anti-Naxal Squad
-
నల్లమలలో ఆయుధాల డంప్
♦ తూటాలు తయారు చేసే యంత్రం,నాటు తుపాకులు, 600 బుల్లెట్లు స్వాధీనం ♦ గుత్తికొండ వద్ద అనుమలతండా అటవీ ప్రాంతంలో డంప్ స్వాధీనం ♦ నల్లమల అడవిని జల్లెడపడుతున్న ఏఎన్ఎస్ సాక్షి, గుంటూరు/పిడుగురాళ్ళ: నల్లమల అడవుల్లో భారీ ఆయుధాల డంప్ పోలీసులకు దొరకడం తీవ్ర సంచలనం కలిగించింది. 4 నెలలుగా నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలున్నాయన్న నిఘావర్గాల హెచ్చరికతో పోలీసులు కూంబింగ్ను ఉధృ తంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గుత్తికొండ గ్రామంలో తూటాలు తయారుచేసే యంత్రాలున్నాయనే సమాచారంతో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) సోమవారం అక్కడకు చేరుకుంది. నక్సలైట్లు వాడే ఆయుధాలు, తూటాలను తయారుచేసే యంత్రాలను స్వాధీనం చేసుకుని, అక్కడున్న నలుగురైదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 3 ప్రత్యేక వాహనాల్లో పిడుగురాళ్లకు తరలించారు. గుత్తికొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలోని వేమగిరి, అనుమల వద్ద యాంటీ నక్సల్స్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తూటాలు తయారు చేసే యంత్రంతోపాటు, నాటు తుపాకులు, 600 బుల్లెట్లు, తూటాలు తయారు చేసే సామగ్రిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిసింది. ఇది 2003లో తయారు చేసిన యంత్రమని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులకు అత్యంత పట్టున్న గ్రామంగా పేరొందిన గుత్తికొండ వద్ద అటవీ ప్రాంతంలో ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే మళ్లీ మావోయిస్టు కదలికలు మొదలయ్యాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. పూర్తిగా విచారణ నిర్వహించిన తర్వాతే సమాచారం వెల్లడిస్తామని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్ చెప్పారు. ఈ డంప్ను మంగళవారం గుంటూరుకు తరలించనున్నట్లు సమాచారం. -
కానిస్టేబుళ్లకు వేధింపులు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్లైన్, రాత్రింబవళ్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే యాంటి నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) కానిస్టేబుళ్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఐ(రిజర్వ ఇన్స్పెక్టర్) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వారం తా విలవిలలాడుతున్నారు. తన సొంత పనులు చేసిపెట్టేవారికే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వారిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఏఎన్ఎస్ ఆర్ఐ సంకురయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వేధింపులు ఇలా.: సంకురయ్య రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు రూరల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ప్రకాశం జిల్లాలో కానిస్టేబుళ్ళను వేధింపులకు గురిచేయడం, ఇష్టానుసారంగా వ్యవహరించినందునే గుం టూరుకు బదిలీ చేసినట్లు విమర్శలున్నాయి. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 190మంది కానిస్టేబుళ్లు ఏఎన్ఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. సంకురయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వారంతా వాపోతున్నారు. నెల రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ తన తండ్రి చనిపోయాడని వార్త రావడంతో ఆర్ఐ వద్దకు వెళ్లి సెలవు కావాలని కోరగా, సెలవు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. చివరికి ఆ కానిస్టేబుల్ ఓఎస్డీ వెంకటయ్యను కలిసి సమస్య వివరించడంతో పది రోజుల సెలవు ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం అందించినా వాస్తవం కాదంటూ కొట్టిపారేస్తున్నాడని కానిస్టేబుళ్లు వాపోతున్నారు. ఆయన ఆగడాలను ఎస్పీ జె.సత్యనారాయణకు వివరించేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్ళగా విషయం తెలుసుకున్న ఆర్ఐ వారిని పిలిపించి తీవ్రంగా మందలించడంతోపాటు మెమోలుజారీ చేసినట్లు తెలిసింది. ఓఎస్డీ ఆదేశాలను సైతం బేఖాతరు చూస్తూ... కానిస్టేబుళ్లకు సొంతపనులు అప్పగించడం, చేయనివారిని వేధింపులకు గురిచేయడం, చార్జిమెమోలు జారీ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా దృష్టికి రాలేదు : ఓఎస్డీ సిబ్బందిని ఆర్ఐ వేధిస్తున్నట్టు తన దృష్టికి రాలేదని ఓఎస్డీ వెంకటయ్య న్యూస్లైన్కు చెప్పారు. వాస్తవమని విచారణలో తేలితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎన్ఎస్ విభాగంలో ఎవరికి సెలవులు అవసరమైనా వెంటనే మంజూరు చేయాలని ఆర్ఎస్ఐ, ఆర్ఐలను ఆదేశించానని తెలిపారు. ఆర్ఐ తీరుపై దృష్టి సారించామన్నారు.