేత రాహుల్ తోసివేసినట్టు చెప్పారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు ఆరోపించారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024అనంతరం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను లాగే ప్రయత్నం జరిగింది. అనంతరం, లోపులాట చోటుచేసుకుంది. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024 లోక్సభ వాయిదాpic.twitter.com/Ng1cxNL4oI— LOK SABHA (@LokSabhaSectt) December 19, 2024రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడ్డాయి.పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలుపార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.రాజ్యసభలో అంబేద్కర్పై అమిత్షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులుకాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన#WATCH | Delhi | INDIA bloc holds protest march at Babasaheb Ambedkar statue in the Parliament complexThey will march to Makar Dwar, demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar in Rajya Sabha. pic.twitter.com/4cmM90DWpY— ANI (@ANI) December 19, 2024 #WATCH | Delhi: BJP MPs protest in Parliament, alleging insult of Babasaheb Ambedkar by Congress party. pic.twitter.com/HRF2UFfucd— ANI (@ANI) December 19, 2024శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇంకా బీజేపీ చేసేదేమీ లేదు. అమిత్ షా దేశానికి హోంశాఖ మంత్రి. అంబేద్కర్పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన అంబేద్కర్కు క్షమాపణలు చెప్పడం నేరమేమీ కాదు కదా?. అంబేద్కర్ది దేవుడి లాంటి వ్యక్తిత్వం. దేశంలోని వెనుకబడిన వారికి గౌరవం అందించిన వ్యక్తి. అంబేద్కర్ విషయంలో అమిత్ షా తప్పుడు పదాలు ఉపయోగించారు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. #WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, "BJP has no work left. BJP is a party which is sitting idle. Amit Shah is the Home Minister of the country. If he has made a mistake, if there was a slip of the tongue, he should apologise. There is no crime in apologising over Dr… https://t.co/JdVCWRpk0k pic.twitter.com/OTojRiNotq— ANI (@ANI) December 19, 2024 -
‘అమిత్షా క్షమాపణలు చెప్పాల్సిందే’
ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్షా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్,అంబేద్కర్ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు. "अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."अमित शाह ने बेहद घृणित बात की है. इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.नफरत… pic.twitter.com/UMvMAq43O8— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024 అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్తో విభేదిస్తారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్బాటెన్, అల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
సావర్కర్ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్పై విమర్శలు రాహుల్కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో హథ్రాస్ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం
-
గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది: లోక్సభలో ప్రధాని మోదీ
Live Updates..రాజ్యాంగంపై చర్చ.. ప్రధాని మోదీ సమాధానంఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాంరాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలుప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాంఅందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుందిభారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందిమనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడామనది మదర్ ఆఫ్ డెమోక్రసీదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందిత్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుందిరాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారువివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు.భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకతభారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించిందిఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిందిభారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పదిమన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు.ప్రజా స్వామ్య దేశాలు భారత్ను విశ్వసిస్తున్నాయి.గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది.కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారుకాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందిప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. లోక్సభలో రాజ్యాంగంపై వాడీవేడీ చర్చ..కాసేపట్లో ప్రతిపక్ష నేతల ప్రశ్నలపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీపార్లమెంటులో రాజ్యాంగంపై రెండో రోజు కొనసాగుతున్న చర్చరాజ్యాంగ చర్చలో.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26.. మతపరమైన విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వాహణకు వెసులుబాటు కల్పించింది కానీ, ప్రధాని మాత్రం వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంతో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అసలు ఈ ప్రధానికి పాఠాలు నేర్పింది ఎవరు?. ఆయన్ని(ప్రధాని మోదీని ఉద్దేశించి..) ఆర్టికల్ 26 చదవమనండి. వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్రను కేంద్రం చేస్తోంది #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, AIMIM MP Asaduddin Owaisi says, "Read Article 26, it gives religious denomination, the right to establish and maintain institution for religious and charitable purposes. The Prime Minister… pic.twitter.com/5KOoRAe6Vm— ANI (@ANI) December 14, 2024 అందుకే కులగణన.. రాజ్యాంగ చర్చలో రాహుల్ గాంధీ50 శాతం రిజర్వేషన్ అనే గోడను మేం బద్ధలు కొడతాంఅందుకే కులగణనని తెరపైకి తెచ్చాంమీరేం చెప్తారో.. చెప్పుకోండిదేశం కోసం రాజ్యాంగం.. ఇండియా కూటమి సిద్ధాంతంరాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ కూటమి ఉందిఆర్థిక-సామాజిక సమానత్వాలు లేకుండా రాజకీయ ఐక్యత మనుగడ కష్టమని అంబేద్కర్ చెప్పారుఇవాళ అదే ప్రతీ ఒక్కరి ముందు కనిపిస్తోందిరాజకీయ సమానత్వం లేకుండా పోయిందిదేశంలోని వ్యవస్థలన్నింటిని గుప్పిట పట్టేశారుసామాజిక, ఆర్థిక సమానత్వాలు లేకుండా పోయాయిదళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రామికులు.. దేశంలో వీళ్లు(బీజేపీ) ఎవరి బొటనవేళ్లు కత్తిరిస్తున్నారో దేశానికి చూపించాలనుకున్నాంఈ క్రమంలోనే కులగణన మా తదుపరి అడుగు అయ్యిందికులగణనతో భారత్లో సరికొత్త అభివృద్ధికి బాటలు వేస్తాంఅలా రాజ్యాంగంలో ఉందా? చూపించండి: రాహుల్ గాంధీకుల, వర్ణ, వర్గ, లింగ.. వివక్ష రహిత సమాజం కొనసాగాలని రాజ్యాంగంలో ఉంది.కొన్నిరోజుల కిందట.. సంభల్ నుంచి కొందరు యువకులు నన్ను చూడడానికి వచ్చారుఅమాయకులైన ఐదుగురు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడ్డారుఅలా చంపేయమని రాజ్యాంగంలో రాసి ఉందా?మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారు.హాథ్రస్ సామూహిక అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాబాధితులు మాత్రం ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి.ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్ని ఉసిగొల్పాలని, ఒక దళిత కుటుంబాన్ని బంధించాలని నేరాలు చేసిన వాళ్లను స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?రాజ్యాంగంలో అలా ఎక్కడ రాశారు? నాకు చూపించండి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోంది. బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉంది లోక్సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅగ్నివీర్తో దేశ యువత బొటనవేలు తెంపేశారుదేశవ్యాప్తంగా 70 పేపర్ల లీకేజీ ఘటనలు వెలుగు చూశాయిపేపర్ లీక్లతో యువత బొటనవేలు తెంపేశారుఢిల్లీ సరిహద్దులో రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.. రైతులపై లాఠీ ఛార్జీలు చేస్తున్నారువాళ్లు మిమ్మల్ని కోరేది మద్దతు ధర.. ఆ డిమాండ్ సబబైందేకానీ, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తూ.. అన్నదాతల బొటనవేలు కూడా తెంపేశారుఅభయ ముద్రతో మేం(కాంగ్రెస్) ‘‘భయపడొద్దు’’ అని ప్రజలకు చెప్తుంటే.. మీరేమో వాళ్ల బొటనవేలు తెంచేస్తున్నారుఇదే మీకు మాకు ఉన్న తేడా! లోక్సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅనేకమంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగందేశంలో ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారుసావర్కర్ సిద్దాంతాలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారురాజ్యాంగం, మనుస్మృతి వేర్వేరురాజ్యాంగం ఆధునిక భారత దస్త్రం.. కానీ, ప్రాచీన భారతం, దాని ఆలోచనలు అందులో ఉన్నాయిరాజ్యాంగాన్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయిసావర్కర్ గురించి ప్రశ్నిస్తే నన్ను దోషిగా చూస్తున్నారుమహాభారతంలోని కులవివక్షను ప్రస్తావించిన రాహుల్ గాంధీఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడునువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడుద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడుద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడుద్రోణుడి మాదిరిగానే మీరు(కేంద్రాన్ని ఉద్దేశించి..) కూడా దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు. #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "This is Abhayamudra. Confidence, strength and fearlessness come through skill, through thumb. These people are against this. The manner in which Dronacharya… pic.twitter.com/nIropoeCfq— ANI (@ANI) December 14, 2024#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "I want to start my speech by quoting what the Supreme Leader, not of the BJP but of the modern interpretation of the ideas of the RSS has to say about the… pic.twitter.com/eS7HGR8Ivp— ANI (@ANI) December 14, 2024 జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం: కార్తీ చిదంబరం👉వన్ నేషన్ వన్ ఎలక్షన్పై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. డీఎంకేతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య నిర్మాణాన్ని తీసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది. రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చాలా మంచివి. రాష్ట్ర ఎన్నికలు రాజకీయ పార్టీలను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రజలకు అవకాశం ఇస్తాయి అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: On One Nation One Election, Congress MP Karti Chidambaram says, "The Congress party will oppose this proposal and many regional parties including the DMK oppose the proposal. It is yet another attempt by the government to take away the federal structure. Having… pic.twitter.com/kK2CfP1KFm— ANI (@ANI) December 14, 2024అలా చేయడం నియంతృత్వమే.. 👉జమిలి ఎన్నికలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ..‘1966-68 వరకు ప్రతీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే అన్ని ఎన్నికలు కలిసి జరిగేవి. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం ప్రారంభమైన తర్వాత వ్యవస్థ మారిపోయింది. సంకీర్ణాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వం పడిపోతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవద్దు. ప్రతిపక్షంతో మాట్లాడకుండా దీనిని తీసుకురావడం నియంతృత్వం అవుతుంది.#WATCH | Delhi | On One Nation One Election, TMC MP Kirti Azad says, “Till 1966-68, all the elections used to happen together because the government used to run for 5 years. But then the system changed because coalition governments started forming and sometimes the government… pic.twitter.com/Cjiz5jzSNA— ANI (@ANI) December 14, 2024 👉దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అంశం లోక్సభలో చర్చకు వచ్చింది.. ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటరిచ్చారు. 👉లోక్సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. మన దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ప్రతిపక్ష నేతలు ఎందుకు అంటున్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ ఒక్క పార్టీ కోసమో చెప్పడం లేదు. నేను దేశం కోసం చెబుతున్నాను.👉యూరోపియన్ యూనియన్లోని సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ సర్వే ప్రకారం.. యూరోపియన్ యూనియన్లో 48% మంది ప్రజలు వివక్షకు గురయ్యారు. అందులో ముస్లింలు, హిందువులు, మైనారిటీలు కూడా ఉన్నారు. స్పెయిన్లో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లింలపై అంతర్గత ద్వేషపూరిత నేరాల నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో కూడా పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాలను వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ సహా టిబెట్లో జరుగుతున్న పరిణామాలను సైతం చెప్పారు. అలాంటప్పుడు ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ఎందుకంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. #WATCH | In Lok Sabha, Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...A narrative is being created. According to the survey of the Center for Policy Analysis in European Union, 48% people in European Union have been victims of discrimination. Most of them are… pic.twitter.com/oqZVtpGLDn— ANI (@ANI) December 14, 2024👉రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఇరుపక్షాల మధ్య మధ్య ఇవాళ లోక్సభలో వాడీవేడి చర్చ జరగనుంది. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడనున్నారు. 👉లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చలో.. ఇవాళ కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. రాజ్యాంగంపై చర్చలో.. రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలూ మాట్లాడతారు. సాయంత్రం.. ఆఖర్లో ప్రధాని ప్రసంగంతో ఈ చర్చ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ప్రియాంక గాంధీ.. ఇవాళ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు, విమర్శలకు మోదీ స్పందించనున్నారు.👉పార్లమెంట్ వద్ద ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. విపత్తుకు గురైన వయనాడ్కు స్పెషల్ ప్యాకేటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. హిమాచల్లో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. ఈ మేరకు సాయం కేంద్రాన్ని కోరాం. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం. కానీ, విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. విపత్తును కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అక్కడ నివస్తున్న వాళ్లు కూడా భారతీయలే అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "The government is refusing to give a special package to Wayanad. We have requested the Home Minister, we have written to the Prime Minister...Himachal Pradesh has also seen similar large-scale devastation and there is a… https://t.co/mIyBAQipwu pic.twitter.com/7xdie56kHH— ANI (@ANI) December 14, 2024👉తొలిరోజు.. శుక్రవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. 👉ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. పార్లమెంట్లో తొలి ప్రసంగం చేసిన ఆమె.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు.ఎల్లుండి జమిలి బిల్లు👉సోమవారం లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్ వెళ్లనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా సోమవారం లోక్సభ బిజినెస్లో లిస్ట్ జమిలి ఎన్నికల బిల్లును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. 👉లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించారు. మధ్యలో అసెంబ్లీలు రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే ఎన్నికల నిర్వహణ జరిగేలా బిల్లులో సవరణలు చేశారు. అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, జమ్మకశ్మీర్, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అపాయింటెడ్ డే తర్వాత ఒకే సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. 👉ఇదిలా ఉండగా.. అపాయింటెడ్ డే 2029 కంటే ముందే ఉంటుందా? లేదా అనేదానిపై భిన్నమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే జమిలి ఎన్నికల బిల్లు చట్ట రూపం దాల్చే అవకాశం ఉంది. -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు.. రాహుల్పై నిర్మల ఫైర్
ఢిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించే వారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకుల సిబ్బందికి ఫోన్లు చేసి మరీ వేధించేవారు. రుణాల ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్తో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజేపీ హాయంలోనే 54 కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్-అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్టు తెలిపారు. -
‘చేతి’కి ఓటేస్తే.. చేతగాని సీఎంను రుద్దారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి పంపుతున్న మూటలపై ఉన్న శ్రద్ధ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. రాష్ట్రంలో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆగమాగం చేసిందని, అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఎం మతిలేని నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు అధోగతి పాలవుతుంటే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘విషమే తప్ప విషయం లేని సీఎం చేతిలో ఏడాది పాలనలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కాంగ్రెస్ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులతో ఫొటోలకు పోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. హైడ్రా, మూసీ పేరిట నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చరిత్రను లిఖించింది. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టించారు. రేవంత్ చేసిన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం. అసలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉంది. ఆ విగ్రహాలను గాంధీ భవన్కు సాగనంపుతాం ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాందీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చుతాం. సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను మీ పార్టీ కార్యాలయం గాందీభవన్కు సకల మర్యాదలతో సాగనంపుతాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ను సీఎం ఇకనైనా మానుకోవాలి. మేం పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
జరగబోయేది అదే.. రాహుల్కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? ♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం? -
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్నాథ్తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్కు వస్తున్న రాజ్నాథ్ సింగ్కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
ఇది వరకు కేవలం ప్రధాని అభ్యర్ధి ఎవరనే విషయంలోనే లుక లుకలు బయటపడేవి!
-
రాహుల్ ఉన్నతస్థాయి ద్రోహి: బీజేపీ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్షం ముసుగులో రాహుల్.. ఉన్నతస్థాయి దేశ ద్రోహిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. అమెరికాకు చెందిన ఏజెన్సీలు, బిలియనీర్ జార్జ్ సోరోస్లతో రాహుల్ను పోల్చుతూ బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నవేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశాన్ని అస్థిరపర్చేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని సాంబిత్ పాత్రా మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, ఆయన మద్దతున్న ఓసీసీఆర్పీ మధ్య ఓ ముక్కోణపు బంధం ఉందని విమర్శించారు. రాహుల్ దేశానికి ద్రోహం చేస్తున్నాడని, సోరోస్ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర‘త్రిభుజానికి ఒకవైపు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్, అమెరికాకు చెందిన కొన్ని ఏజెన్సీలు, మరోవైపు సొరేస్ మద్దతున్న OCCRP పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ ఉన్నాయి. త్రిభుజం చివరి మూలలో రాహుల్ గాంధీ, ‘ఉన్నత స్థాయి ద్రోహి’ అని అనడానికి నేను భయపడను. లోక్సభలో ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తనకు ఎలాంటి సందేహం లేదు. సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఓసీసీఆర్పీ ఆదేశాలను పాటిస్తున్నారు. రాహుల్, సోరోస్ ఇద్దరూ ఒకటే. ఒకరు బాధ పడితే మరొకరు కలత చెందుతారు. తన అజెండాలను నెరవేర్చుకోవాలని ఆ బిలియనీర్ కోరుకుంటున్నారు. ఆయనకు రాహుల్ సాయం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలకు ముప్పుతేవడమే వారిద్దరికీ కావాలి. దేశాన్ని విభజించాలని చూసేవారు ప్రగతిని చూడలేరు.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్
-
సంభల్ ఉద్రిక్తతలు.. తిరిగి ఢిల్లీ ప్రయాణమైన రాహుల్, ప్రియాంక
పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం ‘మేం సంభల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు. అడ్డుకుంటున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకూ నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, వారు అందుకు అంగీకరించడం లేదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు.అటు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్కు ఉంది. ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్ చేశారు. అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాహుల్ ప్రియాంకదాదాపు 2 గంటల తర్వాత ఢిల్లీకి పయనమైన నేతలుసంభల్ సందర్శనకు అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న ప్రియాంక, రాహుల్ఘాజీపూర్లో వీరి కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు.ఢిల్లీ టు సంభల్ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులుఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు #WATCH | Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/EcPEOFahIV— ANI (@ANI) December 4, 2024న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని సంభల్ అల్లర్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. సంభాల్లోని మసీదులో సర్వే కారణంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాహుల్, ప్రియాంక వెంట ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని 10 జనపథ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Visuals from Ghazipur border where Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police on the way to violence-hit Sambhal. pic.twitter.com/eqad86lxr0— ANI (@ANI) December 4, 2024 ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ–సంభల్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఘాజీపూర్ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే సంభల్లో శాంతిభద్రతల దెబ్బతిన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఆడ్డుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా బయటి వ్యక్తులను ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతించబోమని పోలీసులు, జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం జిల్లాలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. ఇక నిషేధాజ్ఞలను డిసెంబర్ 31 వరకు పొడిగించారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్ పోలీసు కమీషనర్లకు.. అమ్రోహా, బులంద్షహర్ పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. రాహుల్ సోనియా గాంధీలను ఆపాలని లేఖలో కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. కనీసం నలుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభాల్కు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.కాగా సంభల్లోని షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కొందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంభల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్, మరో 700 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.. -
లోక్సభలో ప్రియాంక సీటింగ్ ఖరారు.. మోదీ, రాహుల్ స్థానాలు కూడా!
18వ లోక్సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.రాహుల్ గాంధీ 498వ స్థానంలో..వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. -
అటు ప్రేమ, ఇటు వివక్ష
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్గాంధీ పాల్గొని ప్రసంగించారు. ‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు. అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు. బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే. రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు. -
నేడు వయనాడ్కు రాహుల్, ప్రియాంక
వయనాడ్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా శనివారం కేరళలోని వయనాడ్లో పర్యటించనున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్లో మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నాయి. కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక, రాహుల్ కలుసుకుంటారని తెలిపాయి. వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్లో పర్యటించబోతున్నారు. తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
కాంగ్రెస్కు మరో షాక్.. బాంబు పేల్చిన మమత!
ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయాల నేపథ్యంలో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో చీలికలను సంకేతాలిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ విజయం పక్కా అనుకున్నప్పటికీ హర్యానాలో ఓటమి.. మహారాష్ట్రలో కూడా దారుణ ఫలితాలు రావడంతో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. మొదటి నుంచి ఇండియా కూటమిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్.పార్లమెంట్ సమావేశాల వేళ కూటమిలో చీలికకు సంకేతాలిస్తూ కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు చేశారు. అలాగే, మిత్రపక్షం కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోదని టీఎంసీ పేర్కొంది. పార్లమెంట్ లో బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా సభను నిర్వహించాలని కోరింది. అవినీతిపై పార్లమెంట్లో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలనుకుంటున్నట్టు టీఎంసీ వెల్లడించింది. బెంగాల్ కు నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి నిధుల రావాల్సి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్ లో చర్చించాలనుకుంటున్నాం అని టీఎంసీ సభ్యులు తెలిపారు.ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికలలో మొత్తం ఆరు స్థానాలను, లోక్సభ ఎన్నికలలో 40 నియోజకవర్గాలలో 29 స్థానాలను గెలుచుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందడంపై కూడా టీఎంసీ ఘాటు విమర్శలు చేసింది. -
తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా ఇదే తరహాలో కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన ఫలితాల ఆధారంగా పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తోల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఏం చేసినా, ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కులగణనను ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చాం. కులగణన ఏదో మూసి ఉన్న గదిలో పది పదిహేను మంది రూపొందించినది కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అంతా కలసి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇది చరిత్రాత్మకం. కర్ణాటక, తెలంగాణలాగే.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం. తెలంగాణలో కులగణన ఫలితాలు వస్తే.. దాని ఆధారంగా మేం పాలసీలు రూపొందిస్తాం. బీజేపీ భయపడుతోంది కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి. నాలుగైదు శాతం మంది కోటీశ్వరుల కంట్రోల్లో ఈ దేశాన్ని పెట్టాలని బీజేపీ భావిస్తుంది. కులగణన చేయడం, రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారానే దానిని ఛేదించగలుగుతాం. అదే పనిలో మేమున్నాం. దీనిని తెలంగాణ, కర్ణాటకలలో చేశాం. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల డేటా తీస్తాం. అభివృద్ధి, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం ఎంత? భవిష్యత్తు ఏమిటి? అనేదే మా లక్ష్యం. ఈ వేదికపై రోహిత్ వేముల ఫొటో ఉంది. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నారు. కానీ వీళ్లు (కేంద్ర ప్రభుత్వం) రోహిత్ వేముల గొంతు నొక్కేశారు. యువత కలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు.. ఆదివాసీలా? దళితులా? దేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ వీరి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఆదివాసీలా? దళితులా? దేశంలో 90 శాతం ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానికి కులగణన, రిజర్వేషన్ల పెంపు ఒక్కటే మార్గం. ఆ దిశగా ఉన్న అడ్డుగోడలను తొలగించి చూపిస్తాం. కులగణన విషయాన్ని ఊరూవాడాలో ప్రచారం చేయాలి..’’అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. -
రాహుల్ తిట్టినందుకే అదానీ విరాళం వెనక్కి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్రెడ్డి వెనక్కి తగ్గాడు. అదానీ విరాళంగా రూ.100 కోట్ల చెక్ను ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనుక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా?..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ‘అదానీ ఫ్రాడ్ అని రేవంత్కు ఇప్పుడే తెలిసిందా? అదానీని రాహుల్గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాల రేవంత్రెడ్డిగా మార్చుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ అసలైన శాడిస్ట్..: ‘అదానీ విషయంలో రాహుల్గాందీకి, రేవంత్కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. చిట్టి నాయుడికి చిప్ దొబ్బినట్లు కనిపిస్తోంది. అదానీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెట్టడాన్ని ప్రశ్నించిన నేను సైకోనా? తాను తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న రేవంత్ అసలైన శాడిస్ట్. రేవంత్ మాదిరిగా కాళ్లు పట్టుకోవడం, లుచ్చా పనులు చేయడం, మస్కా కొట్టడం, గౌతమ్ భాయ్ అంటూ తిరిగే రకం కాదు మేము. నేను దావోస్లో అదానీతో కలిసి దిగిన ఫోటోను బహిరంగంగా ట్విట్టర్లో పెట్టా. కానీ రేవంత్ తరహాలో ఆయనను ఇంటికి పిలుచుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. కోహెనూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. అదానీ కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాకు లేదు..’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి అనుమతులపై అబద్ధాలు ‘సీఎం ప్రతి అంశంపైనా అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవం మంటగలుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ను అదానీతో ముడి పెడుతూ సీఎం ప్రెస్మీట్లు పెడుతున్నాడు. రక్షణ శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. డ్రై పోర్టు, విద్యుత్ ట్రాన్స్మిషన్ అనుమతులతో మాకు సంబంధం లేదు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. గురుకుల మరణాలన్నీ సర్కారు హత్యలే ‘గురుకుల పాఠశాలల్లో చదివే 48 మంది పిల్లలు చనిపోయినా సీఎం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్రెడ్డే కారణం..’ అని కేటీఆర్ ఆరోపించారు. జనతా గ్యారేజ్లా తెలంగాణ భవన్ బంజారాహిల్స్ (హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలపై పగ పెంచుకుని వేధిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా బాధితులు, ఆటోడ్రైవర్లు తదితర నగర ప్రజలు.. ప్రభుత్వం పెడుతున్న బాధలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిíÙని కావాలని భావిస్తున్నాడని, కానీ కేసీఆర్లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించడం లేదని అన్నారు. హైదరాబాద్ను నాలుగు ముక్కలు చేసే కుట్ర ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
రాజ్యాంగంలో సావర్కర్ స్వరం ఉందా?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY— ANI (@ANI) November 26, 2024ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
అన్న రాహుల్ గాంధీ మెజార్టీని దాటేసిన ప్రియాంక
-
Wayanad: ప్రియాంక గాంధీ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే!
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. తన సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08. 036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్వయనాడ్ ఉప ఎన్నికల్లో ఏకంగా సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా.. ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ డో స్థానంలో ఉన్నారు.కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. 3, 64, 653 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. రాహుల్కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా.. సీపీఐ నేత అన్నీ రాజాకు 2,83023 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్ను 1, 41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి.